Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Naidu emotional speech: బాబు భావోద్వేగం.. విశాఖ చరిత్రలో శాశ్వత అధ్యాయం

Chandrababu Naidu emotional speech: బాబు భావోద్వేగం.. విశాఖ చరిత్రలో శాశ్వత అధ్యాయం

Chandrababu Naidu emotional speech: విశాఖ జిల్లా తర్లువాడలో గూగుల్‌ డేటా సెంటర్‌కు శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘ఇది నా జీవితంలో శాశ్వతం’’ అని చెప్పడంతోపాటు, తను చేసిన అన్ని ప్రారంభోత్సవాలలో గూగుల్‌ డేటా సెంటర్‌ ప్రారంభం ప్రత్యేకమైన జ్ఞాపకంగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీని నిర్మాణం చేసే సమయంలో తనలోని కసి, ప్రయాణం ఇప్పుడు సైబరాబాద్‌గా మారి, సంపదను సృష్టిస్తోందన్నారు. విశాఖ కూడా అదే రీతిలో ఒక ‘‘శాశ్వతమైన […]

Chandrababu Naidu emotional speech: విశాఖ జిల్లా తర్లువాడలో గూగుల్‌ డేటా సెంటర్‌కు శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘ఇది నా జీవితంలో శాశ్వతం’’ అని చెప్పడంతోపాటు, తను చేసిన అన్ని ప్రారంభోత్సవాలలో గూగుల్‌ డేటా సెంటర్‌ ప్రారంభం ప్రత్యేకమైన జ్ఞాపకంగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీని నిర్మాణం చేసే సమయంలో తనలోని కసి, ప్రయాణం ఇప్పుడు సైబరాబాద్‌గా మారి, సంపదను సృష్టిస్తోందన్నారు. విశాఖ కూడా అదే రీతిలో ఒక ‘‘శాశ్వతమైన మార్గంగా’’ మిగిలిపోతుందని తెలిపారు.

ఐటీ, ఏఐ విప్లవంలో విశాఖ పాత్ర
ఐటీ రంగంలో భవిష్యత్తు అంతా ఆ సెక్టార్‌దే అని ముందుగా ప్రతిపాదించగా, ఆనాడు అందరూ నమ్మలేదని గుర్తు చేశారు. ఇప్పుడు అదే విషయం అందరూ చూస్తున్నారని అన్నారు. ఇప్పుడు ఏఐ విప్లవం, క్వాంటం టెక్నాలజీ వంటివి రావడంతో విశాఖను ‘‘కేరాఫ్‌ ఏఐ’’ గా, మరో హైటెక్‌ సిటీగా మార్చాలని లక్ష్యం పెట్టుకున్నారు. విశాఖలో ఇలాంటి ప్రపంచస్థాయి ప్రాజెక్ట్‌ రావడం అంటే తనకు చాలా గర్వకారణమని బాబు చెప్పారు.

వెనకబాటు నుంచి ఉపాధి కేంద్రానికి..
ఉత్తరాంధ్రను ఇప్పటికే వెనకబడిన ప్రాంతం అని పేర్కొనే వారిని ఉటంకిస్తూ, ఈ రోజు అది ఉపాధి, అభివృద్ధి చిరునామా అయ్యిందని చంద్రబాబు చెప్పారు. గడిచిన రెండేళ్లలో గణనీయంగా పరిశ్రమలు విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాలకు తరలివస్తున్నాయి. ఇప్పటికే జూలైలో భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులు, గూగుల్‌ డేటా సెంటర్, ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌ వంటివి పూర్తయితే ఉత్తరాంధ్ర రూపురేఖలే మారిపోతాయని చంద్రబాబు అంచనా వేశారు.

విశాఖ మంచితనం..
విశాఖపట్నం ప్రత్యేకతను ప్రశంసిస్తూ, విశాఖ వాసులు ఎంతో మంచివారని, ఎక్కడా చూడలేని ద్రుఢత్వం, స్వాభావికత, స్నేహపూర్వకత వారిలో ఉన్నాయని చెప్పారు. వారు ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండి, అభివృద్ధిని స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. విశాఖ ప్రకృతిలో కూడా అందం, ప్రశాంతత, సముద్రం, కొండలు, పచ్చని ప్రాంతాలు అన్నీ కలిసి ఈ నగరాన్ని ‘‘గ్లోబల్‌ సిటీ’’గా మార్చినట్లుగా చెప్పారు. గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ కూడా విశాఖ అందాన్ని చూసి ముచ్చటపడి, ఇప్పుడు అక్కడే గూగుల్‌ ఏర్పాటు చేస్తున్నందుకు తనకు గర్వమని బాబు అన్నారు.

గూగుల్‌ డేటా సెంటర్‌తో జోడించి, విశాఖను ఒక ‘‘గ్లోబల్‌ ఐటీ, ఏఐ హబ్‌’’గా మార్చే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇది కేవలం పరిశ్రమ కాదు, ప్రజల జీవన విధానం, నగర అభివృద్ధి, ఉపాధి సృష్టి వంటి అన్నిటినీ మార్చే సుదీర్ఘకాలిక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇలాంటి మార్పుల మధ్య, చంద్రబాబు భావోద్వేగం ‘‘ఇది నా జీవితంలో శాశ్వతం’’ అనే మాట చారిత్రక సందర్భాన్ని సూచిస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper