Home Blog Page 8598

యస్‌బ్యాంకు సంక్షోభంలో ప్రధాని మోదీ సన్నిహితులు!

దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్న యస్‌బ్యాంకు సంక్షోభంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సన్నిహితంగా ఉండే కొందరు పారిశ్రామికవేత్తల పేర్లు తెరపైకి వచ్చాయి. గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో యస్‌ బ్యాంకు రుణసామర్ధ్యం అనూహ్యంగా పెరగడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో వ్యవస్థాపకుడు రానా కపూర్‌ పై దాడులు జరిపి, ఇడి అరెస్ట్ చేసింది.

ఈ బ్యాంకుకు భారీ మొత్తంలో ఎగవేసిన వారిలో అనిల్‌ అంబానీ, ఎస్‌ఎల్‌ గ్రూపు అధినేత సుభాష్‌ చంద్ర పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు కేంద్ర ప్రభుత్వానికి, బిజెపికి దగ్గరగా వ్యవహరించే మరికొన్ని కార్పొరేట్‌ సంస్థలు కూడా యస్‌ బ్యాంకు నుండి రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లించడంలో విఫల మయ్యాయి. దీంతో వీరిపేర్లు ఆ బ్యాంకు నిరర్ధక ఆస్తుల జాబితాలో చోటుచేసు కున్నాయి.

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ఈ విషయాలను ధృవీ కరించారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆమె ‘యస్‌ బ్యాంకు జారీచేసిన రుణాలు సకాలంలో వసూళ్లు కాలేదని, దీంతో బ్యాంకు తీవ్ర ఒత్తిడికి గురయ్యింది. ఈ కారణంగానే సంక్షోభం చోటుచేసుకుంది.’ అని చెప్పారు.

మరోవైపు యస్‌ బ్యాంకు రుణ సామర్ధ్యం కొన్ని సంవత్సరాలుగా అనూహ్యంగా పెరగడం కూడా అనేక అనుమానాలకు దారి
తీస్తోంది. 2017వ సంవత్సరంలో ఈ బ్యాంకు రూ.1.32 లక్షల కోట్లను రుణంగా ఇవ్వగా, 2019 నాటికి ఆ మొత్తం రూ.2.41 లక్షల కోట్లకు చేరింది. అంటే, రెండు సంవత్సరాల్లో 80శాతం పెరుగుదల నమోదైంది.

కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం తొలివిడత అధికారంలో వచ్చే సమయానికి (2014) యస్‌ బ్యాంకు ఇచ్చిన మొత్తం రుణాలు రూ.55 వేల కోట్లు మాత్రమేనని మాజీ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి చిదంబరం పేర్కొన్నారు. ‘దేశవ్యాప్తంగా మిగిలిన బ్యాంకుల రుణ సామర్ధ్యం 2014 నుండి 2019 మధ్య 10శాతం మాత్రమే పెరిగింది. ఒక్క యస్‌ బ్యాంకు మాత్రమే ఇంతలా తన సామర్య్ధాన్ని ఎలా పెంచుకో గలిగింది.’ అని ఆయన ప్రశ్నించారు.

రెండు, మూడేళ్లుగా ఈ బ్యాంక్‌ తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పటికీ, మోసాలు జరుగుతున్నాయని సంకేతాలు వచ్చినప్పటికీ మోడీ సర్కార్‌ పట్టించుకోలేదనే విమర్శలున్నాయి.

కాశ్మీర్ లో కొత్త పార్టీ వెనుక బీజేపీ!

జమ్మూకశ్మీర్ రాజకీయ వేదికపై మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. ‘జమ్మూకశ్మీర్ అప్నీ పార్టీ’ (జేకేఏపీ)ని పీడీపీ మాజీ నేత, గతంలో రెండుసార్లు మంత్రిగా పనిచేసిన సైయద్ అల్టాఫ్ బుఖారి ఆదివారంనాడు శ్రీనగర్‌లో లాంఛనంగా ప్రారంభించారు. పీడీపీ, ఎన్‌సీ, కాంగ్రెస్‌కు చెందిన 40 మంది మాజీ ఎమ్మెల్యేలు ఈ పార్టీలో చేరారు.

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఆరు నెలల తర్వాత జమ్మూకశ్మీర్‌లో కొత్త రాజకీయ శక్తి అవతరించడం ఇదే మొదటిసారి.కాశ్మీర్‌లోయలో కమ్యూనికేషన్ల దిగ్బంధం, ప్రధాన నేతల నిర్బంధంతో పాటు, రాష్ట్ర ప్రత్యేక హోదాను రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్రం విభజించిన సమయంలో ఈ పార్టీ అరంగేట్రానికి సిద్ధమవటం గమనార్హం.

బీజేపీ ఆశీస్సులతోనే కొత్త పార్టీ తెరపైకి వస్తోందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. కాశ్మీర్ లోయ రాజకీయాలపై ప్రాబల్యం గల ఉబర్ అబ్దుల్లా, ముఫ్తి మెహమూద్ లను గత ఆగష్టు నుండి గృహ నిర్బంధంలో ఉంచడం గమనార్హం. వారిద్దరి పరటీలను చీల్చి, కొత్తగా ఏర్పడిన ఈ పార్టీ కేవలం బిజేపికి కాశ్మీర్ లోయలో రాజకీయ మద్దతు కూడదీయడం కోసమే అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

ఈ ఊహాగానాలను బిజెపి తిప్పి కొడుతున్నా ఇమ్రాన్‌ నబీ స్పందిస్తూ కాశ్మీర్‌లో ఊహాగానాలు, అంచనాలు అన్ని వేళలా నిజమయ్యాయన్న విషయం గతానుభవాల ద్వారా తెలుస్తోందని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం, ప్రతిష్టను కాపాడేందుకు, కశ్మీర్ పండిట్లు తిరిగి రావడానికి కట్టుబడి ఉంటామని, మహిళలు, యువకుల సాధికారతకు పెద్దపీట వేస్తామని బుఖారి చెప్పారు.

పూర్తి ఆశావహ దృక్పథం, నిజాయితీ, నిష్పాక్షికతతో పార్టీ ఏర్పాటు చేశామని, ఈ రాజకీయ ప్రక్రియలో ప్రజలంతా భాగస్వాములేనని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ ఎన్నో త్యాగాలు చేసిందని, ప్రజల కలలు సాకారం చేసేందుకు పార్టీ కృషిచేస్తుందని బుఖారి చెప్పారు.

అభిమానులకు గుడ్ న్యూస్.. సీఎంగా పవన్ కల్యాణ్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. ప్రతిపక్ష పార్టీల ఎత్తును చిత్తుచేసి ఎన్నికల్లో గెలిచి రాష్ట్రాన్ని పాలిచేందుకు సిద్ధమవుతున్నాడు. అభివృద్ధికి ఆటంకం కలిగించే శక్తులను సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. అయితే ఇదంతా నిజ జీవితంలో జరుగుతుందో లేదోగానీ.. ప్రస్తుతానికి సినిమాల్లో మాత్రం పవన్ చేసి చూపించబోతున్నాడు.

పవన్ కల్యాన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక వరుసగా సినిమాలు చేస్తూ బీజీగా మారారు. తాజాగా పవన్ కల్యాణ్ కోసం దర్శకుడు పూరి జగన్మాథ్ రంగంలోకి దిగాడు. పొలిటికల్ కథాంశంతో ఓ మూవీని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్‌ను దర్శకుడు పూరి సీఎంగా చూపించబోతున్నాడట. దీనికి పవన్ కల్యాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్బిన బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి..

తాజాగా పవన్ రీఎంట్రీ మూవీగా `వ‌కీల్‌సాబ్‌` తెరకెక్కుతుంది. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. బోనీ క‌పూర్‌, దిల్ రాజుకలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. అదేవిధంగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలోనూ ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.

ఈ సినిమాలు పూర్తయ్యాక పవన్ పూరితో సినిమా చేయనున్నాడు. పవన్ ను సీఎంగా చూడాలనుకున్న అభిమానుల కోరికను పూరి ఇలా తీర్చేందుకు సన్నహాలు చేస్తున్నాడు.

VijayDeverakonda10 Team on Sets

ఎదురుగా కరోనా బాధితుడు… డోంట్ కేర్ అన్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైన రాజకీయ సభ కు కోరానా వైరస్ బారిన పడిన వ్యక్తి వచ్చాడు. ఈ వార్త తెలిసిన వెంటనే వైట్ హౌస్ లో అలజడి మొదలైంది. అయితే ట్రంప్ తాను అలాంటివి పట్టించుకోనని తేల్చిచెప్పడం విచిత్రంగా మారింది. పైగా తన ప్రచార షెడ్యూల్ మునుపటిలా నడుస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం అమెరికాలోని వాషింగ్టన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ హాజరయ్యారు.

ఈ కార్యక్రమ నిర్వాహకుడు ఒక ట్వీట్ లో సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెప్పిన విషయాన్ని తెలియజేస్తూ… సమావేశానికి ఒక కరోనా బాధితుడు వచ్చాడని చెప్పారు. సమావేశానికి ముందే, న్యూజెర్సీలోని ఒక ఆసుపత్రిలో అతనిని పరీక్షించారని, కరోనా పాజిటివ్ లక్షణాలున్న వ్యక్తిగా గుర్తించారన్నారు. ఇది తెలియడంతో అతనిని సాధారణ ప్రజల నుండి వేరు చేశారన్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తి వ్యక్తి న్యూజెర్సీలోని వైద్యుల సంరక్షణలో ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి ప్రధాన ఆడిటోరియంలో జరిగే కార్యక్రమాలకు హాజరు కాలేదని వివరించారు.

అయితే ఈ కార్యక్రమంలో తాను కరోనా సోకిన వ్యక్తితో మాట్లాడానని సమావేశం చివరి రోజున ట్రంప్‌తో కూడా చేతులు కలిపానని యూనియన్ చైర్మన్ మాట్ ష్కాల్ప్ యుఎస్ ది వాషింగ్టన్ పోస్ట్‌ కు తెలిపారు. కాగా ఈ విషయం వెల్లడయ్యాక ట్రంప్… తాను ఈ విషయం గురించి ఏమాత్రం ఆందోళన చెందడం లేదన్నారు. ఇక్కడ కరోనా వైరస్ ముప్పు ఉన్నప్పటికీ, తన ఎన్నికల ప్రచారం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు.

పెళ్లి పందిట్లోకి అడవి పంది… ఊహించని విధంగా…

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని సయాజీ హోటల్‌లో ఒక వివాహానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పెళ్ళికి హాజరైన విదేశీ అతిథులపై అడవి పంది దాడి చేసింది. పెళ్లి కుమారుని సోదరుడు అక్కడున్నవారిని రక్షించడానికి ప్రయత్నించినప్పుడు, ఆ పంది అతనిపై తిరగబడింది. తీవ్రంగా గాయపడిన ఆతను ఆసుపత్రి పాలయ్యాడు. భద్రతా ఏర్పాట్లలో హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అందుకే అడవి పంది హోటల్‌లోకి ప్రవేశించిందని అక్కడున్నవారు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటన జరిగిన సమయంలో ఆస్ట్రియాకు చెందిన 13 మంది విదేశీ అతిథులతో సహా 16 మంది అక్కడ వున్నారు. భోపాల్‌లోని ప్రేమ్ పురా ఘాట్ వద్ద ఉన్న సయాజీ హోటల్‌లో ఈ వివాహం జరిగింది. అతిథులు బయలుదేరడానికి సిద్ధమవుతున్నారు. అప్పుడు హోటల్ ప్రాంగణంలోకి ఒక అడవి పంది వచ్చింది. దింతో గందరగోళం చెలరేగింది. అతిథులందరూ ప్రాణాలను కాపాడుకోడానికి పరుగెత్తటం ప్రారంభించారు.

ఇంతలో పెళ్లికుమార్తె సోదరుడు మయూర్ పవార్ అడవి జంతువును తరిమికొట్టడానికి ప్రయత్నించాడు. అయితే మయూర్ తనను తాను రక్షించుకోలేకపోయాడు. అడవి పంది మయూర్ కాలును తీవ్రంగా కొరికివేసింది . అతనిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వివాహ వేడుకకు తాము ఒక పెద్ద హోటల్‌ను బుక్ చేసి భారీ మొత్తాన్ని కూడా చెల్లించామని, తగినంత భద్రతా ఏర్పాట్లు చేయలేదని దేవేంద్ర పవార్ ఆరోపించారు.

“302” Movie stills

302 movie trailer launch photos

సునీల్ చేతులు మీదుగా 302 మూవీ ట్రైలర్

భవికా దేశాయ్ ప్రధాన పాత్రలోను, వెన్నెల కిశోర్, రవివర్మ, విజయసాయి, తాగుబోతు రమేష్ కీలక పాత్రలలోను నటించిన చిత్రం 302. (దీనికి ది ట్రూ స్టోరీ ఆఫ్ రియల్ ఫేక్ అన్నది ఉపశీర్షిక) కార్తికేయ మిరియాల దర్శకత్వంలో డ్రీమ్ ట్రీ మీడియా పతాకంపై అవినాష్ సుందరపల్లి నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్రం ట్రైలర్ ను ఆదివారం హైదరాబాద్ లో ప్రముఖ నటుడు సునీల్ ఆవిష్కరించారు. అనంతరం సునీల్ మాట్లాడుతూ, మా కామెడీ కుటుంబ సభ్యులు వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, వేణు తదితరులు చేసిన చిత్రం. ట్రైలర్ బావుంది. చిత్రం కూడా ప్రేక్షకులను అలరింపచేస్తుందని ఆశిస్తున్నాను అని అన్నారు. చిత్ర నిర్మాత అవినాష్. సుందరపల్లి మాట్లాడుతూ, నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ద్వారా ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు.

దర్శకుడు కార్తికేయ మిరియాల మాట్లాడుతూ, క్రైమ్, సస్పెన్స్, కామెడీ అంశాలతో పాటు కాస్త హారర్ అంశాలను మేళవించి ఆద్యంతం ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా ఈ చిత్రాన్ని మలిచాం. ఒక రోజులో అంటే 24 గంటల్లో జరిగే కథ ఇది. ఒక అమ్మాయి ప్రేమ విషయంలో తల్లితండ్రులతో గొడవపడి ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఎలాంటి మలుపులు తిరిగిందన్నది తెరపై చూడాల్సిందే. కడుపుబ్బ నవ్వించే కామెడీ సీన్స్ కూడా ఇందులో వున్నాయి,. ఇంటర్నేషనల్ మోడల్ సూఫీ సయ్యద్ చేసిన ఐటెం సాంగ్ ఓ హైలైట్ అని చెప్పారు.

విజ‌య్-పూరి మూవీ లేటెస్ట్ అప్ డేట్..

పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో సంచ‌ల‌న క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తోన్న చిత్రం షూటింగ్ ప్ర‌స్తుతం ముంబైలో జ‌రుగుతోంది. అక్క‌డ ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు.ఇప్ప‌టివ‌ర‌కూ చిత్ర బృందం 40 రోజుల షూటింగ్ పూర్తి చేసుకోగా, వాటిలో రెండు భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు కూడా ఉన్నాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌మ్య‌కృష్ణ‌, అన‌న్యా పాండే, రోణిత్ రాయ్‌, అలీ త‌దిత‌రుల‌పై ముఖ్య‌మైన స‌న్నివేశాలు తీశారు.

పాన్ ఇండియా ఫిల్మ్‌గా త‌యార‌వుతున్న ఈ సినిమాని బ‌డ్జెట్ విష‌యంలో ఏమాత్రం కాంప్ర‌మైజ్ కాకుండా భారీ స్థాయిలో పూరి క‌నెక్ట్స్, ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లు నిర్మిస్తున్నాయి. అత్యంత ఆస‌క్తిక‌రమైన‌ ఈ క్రేజీ కాంబినేష‌న్ సినిమాకు విష్ణుశ‌ర్మ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తుండ‌గా, ఇదివ‌ర‌కు పూరి జ‌గ‌న్నాథ్ ఫిల్మ్ ‘ఇద్ద‌ర‌మ్మాయిల‌తో..’ స‌హా ప‌లు చిత్రాల‌కు ప‌నిచేసి మంచి పేరు సంపాదించుకున్న కెచ్చా.. స్టంట్ మాస్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్ స‌హ నిర్మాణంలో త‌యార‌వుతున్న ఈ యాక్ష‌న్ ఫిల్మ్‌ను పూరి జ‌గ‌న్నాథ్‌, చార్మీ కౌర్‌, క‌ర‌ణ్ జోహార్‌, అపూర్వ మెహ‌తా క‌లిసి నిర్మిస్తున్నారు.

నార్త్ నుండి వచ్చి సౌత్ లో అందాల ఆరబోత

ఉత్తరాది నుండి వచ్చిన అందాల భామలు దక్షిణాది చిత్రపరిశ్రమను ఏలేస్తున్నారు. తమ అందాలతో నటనతో యిట్టె  కట్టిపడేస్తున్నారు. అటువంటి కొంతమంది అందాల తరాల జాబితా ఇదే.. ‘నామ్ షబానా’, ‘పింక్’, ‘జుడ్వా 2’, ‘బద్లా’ తదితర చిత్రాలలో నటించిన బాలీవుడ్ నటి తాప్సీ పన్నూ దక్షిణ భారతీయురాలు కాదు. ఆమె ఢిల్లీ నివాసి. 2014 లో ‘బర్ఫీ’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నటి ఇలియానా డిక్రూజ్ హిందీ, తెలుగు, తమిళ చిత్రాలలో నటించి పేరు సంపాదించింది. ఇలియానా గోవాకు చెందినది. కాజల్ అగర్వాల్ తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తోంది. కానీ ఆమె బాలీవుడ్ లో  హిట్ కొట్టలేక పోయింది. కాజల్ ముంబైకి చెందినది.  ‘సింఘం’ చిత్రంలో అజయ్ దేవ్‌గన్‌ సరసన ఆమె బాలీవుడ్‌లో కనిపించింది.

బ్లాక్ బస్టర్ చిత్రం కోయి మిల్ గయలో చైల్డ్ రోల్ లో నటించిన నటి హన్సిక మోత్వానీ, ‘తేరా సూరూర్’ చిత్రంతో హీరోయినిగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది, అయితే ఆ సినిమా ఫ్లాప్ తరువాత ఆమె సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యింది. హన్సిక ముంబైకి చెందినది. ఇక పాపులర్ అండ్ హిట్ సీరియల్  అయిన  ‘చిన్నారి పెళ్లి కూతురు’తో తన నటనా జీవితాన్ని ప్రారంభించిన నటి అవికా గౌర్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన ఉనికిని చాటింది. అవికా కూడా ముంబైకి చెందినదే.

అలాగే ‘తేరే నామ్’ చిత్రంతో ప్రేక్షకుల హృదయాలను అలరించిన నటి భూమికా చావ్లాకు సౌత్‌లో చాలా హిట్ చిత్రాలు పడ్డాయి. తర్వాత బాలీవుడ్‌లో అవకాశం దక్కింది. భూమిక దేశ రాజధాని ఢిల్లీ నుండి వచ్చింది.కాగా నటి నమ్రతా శిరోద్కర్ ‘వాస్తవ్’, ‘పుకార్’ తదితర బాలీవుడ్ చిత్రాలలో నటించింది. తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబును వివాహం చేసుకున్నారు. నమ్రత స్వస్థలం ముంబై. మెగాబ్లాక్‌బస్టర్ చిత్రం ‘బాహుబలి’ నటి తమన్నా భాటియాకు బాలీవుడ్‌లో మంచి పేరు వుంది. ఆమె అజయ్ దేవ్‌గన్‌తో హిమ్మత్‌వాలా, అక్షయ్ కుమార్‌తో కలిసి ఎంటర్టైన్మెంట్ తదితర బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. తమన్నా పంజాబ్ కు చెందినది.

దిల్‌రాజ్‌ మేనల్లుడితో అనుపమ సరసాలు

మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వర్ దిల్ రాజు మేనల్లుడితో రోమాన్స్ చేసేందుకు రెడీ అయింది. దిల్ రాజు మేనల్లుడు అశిష్‌ రెడ్డి హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. ఈ కొత్తకుర్రాడికి జోడీగా అనుపమ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దిల్ రాజు బ్యానర్లో వచ్చిన ‘శతమానంభవతి’ తెలుగులో అనుపమకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బీజీగా మారింది. తనకు అవకాశం ఇచ్చిన దిల్ రాజుపై కృతజ్ఞతతోనే అశిష్ రెడ్డి మూవీలో నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని ‘హుషారు’ మూవీ దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి తెరకెక్కిస్తున్నాడు.

అనుపమ పరమేశ్వర్‌ ‘ప్రేమమ్‌’ మూవీతో సినిమాల్లోకి అడుగుపెట్టింది. మళయాలంలో ‘ప్రేమమ్’ ఘనవిజయం సాధించింది. దీనికితోడు అనుపమ అందం, అభినయం యువతలో మంచి క్రేజ్ తీసుకొచ్చింది. తెలుగులో అనుపమ తివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆఆ’ మూవీతో పరిచయమైంది. ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

దిల్‌రాజ్‌ నిర్మించిన ‘శతమానం భవతి’ మూవీతో మొయిన్ హీరోయిన్ గా ఎంపికైంది. ఈ మూవీ భారీ విజయం అందుకోవడంతో తెలుగులో బీజీగా మారింది. ఆ తర్వాత… ఇదే బ్యానర్లో ‘హలో గురూ ప్రేమ కోసమే’ మూవీలో నటించింది. అయితే అనుకున్నంత విజయం సాధించలేదు. ఈ మూవీలో అనుపమ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇటీవల బెల్లకొండ శ్రీనివాస్ కు జోడీగా ‘రాక్షసుడు’ మూవీలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం స్టార్ హీరోల పక్కన నటిస్తున్న దిల్ రాజు కోరిక మేరకే కొత్త కుర్రాడితో నటించేందుకు సిద్ధమైంది.

Uppena Movie Video Song Posters

‘మగువ’లకు స్పెషల్ కానుక ఇచ్చిన ‘వకీల్ సాబ్’

pawan

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్టు లుక్ ఇటీవల విడుదలైన సంగతి తెల్సిందే. కొన్నేళ్లుగా పవర్ స్టార్ మూవీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ‘వకీల్ సాబ్’ పోస్టర్ రిలీజ్ కాగానే అభిమానులు లైక్ లు, షేర్లలో సోషల్ మీడియాను హడలెత్తించారు. దీంతో ‘వకీల్ సాబ్’ ఒక్కసారిగా ట్రెండింగ్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం ఈ మూవీలోని ‘మగువా…మగువా’ సాంగ్ టీజర్ రిలీజ్ చేసి మార్చి 8న పూర్తి సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కోసం ఒక స్పెషల్ సాంగ్ ను చిత్రబృందం రెడీ చేసింది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్ అందించారు. సిధ్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఎస్.ఎస్.థమన్ బాణీలను అందించాడు. దిల్ రాజు-బోనీకపూర్ నిర్మిస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీకి ఆదిత్య శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

‘మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా.. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా!’ అంటూ సాగే లిరికల్ సాంగ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మహిళల గొప్పతనాన్ని వివరించేలా మహిళా దినోత్సవం రోజున ‘వకీల్ సాబ్’ మూవీ సాంగ్ రిలీజ్ చేయడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్లో వైరల్ గా మారింది. యూట్యూబ్లో సరికొత్త రికార్డులు తిరగరాయడం ఖాయంగా కన్పిస్తుంది. వేసవిలో మూవీని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నహాలు చేస్తున్నారు.

 

లవర్ బాయ్ గా మారనున్న రాంచరణ్?

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్లో బీజీగా ఉన్నాడు. ఈ మూవీలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటించనున్నాడు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, సీనియర్ నటి శ్రియ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. రాంచరణ్ కు జోడీగా అలియాభట్ నటిస్తుంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాంచరణ్ తదుపరి ఎలాంటి మూవీ చేయనున్నాడనే ఆసక్తి నెలకొంది. తాజాగా జెర్సీ మూవీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చరణ్ కు కలిసి ఓ లవ్ స్టోరీని విన్పించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.

రామ్ చరణ్ ఇప్పటివరకు చేసిన ఏకైక లవ్ స్టోరీ ‘ఆరెంజ్’. ఈ చిత్రం అనుకున్నంత విజయం దక్కకపోయినా చరణ్ నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. ‘ఆరెంజ్’ తన మనస్సు నచ్చిన మూవీ అని రాంచరణ్ చాలాస్లారు చెప్పాడు. ఈ మూవీ తర్వాత లవ్ స్టోరీలను పక్కనపెట్టి కమర్షియల్ మూవీలను చేస్తూ పోయాడు. తాజాగా దర్శకుడు గౌతమ్ ఓ ప్యూర్ లవ్ స్టోరీని చరణ్ కు వినిపించగా వెంటనే ఓకే చేశాడట. ఉత్తరాది అమ్మాయి.. దక్షిణాది అబ్బాయి మధ్య లవ్ స్టోరీ అద్భుతంగా ఉండనుందని తెలుస్తోంది. ఈ లవ్ స్టోరీని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు.

‘మళ్లీ రావా..’ ‘జెర్సీ’ చిత్రాలతో దర్శకుడు గౌతమ్ టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గౌతమ్ సినిమాల్లో ఓ ఎమోషన్ క్యారీ అవుతుంటుంది. తాజాగా చెర్రీకి వినిపించిన ప్రేమకథలోనూ ఓ ఎమోషన్ కామన్ గా ఉంటుందట. ఇప్పటికే ప్రదీప్ అనే కొత్త కుర్రాడు రాంచరణ్ ఓ కథను విన్పించి లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా గౌతమ్ కథకు ఓకే చేసనట్లు ప్రచారం జరుగుతుంది. వీరిద్దరిలో రాంచరణ్  ముందుగా ఏ దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడో వేచి చూడాల్సిందే.

‘మ‌ధ’ టీజ‌ర్ విడుద‌ల చేసిన ప్ర‌ముఖ హీరోయిన్‌

ఒక‌టి, రెండు అవార్డులు కావు.. ఏకంగా 26 ఇంట‌ర్నేష‌న‌ల్‌ ఫిలిం ఫెస్టివ‌ల్ అవార్డ్స్ సొంతం చేసుకున్న చిత్రం ‘మ‌ధ‌’. థర్డ్ ఐ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాహుల్, త్రిష్నా ముఖర్జీ హీరో హీరోయిన్లుగా శ్రీవిద్య ద‌ర్శ‌క‌త్వంలో ఇందిరా బ‌స‌వ నిర్మించిన ఈ చిత్రం మార్చి 13న విడుద‌ల కానుంది. ఈ సినిమా టీజ‌ర్‌ను ప్ర‌ముఖ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ విడుద‌ల చేశారు.

‘‘చాలా చాలా అరుదుగా మనం చూసే చిత్రాల్లో ‘మధ’ ఒకటి. డైరెక్టర్ శ్రీవిద్య బసవ ఈ సినిమా కోసం చేసిన ప్రయాణం నన్ను ఇన్‌స్పైర్ చేసింది. టీజర్ నాలో ఆసక్తిని రేపింది. అద్భుతమైన టీజర్. ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు’’ అంటూ చిత్ర యూనిట్ను అభినందించారు రకుల్ ప్రీత్ సింగ్.

టీజర్ విషయానికి వస్తే.. ఓ అమ్మాయి మానసిక సమస్యల గురించి చెప్పే చిత్రంగా మధ కనిపిస్తుంది. ‘నేను ఈ ప్రపంచాన్ని చదివింది..చూసింది ఈ కిటికీలో నుండే’ అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. త్రిష్నా ప్రధాన పాత్రలో నటించింది. ఆమె చుట్టూనే కథంతా తిరుగుతుంది. ఆమె ఏదో మానసిక సమస్యతో బాధపడుతుందని, దేనికో భయపడుతుందని టీజర్ ద్వారా చెప్పారు డైరెక్టర్ శ్రీవిద్య బసవ.  టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సందర్భంగా

డైరెక్టర్ శ్రీవిద్య మాట్లాడుతూ – ‘‘‘మధ’ చిత్రం టీజర్‌ను విడుదల చేసి మా యూనిట్‌ను ఎంకరేజ్ చేసిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కి అభినందనలు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నమైన చిత్రం. ఈ సినిమా చేయడానికి మూడేళ్ల జర్నీ చేశాం. నాతో పాటు ఎంటైర్ యూనిట్ ఎంతగానో కష్టపడ్డారు. అలాగే మా సినిమా విడుదలకు సపోర్ట్ చేస్తున్నహ‌రీశ్‌గారు, మ‌హేశ్‌గారు, న‌వ‌దీప్‌గారికి థాంక్స్‌. ప్ర‌తి అమ్మాయి ఈ సినిమా కాన్సెప్ట్‌కి క‌నెక్ట్ అవుతుంది. స్త్రీ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను చూపిస్తున్నాం. మార్చి 13న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాం. కంటెంట్ అంద‌రికీ నచ్చుతుంది’’ అన్నారు.

https://www.youtube.com/watch?v=Egqg8o4X8K4&feature=youtu.be