Sai Dharam Tej: ఇటీవలే యాక్సిడెంట్ కు గురై కోలుకొని డిశ్చార్జ్ అయిన మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల సాయిధరమ్ పుట్టిన రోజు సందర్భంగా మెగా హీరోలు, ఫ్యామిలీ అంతా కలిసి అతడికి సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నిహారిక నుంచి మొదలు కొని శ్రీజ, వరుణ్ తేజ్, ఇతరులు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
అయితే సాయిధరమ్ తేజ్ బర్త్ డే సందర్భంగా అల్లు శిరీష్ చేసిన పోస్ట్ సరికొత్త ఊహాగానాలకు తెరలేపింది. సాయిధరమ్ తేజ్ వివాహంపై పుకార్లను పుట్టించింది. ‘ఒంటరి వ్యక్తిగా ఇది మీ చివరి పుట్టినరోజు అని నేను ఆశిస్తున్నాను. త్వరలో మీరు మీ వివాహ వార్తలతో ముందుకు వస్తారు’ అని సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ మ్యాన్ కావాలంటూ అల్లు శిరీష్ చేసిన ట్వీట్ ఆసక్తి రేపుతోంది. త్వరలోనే సాయిధరమ్ తేజ్ వివాహం చేసుకోబోతున్నట్టు దీని ద్వారా తేటతెల్లమైంది.
సాయిధరమ్ తేజ్ కుటుంబం, ప్రత్యేకించి అతడి తల్లి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తోందని.. వీలైనంత త్వరగా సాయిని ఓ ఇంటి వాడిని చేయాలని చూస్తోందని సమాచారం. సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత ఆ కుటుంబం ఈ మేరకు బలంగా ఫిక్ అయినట్టు తెలిసింది. అమ్మాయిని కూడా చేశారని.. సాయికి బాగా తెలిసిన అమ్మాయి అని.. ఆ అమ్మాయినే ఫిక్స్ చేశారని తెలిసింది. బంధువుల అమ్మాయిని సాయిధరమ్ కు చూసినట్టు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు ప్రకటించాల్సి ఉంది.
సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాడు. ఒక పెద్ద ప్రమాదం బారిన పడి కోలుకుంటున్నారు. తాను బాగానే కోలుకుంటున్నట్టు సాయి ఇటీవల ఒక ఫొటో విడుదల చేసి తెలిపారు. తనకోసం ప్రార్థించిన వారికి కృతజ్ఞతలు తెలిపాడు.
సాయిధరమ్ తేజ్ ఈ దసరాకు డిశ్చార్జ్ అయ్యాడు. నెలరోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నాడు. సాయిధరమ్ డిశ్చార్జ్ అయిన విషయాన్ని చిరంజీవి ట్విట్టర్ లో పోస్ట్ చేసి తెలిపాయి. త్వరగా సాయి కోలుకోవాలని కోరాడు.
సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ఇటీవలే విడుదలై అందరి ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అతడు పూర్తిగా కోలుకున్న తర్వాత తన రాబోయే సినిమాల షూటింగ్ ప్రారంభిస్తాడు.