Homeక్రీడలుక్రికెట్‌Afghanistan Cricketers Emotional Post: గుండెలను కదిలిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ల పోస్ట్..

Afghanistan Cricketers Emotional Post: గుండెలను కదిలిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ల పోస్ట్..

Afghanistan Cricketers Emotional Post: క్రికెట్ ను జెంటిల్మెన్ గేమ్ అంటారు. 11 మంది మాత్రమే ఆడే ఈ ఆటలో ఉద్వేగాలు తారస్థాయిలో ఉంటాయి. ఆ సమయంలో ఆటగాళ్ల మధ్య బలమైన బంధాలు ఏర్పడుతుంటాయి. ఆ బంధాలను ఆటగాళ్లు నిజ జీవితంలో కూడా కొనసాగిస్తుంటారు. ఇది ఒకప్పటి మాట.. ఇప్పుడు క్రికెట్ మొత్తం జెంటిల్మెన్ గేమ్ కాకుండా.. కాసుల క్రీడగా మారిపోయింది.. ప్రీమియర్ లీగ్ లు అందుబాటులోకి రావడంతో ఆటగాళ్ల మధ్య బలమైన బంధాలు ఉండడం లేదు. పక్కా కమర్షియల్ అన్న తీరుగానే ఆటగాళ్ల వ్యవహారం సాగుతోంది. చివరికి జాతీయ జట్లకు ఆడుతున్న ఆటగాళ్ల మధ్య కూడా హాయ్ బాయ్ అన్నట్టుగానే రిలేషన్స్ ఉంటున్నాయి.

ఇటువంటి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు ప్రపంచ క్రికెట్ కు సరికొత్త పాఠాలు నేర్పారు. అసలే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో పరిస్థితులు ఏమాత్రం బాగుండవు. క్రికెటర్లకు అనుకూలంగా పరిస్థితులు ఉండవు. పైగా అక్కడ ఆ దేశ ప్రభుత్వం క్రికెట్ ఉన్నతికి ఏమాత్రం ప్రోత్సాహం అందించదు. కేవలం ఆటగాళ్లు తమ వ్యక్తిగత ఇష్టంతోనే క్రికెట్ ఆడుతూ ఉంటారు. విపరీతంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి అంతర్జాతీయ మ్యాచులలో సంచలన విజయాలు సాధిస్తూ ఉంటారు.

అటువంటి ఆఫ్గనిస్తాన్ జట్టు క్రికెటర్లు ప్రపంచ క్రికెట్ కు సరికొత్త జ్ఞానోదయం కలిగించారు. క్రికెట్ అంటే మైదానంలో మాత్రమే కాదని.. బయట కూడా బలమైన బంధాలు ఏర్పరచుకునే ఆటగాని నిరూపించారు. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లలో చాలామంది ప్రస్తుతం ఇండియాలో ఉన్నారు. వీరంతా కూడా ఐపీఎల్ ఆడుతున్నారు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు మొత్తం ఢిల్లీ వెళ్లారు. అక్కడ గ్రేటర్ నోయిడాలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆఫ్ఘనిస్తాన్ మాజీ క్రికెటర్ షాపూర్ జద్రాన్ ను పరామర్శించారు. అతడు అత్యంత ప్రాణాంతకమైన హెమో పాగో సైటిక్ లింఫో హిస్టియోసిస్ అనే ప్రానంతకమైన వ్యాధితో బాధపడుతున్నాడు. జద్రాన్ ను ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు రషీద్, నబి.. ఇంకా కొంతమంది క్రికెటర్లు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు భావోద్వేగానికి గురయ్యారు. ఆస్పత్రిలో జద్రాన్ పడుతున్న ఇబ్బందికి అక్షర రూపం కల్పించారు.

” చావు బతుకులతో ఇబ్బంది పడుతున్న ప్రియమిత్రుడు జద్రాన్ గ్రేటర్ నోయిడాలోని ఓ ఆసుపత్రిలో పరామర్శించాల్సి వచ్చింది. అతడు మైదానంలో ఎలాంటి ఆట తీరు కొనసాగిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానం లోనే కాదు.. ఇప్పుడు జీవితానికి సంబంధించిన పోరాటంలో అతడు అదే స్థాయిలో పటిమను చూపిస్తున్నాడు. అతడు విజయం సాధిస్తాడని అనుకుంటున్నాను. ఆస్పత్రి బెడ్ మీద అతడు అలా ఉండడం బాధగా ఉంది. త్వరలోనే అతడు కోలుకొని రావాలని కోరుకుంటున్నాను అని” ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు నబి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జద్రాన్ వన్డేలలో 44.. టి20లలో 36 మ్యాచులు ఆడాడు. 38 సంవత్సరాల వయసు ఉన్న ఇతడు రెండు ఫార్మాట్లలో 80 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఆఫ్గనిస్తాన్ జట్టు తరఫున 2020లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular