Homeఅంతర్జాతీయంIndia Seychelles strategic ties: దటీజ్‌ మోదీ.. అదను చూసి చైనాకు చెక్‌!

India Seychelles strategic ties: దటీజ్‌ మోదీ.. అదను చూసి చైనాకు చెక్‌!

India Seychelles strategic ties: నరేంద్రమోదీ స్టైలే వేరు.. ఎవడికి ఎక్కడ చెక్‌ పెట్టాలో.. ఎవరిని ఎలా అణచివేయాలో ఆయనకు తెలిసినంత ఎవరికీ తెలియదు. దేశం కోసం ఆయన ఏమైనా చేస్తారు. దేశం ఫస్ట్‌ నినాదాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తారు. తనను ద్వేషించినా, ధూషించినా పట్టించుకోరు. సంపాదించాలనే యావ లేని వ్యక్తి. గతంలో చైనాకు లొంగిపోయాడని కాంగ్రెస్‌ మోదీపై ఆరోపణలు చేసింది. ఇక అంబానీ అదానీకి దోచి పెడుతున్నాడని ఆరోపిస్తోంది. గతంలో రఫేల్‌ కొనుగోలుపైనా రాద్ధాంతం […]

India Seychelles strategic ties: నరేంద్రమోదీ స్టైలే వేరు.. ఎవడికి ఎక్కడ చెక్‌ పెట్టాలో.. ఎవరిని ఎలా అణచివేయాలో ఆయనకు తెలిసినంత ఎవరికీ తెలియదు. దేశం కోసం ఆయన ఏమైనా చేస్తారు. దేశం ఫస్ట్‌ నినాదాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తారు. తనను ద్వేషించినా, ధూషించినా పట్టించుకోరు. సంపాదించాలనే యావ లేని వ్యక్తి. గతంలో చైనాకు లొంగిపోయాడని కాంగ్రెస్‌ మోదీపై ఆరోపణలు చేసింది. ఇక అంబానీ అదానీకి దోచి పెడుతున్నాడని ఆరోపిస్తోంది. గతంలో రఫేల్‌ కొనుగోలుపైనా రాద్ధాంతం చేసింది కాంగ్రెస్‌.

సియాచెన్‌తో కీలక ఒప్పందం..
సియాచెన్‌… కశ్మీర్‌కు 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న ద్వీపం. గతంలో దీనిపై చైనా ఆధిపత్యం చెలాయించింది. బెదిరిస్తూ.. వాడుకుంది. మోజాంబిక్‌ ఛానల్‌కు కీలకమైన సియాచెల్స్‌లో ఇప్పుడు మోదీ చక్రం తిప్పబోతున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సియాచెన్‌కు 175 మిలియన్‌ డాలర్ల ఆర్థికసాయం ప్రకటించారు. అక్కడ నావీ బేస్‌ ఏర్పాటు చేయబోతున్నారు.

స్థానికులకు వసతులు..
భారత్‌ ఆర్థికసాయంతో గృహ నిర్మాణం, ఉపాధి శిక్షణ కార్యక్రమాలు ఉన్నాయి. మోజాంబిక్‌ ఛానెల్‌ వైపు చైనా షిప్పింగ్‌ రాకపోకలను గమనించేలా భారత నేవీ బేస్‌ ఏర్పాటు అవుతుంది. గతంలో చైనా బెదిరింపులు విఫలమైన నేపథ్యంలో ఈ అడుగు వ్యూహాత్మకం.

చైనాకు వ్యూహాత్మక దెబ్బ
చైనా భారత చుట్టూ నౌకల మోహర్‌ వేస్తుంటే, సియాచెన్‌ బేస్‌ దాని ఆధిపత్యాన్ని ఎదుర్కొంటుంది. ఇది హిందూ మహాసముద్రంలో భారత పట్రిక స్థిరపడుతుందన్న సంకేతం. మోదీ దీర్ఘకాలిక దృష్టితో ఆర్థిక సహాయం ద్వారా మిత్రత్వాలు పెంచుకుంటూ, రక్షణ ప్రాంగణాన్ని బలోపేతం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో భారత ఆధిపత్యం పెరుగుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper