Homeఎంటర్టైన్మెంట్Superstar Krishna- Indira Devi: సూపర్ స్టార్ కృష్ణకు ఇందిరాదేవికి పెళ్లి ఎప్పుడు అయ్యింది.? విజయ...

Superstar Krishna- Indira Devi: సూపర్ స్టార్ కృష్ణకు ఇందిరాదేవికి పెళ్లి ఎప్పుడు అయ్యింది.? విజయ నిర్మలను ఎప్పుడు రెండో పెళ్లి చేసుకున్నాడు?

Superstar Krishna- Indira Devi: సూపర్ స్టార్ కృష్ణ వ్యక్తిగత జీవితంలో అనేక నాటకీయ పరిణామాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన భార్య ఉండగానే మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది. హీరోయిన్ విజయ నిర్మలను కృష్ణ రహస్య వివాహం చేసుకున్నారు. హీరోగా ఎదుగుతున్న రోజుల్లోనే కృష్ణ విజయనిర్మలను పెళ్లి చేసుకున్నారు. ఇందిరా దేవి ఉన్నప్పటికీ కృష్ణ రెండవ పెళ్లి చేసుకోవడానికి కారణం… ప్రేమ వ్యవహారమే. తేనెమనసులు మూవీతో 1965లో కృష్ణ హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు.

Superstar Krishna- Indira Devi
Superstar Krishna- Indira Devi

అయితే అంతకు ముందే ఆయనకు వివాహం జరిగింది. ఆ రోజుల్లో వయసొచ్చిన వెంటనే పెద్దవాళ్ళు పెళ్లి చేసేవాళ్లు. చదువు పూర్తి చేసిన కృష్ణకు బంధువుల అమ్మాయి, వరసకు మరదలు అయ్యే ఇందిరాదేవితో 1962లో వివాహం చేశారు. పెళ్ళైన తర్వాత కృష్ణ మద్రాస్ వచ్చి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. గూఢచారి మూవీతో కృష్ణకు ఫస్ట్ బ్రేక్ వచ్చింది. అనంతరం దర్శకుడు బాపు తెరకెక్కించిన సాక్షి సూపర్ హిట్ కొట్టింది. ఆ దెబ్బతో కృష్ణకు పరిశ్రమలో అవకాశాలు క్యూ కట్టాయి. సాక్షి మూవీలో కృష్ణకు జంటగా విజయనిర్మల నటించారు.

Also Read: Nagarjuna Ghost Pre- Review: ఘోస్ట్ మూవీ ప్రీ రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం

ఆ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అప్పటికి విజయనిర్మలకు పెళ్ళై ఒక అబ్బాయి ఉన్నాడు. భర్తతో ఆమెకు విబేధాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆమె కృష్ణకు దగ్గరయ్యారు. విజయనిర్మల కృష్ణకు అండగా ఉంటూ ఆయనకు సలహాదారుగా వ్యవహరించేవారు. అలా పరిచయం ప్రేమగా మారి పెళ్ళికి దారితీసింది. విజయనిర్మలను కృష్ణ ఓ గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి రహస్యంగా చేసుకున్నప్పటికీ మొదటి భార్య ఇందిర దగ్గర ఆయన విషయం దాచలేదు.

Superstar Krishna- Indira Devi
Superstar Krishna- Indira Devi

విజయ నిర్మలను రెండో వివాహం చేసుకున్నట్లు చెప్పాడు. భర్త అంటే అమితమైన ప్రేమ కలిగిన ఇందిరా దేవి ఆయన నిర్ణయాన్ని గౌరవించారు. ఇక కృష్ణ ఒకవైపు స్టార్ గా ఎదుగుతూ మరోవైపు ఇద్దరు భార్యలతో సన్నిహిత సంబంధాలు నెరిపారు. విజయ నిర్మలతో కృష్ణ పిల్లల్ని కనలేదు. నరేష్ మొదటి భర్తకు పుట్టిన అబ్బాయి. ఇక ఇందిరా దేవికి ఐదుగురు సంతానం. రమేష్ బాబు, మహేష్ బాబు అబ్బాయిలు కాగా, మంజుల, పద్మావతి, ప్రియదర్శి అనే ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. కాగా ఇందిరా దేవి పబ్లిక్ లో కనిపించడానికి ఇష్టపడరు. ఆమె ఏళ్ల తరబడి కెమెరా వెనుక ఉండిపోయారు. నేడు అనారోగ్యంతో ఇందిర 70 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

Also Read: Varalaxmi Sarathkumar: తండ్రి పేరుతోనే పరిశ్రమలోకి వచ్చింది: చేతిలో ఎనిమిది సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉంది

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
Peddi Sudarshan Reddy

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
YCP Leaders

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
rain forecast for AP

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
Oktelugu Epaper