spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Atrocity In Visakha: మొన్న ఢిల్లీలో.. నేడు విశాఖలో.. మహిళను ముక్కలు చేసిన సైకో కిల్లర్.....

Atrocity In Visakha: మొన్న ఢిల్లీలో.. నేడు విశాఖలో.. మహిళను ముక్కలు చేసిన సైకో కిల్లర్.. భయానక స్టోరీ

Atrocity In Visakha: శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి ప్యాక్ చేశారు. డబ్బాలోపెట్టి చుట్టూ ప్లాస్టర్ అతికించారు. బయటకు దుర్వాసన రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. నెలల తరబడి శవం అలానే కుళ్లి కృషించిపోయినా వాసన బయటకు రాలేనంతగా ఏర్పాట్లు చేశారు. సైకో కిల్లర్ తరహాలో ఓ ఘటన విశాఖలో బయటపడింది. భయానక స్థితిలో మహిళ మృతదేహం వెలుగుచూసింది. ఎప్పుడో నెలల కిందట జరిగిన హత్య ఉదాంతం.. అద్దె ఎగ్గొట్టడంతో ఇంటి ఓనర్ ఖాళీ చేయించే క్రమంలో బయటపడడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకూ అద్దెకు ఉన్న వ్యక్తే అసలు సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తూ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. అయితే కేసులో నిందితుడును గుర్తించిన పోలీసులు.. ఇప్పుడు హతురాలు ఎవరన్నది తేల్చే పనిలో ఉన్నారు.

Atrocity In Visakha
Atrocity In Visakha

 

పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన రిషి 2019లో ఉపాధి కోసం విశాఖ వచ్చాడు. ఎండాడ జంక్షన్ లో వెల్డింగ్ దుకాణం నడుపుతున్న రమేష్ ను పని కోసం ఆశ్రయించాడు. అక్కడే పనికి కుదిరిన రిషి కొద్దిరోజుల పాటు సవ్యంగానే నడుచుకున్నాడు. రిషిపై నమ్మకం కుదరడంతో కొమ్మాది వికలాంగ కాలనీలోని తన రేకుల షెడ్డును కొద్ది మొత్తం అద్దెతో రిషికి అప్పగించాడు రమేష్. అప్పటి నుంచి రిషి భార్యతో నివాసముంటున్నాడు. 2021 జూన్ లో భార్యను ప్రసవానికి పుట్టింటికి పంపించాడు. తిరుగు ప్రయాణంలో భాగంగా ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో సదరు మహిళను ఎండాడలో ఇంటికి తీసుకొచ్చారు. ఇద్దరు శారీరకంగా కలిశారు. అయితే నగదు ఇచ్చుపుచ్చుకునే క్రమంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. శారీరక సంబంధాన్ని బయటకు చెప్పేస్తానని మహిళ బెదిరించడంతో రిషి చున్నీతో మెడను బిగించడంతో ఆమె అపస్మారకస్థితికి చేరుకుంది. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని భయపడ్డ రిషి మహిళను హత్యచేశాడు. అంతటితో ఆగకుండా శరీరరాన్ని ముక్కలుగా చేసి ప్యాక్ చేశాడు. ఆ ప్యాక్ ను ఓ డబ్బాలో పడేసి దాని చుట్టూ ప్లాస్టర్ అతికించాడు. బయటకు దుర్వాసన రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆ డబ్బాను ఇంట్లో ఓ మూలన పడేసి వెళ్లిపోయాడు.

Atrocity In Visakha
Atrocity In Visakha

అయితే అటు వెల్డింగ్ షాపునకు వెళ్లడం మానేశాడు రిషి. దీంతో రమేష్ తరచూ ఫోన్ చేసినా ఏవేవో కథలు చెబుతూ తప్పించుకొని తిరిగే వాడు. నెలల తరబడి అద్దె సైతం చెల్లించలేదు. ఇటీవల ఫోన్ కూడా స్విచ్ఛాప్ చేశాడు. దీంతో వెరొకరికి అద్దెకిచ్చేందుకు రమేష్ నిర్ణయించుకున్నాడు. షెడ్ లో ఉన్న రిషి లగేజీ ఖాళీ చేయించాడు. ఈ క్రమంలో డబ్బా కనిపించింది. తెరిచి చూడగా ముక్కముక్కలుగా ఉన్న మృతదేహం బయటపడింది. దీంతో రమేష్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలో రిషి అనే వ్యక్తి ఉండేవాడని చెప్పడంతో పోలీసులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు. రిషిని అదుపులోకి తీసుకొని ఇంటరాగేషన్ చేయగా.. తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. కానీ ఆమె ఎవరనేది మాత్రం చెప్పలేకపోతున్నాడు. ప్రయాణంలో పరిచయమైనట్టు మాత్రమే చెబుతున్నాడు. అయితే రిషికి, అపరిచిత మహిళ మధ్య రెండుసార్లు ఫోన్ సంభాషణలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. కానీ ఎక్కువ రోజులు కావడంతో ఫోన్ కాల్ డేటాలో సైతం ఎటువంటి వివరాలు లభ్యం కావడం లేదు. దీంతో సదరు మహిళ ఎవరనేది పోలీసులకు అంతుపట్టడం లేదు. మిస్టరీని ఛేదించే పనిలో ప్రస్తుతం విశాఖ పోలీసులు ఉన్నారు. మొన్న ఢిల్లీలో ప్రేమోన్మాదంతో మహిళను ముక్కలు ముక్కలుగా నరికిన ఘటన మరువక ముందే.. విశాఖలో అటువంటి ఘటనే వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...

NTR: కీలక నిర్ణయం దిశగా జూనియర్ ఎన్టీఆర్!

NTR: తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరూ అంటే మాత్రం చటుక్కున లోకేష్ పేరు వస్తుంది. ప్రస్తుతం ఆయన అనధికార అధినేత తెలుగుదేశం పార్టీకి. పైగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్ని తానై...

Tammineeni Seetharam: ఏపీలో మారిన అరెస్టుల స్టైల్!

Tammineeni Seetharam: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అరెస్టు భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసుల రూపంలో వెంటాడింది. కానీ కొందరు తమ వ్యవహార శైలితో ఏరి కోరి కేసులు తెచ్చుకున్నారు....

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...
Oktelugu Epaper
Exit mobile version