Homeఆంధ్రప్రదేశ్‌Anantapur District Crime News: భార్యలపై అనుమానంతో.. ఈ భర్తలు ఎంతటి దారుణానికి ఒడి కట్టారంటే?

Anantapur District Crime News: భార్యలపై అనుమానంతో.. ఈ భర్తలు ఎంతటి దారుణానికి ఒడి కట్టారంటే?

Anantapur District Crime News: అనుమానం అనేది మనిషిని స్థిరంగా ఉంచదు. వారిలో రకరకాల ప్రతికూల ఆలోచనలను ప్రేరేపిస్తుంది. చివరికి దారుణాలకు పాల్పడే విధంగా నడిపిస్తూ ఉంటుంది. ప్రతికూల భావంతో చివరికి ఎంతటి ఘోరాల కైనా వారు పాల్పడుతూ ఉంటారు. ఆ సమయంలో తాను మనుషులమనే విషయాన్ని మర్చిపోయి.. మృగాల మాదిరిగా ప్రవర్తిస్తూ ఉంటారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో రెండు దారుణాలు చోటు చేసుకున్నాయి. ఈ దారుణాలలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. వారు ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణం భర్తలు. సూటిగా చెప్పాలంటే భర్తల చేతుల్లో వారు ప్రాణాలు కోల్పోయారు.

అనంతపురం జిల్లా కేంద్రంలోని నగరం బిందెల కాలనీ లో లక్ష్మీ గంగ, వీరాంజనేయులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఆరు సంవత్సరాల కుమారుడు, నాలుగు సంవత్సరాల కుమార్తె ఉంది. లక్ష్మి, వీరాంజనేయులు ప్రేమించి పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. మొదట్లో వీరి సంసారం బాగానే నడిచింది. లక్ష్మీ ఇటీవల మరొక వ్యక్తితో సంబంధం కొనసాగిస్తుందని వీరాంజనేయులు అనుమానించడం మొదలు పెట్టాడు. కొంతకాలం క్రితం నుంచి దంపతులిద్దరూ వేరువేరుగానే ఉంటున్నారు.. ఇటీవల పెద్ద మనుషులు పంచాయతీ చేశారు. దీంతో వీరాంజనేయులు లక్ష్మీని ఇంటికి తీసుకొచ్చాడు. లక్ష్మీ ఇంటికి వచ్చినప్పటి నుంచి వీరాంజనేయులు మళ్లీ గొడవ పడడం మొదలుపెట్టాడు. ఆవేశంలో లక్ష్మిని కత్తితో నరికాడు. ఆ తర్వాత ఇద్దరు పిల్లలతో పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు.

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ముద్రాసి కాలనీలో కుళ్లాయమ్మ, మారెన్న దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. మారెన్న లారీ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. మారెన్న కొద్దిరోజులుగా భార్య మీద అనుమానం పెంచుకున్నాడు.. అనంతపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశాడు. ఇటీవల కుళ్లాయమ్మ సంక్రాంతి పండుగకు పుట్టింటికి వెళ్ళింది. మారెన్న కూడా అత్తింటివారికి వెళ్ళాడు. అక్కడ ఇద్దరికీ గొడవైంది. ఆరోజు రాత్రి కుళ్లాయమ్మను మారెన్న విచక్షణ రహితంగా నరికాడు. కుటుంబ సభ్యులు కుళ్లాయమ్మను ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది.

వాస్తవానికి ఈ రెండు సంఘటనలు సమాజంలో మృగాల మాదిరిగా ప్రవర్తిస్తున్న కొంతమంది భర్తల తీరును తేట తెల్లం చేస్తున్నాయి. వాస్తవానికి అనుమానం అనేది ఒక రోగం లాంటిది. అది ఒకసారి మగాడిలో ఆవహిస్తే.. ఇక ఏం చేసినా ఉపయోగం ఉండదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Bonda Umamaheswara Rao

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...
Loan Advice

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...
AP Ration Cards

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...
Tollywood Heroes Injuries

Tollywood Heroes Injuries: టాలీవుడ్ కు ఏంటీ శాపం.. హీరోల వరుస గాయాల వెనుక ఏముంది..?

Tollywood Heroes Injuries: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్న మన స్టార్ హీరోలు ఎలాంటి డూపులు...
Oktelugu Epaper