spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Rayapati Sambasiva Rao Career: రాజకీయాలకు ఆ కుటుంబం గుడ్ బై!

Rayapati Sambasiva Rao Career: రాజకీయాలకు ఆ కుటుంబం గుడ్ బై!

Rayapati Sambasiva Rao Career: రాజకీయంగా ఒక వెలుగు వెలిగిన చాలా కుటుంబాలు తర్వాత కనుమరుగయ్యాయి. అటువంటి జాబితాలో చాలా కుటుంబాలు ఉన్నాయి. అయితే గుంటూరు జిల్లాలో తనకంటూ రాజకీయం చేసిన రాయపాటి కుటుంబం ఇప్పుడు.. స్వచ్ఛంద విరమణ చేయాల్సి వచ్చింది. ఆ పరిస్థితులు దాపురించాయి. చిన్న వయసులోనే కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజ్యసభలో అడుగుపెట్టారు రాయపాటి సాంబశివరావు. తెలుగుదేశం ప్రభంజనంలో సైతం ఆయన గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అయితే రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో టిడిపిలోకి వచ్చారు రాయపాటి. ఒకసారి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. రెండోసారి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఎన్నికల్లో ఆయనకు కానీ.. కుటుంబానికి కానీ ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు చంద్రబాబు. దీంతో ఎన్నికలకు ముందు రాయపాటి కుమారుడు టిడిపి నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అందుకే టిడిపి అధికారంలోకి వచ్చినా ఆ కుటుంబానికి ఎటువంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. అందుకే ఆ కుటుంబం పూర్తిగా రాజకీయాలనుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

* చిన్న వయసులోనే పెద్దల సభకు..
1982లో తెలుగుదేశం పార్టీ ( Telugu Desam Party) ఆవిర్భవించింది. ఆ సమయంలో యువజన కాంగ్రెస్ లో ఉన్నారు రాయపాటి సాంబశివరావు. కమ్మ సామాజిక వర్గం నేత కావడంతో ఆయనను గుర్తించింది కాంగ్రెస్ పార్టీ. తొలిసారిగా రాజ్యసభకు నామినేట్ చేసింది. అప్పుడు ఆయన వయసు కేవలం 39 సంవత్సరాలు మాత్రమే. అటు తరువాత కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా ఎదిగారు రాయపాటి. 1996, 1998, 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. 2014లో టిడిపి తరఫున పోటీ చేసి మరోసారి పార్లమెంట్ సభ్యులు అయ్యారు. 2019లో టిడిపి తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో తనతో పాటు తన కుమారులను పోటీ చేయించాలని చూశారు. కానీ మారిన సమీకరణ నేపథ్యంలో చంద్రబాబు చాన్స్ ఇవ్వలేదు.

* అవకాశం ఇవ్వని చంద్రబాబు..
2024 ఎన్నికల్లో రాయపాటి సాంబశివరావు( rayapati sambasiva Rao ) నరసారావు పేట పార్లమెంట్ సీటును ఆశించారు. గుంటూరు నుంచి కూడా అవకాశం కోరారు. కుమారుడు రంగారావుకు సత్తెనపల్లి టికెట్ అడిగారు. కానీ సత్తెనపల్లి నుంచి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కు ఛాన్స్ దక్కింది. గుంటూరు నుంచి పారిశ్రామికవేత్త పెమ్మసాని చంద్రశేఖర్ కు అవకాశం ఇచ్చారు. నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలకు అవకాశం ఇచ్చారు. దీంతో రాయపాటి కుమారుడు రంగారావు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు టిడిపి అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటుతోంది. కానీ ఇంతవరకు రాయపాటి సాంబశివరావుకు ఎటువంటి పిలుపు లేదు. దీంతో రాజకీయాలనుంచి నిష్క్రమించడమే మేలని ఆ కుటుంబం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చూడాలి వారి నిర్ణయం ఎలా ఉంటుందో?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper