spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Jagan Faked Medical Colleges: ఆగి మెడికల్ కాలేజీలు చూడాలా?.. జగన్మోహన్ రెడ్డిని ఏకిపారేస్తున్న టిడిపి!

Jagan Faked Medical Colleges: ఆగి మెడికల్ కాలేజీలు చూడాలా?.. జగన్మోహన్ రెడ్డిని ఏకిపారేస్తున్న టిడిపి!

Jagan Faked Medical Colleges: ఏపీలో( Andhra Pradesh) మెడికల్ కాలేజీల అంశం మరింత వివాదాస్పదం అవుతోంది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో మెడికల్ కాలేజీలు ప్రభుత్వ, ప్రైవేటు, పబ్లిక్ విధానంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము సృష్టించిన సంపదను అమ్మేస్తున్నారని ఆరోపించారు. ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్తే మెడికల్ కాలేజీల్లో సామాన్యులకు సీట్లు దక్కవని చెప్పారు. తాము రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలను కట్టించామని వైసిపి నేతలు ప్రకటన చేశారు. అయితే దీనిపై టిడిపి కూటమి గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. జగన్ కట్టిన మెడికల్ కాలేజీలు ఇవేనంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. అయితే జగన్ హయాంలో మెడికల్ కాలేజీల ప్రకటన వచ్చింది కానీ.. నిర్మాణాలు మాత్రం నోచుకోలేదు. అయితే తాము కట్టిన మెడికల్ కాలేజీలను చూసినవారు చాలా ఆశ్చర్యపోతుంటారని.. ఆ భవనాలను చూసి వెళ్తుంటారని జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో చెప్పారు. అయితే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కనీసం పని జరగకుండా.. పునాదుల స్థాయిలో ఉన్న మెడికల్ కాలేజీ స్థలాలను టిడిపి కూటమి సోషల్ మీడియా హైలెట్ చేస్తోంది.

కేంద్రం నిధులే..
వాస్తవానికి వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ హయాంలో 17 మెడికల్ కాలేజీలు ప్రకటించడం వాస్తవం. కానీ వాటి నిర్మాణానికి కేంద్రం నిధులు విడుదల చేసిందే తప్ప.. వైసిపి ప్రభుత్వం ఒక్క పైసా కూడా కేటాయించలేదు. కానీ జగన్ మాత్రం తమ హయాంలోనే మెడికల్ కాలేజీల నిర్మాణం జరిగినట్లు.. అద్భుత కట్టడాలు పూర్తయినట్లు ప్రకటన చేశారు. ఒకటి రెండు జిల్లాల్లో తప్పితే.. మిగతా జిల్లాల్లో కనీసం పనులు ప్రారంభం కాలేదు. కొన్నిచోట్ల భూమిని సేకరించారు కానీ.. నిర్మాణాలు ప్రారంభించలేదు. అయితే ఇప్పుడు ప్రైవేటు భాగస్వామ్యంతో కూటమి ప్రభుత్వం వాటిని పూర్తి చేయాలని సంకల్పించింది. అదే జరిగితే పనులు చాలా వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. అలా పూర్తి చేస్తే కూటమి ప్రభుత్వం ఆ క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకుంటుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి అవిగో మేము నిర్మాణాలు పూర్తి చేసామంటూ చెప్పుకు రావడం ఒక విధంగా చెప్పాలంటే ఆ పార్టీకి మైనస్ గా మారింది.

అడ్డంగా బుక్ అయ్యారు..
మెడికల్ కాలేజీలు( medical colleges) నిర్మాణం పూర్తి చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. ఇది ముమ్మాటికి వాస్తవం కూడా. మరి ఎందుకు అనవసరంగా ఈ మెడికల్ కాలేజీ విషయంలో ఆయన అలా ప్రకటన చేశారో తెలియడం లేదు. అయితే ఇప్పుడు మెడికల్ కాలేజీ ల వ్యవహారంపై విమర్శలు చేసి అడ్డంగా బుక్కయ్యారు జగన్. అనవసరంగా సోషల్ మీడియాకు టార్గెట్ అయ్యారు. ఆయన హావభావాలు కూడా హాస్యాస్పదంగా ఉన్నాయి. మేము కట్టిన భవనాలు చూసి ప్రజలే ఆశ్చర్యపోతున్నారని.. అక్కడకు వచ్చి ఆగి చూస్తున్నారని.. ఇలా ఏవేవో వింతగా చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు టిడిపి సోషల్ మీడియా నేరుగా మెడికల్ కాలేజీ నిర్మాణాల వద్దకు వెళ్లి ఇది పరిస్థితి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ విషయంలో అనవసరంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి బుక్ చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper