Home Blog Page 8599

హీరోయిన్ ‘ఎగ్ దోశ’ వీడియో వైరల్

తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ కోలీవుడ్‌లో హీరోయిన్ గా బీజీగా మారింది. వరుస సినిమాలతో ఐశ్వర్య రాజేశ్ బీజీగా మారింది. తాజాగా ఐశ్వర్య రాజేష్ షూటింగ్‌ లోకేషన్లో నోరూరించే ఎగ్‌దోశ వేసి అందరినీ ఆశర్చానికి గురిచేసింది. ఐశ్వర్య దోశ వేస్తుండగా తీసిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ గా మారుతోంది.

ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తోంది. సతీష్ దర్శకత్వంలో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీలో నటిస్తోంది. ఈ మూవీతోపాటు తమిళంలో కా.పే రణసింగం, భూమిక, ఇదు భేతాళం సొల్లుం కథై చిత్రాల్లో నటిస్తుంది. అదేవిధంగా తెలుగులో నాని ‘టక్‌ జగదీష్‌’ మూవీలో నటిస్తుంది. ‘కౌసల్య కృష్ణమూర్తి’ మూవీలో ఐశ్వర్య రాజేష్ నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవలే విడుదలైన ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ మూవీలో సువర్ణ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలను అందుకుంది.

ఐశ్వర్య రాజేష్ పోస్టు చేసిన వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. కొందరు నెటిజన్లు ‘ఐశ్వర్య రాజేష్ మల్టి టాలెంటెడ్ అని కొడియాడుతుంటే.. మరికొందరు తన తదుపరి మూవీలో ఛెప్ గా కనిపించబోతున్నారా అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఏదిఏమైనా షూటింగ్లో సరదాగా ఐశ్వర్య రాజేష్ వేసిన ఎగ్ దోశకు ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు.

https://www.instagram.com/tv/B9UFT8RJPgR/

మిర్చి మదర్ గా పావురం పిల్ల

సినీ రంగంలో హీరోయిన్లు త్వరగా ఫేడ్ అవుట్ అవుతారన్నది జగమెరిగిన సత్యం. అదే హీరోలకు అయితే లాంగ్ రన్ ఉంటుంది. 1989లో వచ్చిన హిందీ డబ్బింగ్ చిత్రం ప్రేమ పావురాలు తెలుగు నాట స్ట్రైట్ చిత్రాలతో పోటీపడి వసూళ్లు సాధించింది. ఆ సినిమాలో హీరో,హీరోయిన్ లుగా నటించిన సల్మాన్ ఖాన్ భాగ్యశ్రీ ఓవర్ నైట్ స్టార్లుగా మారిపోయారు. కానీ ఇపుడు సల్మాన్ ఖాన్ మాత్రమే స్టార్ హీరోగా ఉన్నాడు. తన హవాని కంటిన్యూ చేస్తున్నాడు. భాగ్యశ్రీ మాత్రం ఫేడ్ అవుట్ అయిపోయి తల్లి పాత్రలకు సిద్ద మౌతోంది ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ప్రభాస్ చిత్రం లో తల్లి పాత్రకు భాగ్యశ్రీ ఎంపికయ్యింది..జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక పిరియాడికల్ లవ్ స్టోరీ గా తెర కెక్కుతోంది . భారీ నిర్మాణ విలువలతో తెర కెక్కుతోన్న ఈ చిత్రం లో భాగ్యశ్రీ పోషించ బోయే పాత్ర చాలా కీలకం అని తెలుస్తోంది.
CHANGING ACCORDING TO TIMES

Nakshatra at Palasa 1978 Thanks Meet

బీజేపీకే దూరమయ్యాం..హిందుత్వానికి కాదు

తాము బీజేపీకే దూరమయ్యాం కానీ.. హిందుత్వానికి కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టం చేశారు. మహా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తైన సందర్భంగా అయోధ్యకు వచ్చారు. రామ్‌ లల్లా ఆశీర్వాదం తీసుకునేందుకు ఇక్కడకి వచ్చానని ఠాక్రే తెలిపారు.

‘గత ఏడాదిన్నరలో నేను ఇక్కడికి రావడం ఇది మూడోసారి. నేను ఈ రోజు ప్రార్థనలు కూడా చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాకుండా, రామ మందిరం నిర్మాణం కోసం నా ట్రస్టు నుంచి కోటి రూపాయలను విరాళంగా ఇస్తాను’ అని ప్రకటించారు.

తామే అసలైన హిందూవాదులమని పేర్కొంటూ బీజేపీ హిందుత్వాన్ని ఎప్పుడో విడిచిపెట్టిందని ధ్వజమెత్తారు.బీజేపీ అంటే హిందుత్వ అని కాదని, హిందుత్వ వేరు, బీజేపీ వేరని అన్నారాయన. రాముడు, హిందుత్వం ఏ ఒక్క పార్టీ సొత్తు కాదంటూ బీజేపీని పరోక్షంగా విమర్శించారు.

బీజేపీ అంటే హిందుత్వ అని కాదని, హిందుత్వ వేరు, బీజేపీ వేరని అన్నారాయన. రాముడు, హిందుత్వం ఏ ఒక్క పార్టీ సొత్తు కాదంటూ బీజేపీని పరోక్షంగా విమర్శించారు.

కాగా, శివసేన పత్రిక ‘సామ్నా’ సంపాదకీయ కూడా పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించింది. రాముడు, హిందుత్వ అనేది ఏ ఒక్క రాజకీయ పార్టీకో పరిమితం కాదని పేర్కొంటూ 80 గంటల్లో ప్రభుత్వాన్ని కోల్పోయిన వారు థాకరే ప్రభుత్వం కనీసం 100 గంటలు కూడా ప్రభుత్వాన్ని నడపలేదని విమర్శించారని, కానీ ‘మహా వికాస్ అఘాడి’ ప్రభుత్వం ప్రజల విశ్వాసం పొందడంతో పాటు చక్కటి పనితీరుతో వారి హృదయాల్లో నిలిచిపోయిందని పేర్కొంది. ఈ శుక్రవారంతో థాకరే ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకుంది.

చెక్ బౌన్స్ కేసులో టాలీవుడ్ నిర్మాతకు జైలు శిక్ష

చెక్ బౌన్స్ కేసులో టాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టికుమార్ కు ఏడాది జైలు శిక్ష పడింది. ‘శంఖం’ సినిమా డిస్ట్రిబ్యూషన్ సమయంలో విజయవాడలోని రాజ్యలక్ష్మి థియేటర్ యాజమన్యానికి-నట్టికుమార్ కు మధ్య వివాదం నెలకొంది. ఇటీవల నట్టికుమార్ పై చౌక్ బౌన్స్ కేసు నమోదయింది. శుక్రవారం ఈ కేసులో నట్టికుమార్ కు ఏడాది జైలు శిక్ష, 6లక్షల జరిమానాను విధిస్తూ స్థానిక మెజిస్ట్రేట్ కె.దివ్యకృప తీర్పునిచ్చారు.

2009లో నట్టికుమార్ కరుణాలయ ఫిల్మ్ పేరుతో విశాఖలో సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసేవారు. ‘శంఖం’ మూవీకి సంబంధించి విజయనగరంలోని రాజ్యలక్ష్మీ థియేటర్లో రెండువారాలు ప్రదర్శించేందుకు రూ.6.5లక్షలకు థియేటర్ యాజమాన్యంతో నట్టికుమార్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. కాగా సినిమా ప్రదర్శనను వారంరోజుల్లోనే నిలిపేశారు. దీంతో యాజమాన్యానికి, నట్టికుమార్ కు మధ్య వివాదం నెలకొంది.

దీనిపై సినీ ఇండస్ట్రీలోని పెద్దలు ఇరువురి మధ్య చర్చలు జరిపారు. థియేటర్ యాజమాన్యానికి రూ.5.5లక్షలు ఇచ్చేలా నిర్మాత నట్టికుమార్ అంగీకరించాడు. ఈ సందర్భంగా థియేటర్ యాజమాన్యానికి నట్టికుమార్ ఇచ్చిన చౌక్ బౌన్స్ ఇచ్చాడు. అదికాస్తా బౌన్స్ అయింది. దీంతో ఆ థియేటర్ యజమాని కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో తాజాగా నట్టికుమార్ కు ఏడాది జైలు శిక్షతోపాటు 6లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

అతను ముస్లింల పాలిట హీరో.. అయితే ఇప్పుడు..

ఢిల్లీ హింసాకాండలో ఇప్పటివరకు 53 మంది మరణించారు. పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హింసాయుత ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు ఇప్పటికీ మోహరించి వున్నాయి. పరిస్థితిని చక్కదిద్దాలని పోలీసులు, అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. బాధితులకు ఇప్పటివరకు రెండు కోట్ల రూపాయలకుపైగా పరిహారం అందించారు. అయితే 1984 అల్లర్ల బాధితుడైన మొహిందర్ సింగ్ ఇప్పుడు హీరోగా మారాడు. ఢిల్లీ అల్లర్లలో ముస్లింలు హిందువులను, హిందువులు ముస్లిం కుటుంబాలను రక్షించిన ఘటనలు చాలా ఉన్నాయి.

గోకుల్‌పురికి చెందిన మొహిందర్ సింగ్ ఫిబ్రవరి 24, 25 తేదీలలో 60 నుంచి 70 మంది ముస్లింలను తన మోటారుసైకిల్‌పై సురక్షిత ప్రదేశాలకు తరలించాడు. ఇప్పుడు పరిస్థితులు మెరుగైన నేపథ్యంలో బాధితులు గోహిల్‌పురికి తిరిగి రావడానికి మొహిందర్ సింగ్ కృషి చేస్తున్నారు. ఢిల్లీలో హింస తాండవిస్తున్న సమయంలో మొహిందర్ సింగ్, అతని కుమారులు.. బాధిత మహిళలు, పిల్లలను సురక్షితమైన ప్రదేశానికి తరలించారు. తరువాత ముస్లిం పురుషులను సురక్షితమైన ప్రదేశానికి తీసుకువచ్చారు. దింతో ముస్లిం కుటుంబాలన్నీ ఆయనకు కృతజ్ఞతలు చెప్పాయి. ఇప్పుడు మొహిందర్ సింగ్… బాధితులు తిరిగి తమ ఇళ్లకు రావడానికి వారిలో ఈ నమ్మకాన్ని కలిగిస్తున్నారు. అలాగే హిందూ, ముస్లిం వర్గాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు. 13 రోజుల అల్లర్ల తరువాత, మోహిందర్ సింగ్, ఫరూఖ్, ఇషాక్ తదితరులు గోకుల్‌పురిలో తమ దుకాణం తెరవడానికి వచ్చారు.

ఢిల్లీలో హింసకు పాల్పడిన షహనావాజ్ అలియాస్ షానును పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఇతను దిల్బార్ నేగి అనే యువకుడి రెండు చేతులను నరికి, అతన్ని మంటల్లో సజీవంగా విసిరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దిల్బార్… శివ విహార్ ప్రాంతంలో ఉన్న అనిల్ స్వీట్ హౌస్ లో పనిచేసేవాడు. అతని మృతదేహం దుకాణం లోపల పూర్తిగా కాలిపోయిన స్థితిలో కనిపించింది. అల్లర్లను షానవాజ్ రెచ్చగొట్టాడని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు.

భారత్ లో కరోనాకు మించి క్యాన్సర్ సునామి

క్యాన్సర్ రోగులకు విజయవంతంగా చికిత్సలు నిర్వహిస్తున్న భారతీయ సంతతికి చెందిన ఇద్దరు అమెరికన్ వైద్యులు భారతదేశం గురించి ఒక హెచ్చరిక జారీ చేశారు. దేశంలో తక్షణ చర్యలు తీసుకోకపోతే త్వరలోనే భారతదేశం ‘క్యాన్సర్ సునామీ’లో చిక్కుకుంటుందని డాక్టర్ దత్తాత్రేయుడు నోరి, డాక్టర్ రేఖ భండారి హెచ్చరించారు. ప్రముఖ క్యాన్సర్ పాథాలజిస్ట్ డాక్టర్ దత్తాత్రేయుడు నోరి…. ఈ వ్యాధితో బాధపడుతున్న అనేక మంది భారతీయులకు చికిత్స చేశారు. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించడం ద్వారా మాత్రమే భారతదేశం ‘క్యాన్సర్ సునామి’లో చిక్కుకోకుండా నిరోధించవచ్చని వారిద్దరూ తెలిపారు.

భారతదేశంలో ప్రతిరోజూ 1,300 మంది క్యాన్సర్‌తో మరణిస్తున్నారని నోరి తెలిపారు. ప్రతి సంవత్సరం భారతదేశంలో సుమారు 1.2 మిలియన్ల కొత్త క్యాన్సర్ కేసులు వస్తున్నాయన్నారు. కాగా ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ తాజాగా 2030 నాటికి భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 1.7 మిలియన్ల కొత్త క్యాన్సర్ కేసులు సంభవిస్తాయని అంచనా వేసింది. భారత్ లో కాన్సర్ నివారణకు అవసరమైన చర్యలు తీసుకోకపోతే క్యాన్సర్ సునామీ సంభవిస్తుందని డాక్టర్ నోరి హెచ్చరించారు. భారతదేశంలో ప్రజారోగ్య సంరక్షణకు ఇది పెద్ద సవాలుగా మారిందని ఆయన పేర్కొన్నారు.

హీరోలపై ఆర్జీవీ ‘కరోనా’ పంచ్

చైనాలో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ బారినపడి 3వేలకు పైగా మృత్యువాత పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి అన్ని దేశాలను అప్రమత్తం చేసింది. తాజాగా కరోనా వైరస్ ఇండియాకు చేరింది. దీంతో భారతీయులు భయాందోళన చెందుతున్నారు. కరోనా వైరస్ సినీ ప్రముఖులు పలురకాలుగా స్పందిస్తున్నారు.

కరోనా వైరస్ తెలంగాణలో సోకిందని ప్రచారం కాగానే హీరోయిన్ ఛార్మి వెల్ కమ్ చేస్తూ వీడియో పోస్టుచేసి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. ఛార్మిని నెటిజన్లు ట్రోలింగ్ చేయడంతో వీడియోను డిలీట్ చేసి అందరికి క్షమాపణ చెప్పింది. అందరినీ భయపెడుతున్న కరోనా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో టార్గెట్ చేయడంతో నెటిజన్లు అవాక్కాయ్యారు. ‘మూగదానిలా అందరినీ చంపుకుంటూ పోతున్న డియర్ కరోనా నువ్వొక విషయం గుర్తించుకో.. నీవు ఒక పరాన్నజీవివి. మాతోపాటే నీవు కూడా చస్తావ్.. నీవు నా మాటలను నమ్మకపోతే.. వైరాలజీలో ఒక క్రాష్ కోర్సు తీసుకో.. నీకు ఇదే నా విన్నపం.. నువ్వు బ్రతుకు.. అందరినీ బతికించు. అంటూ కరోనాకు జ్ఞానోదయం చేశాడు.

తాజాగా రాంగోపాల్ వర్శ హీరోలపై తనదైన శైలిలో సెటైర్ వేసి ఆకట్టుకున్నాడు. విలన్లను భయపెట్టే హీరోలు ఈ కరోనా వైరస్‌ను ఎదుర్కోకుండా ఎక్కడికి పోయారంటూ ట్వీట్ చేశాడు. సూపర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్, స్పైడర్‌మ్యాన్ మొదలైన హీరోలందరూ ఎక్కడ ఉన్నారు. వారు వేరే గ్రహానికి పారిపోయారని మాత్రం చెప్పకండి అంటూ వర్మ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

బాలయ్యకు రామయ్యే దిక్కు

సినీ ఇండస్ట్రీలో కూడా రాజకీయాల్లో లాగానే శాశ్వత మిత్రులు ,శాశ్వత శత్రువులు ఉండరు. అవసరాన్ని బట్టి మనుషుల్ని కలుపుకు పోతారు. ఇప్పుడు తాజాగా నందమూరి బాలకృష్ణ కి అదే పరిస్థితి వచ్చింది. తన గత చిత్రం రూలర్ షూటింగ్ సమయంలో గొడవపడ్డ వ్యక్తి తోనే మరలా పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. 2019 డిసెంబర్ ఇరవైన విడుదలయిన రూలర్ చిత్రం బాలయ్య బాబు చిత్రాల్లోనే ఒక డిజాస్టర్ చిత్రంగా నిలిచింది. అవుట్ డేటెడ్ కథ తో వచ్చిన ఈ చిత్రం టోటల్ గా ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్ల షేర్ ని మాత్రమే రాబట్టింది. విమర్శకుల నుంచి ప్రేక్షకుల నుంచి విపరీతంగా వ్యతిరేకతను మూటగట్టుకున్న ఈ చిత్రం యొక్క అపజయానికి కారణమైన వాటిలో బాలకృష్ణ గెటప్ గురించి చెప్పక తప్పదు. దరిమిలా బాలయ్య ఆ చిత్రం యొక్క కెమెరామెన్ రామ్ ప్రసాద్ తో గొడవ పడటం జరిగింది. కట్ చేస్తే ఇపుడు బాలయ్య బాబు కొత్తగా బోయపాటి శ్రీను దర్శత్వంలో చేయబోయే చిత్రానికి రామ్ ప్రసాద్ ని కెమెరామెన్ గా ఎన్నిక చేయడం జరిగింది. దీనికంతటికి కారణం బాలయ్య బాబు చిత్రానికి పనిచేయడానికి వేరే కెమెరామెన్ ముందుకి రాకపోవడమే అని తెలిసింది.
NO RULES IN FILM AND POLITICS

చైనా నుంచి మరో సంచలన వార్త!


చైనా సైంటిస్టులు కరోనా వైరస్ పై చేస్తున్న పరిశోధలనల్లో భాగంగా మరో సంచలన వార్తను ప్రకటించారు. కరోనా ఏ విధంగా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుందో..? అనే అంశంపై చేస్తున్న పరిశోధనలలో వారికి మరో నూతన విషయం తెలిసింది. ఇప్పటి వరకు, కరోనా సోకిన వ్యక్తి, తుమ్మినా, దగ్గినా, అతనిని తాకినా, లేదా అతను తాకిన వస్తువులను తాకినా.. ఈ వైరస్ సోకే అవకాశం ఉందని చెప్పిన చైనా సైంటిస్టులు ఇప్పుడు మరో కొత్త మార్గంలో కూడా కరోనా వ్యాపిస్తుందని చెబుతున్నారు. కరోనా ఉన్న వ్యక్తి “అపానవాయువు” చేసినా.. ఆ గాలిని పీల్చిన వ్యక్తికి కూడా ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని “చావుకబురు చల్లగా” చెప్పారు.

కరోనా వైరస్ సోకిన వ్యక్తి నుంచి యూరిన్ మరియు మలం శాంపిల్స్ తీసుకుని పరిశోధనలు నిర్వహించినట్లు చెప్పారు. ఆ పరిశోధనల్లో కరోనా వైరస్ యొక్క తీవ్రత చాలా ప్రమాదకరంగా ఉందని గుర్తించినట్లు తెలిపారు. అపాన వాయువు విడుదల చేసిన సమయంలో ఇది మరో మనిషికి సోకే అవకాశం ఎక్కువగా ఉందని తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.కొన్నేళ్ల క్రితం అపానవాయువుతో సోకే వ్యాధులపై పరిశోధనలు చేసినట్లు పరిశోధకులు చెప్పారు.

అయితే అపానవాయువును అడ్డుకునేలా పూర్తిస్థాయిలో ప్యాంట్లు ధరిస్తే కరోనావైరస్ ఎట్టి పరిస్థితుల్లో పక్కవ్యక్తికి సోకే ప్రమాదం లేదని తెలిపారు. కరోనా సోకిన వ్యక్తి ధరించిన ప్యాంట్లు అడ్డుగా ఉండటం వల్ల చాలావరకు ఇది బయటకు రాదని వైరస్ అక్కడే చచ్చిపోతుందని వారు స్పష్టం చేశారు. కొన్నేళ్ల క్రితం అపానవాయువుతో సోకే వ్యాధులపై పరిశోధనలు చేసినట్లు పరిశోధకులు చెప్పారు. అయితే ధరించే ప్యాంట్ల వల్ల ఎలాంటి అపాయం ఉండబోదని కూడా చైనా సైంటిస్టులు స్పష్టం చేశారు.

Palasa 1978 Movie Thanks Meet Photos

103 ఏళ్ల వరుడు, 27 ఏళ్ల వధువు…ఇదేం పెళ్లి బాబోయ్

ఇండోనేషియాలో తన కంటే 76 సంవత్సరాల చిన్న వయస్సు గల స్త్రీని వివాహం చేసుకున్న 103 ఏళ్ల వ్యక్తి అకస్మాత్తుగా వెలుగులోకి వచ్చాడు. 103 ఏళ్ల పువాంగ్ కట్టే 27 ఏళ్ల ఇండో అలంగ్‌ను వివాహం చేసుకున్నాడు. వారి వివాహానికి సంబంధించిన ఫొటోలు ఫేస్బుక్, ట్విట్టర్లలో వైరల్ అయిన తరువాత ఈ వివాహ వివాహానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. స్థానిక మీడియా చెప్పినదాని ప్రకారం పువాంగ్ 1945-1949 మధ్య కాలంలో ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. ఆ మహిళ బంధువు తనకు పువాంగ్ ఖచ్చితమైన వయస్సు తెలియదని అన్నారు.

తాజాగా ‘ట్రిబ్యూన్ న్యూస్’ ఈ జంట నిజమైన వయస్సును వెల్లడించింది. వధూవరుల వయస్సు మధ్య వ్యత్యాసం తెలుసుకున్న స్థానికులు షాక్ అయ్యారు. వీరిద్దరి పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు పువాంగ్ ఆ అమ్మాయికి ఇచ్చిన కట్నం గురించి కూడా చర్చ జరుగుతోంది. పువాంగ్ నామమాత్రపు మొత్తాన్ని చెల్లించి ఈ వివాహం చేసుకున్నాడు. సుమారు 25 వేల రూపాయలు, బంగారు ఉంగరం ఇచ్చి పువాంగ్ ఈ వివాహం చేసుకున్నట్లు మీడియా వెల్లడించింది.

వివాహం అయిన తరువాత ఈ జంట దక్షిణ సులవేసిలోని పువాంగ్ ఇంటిలో వుంటున్నారు. ఇదిలా ఉండగా ఆడిటీ సెంట్రల్ పేర్కొన్నదాని ప్రకారం 2017 లో కూడా 76 ఏళ్ల మహిళ 16 ఏళ్ల బాలుడిని వివాహం చేసుకుంది. అలాగే 2016 లో జింబాబ్వేకు చెందిన 70 ఏళ్ల మంత్రి కెన్ మాథెమా 23 ఏళ్ల బతాబెట్సో నారాను వివాహం చేసుకున్నాడు.ఇటువంటి పెళ్లిళ్లు చర్చనీయాంశంగా మారుతుంటాయి.

Enter The Girl Dragon Movie Stills

సెల్ ఫోన్లకు పాకిన కరోనా!

ప్రపంచ దేశాలను వణికిస్తూ, ఆ దేశ ఆర్థిక వ్యవస్థలను చిన్నా భిన్నం చేస్తున్న కరోనా రక్కసి, ఇప్పుడు సెల్ ఫోన్‌ల వినియోగంపై పడింది. కరోనా దెబ్బతో ప్రపంచ వ్యాప్తంగా అనేక ఫోన్ల కంపెనీ యజమానులు ఏమిచేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే వివిధ ఫోన్ల కంపెనీలు ఉత్పత్తిని తగ్గించాయి. చైనాలోని ఫోన్ల విడిభాగాలను తయారు చేస్తారు. ప్రస్తుతం ఈ వైరస్ దెబ్బతో ఫోన్ల విడిభాగాలు తయారు చేసే కంపెనీలు మూతపడుతుండటం కారణంగా ఫోన్ల ధరలు పెరగనున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

శాంసంగ్ కంపెనీ దక్షణి కొరియాలోని ఒక తయారీ కేంద్రాన్ని మూసివేసింది. అంతేకాకుండా స్టార్ట్ ఫోన్ల ఉత్పత్తిని తాత్కాలికంగా వియత్నాంకు తరలిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది కూడా. తమ కంపెనీలో కూడా కరోనా వైరస్ సోకిన వ్యక్తులను గుర్తించడం కారణంగా.. అతి పెద్ద శాంసంగ్ కంపెనీ.. కొన్ని రోజులు ఈ కంపెనీని మూసివేయనుంది. దీంతో.. రాబోయే రోజుల్లో.. ఫోన్ కొనాలనుకునే వారికి భారీగానే చెల్లించాల్సి ఉంటుంది.

ఇప్పటివరకూ కరోనా వైరస్‌.. 80కి పైగా దేశాలకు పాకింది. మన దేశంలో కూడా 31పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీన్ని నియంత్రించే మందు ఇప్పటి వరకు రాలేదు. కేవలం జాగ్రత్తలు పాటించడం తప్ప. ఈ మహమ్మారి భూతానికి ఇంకెన్ని అనర్ధాలు చూడాల్సిఉంటుందో అని ఆర్థిక నిపుణులు భయపడుతున్నారు.

అనసూయకు రష్మి ఛాలెంజ్

తెలంగాణలో ప్రారంభమైన గ్రీన్ ఛాలెంజ్ కు అన్నివర్గాల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఈ ఛాలెంజ్లో చాలా మంది సీని, రాజకీయ ప్రముఖులు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేస్తారు. నామినేట్ అయిన వ్యక్తులు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేస్తూ ఛాలెంజ్ ను కొనసాగిస్తుంటారు. దీనిని స్ఫూర్తిగా తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐసీసీ చైర్ పర్సన్ రోజా ‘రోజావనం’ అనే ఛాలెంజ్ ప్రారంభించారు.

‘రోజావనం’ ఛాలెంజ్ లో రోజా మొక్కలు మొక్కలునాటి హీరో అర్జున్, నటి ఖుష్బూ, యాంకర్ రష్మికి సవాల్ విసిరారు. రోజా విసిరిన చాలెంజ్‌ను హీరో అర్జున్‌, నటి ఖుస్బూలు స్పందించి ఇటీవల మొక్కలు నాటి మరో ముగ్గురి చొప్పున నామినేట్ చేశారు. తాజాగా ప్రముఖ యాంకర్‌ రష్మి కూడా రోజా విసిరిన చాలెంజ్‌కు స్పందించారు. నానక్‌రాంగూడలోని రామానాయుడు స్టూడియోలో రష్మి మొక్కలు నాటి హీరో సత్యదేవ్‌, ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌, ప్రముఖ యాంకర్‌ అనసూయకు సవాలు విసిరింది.

ఈ సందర్భంగా యాంకర్ రష్మి మాట్లాడుతూ ప్రతీఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని కాపాడే బాధ్యత తీసుకోవాలన్నారు. రానున్న వేసవి దృష్ట్యా ఎండ తీవ్రతను, వాతావరణంలో మార్పును సమతుల్యత చేయడానికి అందరూ మొక్కలను పెంచాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ఇలాంటి కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు.

పాతబస్తీపై కెసిఆర్ కీలక వ్యాఖ్యలు

ట్విన్ సిటీస్ (హైదరాబాద్, సికింద్రాబాద్) లలో మెట్రో రైలు పరుగులు తీస్తున్నా..పాతబస్తీకి ఆ యోగం లేదని సీఎం కెసిఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. అయితే ఎంఐఎం ఎమ్మెల్యేలు కృషి చేస్తే.. త్వరలోనే పాతబస్తీకి కూడా మెట్రోరైలు వస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్బంగా కెసిఆర్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మెట్రో రైలు కోసం ఎంఐఎం సభ్యులు చేసిన విఙ్ఞప్తులపై స్పందించారు. ఎంజీబీఎస్ వరకు మెట్రో రైలు పూర్తి అయినా.. అక్కడ నుండి ఫలక్‌ నుమాకు మెట్రో మార్గం నిర్మాణం కాలేదని, అందుకు మార్గమధ్యంలో వున్న కట్టడాలే కారణమని కేసీఆర్ చెప్పారు. ఈ అడ్డంకులను తొలగించేందుకు స్థానిక నేతలు స్పందించినట్లైతే త్వరలోనే పాతబస్తీలో కూడా మెట్రోరైలు పరుగులు తీస్తుందన్నారు.

ఎంఐఎం ఎమ్మెల్యేలు రంగంలోకి దిగితే టీఆర్ఎస్ మంత్రులు కూడా వారితో పాటు పాతబస్తీలో పర్యటించి.. వివాదాలను పరిష్కరిస్తారని.. ఆ వెంటనే యుద్ధ ప్రాతిపదికన మెట్రో మార్గం నిర్మాణం ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి అన్నారు.

Nithya Shetty Latest Photos