Homeఅంతర్జాతీయంOperation Sagar Bandhu: శత్రువులకు కూడా సాయం చేసే గొప్ప దేశం భారత్‌... ఇదే సాక్ష్యం

Operation Sagar Bandhu: శత్రువులకు కూడా సాయం చేసే గొప్ప దేశం భారత్‌… ఇదే సాక్ష్యం

Operation Sagar Bandhu: భారతదేశం పరస్పర సహకారం.. సానుభూతి, దయ కలిగిన దేశం. ఎదుటివారు కష్టాల్లో ఉంటే తోచిన సాయం చేసే గుణం మనది. ముఖ్యంగా మన పొరుగు దేశాలు మనపై శత్రుత్వ భావంతో ఉన్నా.. కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం మన వంతు సాయంగా అందిస్తున్నాం. తిరిగి రూపాయి కూడా ఆశించడం లేదు. తాజాగా దిత్వా తుపాన్‌ ప్రభావంతో శ్రీలంక అల్లకల్లోంగా మారింది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. భారత్‌ మానవతా భావంతో స్పందించి. ఆపరేషన్‌ సాగర్‌ బంధు ద్వారా నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

శ్రీలంకకు భారీగా సాయం..
శ్రీలంకలో 2004 సునామీ సమయంలో 23 మిలియన్ల విలువైన సరుకులు, 2009 రాజకీయ సంక్షోభ కాలంలో రూ.500 కోట్ల సాయం, 2017, 2024 తరచూ వరదల సమయంలో కూడా భారతదేశం సహాయం అందించింది. తాజగా దిత్వా తుపాను ప్రభావంతో నష్టపోయిన శ్రీలకకు సాగర బంధు పేరుతో 12 టన్నుల సరుకులు పంపింది.

శత్రుదేశానికి కూడా కూడా సాయం
పాకిస్తాన్‌లో 2006లో వచ్చిన భూకంప సమయంలో భారత్‌ 50 మిలియన్‌ డాలర్ల సాయం పంపించింది. మన సైన్యం పాకిస్తాన్‌కు వెళ్లి అక్కడి ప్రజలను రక్షించింది. వైద్య సాయం అందించింది. కానీ దీనిని విస్మరించిన పాకిస్తాన్‌.. 2008లో ముంబై ఉగ్రదాడి చేసింది.

మయన్మార్‌కు..
మయన్మార్‌లో టైపూన్‌ యాగి వచ్చిన సమయంలో కూడా భారత్‌ భారీగా సాయం చేసింది. కొన్ని నెలల క్రితం సైక్లోన్‌ మోచ వచ్చింది. దీంతో మయన్మార్‌ తీవ్రంగా నష్టపోయింది. అప్పుడు కూడా భారీగా సాయం చేశాం.

టర్కీ భూకంప సమయంలో..
2023లో టర్కీలో భారీ భూకంపం వచ్చిది. ఈ సమయంలో ప్రపంచ దేశాలన్నింటికన్నా ముందు స్పందించిందిన మనమే. భారత సైన్యం సహాయం చేసింది. దాదాపు నెల రోజులు అక్కడే ఉండి ప్రజలకు సరుకులు, వైద్య సాయం చేసింది. కానీ దీనిని మర్చిపోయిన టర్కీ ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్తాన్‌కు డ్రోన్లు అందించి మనపై దాడికి ప్రోత్సహించింది. బంగ్లాదేశ్‌తో సహాకారం చూపించడం విరోధాభాసాలకు దారి తీసింది.

మానవత్వపు నిలువ
మన దేశం ఎప్పుడూ సహాయ దృక్పథంతోనే వ్యవహరిస్తుంది. సత్సంబంధాలు కోరుకుంటుంది. కానీ మన పొరుగున్న ఉన్న ఈ దేశాలను మనపై ఎప్పుడూ ద్వేష భావం ప్రదర్శిస్తున్నాయి. శత్రదేశాల ప్రజల మనసు గెలుచుకుంటున్నా.. అక్కడి పాలకులు మాత్రం కయ్యానికి కాలుదువ్వుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

US Iran Conflict

Gulf Tensions : గల్ఫ్‌ ఉద్రిక్తతలు తీవ్రం.. ఇరాన్‌పై చిన్న దేశాల వ్యూహాత్మక దాడులు!

Gulf Tensions : పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంలా మారుతోంది. అమెరికా–ఇజ్రాయెల్‌తో ఇరాన్‌ మధ్య ఘర్షణలు విస్తరిస్తుండగా, గల్ఫ్‌ ప్రాంత దేశాలు నేరుగా తమ ప్రమేయం లేకపోయినా బాధిత దేశాలుగా మారాయి. అమెరికాకు స్థావరాలు...

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
Oktelugu Epaper