Greater Rayalaseema: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక టెన్షన్ ప్రారంభం అయింది. జనసేన చేరికల కమిటీ ప్రకటించడంతో తమ పార్టీ నాయకత్వంతో పాటు క్యాడర్ చేజారి పోతుందన్న అనుమానం వైసీపీలో ఉంది. ఆపై రాయలసీమకు సంబంధించి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి పవన్ కళ్యాణ్ బాధ్యతలు అప్పగించడం కూడా టెన్షన్ కు కారణం. పైగా బాలినేని కోసం ప్రకాశం తో పాటు నెల్లూరు జిల్లాల కమిటీలను రద్దు చేశారు పవన్ కళ్యాణ్. గ్రేటర్ రాయలసీమ బాధ్యతలన్నింటినీ బాలినేని కట్టబెట్టడంతో… ఆయన నుంచి తమకు ఇబ్బందులు తప్పవని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఎందుకంటే పార్టీ గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి బాలినేని. అందుకే వైసిపికి ఉన్న బలం,బలహీనతలు ఆయనకు తెలుసు. చేరికల కమిటీలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
తిరుగులేని నేతగా..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. అంతకుముందు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించారు. ఎంతోమంది పార్టీ నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ బాలినేని లేకపోవడం ఆ పార్టీకి లోటు. ప్రస్తుతం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా బాధ్యతలు చూస్తున్న.. మాజీ మంత్రి బాలినేని లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. వై వి సుబ్బారెడ్డి లాంటివారు ఉన్న పెద్దగా ప్రభావం చూపలేరు. వైసీపీలో బాలినేని లేరు అన్న లోటు కంటే ఇప్పుడు పార్టీ క్యాడర్ను ఎక్కడ లాగేస్తారు అన్న ఆందోళన నాయకత్వంలో ఉంది.
చంద్రబాబు మంత్రాంగం..
నెల్లూరు ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమ లోని నాలుగు జిల్లాల బాధ్యతను మాజీ మంత్రి బాలినేనికి పవన్ కళ్యాణ్ అప్పగించారు. అయితే ఇదంతా ఒక వ్యూహం ప్రకారం జరుగుతోంది అనేది అర్థమవుతుంది. ఒక నెల రోజుల కిందట ఏపీ సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా కలిశారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఆయన రాజకీయ జీవితంలో చంద్రబాబును వ్యతిరేకిస్తూ వచ్చారు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు దగ్గర కావడం ద్వారా చంద్రబాబుతో సన్నిహిత్యం పెంచుకున్నారు బాలినేని. దీని వెనుక రాజకీయ రాయలసీమ వ్యూహం ముందు. బాలినేని ముందు పెట్టి రాయలసీమలో జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలని పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబు భావిస్తున్నారు. ఆ విషయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కూడా తెలుసు. ఆ పార్టీలో ఒక రకమైన ఆందోళనకు అదే కారణం.
