Chhattisgarh
Chhattisgarh: మనుషులు విచక్షణ కోల్పోతే మృగాల్లాగా ప్రవర్తిస్తారు. ఆ క్షణంలో ఏం చేస్తున్నామనే సోయి వారికి ఉండదు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడరు. ఎందుకంటే మనుషులు ఉద్రేకంగా ఉన్నప్పుడు వారి శరీరంలో ఏపిడ్రిమిన్, సెరటోనిన్ అధిక స్థాయిలో ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల వారిలో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది.. కోపంలో ఏం చేస్తారో తెలియని పరిస్థితి కల్పిస్తుంది.
తాజాగా ఇలాంటి ఘటనే ఛత్తీస్గడ్ రాష్ట్రం జాష్ పూర్ జిల్లాలో జరిగింది. ఈ జిల్లాలోని ఓ గ్రామానికి శంకర్ రామ్, ఆశా భాయ్ భార్యాభర్తలు.. అయితే శంకర్ రామ్ కు మద్యం తాగే అలవాటు ఉంది. మద్యం తాగిన తర్వాత అతడు ఏం చేస్తాడో అతడికే తెలియదు. అయితే మంగళవారం తీవ్రంగా మద్యం తాగి వచ్చిన శంకర్ రామ్… భార్య ఆశా భాయ్ ని శృంగారం చేయాలని బలవంతం చేశాడు. అతడు మద్యం తాగి ఉండడంతో ఆవాసన భరించలేక శృంగారానికి ఆశా భాయ్ ఒప్పుకోలేదు. దీంతో శంకర్ రామ్ ఆమెతో వాగ్వాదానికి దిగాడు.. భర్త వేధింపులు తట్టుకోలేక ఆశా భాయ్ బావిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. భార్య చనిపోతుందనే భయంతో శంకర్ రామ్ ఆశా భాయ్ ని కాపాడాడు..
మళ్లీ తనతో శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేశాడు. దీనికి ఆమె ఒప్పుకోలేదు. మళ్లీ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.. దీంతో విచక్షణ కోల్పోయిన శంకర్ రామ్… ఆమెపై దాడి చేశాడు. తీవ్రంగా కొట్టాడు. అతడి దెబ్బలకు తాళలేక ఆశాభాయ్ కన్ను మూసింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు శంకర్ రామ్ ను అదుపులోకి తీసుకున్నారు.. ఆషా భాయ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. కాగా ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Chhattisgarh
అయితే శంకర్ రామ్, ఆషా భాయ్ అన్యోన్యంగా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. అయితే భర్త మద్యానికి అలవాటు పడటంతో దాన్ని మాన్పించేందుకు ఆషా భాయ్ అనేక ప్రయత్నాలు చేసిందని గుర్తు చేస్తున్నారు. అయినప్పటికీ శంకర్ రామ్ తన ప్రవర్తన తీరు మార్చుకోకపోవడంతో శృంగారానికి ఆశా భాయ్ నిరాకరించిందని వారు అంటున్నారు. విచక్షణ కోల్పోయిన శంకర్ రామ్ ఆశా భాయ్ ని దారుణంగా కొట్టాడని, అందువల్లే ఆమె చనిపోయిందని వారు చెబుతున్నారు.