
నటవిశ్వరూపం నందమూరి బాలకృష్ణ తన తనయుడు మోక్షజ్ఞ సినిమా అరంగేట్రంపై తెగ తపన పడుతున్నాడట. దానికోసం బాలకృష్ణ మోక్షజ్ఞని ఎలా అయినా ఒక మంచి హీరోగా తీర్చిదిద్దలనే పనిలో పడ్డాడు. తన కొడుకుకి అమెరికాలోని ప్రఖ్యాతి గాంచిన లీ స్ట్రాస్బెర్గ్ ఫిలిం అండ్ థియేటర్ ఇంస్టిట్యూటులో కోచింగ్ ఇప్పించాలి అని నిర్ణయించుకున్నాడు. మోక్షజ్ఞకు వివిధరకాల నటన కళలను నేర్పించాలనే ఉద్దేశంతో తన తండ్రి ఈ నిర్ణయం తీసుకున్నాడు.
అయితే నటనను నేర్చుకోవటం కోసం అంత దూరం పంపించాలా.. అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. తాత ఎన్టీర్ గొప్ప నటుడు, బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడు.. వీళ్ళు ఎవరు నటించటం కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదు.. కానీ ఇప్పడు మోక్షజ్ఞని శిక్షణ కోసం విదేశాలకు పంపుతుంటే ఆశ్చర్యంగా ఉంది. అంటే మోక్షజ్ఞకి ఇన్ని రోజులు నటన రాదా.. అని జనాలు గుసగుసలు అడుకుంటున్నారు.
ఇది ఇలా ఉంటె ఇంకో కొత్త వాదన కూడా తెరపైకి వచ్చింది.. అదేంటంటే.. మోక్షజ్ఞని జూ.ఎన్టీర్ కి ధీటుగా తయారుచేయాలని బాలకృష్ణ ప్రయత్నిస్తునాడట. నందమూరి వంశంలో..అప్పట్లో ఎన్టీర్.. ఇప్పుడు బాలకృష్ణ, జూ. ఎన్టీర్ మాత్రమే చెప్పుకోతగ్గ నటులుగా జనాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే బాలకృష్ణ వయసు అయిపోతుంది.. కొన్ని సంవత్సరాలలో అతను సినిమాలు చేయటం ఆపేస్తాడు. ఇక మిగిలింది జూ. ఎన్టీర్ ఒక్కడే… తనని మినహాయించి నందమూరి వంశంలో వేరే ఎవరికీ ప్రజలలో అంత ఆదరణ లభించలేదు.
ఇప్పుడు బాలకృష్ణకి ఇదే పెద్ద సమస్య అయిందట. తన కొడుకు సినిమా అరంగేట్రం చేస్తే ప్రజలు జూ. ఎన్టీర్ ని ఆదరించినంత ఆదరిస్తారా..లేదా.. అనే భయం పట్టుకుందట. దీనిని అధిగమించాలంటే మోక్షజ్ఞను జూ. ఎన్టీర్ కన్న విలక్షణమైన నటుడిగా తయారుచేయాలి.. అందుకోసమే మోక్షజ్ఞను విదేశాలకు పంపి మరీ శిక్షణ ఇస్తున్నారనే వార్తలు జనాలలో చక్కర్లు కొడుతున్నాయి.








అల్లు అర్జున్ తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’ భారీ విజయం సాధించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ‘అలవైకుంఠములో’ అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. తెలుగు, మలళయాళంతోపాటు ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్లు రాబట్టింది. టాలీవుడ్లో హిట్టయిన ప్రతీ మూవీ బాలీవుడ్లో రీమేక్ అవడం షారా మామూలుగా మారింది. దీంతో ఈ మూవీని కూడా నిర్మాత అల్లు అరవింద్ బాలీవుడ్లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ మూవీపై బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ హక్కులను దక్కించుకునేందుకు సల్మాన్ భాయ్ ప్రయ్నతాలు చేస్తున్నాడని తెలుస్తోంది. అయితే అల్లు అరవింద్ తానే ఈ మూవీని బాలీవుడ్లో నిర్మించాలని భావిస్తున్నాడు. అయితే ఈ మూవీలో సల్మాన్ నటిస్తాడని ప్రచారం జరుగుతుంది.


