spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh latest political survey: ఏపీలో సంచలన సర్వే.. ఆ ఎంపీ ఏకంగా..?!

Andhra Pradesh latest political survey: ఏపీలో సంచలన సర్వే.. ఆ ఎంపీ ఏకంగా..?!

Andhra Pradesh latest political survey: ఏపీలో ( Andhra Pradesh) పార్లమెంట్ సభ్యుల పనితీరుపై ఒక సర్వే జరిగింది. గత కొంతకాలంగా సాగిన ఈ సర్వే ఫలితాలను సదరు సంస్థ ప్రకటించింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు గాను మొన్నటి ఎన్నికల్లో కూటమి ఏకపక్షంగా విజయం సాధించింది. 21చోట్ల కూటమి గెలుపొందింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. కూటమి కట్టిన మూడు పార్టీలు సంయుక్తంగా ఎక్కువ స్థానాలు గెలుచుకున్నాయి. మోదీ నేతృత్వంలో ఎన్డీఏ మూడోసారి కొలువుదీరేందుకు ఏపీ మెజారిటీ అక్కరకు వచ్చింది. అందుకే కేంద్ర ప్రభుత్వంలో సైతం ఏపీకి తగిన ప్రాధాన్యం దక్కుతోంది. ఏపీ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు క్యాబినెట్ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇక సహాయ మంత్రులుగా పెమ్మసాని చంద్రశేఖర్, భూపతి రాజు శ్రీనివాస వర్మ ఉన్నారు. ఈ రెండేళ్ల కాలంలో ఏపీ ఎంపీల పనితీరుపై రైజ్ అనే సంస్థ సర్వే చేపట్టింది. ఆ సర్వే ఫలితాలను వెల్లడించింది.

రైజ్ సర్వే సంస్థ
ఓ 13 మంది ఎంపీల పనితీరుపై నివేదికలు ఇచ్చింది రైజ్ సర్వే సంస్థ. మొన్నటి ఎన్నికల ఫలితాల్లో టిడిపి కూటమి ఘనవిజయం సాధిస్తుందని ఈ సంస్థ చెప్పింది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలోనే సర్వేలు ఇస్తూ వచ్చింది. ఇప్పుడు అదే సంస్థ ఎంపీల పనితీరుపై సర్వేలు ఇవ్వడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇటీవల డ్రగ్స్ కేసులో చిక్కుకున్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పనితీరులో రాష్ట్రంలోనే మూడో స్థానంలో ఉన్నట్లు చెబుతోంది ఈ సర్వే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు జనసేన ఎంపీ కూడా తన పనితీరు మెరుగుపరుచుకున్నట్టు ఈ సర్వే చెబుతోంది.

ఆ 13 మంది ఎంపీలు వీరే..
ఎంపీల పనితీరుకు సంబంధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నారు గుంటూరు ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రెండో స్థానంలో మరో కేంద్రమంత్రి, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు నిలిచారు. మూడో స్థానంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, నాలుగో స్థానంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఐదో స్థానంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఆరో స్థానంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఏడో స్థానంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎనిమిదో స్థానంలో చిత్తూరు వైసీపీ ఎంపీ ప్రసాదరావు, తొమ్మిదో స్థానంలో నరసాపురం, కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, పదో స్థానంలో విశాఖ ఎంపీ మార్గాన్ని శ్రీ భరత్, 11వ స్థానంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, 12వ స్థానంలో జనసేన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, 13వ స్థానంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నిలిచారు. ప్రస్తుతం ఈ సర్వే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Venkatesh Kalyan Ram Movie

Venkatesh Kalyan Ram Movie: అనిల్ రావిపూడి కి తెలియకుండా వెంకటేష్ – కళ్యాణ్ రామ్ ఎంజాయ్ చేస్తున్నారుగా…

Venkatesh Kalyan Ram Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలను చేస్తూ...
Bigg Boss Telugu

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ ఆఫర్ పై జబర్దస్త్ బ్యూటీ హాట్ కామెంట్స్.. ఈ...

Bigg Boss 10 Telugu: సెప్టెంబర్ 6 న ఇండియా వైడ్ గా అన్ని భాషలకు సంబంధించిన బిగ్ బాస్ సీజన్స్ గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్...
Nagarjuna

Nagarjuna: నాగార్జున కొడుకుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడా…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చిన వాళ్ళలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను మైమరపింపజేసిన ఆయన ఇతర ఇండస్ట్రీలో నుంచి ఎదురయ్యే...
Oktelugu Epaper