HomeతెలంగాణMLC Kavitha: కవితకు బెయిల్ కోసం వేయికళ్లతో ఎదురుచూపులు.. రంగంలోకి ప్రముఖ న్యాయవాది.. సుప్రీంకోర్టులో ఏం...

MLC Kavitha: కవితకు బెయిల్ కోసం వేయికళ్లతో ఎదురుచూపులు.. రంగంలోకి ప్రముఖ న్యాయవాది.. సుప్రీంకోర్టులో ఏం జరుగనుంది?

MLC Kavitha: ఢిల్లీ మద్యం పాలసీని మార్చడం.. తద్వారా పరోక్షంగా లబ్ధి పొందినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా.. లబ్ధి పొందినట్లు ఢిల్లీ అటార్నీ జనరల్‌ గుర్తించారు. వెంటనే విచారణకు ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ చేపట్టింది. ఇందులో భారీగా డబ్బులు చేతులు మారినట్లు ప్రాథమికంగా గుర్తించింది. దీంతో వెంటనే ఈడీ కూడా రంగంలోకి దిగింది. రెండు దర్యాప్తు సంస్థలు విచారణలో సంచలన విషయాలు, వీవీఐపీలు వెలుగులోకి వచ్చారు. పది మందికిపైగా అరెస్ట్‌ అయ్యారు. చివరగా తెలంగాణ మాజీ సీఎం కూతురు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారు. ఈ ఏడాది మార్చి 14న కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది. అంతకు ముందు రెండుసార్లు ఈడీ విచారణకు హాజరైన కవిత.. తర్వాత విచారణ నుంచి మినహాయించాలని సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. కానీ విచారణ జరుగుతుండగానే ఈడీ కవితను అరెస్టు చేసింది. మార్చి 15వ తేదీ నుంచి ఆమె తిహార్‌ జైల్లో ఉంటున్నారు. ఇక కవిత రెగ్యులర్‌ బెయిల్‌ కోసం, మధ్యంతర బెయిల్‌ కోసం పలుమార్లు ప్రయత్నం చేశారు. రవూస్‌ అవెన్యూ కోర్టును, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కానీ దర్యాప్తు సంస్థలు బెయిల్‌ ఇవ్వొద్దని కోరడంతో న్యాయస్థానాలు దర్యాప్తు సస్థల వాదనలతో ఏకీభవించాయి. దీంతో చివరి ప్రయత్నంగా కవిత ఇటీవలే సుప్రీ కోర్టు తలుపు తట్టారు. మంగళవారం కవిత బెయిల్‌ పటిషన్‌పై విచారణ జరుగనుంది.

ఆగస్టు 12న సుప్రీ కోర్టుకు..
రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై జూలై 1న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌చేస్తూ కవిత ఆగస్టు 12న సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు బీఆర్‌.గవాయ్, కేవీ.విశ్వనాథ్‌లతో కూడిన ధర్మాసనం కౌంటర్‌ దాఖలు చేయాలని సీబీఐ, ఈడీకి నోటీసులు జారీ చేసింది. సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. ఈడీ దాఖలు చేయకపోవడంతో విచారణ వాయిదా పడింది. మంగళవారం(ఆగస్టు 27న) విచారణ చేపట్టనుంది. సీబీఐ, ఈడీ వాదనలు వినిపించనున్నాయి. ఇప్పుడు రద్దయిన ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ 2021–22 రూపకల్పన, అమలుకు సంబంధించిన నేరపూరిత కుట్రలో ప్రధాన కుట్రదారుల్లో ఆమె ప్రాథమికంగా ఒకరని పేర్కొంటూ, రెండు కేసుల్లోనూ కవిత బెయిల్‌ పిటిషన్‌లను హైకోర్టు ఇదివరలో కొట్టివేసింది. పాలసీ రూపకల్పన, అమలులో అవినీతి, మనీలాండరింగ్‌కు సంబంధించి సీబీఐ, ఈడీ వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి.

రంగంలోకి ముకుల్‌ రోహ్గతి..
ఇక ఇప్పటి వరకు బెయిల్‌ కోసం రవూస్‌ అవెన్యూ, ఢిల్లీ హైకోర్టులో కవిత తరఫున పలువురు న్యాయవాదులు వాదనలు వినిపించారు. బెయిల్‌ ఇవ్వాలని కోరారు. దర్యాప్తు సంస్థల తరఫున కూడా న్యాయవాదులు వాదనలు వినిపించారు. కానీ, దర్యాప్తు సంస్థల న్యాయవాదులే పైచేయి సాధించారు. దీంతో కవితకు బెయిల్‌ రాలేదు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో కవిత తరఫున వాదనలు వినిపించేందుకు మాజీ అటార్టీ జనరల్‌ ముకుల్‌ రోహ్గతిని కేటీఆర్, హరీశ్‌రావు రంగంలోకి దించారు. మంగళవారం ఆయన కవిత తరఫున వాదించనున్నారు. దీంతో బెయిల్‌పై ఉత్కంఠ నెలకొంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Toxic Movie

Toxic Movie: ‘టాక్సిక్’ నుండి మరో హాట్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది.. ఈసారి డోస్ బాగా తగ్గించేశారుగా!

Toxic Movie: కన్నడ సూపర్ స్టార్ యాష్ నటించిన లేటెస్ట్ చిత్రం 'టాక్సిక్' వచ్చే నెల ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్ల గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన...
Nagarjuna

Nagarjuna: ‘లెనిన్’ ని ఆ రేంజ్ కి తీసుకెళ్లలేకపోయాము అంటూ నాగార్జున హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Nagarjuna: అక్కినేని ఫ్యామిలీ 'లెనిన్' సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతున్న సంగతి అందరికీ తెలిసిందే. 12 ఏళ్ళ నిరీక్షణకు తెరదించుతూ , అక్కినేని అఖిల్ ఈ చిత్రం తో భారీ బ్లాక్...
Bigg Boss 10 Telugu

Bigg Boss 10 Telugu: పోలీస్ బిడ్డ.. ఆర్మీ బిడ్డ.. మధ్యలో జపాన్ బిడ్డ.. ‘బిగ్ బాస్...

Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్ 10' సెప్టెంబర్ 6 న గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. గత ఏడాది...
Himalayan Disaster

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...
Divvela Madhuri

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...
Oktelugu Epaper