Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi: షాకింగ్.. షూటింగ్ లో ఉన్న రెండు సినిమాలను ఆపేసిన చిరంజీవి

Chiranjeevi: షాకింగ్.. షూటింగ్ లో ఉన్న రెండు సినిమాలను ఆపేసిన చిరంజీవి

Chiranjeevi: రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేసిన సినిమాలలో అత్యంత అవమానకరమైన ఫలితం ని ఆయన చూసింది ఇటీవల విడుదల అయినా ఆచార్య సినిమాకే..భారీ అంచనాల నడుమ చిరంజీవి మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య సినిమాకి కనీసం ఓపెనింగ్స్ కూడా దక్కలేదు అంటే, ఈ సినిమా ఏ స్థాయి డిజాస్టర్ ఫ్లాప్ అనేది అర్థం అయ్యిపోతుంది..మెగా ఫాన్స్ అందరూ చిరంజీవి 150 సినిమాల్లో ఇంత చెత్త సినిమా ఎప్పుడు చెయ్యలేదు అని పెదవి విరిచారు..ఈ సినిమా ఎఫెక్ట్ చిరంజీవి గారి కెరీర్ పై గట్టిగానే పడింది అని చెప్పాలి..అందుకే చిరంజీవి తానూ ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలలో ఔట్పుట్ ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు అట..ప్రతి సన్నివేశం ని ఆయన చూడడమే కాకుండా, తన సన్నిహితులకు కూడా చూపించి సలహాలు తీసుకుంటున్నాడు అట మెగాస్టార్..150 సినిమాలు చేసిన అనుభవం ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారు ఒక్కరి సలహా తీసుకోవడం ఏంటి అని అందరూ ఆశర్యపోతున్నారు..కానీ సలహాలు తీసుకోవడం లో అసలు తప్పే లేదు..ఎందుకంటే నేటి తరం యువత అభిరుచులు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాలి అంటే ఒక్క కచ్చితమైన సలహాదారులు పక్కన ఉండాలి.

Chiranjeevi
Chiranjeevi

ప్రస్తుతం చిరంజీవి గారు చేస్తున్న పని కూడా అదే..తాను నటిస్తున్న మలయాళం సూపర్ హిట్ లూసిఫెర్ అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ మరియు తమిళ్ బ్లాక్ బస్టర్ హిట్ వేదలమ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలలో చిరంజీవి తనకి పెద్ద గా నచ్చని సన్నివేశాలను రీ షూట్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడట..ఔట్పుట్ విషయం లో ఈసారి ఒక్క శాతం కూడా తగ్గేదే లేదు అని..ఇది తన ప్రెస్టీజియస్ కి సంబంధించిన విషయం అని చిరంజీవి ఈ రెండు చిత్రాల డైరెక్టర్లకు హెచ్చరించినట్టు ఫిలిం నగర్ లో ఒక్క వార్త చక్కర్లు కొడుతోంది.

Also Read: NTR- Prashant Neel: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాకి నారా రోహిత్ ఫ్లాప్ సినిమా టైటిల్

Chiranjeevi
Chiranjeevi

అందుకే ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్స్ ని నిలిపివేసి ఇప్పటి వరుకు తీసిన ఔట్పుట్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడట మెగాస్టార్..గాడ్ ఫాదర్ సినిమా ఔట్పుట్ చిరంజీవి కి సంతృప్తిని ఇచ్చినప్పటికీ, భోళా శంకర్ విషయం లో ఆ చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ కి చివాట్లు పడినట్టు తెలుస్తుంది..కొన్ని సన్నివేశాలు చాలా సిల్లీ గా ఉన్నాయి అని..వెంటనే రీ షూట్ చెయ్యాలని చిరంజీవి అన్నాడట..రీ ఎంట్రీ తర్వాత ఖైదీ నెంబర్ 150 మరియు సైరా నరసింహ రెడ్డి వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ దూసుకుపోతున్న మెగాస్టార్ జైత్ర యాత్ర కి అడ్డుకట్టగా నిలిచింది ఆచార్య చిత్రం..మరి ఈ అడ్డుకట్టని తొలగించి ప్రస్తుతం తెరకెక్కుతున్న ఈ రెండు సినిమాలు మెగాస్టార్ చిరంజీవి ని బౌన్స్ బ్యాక్ చేస్తాయో లేదో చూడాలి.

Also Read:Vikram Box Office Collections: విక్రమ్ సినిమాకి వచ్చిన లాభలు ఎంతో తెలుసా..?

Recommended Videos:

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular