న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 50 అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో జులై 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
https://npcilcareers.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం 50 ఉద్యోగ ఖాళీలలో ఫిట్టర్ 20, ఎలక్ట్రీషియన్ 13, ఎలక్ట్రానిక్స్ 12, మెషినిస్ట్ 5 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రతి నెలా 7,700 రూపాయలు స్టైఫండ్ లభిస్తుంది.
ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ జూన్ 16వ తేదీన ప్రారంభం కాగా జూలై 7, 2021 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://npcilcareers.co.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశాలు ఉంటాయి.
నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ఉద్యోగాలకు సంబంధించి సందేహాలు ఉన్నా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలన్న వెబ్ సైట్ ద్వారా సందేహాలు నివృత్తి చేసుకోవడంతో పాటు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.