Allu Arjun: నాకు అనిపించింది చేస్తా..నన్ను ఎవ్వరూ ఏమి చెయ్యలేరు అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ కౌంటర్!

అభిమానుల్లో ఇంత వ్యతిరేకత వచ్చిన విషయం అల్లు అర్జున్ కి తెలుసు, అయినా కానీ ఆయన దానిని చల్లార్చే పనులు చెయ్యలేదు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా గెలిచినందుకు మెగా ఫ్యామిలీ మొత్తం సంబరాల్లో మునిగిన రోజున అల్లు అర్జున్ మరియు ఆయన కుటుంబం ఉద్దేశపూర్వకంగానే దూరం హాజరు కాలేదని సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ చెప్తున్న మాట.

Written By: Vicky, Updated On : August 22, 2024 10:05 am

Allu Arjun(3)

Follow us on

Allu Arjun: అల్లు,మెగా ఫ్యామిలీ మధ్య గ్యాప్ ఏర్పడింది అనేది నిజమే అని రోజురోజుకి బలపడేలా చేస్తున్నాయి రీసెంట్ గా జరుగుతున్న కొన్ని సంఘటనలు. రామ్ చరణ్ ప్రత్యేకంగా కొణిదెల ప్రొడక్షన్స్ అని బ్యానర్ పెట్టుకున్నప్పటి నుండి ఈ దూరం చిన్నగా పెరుగుతూ వచ్చిందని ఇండస్ట్రీ లో ఎప్పటి నుండో నడుస్తున్న చర్చ. ముఖ్యంగా అల్లు అర్జున్ కి పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్, క్రేజ్ ని అసూయ పుట్టింది అనేది మెగా అభిమానుల వాదన. చెప్పను బ్రదర్ అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టడం నుండి మొదలైన ఈ గొడవని, తగ్గించుకొని పోదామనే ఆలోచన అల్లు అర్జున్ కి ఏమాత్రం ఉన్నట్టుగా లేదని అనిపిస్తుంది అంటూ సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారం చివరి రోజున, రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం కి వెళ్తే, అల్లు అర్జున్ జనాల దృష్టిని మరలించడానికి వైసీపీ పార్టీ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి ఇంటికి వెళ్లాడని, ఒకవేళ తన స్నేహితుడికి సపోర్ట్ చేసుకోవాలి అని అనిపిస్తే కచ్చితంగా చేసుకోవచ్చని, కానీ అల్లు అర్జున్ ఉద్దేశ్యం వేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అభిమానుల్లో ఇంత వ్యతిరేకత వచ్చిన విషయం అల్లు అర్జున్ కి తెలుసు, అయినా కానీ ఆయన దానిని చల్లార్చే పనులు చెయ్యలేదు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా గెలిచినందుకు మెగా ఫ్యామిలీ మొత్తం సంబరాల్లో మునిగిన రోజున అల్లు అర్జున్ మరియు ఆయన కుటుంబం ఉద్దేశపూర్వకంగానే దూరం హాజరు కాలేదని సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ చెప్తున్న మాట. ఇకపోతే నిన్న అల్లు అర్జున్ మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యాడు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ భార్య తబిత ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తోంది. సుకుమార్ అల్లు అర్జున్ కి ప్రాణ స్నేహితుడు, అలాగే వీళ్లిద్దరు కలిసి ప్రస్తుతం పుష్ప ది రూల్ అనే చిత్రం చేస్తున్నారు. అందుకే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ గా ఆయన విచ్చేశాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘నాకు ఇష్టమైన వారిని , నా స్నేహితులను ఎప్పుడూ మర్చిపోను.

వాళ్ళ కోసం కచ్చితంగా ఎక్కడిదాకా అయినా వెళ్తా’ అంటూ చాలా ఎమోషనల్ గా చెప్తాడు. అంత ఎమోషనల్ గా చెప్పింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఉద్దేశించే అని సోషల్ మీడియా లో అందరూ అనుకుంటున్నారు. మళ్ళీ ఈ రెండు కుటుంబాలు కలుస్తాయి అని ఆశపడిన అభిమానులకు ఇప్పుడు చుక్కెదురు అయ్యింది. ఈ రెండు కుటుంబాలు ఇప్పట్లో కలిసేలా లేవు అని అందరికీ అర్థం అయిపోయింది. భవిష్యత్తు లో ఈ సమస్య ఇంకా పెరిగి పెద్దది అవుతుందా లేదా సర్దుకుంటుందా అనేది చూడాలి. నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న సోషల్ మీడియా వాతావరణం ఇప్పుడు అల్లు అర్జున్ కామెంట్స్ కారణంగా హీట్ ఎక్కింది.