Homeఆధ్యాత్మికంSri Rama Navami 2026: మరో మూడు రోజుల్లో శ్రీరామనవమి.. గుర్తింపు కోసం కోర్టుకు రామచంద్రుడు.....

Sri Rama Navami 2026: మరో మూడు రోజుల్లో శ్రీరామనవమి.. గుర్తింపు కోసం కోర్టుకు రామచంద్రుడు.. ఏంటా కథ!

Sri Rama Navami 2026: మనదేశంలో.. ముఖ్యంగా దక్షిణాది ప్రాంతంలో ఒక మనిషి పేరుకు ముందు ఇంటి పేరు ఉంటుంది. ఆ తర్వాత కులం.. అనంతరం గోత్రం ఉంటుంది.. ఇది ఇప్పటిది కాదు.. తరతరాలుగా సాగుతూ వస్తోంది. కులాన్ని.. గోత్రాన్ని కొంతమంది వ్యతిరేకించినప్పటికీ.. చాలామంది నేటికీ అనుసరిస్తూనే ఉంటారు..

కులాలు.. గోత్రాలు కేవలం మనుషులకు మాత్రమే కాదు.. దేవతామూర్తులకు కూడా ఉంటాయి. దేవతామూర్తులకు కులాలను.. గోత్రాలను ఆపాదించడం ఈనాటిది కాదు.. దాని వెనక ఏళ్ల చరిత్ర ఉంది. ఆయా దేవుళ్లను వివిధ కులాలవారు ఆపాదించుకోవడం పరిపాటిగా మారింది.

ఇప్పటివరకు కులాలు.. గోత్రాల విషయంలో ఏ దేవుళ్ళు కూడా ఇబ్బంది పడిన దాఖలాలు లేవు. వివాదాస్పదమైన సందర్భాలు కూడా లేవు. అయితే తొలిసారిగా ఇటువంటి ఇబ్బందులు శ్రీ సీతారామ చంద్రుడు ఎదుర్కొంటున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం. సీతారామ చంద్రుడికి ఆస్థాయిలో ఇబ్బంది ఎందుకు కలిగింది.. గోత్రం విషయంలో స్వామివారు ఎందుకు కోర్టు మెట్లు ఎక్కారు.. ఈ ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.

భద్రాద్రి రామయ్య గోత్రం వశిష్ట. సీతమ్మది గౌతమస గోత్రం. ఈ గోత్రాల పేర్లను చదువుతూ అర్చకులు పూజలు చేస్తూ ఉంటారు. 2012 తర్వాత పండితులు స్వామివారిని అచ్యుత.. అమ్మవారిని సౌభాగ్య గోత్రాలుగా చదువుతున్నారు. ఈ మార్పు వెనుక ఉద్దేశం ఏమిటో తెలియదు. అయితే సీతారామ చంద్రుల గోత్రాలను 2012 నుంచి మార్చి చదువుతున్నారని ఓ భక్తుడు కోర్టు దాకా వెళ్లాడు.

2022లో తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. కోర్టు ఆదేశాల మేరకు ఒక కమిటీ ఏర్పాటు అయింది. ఆ కమిటీ దేవాదాయ శాఖకు నివేదిక ఇచ్చింది. అయితే ఆ నివేదికను దేవాదాయ శాఖ బయట పెట్టలేదు. దీంతో ఆ వ్యక్తి మళ్ళీ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ సున్నితమైన వివాదంపై కోర్టు ఎలా విచారిస్తుంది? ఎటువంటి తీర్పు ఇస్తుంది అనేది చూడాల్సి ఉంటుంది.

సీతారామచంద్రస్వామికి మరో మూడు రోజుల్లో కళ్యాణం.. మరో నాలుగు రోజుల్లో పట్టాభిషేకం జరుగుతాయి. ఇంతటి మహత్కార్యాల ముందు స్వామివారు గోత్రానికి సంబంధించి వివాదం ఎదుర్కోవడం.. అది కూడా కోర్టు దాకా వెళ్లడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. స్వామివారి గోత్రాలను మార్చి ఎందుకు చదువుతున్నారు.. గతంలో చదివిన వాటిని ఎందుకు పక్కన పెట్టారు.. అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లభించలేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Vijayendra Prasad

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Varanasi Teaser

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...
Monsoon Health Tips

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...
Furniture Rental

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper