HomeతెలంగాణKavitha will launch new party: తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ.. ఆ దిశగా కవిత...

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ.. ఆ దిశగా కవిత అడుగులు!?

Kavitha will launch new party: తెలంగాణ రాజకీయ రంగంలో కొత్త ఒరవడి సృష్టించేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త పార్టీకి పెద్దగా స్కోప్‌ లేదు. అయినా కవిత మాత్రం కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. జూన్‌ 2, 2025న ఈ పార్టీని అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తూ, ప్రజా సమస్యలపై దృష్టి సారించే కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొనడం ద్వారా కవిత రాజకీయ కదలికలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) కూతరు కవిత ఇటీవల తన తండ్రికి ఆరు పేజీల లేఖ రాసి సంచలనం సృష్టించారు. పార్టీ వైఫల్యాలను, అంతర్గత లోపాలను వెల్లడించారు. దీంతో అంతర్గత విభేదాలు బయట పడ్డాయి. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కవిత తీరును తప్పు పట్టారు. అయితే తనను ధిక్కరిచేవారిని పార్టీ నుంచి పంపిచే కేసీఆర్‌.. కవిత వద్దకు మాత్రం రాయబారం పంపించారు. రాజ్యసభ సభ్యుడు దామోదర్‌రావు కవితతో మంతనాలు జరిపారు. ఆ మరుసటి రోజే కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు.

జాగృతి నాయకులతో భేటీ..
కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్‌లోని తన నివాసంలో తెలంగాణ జాగృతి నాయకులతో సమావేశమై, కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన కీలక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో సింగరేణి ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు, ఇది కవిత రాజకీయ ఆధారాన్ని బలోపేతం చేసేందుకు ప్రాంతీయ సమస్యలపై దృష్టి పెట్టే సంకేతంగా భావిస్తున్నారు. జూన్‌ 2, 2025న కొత్త పార్టీ ప్రకటన జరిగే అవకాశం ఉందని, ఈ పార్టీ ‘బహుజన సామాజిక న్యాయం’ అనే ట్యాగ్‌లైన్‌తో ప్రజల్లోకి వెళ్లనున్నట్లు సమాచారం.

మూడింటికి ప్రత్యామ్నాయం..
కవిత ఈ కొత్త పార్టీ ద్వారా తెలంగాణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో తెలంగాణ జాగృతి సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల ద్వారా గుర్తింపు పొందిన కవిత, ఇప్పుడు రాజకీయ వేదికగా దీనిని ఉపయోగించుకోవడం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

Also Read: Annadatha Sukhibhav : తొలి విడత ‘అన్నదాత సుఖీభవ’.. ఎట్టకేలకు క్లారిటీ!

జాగృతి కమిటీల ఏర్పాటు..
కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి ద్వారా జిల్లా స్థాయిలో కమిటీల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అయింది. ఈ కమిటీలు రాష్ట్రవ్యాప్తంగా సామాజిక, రాజకీయ కార్యకలాపాలను సమన్వయం చేయడంతో పాటు, స్థానిక సమస్యలను గుర్తించి, వాటిని ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సింగరేణి ప్రాంతంలో బలమైన సామాజిక ఆధారం ఉన్న కవిత, ఈ ప్రాంతంలోని కార్మిక, గిరిజన, బహుజన సమస్యలపై దృష్టి సారించే అవకాశం ఉంది.

క్షేత్రస్థాయి నుంచి..
జాగృతి కమిటీల ఏర్పాటు ద్వారా కవిత గ్రాస్‌రూట్‌ స్థాయిలో రాజకీయ బలాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కమిటీలు స్థానిక నాయకులను, కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకొచ్చి, పార్టీ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేయడంలో సహాయపడతాయి. సింగరేణి వంటి ప్రాంతాల్లో బలమైన ఆధారం ఉండటం వల్ల, కవిత ఈ ప్రాంతాల్లో రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం ఉంది.

పాదయాత్ర..
బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు మాటల్లో, కవిత వై.ఎస్‌. షర్మిల తరహాలో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టే అవకాశం ఉందని తెలిపారు. ఈ పాదయాత్ర ద్వారా తెలంగాణలోని ప్రజా సమస్యలను లేవనెత్తి, ప్రజలతో నేరుగా సంబంధం ఏర్పరచుకోవడం ద్వారా కొత్త రాజకీయ శక్తిగా గుర్తింపు పొందాలని కవిత లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పాదయాత్ర రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమస్యలను హైలైట్‌ చేసేందుకు ఒక వేదికగా ఉపయోగపడనుంది.

షర్మిల బాటలోనే..
పాదయాత్రలు తెలంగాణ రాజకీయాల్లో గతంలో కూడా ప్రజలతో సంబంధం ఏర్పరచుకోవడంలో సమర్థవంతంగా పనిచేశాయి. వై.ఎస్‌. షర్మిల, కేసీఆర్‌ వంటి నాయకులు ఇలాంటి వ్యూహాల ద్వారా రాజకీయ ఆధారాన్ని బలోపేతం చేసుకున్నారు. కవిత ఈ వ్యూహాన్ని అనుసరించడం ద్వారా, ప్రజలతో నేరుగా సంబంధం ఏర్పరచుకుని, రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం ఉంది.

బీఆర్‌ఎస్‌తో చర్చలు విఫలం..
కవిత ఈ నిర్ణయం వెనుక భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌ రావు (కేసీఆర్‌)తో జరిగిన చర్చలు విఫలం కావడం ఒక కీలక కారణంగా చెప్పబడుతోంది. బీఆర్‌ఎస్‌లో కవిత పాత్ర, రాజకీయ భవిష్యత్తుపై జరిగిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో, కవిత స్వతంత్రంగా రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం. గతంలో ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్టైన కవిత, బెయిల్‌పై విడుదలైన తర్వాత తెలంగాణ జాగృతి ద్వారా సామాజిక కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఇది ఆమె రాజకీయ రీ–ఎంట్రీకి బలమైన వేదికగా మారింది.

Also Read: Heavy rain in AP : బంగాళాఖాతం నుంచి బిగ్ అలెర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన!

స్వతంత్ర రాజకీయ నిర్ణయం..
బీఆర్‌ఎస్‌తో చర్చల వైఫల్యం కవితను స్వతంత్ర రాజకీయ నిర్ణయం తీసుకునే దిశగా నడిపించినట్లు కనిపిస్తోంది. బీఆర్‌ఎస్‌ గత ఎన్నికల్లో ఓటమి, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో, కవిత తన సొంత రాజకీయ గుర్తింపును స్థాపించుకునేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.

సామాజిక, రాజకీయ ప్రభావం
కవిత కొత్త పార్టీ ఏర్పాటు, జాగృతి కమిటీల నిర్మాణం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చను రేకెత్తిస్తోంది. ఈ పార్టీ బహుజన సామాజిక న్యాయంపై దృష్టి సారించడం ద్వారా, గిరిజన, దళిత, మైనారిటీ సమాజాల సమస్యలను లేవనెత్తే అవకాశం ఉంది. సింగరేణి ప్రాంతంలో బలమైన ఆధారం ఉండటం వల్ల, కవిత ఈ ప్రాంతంలోని కార్మిక సమస్యలు, ఉపాధి అవకాశాలు, సామాజిక న్యాయంపై దష్టి సారించే అవకాశం ఉంది. అలాగే, రాష్ట్రవ్యాప్త పాదయాత్ర ద్వారా ప్రజలతో నేరుగా సంబంధం ఏర్పరచుకోవడం ద్వారా, రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశం ఉంది.

బీఆర్‌ఎస్‌ బలహీనం..
తెలంగాణలో బీఆర్‌ఎస్‌ బలహీనపడిన నేపథ్యంలో, కవిత ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, సామాజిక న్యాయం, స్థానిక సమస్యలపై దృష్టి సారించడం ద్వారా రాజకీయ శూన్యతను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, కొత్త పార్టీ ఏర్పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఆధారాన్ని నిర్మించడం సవాళ్లతో కూడుకున్న పని. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పోటీపడేందుకు బలమైన వ్యూహం, నాయకత్వం అవసరం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular