spot_img
Homeట్రెండింగ్ న్యూస్Israeli Universities: రెండు మీటర్ల చేప ఆదిమానవుడి అసలు గుట్టును విప్పింది: శాస్త్రవేత్తల అధ్యయనంలో షాకింగ్...

Israeli Universities: రెండు మీటర్ల చేప ఆదిమానవుడి అసలు గుట్టును విప్పింది: శాస్త్రవేత్తల అధ్యయనంలో షాకింగ్ విషయాలు

Israeli Universities: మనిషి పరిణామ క్రమమే ఒక వైవిధ్యం. కోతి నుంచి రకరకాల మార్పులు చెందుతూ భూమిని శాసించే స్థాయికి మనిషి ఎదగడం అనన్య సామాన్యం.. చార్లెస్ డార్విన్ నుంచి ఇప్పటివరకు ఎంతో మంది శాస్త్రవేత్తలు ఆ పరిణామ క్రమాన్ని తమకు లభించిన ఆధారాలతో నిరూపితం చేస్తూనే ఉన్నారు.. మనిషి పుట్టుక ఒక అద్భుతమైతే.. పెరగడం, ఆహారం సాధించడం, నివాసం ఏర్పరుచుకోవడం, జీవితం కొనసాగించడం.. ఇవన్నీ కూడా అనేక సవాళ్ళతో కూడుకొని ఉన్నవి. ఇప్పుడంటే మనం రకరకాల ఆహార పదార్థాలు తింటున్నాం. కానీ తొలిసారి మానవుడు ఏం తిన్నాడు? ఎలా తిన్నాడు? ఇందుకు సంబంధించిన ఆధారాలు ఇజ్రాయిల్ దేశంలో లభ్యమయ్యాయి.

Israeli Universities
Primitive food

పచ్చిగానే తినేవాడు

ఆదిమానవుడు ఆహారాన్ని వండుకొని కాకుండా పచ్చిగానే తినేవాడని మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. పచ్చి మాంసం, ఆకులు, అలమలు కూడా తిన్నట్టు చరిత్ర పుస్తకాల్లో మనం చూసాం. మానవుడు క్రమక్రమంగా పచ్చి ఆహారాన్ని కాకుండా వండుకొని తినడం నేర్చుకున్నాడు. అయితే మానవుడు తొలిసారి ఆహారాన్ని 7,80,000 ఏళ్ల క్రితమే వండుకొని తిన్నట్టు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఇజ్రాయిల్ దేశంలోని గేషర్ బేనోట్ యాకోవ్ ప్రాంతంలో దొరికిన వండిన చేప అవశేషాలపై అధ్యయనం చేయగా ఈ విషయం తెలిసింది.

చాలా అధ్యయనాలు జరిగాయి

తొలిసారి వండిన ఆహారం ఎప్పుడు తిన్నాడన్న దానిపై పలు అధ్యయనాలు జరిగాయి. అయితే ఇప్పటిదాకా దొరికిన ఆధారాలను బట్టి 1,70,000 సంవత్సరాల క్రితం తొలిసారి వండిన ఆహారం తిన్నట్టు వెళ్లడైంది. తాజాగా టెల్ అవీవ్ యూనివర్సిటీ, హెబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలేం, బార్ ఇలాన్ యూనివర్సిటీలు, స్టీన్ హార్డ్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ, ఒరేనమ్ అకడమిక్ కాలేజ్, ఇజ్రాయిల్ ఓషినో గ్రఫిక్ అండ్ లిమ్నోలాజికల్, లండన్ లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం, మైన్జ్ లోని జోహాన్నేస్ గూటెన్బర్గ్ యూనివర్సిటీలు సంయుక్తంగా నిర్వహించిన ఈ పరిశోధనలో తేలింది.

అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే

7,80,000 ఏళ్ల క్రితమే మానవులు మంటలను నియంత్రిస్తూ ఆహారం వండినట్లు పరిశోధకులు చెప్తున్నారు. దీంతో ఇప్పటిదాకా వెల్లడయిన అధ్యయనాల ఫలితాలకు తాజా అధ్యయనం తెరదించినట్లయింది. ఈ అధ్యయనానికి టెల్ అవివ్ యూనివర్సిటీ కి చెందిన డాక్టర్ ఇరిట్ జోహర్ అనే పరిశోధకుడు నేతృత్వం వహించాడు. అన్ని రకాల పరికరాలు ఉన్న ఈ కాలంలో మంటను నియంత్రించి వంట చేయడం సాధ్యమే. అయితే ఎటువంటి పరికరాలు లేని ఆ రోజుల్లో మంటను నియంత్రిస్తూ ఆది మానవులు వంట చేశారంటే ఆశ్చర్యం కలగక మానదు.. దొరికిన అవశేషాలను బట్టి ఆదిమానవులు తమ ఆహారం కోసం చేపలకు చాలా ప్రాధాన్యం ఇచ్చేవారని అర్థమవుతున్నది. గేషర్ బెనొట్ యాకోవ్ ప్రాంతంలో దొరికిన చేప అవశేషాలను ఒకచోట చేర్చి పరిశీలించగా పురాతన హూలా సరస్సులో ఈ రకం చేపలు ఉన్నట్టు తెలిసింది.

Israeli Universities
Primitive food

 

ఎప్పుడో వందల ఏళ్ల క్రితమే ఈ చేపలు అంతరించిపోయాయి. ఈ చేపలు దాదాపు రెండు మీటర్ల వరకు పొడవు ఉంటాయి. గేషర్ బెనొట్ యాకోవ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున దొరికిన చేపల అవశేషాలను బట్టి చూస్తే ఆదిమానవులు తరచుగా వీటిని తిన్నట్టు తెలుస్తోంది. వారే వంట చేసే పద్ధతులు అభివృద్ధి చేసినట్లు అవగతమవుతోంది. చేపలు వండి తినడం ద్వారా కలిగే ప్రయోజనాలను ఆ రోజుల్లోనే వారు గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే తాజా అధ్యయనాల ఆధారంగా మరిన్ని పరిశోధనలు చేసి మానవుడి పుట్టుక, అనంతర పరిణామాలు మరింత లోతుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...
Oktelugu Epaper
Exit mobile version