వరదసాయంపై ఓవైసీని నిలదీసిన మహిళలు

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా సోమవారం ప్రచారానికి వెళ్లిన ఎంపీ అసుదుద్దీన్ ఓవైసీకి స్థానికుల నుంచి నిరసన సెగ తగిలింది. సోమవారం జాంబాగ్ డివిజన్ ఎంఐఎం అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తుండగా స్థానిక మహిళలు వరదసాయంపై నిలదీశారు. వరదల సమయంలో పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి ఓట్లేయమని ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. అయితే ఓవైసీ ఎలాంటి సమాధానం చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. వరదసాయంపై టీఆర్ఎస్ నాయకులను ఇప్పటికే నిలదీస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఎంఐఎం అధినేతను మహిళలు నిలదీయడం […]

Written By: Suresh, Updated On : November 23, 2020 11:39 am
Follow us on

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా సోమవారం ప్రచారానికి వెళ్లిన ఎంపీ అసుదుద్దీన్ ఓవైసీకి స్థానికుల నుంచి నిరసన సెగ తగిలింది. సోమవారం జాంబాగ్ డివిజన్ ఎంఐఎం అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తుండగా స్థానిక మహిళలు వరదసాయంపై నిలదీశారు. వరదల సమయంలో పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి ఓట్లేయమని ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. అయితే ఓవైసీ ఎలాంటి సమాధానం చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. వరదసాయంపై టీఆర్ఎస్ నాయకులను ఇప్పటికే నిలదీస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఎంఐఎం అధినేతను మహిళలు నిలదీయడం చర్చనీయాంశంగా మారింది.