spot_img
Homeఆంధ్రప్రదేశ్‌ఆంధ్రులకు రాజధాని, అందని ద్రాక్ష!

ఆంధ్రులకు రాజధాని, అందని ద్రాక్ష!

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో ప్రకటించడంతో ఏపీ రాజధాని మరోసారి చర్చనీయాంశంగా మారింది. అమరావతిలో లేజిస్టేటివ్‌ కేపిటల్‌, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అలాగే కర్నూలులో హైకోర్టు జ్యుడీషియల్ కేపిటల్ అని జగన్ ప్రకటించారు. ఏపీలో అభివృద్ధిని వికేంద్రీకరించాలని శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పడం అలాగే వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్‌రావు కమిటీ కూడా అమరావతి అంత సురక్షిత ప్రాంతం కాదు అని చెప్పడంతో మూడు రాజధానులు ఏర్పాటు చేయడం వల్ల మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అనేది జగన్ సర్కార్ వాదన. అలాగే ప్రస్తుత ఏపీ రాజధాని అమరావతి, చంద్రబాబు మానస పుత్రిక అని టీడీపీ నేతలు పదే పదే అనడం కూడా జగన్ కి నచ్చకపోవడం, అమరావతితో పాటు మిగిలిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలను కూడా మెప్పించి, టీడీపీ, జనసేనలను ఇరకాటంలో పెట్టాలని జగన్ వ్యూహంగా తెలుస్తుంది. ఏది ఏమైనా ఏపీకి ప్రస్తుతం మూడు రాజధానులు అని సీఎం జగన్ ప్రకటనతో రాజధాని విషయంలో క్లారిటీ వచ్చినట్లయింది.

నాటి మద్రాసు నుంచి నేటి అమరావతి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని విషయంలో ఎన్నో మార్పులు. మరెన్నో ట్విస్టులు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ పాలకులు రాజధానిని ఒక్కో నగరానికి మార్చుకుంటూ తిరుగుతున్నారు. తమిళనాడుతో కలిసి ఉన్నప్పుడు మద్రాస్, 1953లో ఆంధ్రరాష్ట్రముగా ఏర్పడినప్పుడు కర్నూలు, 1956 తెలంగాణతో కలిసినప్పుడు హైదరాబాద్, 2014 నుంచి అమరావతి, 2019 జగన్ సీఎం అయ్యాక ప్రస్తుతం మూడు రాజధానులు అని ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ కి ఒక స్పష్టమైన రాజధాని లేకుండా పోయింది. పిల్లి తన పిల్లల్ని ఇంటింటికి తిప్పినట్లుగా ఆంధ్ర పాలకులు ఏపీ రాజధానిని పలుచోట్లకు తిప్పుతున్నారు. రాజులు, రాజ్యాలు ఉన్నప్పుడు పాలన సౌలభ్యం కోసం ఇలా తమకు అనుకూలమైన ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించారు. అదేంటోగానీ, స్వాతంత్ర్యానంతరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని విషయంలో స్థిరత్వం లేని పరిస్థితి కొనసాగింది. డెబ్బై ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ అదే అయోమయం ఆంధ్రులను వెక్కిరిస్తోంది. ఈ విధంగా ఆంధ్ర ప్రజలకు రాజధాని అందని ద్రాక్షగా మారింది . మరి, సీఎం జగన్ చివరి నిర్ణయం ఇదే అవుతుందా..? లేక రేపు వేరే ఇంకెవరైనా సీఎం అయితే మళ్ళీ మారుస్తారా..? అనేది కాలమే నిర్ణయించాలి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Godavari Pulasa

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....
Adani Group Airlines

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...
Srirastu Meaning

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Amazon Employee Quits Job

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...
Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...
Oktelugu Epaper