Nara Lokesh Pooja Room Controversy: ఏపీ మంత్రి నారా లోకేష్ విషయంలో వింత ప్రచారం జరిగింది. ఆయన పూజ చేసే గదిలో ఒక విచిత్రమైన బొమ్మ కనిపించింది. కొందరైతే క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందించారు. తన పూజ గదిలో ఉన్న బొమ్మల గురించి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఇదే అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నారా లోకేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఏదైనా అంశాలపై శరవేగంగా స్పందిస్తారు. ఇప్పుడు ఈ బొమ్మపై కూడా అదే విధంగా స్పందించారు నారా లోకేష్.
Also Read: పవర్ హౌస్గా కరీంనగర్.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక ముద్ర..
* ఉగాది పూజల్లో..
తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పర్వదినం ఘనంగా జరిగింది. రాజకీయ పార్టీల నేతలు వారి కార్యాలయాలు, నివాసాల్లో పూజలు జరిపారు. ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా తన ఇంట్లో ఉగాది వేడుకలు జరుపుకున్నారు. కుమారుడు దేవాన్సుతో కలిసి ఉగాది పండుగ చేసుకున్నట్లు ఫోటోలను షేర్ చేశారు. ఈ కొత్త ఏడాదిలో చేదు అనుభవాలు లేకుండా.. మధురమైన క్షణాలతో నింపుదాం. ఉగాది పండుగ కాబట్టి.. నా కఠినమైన డైట్ ను ఒక్క రోజుకు పక్కన పెట్టి పండగ స్పెషల్ వంటలను ఆస్వాదిస్తున్నాను అంటూ మంత్రి నారా లోకేష్ ఫోటోలతో సహా ట్విట్ చేశారు. అయితే ఆ ఫోటోలో దేవుడి ఫోటోల పక్కన ఓ బొమ్మ కనిపించింది. ఆ బొమ్మ ఏంటి అంటూ కొందరు ప్రశ్నించారు. కొందరైతే క్షుద్ర పూజలకు వాడే చేతబడి బొమ్మ మీ ఇంటి మందిరంలో ఉంది ఏంటి? అని సోషల్ మీడియాలో ప్రశ్నించారు.
* అది దేవాన్సు తయారుచేసిన బొమ్మ..
అయితే సోషల్ మీడియాలో దీనిపై విమర్శలు రావడంతో మంత్రి లోకేష్ స్పందించారు. మా పూజ గదిలోని బొమ్మల గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారి కోసం… ఇది దేవాన్సు తన నాలుగేళ్ల వయసులో చేతితో తయారు చేసిన శివుని బొమ్మ.. చిన్న శివలింగం. దేవాన్సు శివుడు పై భక్తితో బొమ్మలను తయారు చేశాడు. వాటిని మేము జ్ఞాపకం గా పూజ గదిలో ఉంచాము. కొందరికి విశ్వాసం అర్థం అవుతుంది. కొందరికి అర్థం కాదు. కానీ ఇలాంటి భక్తికి వివరణ అవసరం లేదు. హర హర మహాదేవ్ అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.

