Virat Kohli Playoff Century: ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో విరాట్ భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటికే అతడు 13 మ్యాచ్ లు ఆడాడు. 13 ఇన్నింగ్స్ లలో 542 పరుగులు చేశాడు. అతడి యావరేజ్54.20. స్ట్రైక్ రేట్ 164.74. ఇందులో ఫోర్లు 57, సిక్సర్లు 21.. పైగా తన సమకాలిన రోహిత్ శర్మ గాయాలపాలై సరిగ్గా ఆడలేకపోతుంటే.. విరాట్ మాత్రం పాదరసం లాగా కదులుతున్నాడు. వీరోచితమైన బ్యాటింగ్ ఆకట్టుకుంటున్నాడు. విరాట్ కోహ్లీ ఖాతాలో ప్రస్తుత సీజన్ లో నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి.
బెంగళూరు జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్ కు వెళ్లిపోయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే టేబుల్ టాపర్ గా కొనసాగుతోంది.13 మ్యాచ్ లు ఆడిన బెంగళూరు 9 విజయాలు సాధించింది. 18 పాయింట్లతో తిరుగులేని స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ ఏకంగా +1.065 గా ఉంది. ప్రస్తుత ఐపీఎల్ లో బెంగళూరు తన చివరి లీగ్ మ్యాచ్ హైదరాబాద్ తో ఆడుతుంది. శుక్రవారం ఈ మ్యాచ్ జరగుతుంది. ఇప్పటికే హైదరాబాద్ పై ఈ సీజన్ లో తొలి మ్యాచ్ లో బెంగళూరు గెలిచింది. మార్చి 28న జరిగిన ఆ మ్యాచ్ లోబెంగళూరు ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. సన్ రైజర్స్ విధించిన 202 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఫినిష్ చేసింది బెంగళూరు.
బెంగళూరు ప్లే ఆఫ్ వెళ్లిపోయిన నేపథ్యంలో సన్ రైజర్స్ మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ ఆట తీరు గురించి ప్రస్తావించిన అతడు.. ప్లే ఆఫ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడని పేర్కొన్నాడు. అంతేకాదు ప్రత్యర్థి జట్లు విరాట్ కోహ్లీతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. అతడు మీకు భయాన్ని పరిచయం చేస్తాడని పేర్కొన్నాడు. అంతేకాదు, ప్లే ఆఫ్ లో సెంచరీ చేస్తాడని డేవిడ్ వార్నర్ స్పష్టం చేశాడు. ఓపినియన్ పోల్ కూడా నిర్వహించాడు. ఇందులో మెజార్టీ నెటిజన్లు విరాట్ సెంచరీ చేస్తాడని పేర్కొన్నారు.
విరాట్ అంటే డేవిడ్ వార్నర్ విపరీతమైన ఇష్టం. దానిని అనేక సందర్బాల్లో అతడు బయట పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏకంగా ప్లే ఆఫ్ లో సెంచరీ చేస్తాడని స్పష్టం చేశాడు. వార్నర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జట్టు ఐపీఎల్ విజేతగా నిలిచింది. హైదరాబాద్ మాజీ ఆటగాడు అయినప్పటికీ విరాట్ నామస్మరణ చేస్తున్నాడంటే అతడు అంటే వార్నర్ కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.