రాయల్ పిక్చర్స్ పతాకంపై నోయెల్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం `14`. లక్ష్మిశ్రీనివాస్ దర్శకత్వంలో సుబ్బారావ్ రాయన, శివకృష్ణ నిచ్చెన మెట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. వైవిద్యభరితమైన ఈ చిత్రంలో రతన్, విశాఖ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ ఆచార్య, మహేష్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 14 వేలెంటైన్స్ డే కానుకగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని బిగ్ బాస్ విన్నర్ `రాహుల్ సిప్లిగంజ్` విడుదల చేశారు. ఈ సందర్భంగా.
రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ… “ఈ మోషన్ పోస్టర్ చాలా కొత్తగా ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంది. ఈ పోస్టర్ లాగే సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది అనుకుంటున్నాను. నోయల్ కి `కుమారి 21ఎఫ్` సినిమాకన్నా ఎక్కువ పేరు రావాలని ఆశిస్తున్నాను. టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్“ అన్నారు.

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లో ఒకరైన నితిన్ ఈ సమ్మర్ లో ఫ్యామిలీ మ్యాన్ అవ్వబోతున్నాడు.



మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టు ‘సైరా’ను దర్శకుడు సురేందర్ రెడ్డి అద్భుతంగా తెరకెక్కించాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో తెలుగులో భారీ విజయం సాధించింది. అయితే మిగతా భాషల్లో ‘సైరా’ అనుకున్నంత ఫలితాన్ని సాధించలేదు. భారీ బడ్జెట్ తో ‘బహుబలి’ మూవీ రేంజ్లో కలెక్షన్లు రాబడుతుందనకున్నా అది జరగలేదు. అయితే సైరా నర్సింహారెడ్డి జీవితగాథను తెరకెక్కించడంలో సురేందర్ రెడ్డి, మెగాస్టార్ ఇద్దరు సక్సస్ అయ్యారు. అయితే దర్శకుడు సురేందర్ రెడ్డితో నటించేందుకు ఓ మెగా హీరో నో అన్నాడనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.



దక్షిణాదిన లేడి సూపర్ స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న నయనతార నిర్మాతలకు, అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. కెరీర్ తొలినాళ్లలో నయనతార గ్లామర్ పాత్రలు చేస్తూ అభిమానులను అలరించించింది. అయితే గత కొంతకాలంగా నయనతార పెళ్లి, ప్రేమ వ్యవహారాలు అనే టాపిక్ రావడంతో ఆమె గ్లామర్ షో తగ్గించింది. బికీనీలు, పొట్టి డ్రెస్సులకు దూరంగా ఉంటూ సంప్రదాయ పాత్రల్లో, లేడి ఓరియెంటెడ్ పాత్రల్లోనే కనిపించిది. అయితే తాజాగా నయనతార నిర్మాతలకు బంపర్ ఆఫ్ ఇచ్చిందని తెలుస్తోంది. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ముద్దు సన్నివేశాల్లో నటించడంతోపాటు బికినీ వేసేందుకు కూడా రెడీ అని చెప్పినట్లు తెలుస్తోంది.


రోజు రోజుకి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏపీలో అధికారం చేజిక్కిచ్చుకోటానికి బీజేపీ పెద్ద ప్రణాళికనే సిద్ధం చేసినట్లుగా అనిపిస్తుంది. ఇటీవల కాలంలోనే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని మునిసిపల్ ఎలక్షన్స్ కి వెళ్లాలనే నిర్ణయం తీసుకుంది. అయితే జనసేనతో కలిసి అధికారంలోకి వెళ్లగలమో లేదో.. అని లోలోపల మధనపడుతూనే..బయటికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది.

దేశం మొత్తానికి ఆదర్శంగా గుజరాత్ రాష్ట్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుష్కరకాలం పాటు ప్రధానిగా ఉన్న సమయంలో తీర్చిదిద్దరని ఒక వంక బిజెపి ప్రచారం చేస్తుంటుంది. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ వస్తున్నారంటే అక్కడున్న బీజేపీ ప్రభుత్వం ఖంగారు పడుతున్నది.