Virat Kohli 82 Runs Against Pakistan: సహజంగానే విరాట్ కోహ్లీని మనం రన్ మిషన్ అంటాం. ఎందుకంటే పరుగులు తీయడంలో అతడు ఆ స్థాయిలో దూకుడు చూపిస్తూ ఉంటాడు. విరాట్ కోహ్లీ కేవలం రన్ మిషన్ మాత్రమేకాదు, ఛేజింగ్ మాస్టర్ కూడా. బీభత్సంగా పరుగులు తీయడంలో.. కఠినమైన లక్ష్యాలను ఛేదించడంలో విరాట్ కోహ్లీ తర్వాతే ఎవరైనా. విరాట్ ఆటకు మన జాతీయ జట్టులోని ప్లేయర్లు మాత్రమేకాదు, ప్రత్యర్థి జట్టు ప్లేయర్లు కూడా ఫిదా అవుతుంటారు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ ఏబీ డివిలియర్స్ ముందువరుసలో ఉంటాడు.
డివిలియర్స్ ను మైదానంలో మిస్టర్ 360 అని పిలుస్తుంటారు. అతడు బంతిని మైదానం నలుమూలలవైపు కొడుతూ ఉంటాడు. ఎంతటి తోపు బౌలర్ అయినా సరే అతడి ముందు తలవంచాల్సిందే. అందరి డివిలియర్స్ కూడా విరాట్ కోహ్లీకి ఫ్యాన్ అయిపోయాడు. అతడు ఆడుతుంటే తీన్మార్ డ్యాన్స్ వేశాడు. ఆ విషయాన్ని ఇటీవల అతడు పంచుకున్నాడు.
ఓ ఇంటర్వ్యూలో డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు..”ఇప్పటివరకు నేను చూసిన అత్యుత్తమ టి20 ఇన్నింగ్స్ విరాట్ కోహ్లీ ఆడింది. అతడు ఆ మ్యాచ్లో 82 పరుగులు చేశాడు. అప్పుడు జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ జట్టుతో భారత్ ఆడుతోంది. ఆ మ్యాచ్లో భారత్ కష్టాల్లో పడింది. తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ గట్టిగా నిలబడ్డాడు. ఏ మాత్రం కంగారు పడలేదు. నమ్మకాన్ని కోల్పోకుండా బ్యాటింగ్ చేశాడు. పాకిస్తాన్ బౌలర్ రౌఫ్ బౌలింగ్లో సిక్సర్లు కొట్టాడు. అప్పుడే ఆట స్వరూపం పూర్తిగా మారిపోయింది. అతని ఓపిక.. సమయమనం ఇక్కడిదాకా తీసుకొచ్చాయి. అతడు ఆ స్థాయిలో ఆడటం వల్లే ప్రపంచ స్థాయి ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడని” డివిలియర్స్ పేర్కొన్నాడు.
డివిలియర్స్ ఐపీఎల్ లో బెంగళూరు జట్టు తరఫున ఆడాడు. అతడు ఆడినప్పుడు బెంగళూరు ఐపిఎల్ ట్రోఫీ అందుకోలేకపోయింది. గత సీజన్ లో విజేతగా నిలిచినప్పుడు బెంగళూరు జట్టును డివిలియర్స్ అభినందించాడు. ఈ సీజన్లో కూడా బెంగళూరు విజేతగా నిలవడంతో.. డివిలియర్స్ ఆనందం వ్యక్తం చేశాడు. తాను జట్టులో ఉన్నప్పుడు బెంగళూరు ట్రోఫీ గెలిచి ఉంటే బాగుండేదని డివిలియర్స్ వ్యాఖ్యానించాడు. అయినప్పటికీ తన జట్టు రెండుసార్లు విజేతగా నిలిచిందని.. ఇది ఆనందకరమైన విషయమని డివిలియర్స్ పేర్కొన్నాడు.

