తెలుగు సినిమా పరిశ్రమ ఎన్నడూ చూడని గడ్డు పరిస్థితుల్లో వుంది.కరోనా వైరస్ కారణం గా సినిమా విడుదలలు షూటింగులు కూడా ఆగిపోతున్నాయి తాజాగా మరో సీనియర్ హీరో చిత్రం యొక్క షూటింగ్ కూడా ఆగిపోయింది .
ఎఫ్ 2 , వెంకీ మామ చిత్రాల విజయం తో జోరు మీదున్న విక్టరీ వెంకటేష్ తన 74వ చిత్రం ‘నారప్ప’ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల తమిళనాడు లో స్టార్ట్ చేయడం జరిగింది .ఆ రాష్ట్రములోని తిరుచందూర్ తెరికాడులోని రెడ్ డెసర్ట్ ప్రాంతంలో ఈ చిత్రం షూటింగ్ జరుపు కొంది. తమిళ చిత్రం అసురన్ రీమేక్ గా రూపొందుతున్న నారప్ప పూర్తిగా గ్రామీణ వాతావరణం లో తయారౌతోంది. అందుచేత తమిళ చిత్రం షూటింగ్ జరుపుకున్న ప్రాంతాల్లోనే తెలుగు సినిమా కూడా చిత్రీకరించడం జరిగింది. కాగా అక్కడ కొన్ని యాక్షన్ సీన్స్ ను పూర్తి చేసి ఈ సినిమా షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పారు. ప్రస్తుతం యూనిట్ మొత్తం హైదరాబాద్ చేరుకొంది.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్నందున ఆ విపత్తు పూర్తిగా తగ్గాకే ” నారప్ప” తదుపరి షెడ్యూల్ ను ప్లాన్ చేయనున్నారు. ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో రెండవ హీరోయిన్ పాత్రలో మలయాళ నటి రెబ్బ మోనిక జాన్ ( అను ఇమ్మానుయేల్ సోదరి ) నటించనుంది. కాగా తమిళనాడులో జరిగిన షెడ్యూల్ లో ఇద్దరు హీరోయిన్ లు , వెంకటేష్ పాల్గొన్న కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేశారట. దళితుల ప్రతినిధి గా పూర్తి వైవిధ్యంగా విక్టరీ వెంకటేష్. కనిపించే ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సామ్.కె నాయుడు, సంగీతం: మణిశర్మ, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్. కాగా అడ్డాల శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు. .
Safety measures are more important than shooting










ఇప్పుడు తెలుగు చిత్రాల్లో సిద్ శ్రీరామ్ గొంతు ఒక ప్రత్యేక ఆకర్షణ. ఇండియన్ అల్ టైం బ్లాక్ బస్టర్ సామజవరగమనా పాట దగ్గర్నుంచి రాబోయే మగువ మగువా పాట దాకా అన్నీ చార్ట్ బస్టర్లే….గతంలో కూడా ఇంకేం ఇంకేం కావాలె ,ఏ మై పోయావే , ఉండి పోరాదే , యంత్ర లోకపు సుందరివే , నువ్వుంటే నా జతగా అంటూ తన శ్రావ్యమైన గొంతుతో శ్రోతల్ని మైమరిపించాడు. అలాగే రాబోయే లో- బడ్జట్ చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ లో కూడా నీలి నీలి ఆకాశం అంటూ తన గానం తో మెస్మరైజ్ చేస్తున్నాడు. అలా చిన్నా చితకా సినిమాల్లో కూడా సిద్ శ్రీరామ్ తో పాట పాడించడం పరిపాటి అయిపోయింది. సిద్ పాట పాడితే దానికి యూత్ లో ఆకర్షణ ఉండడం తో వేరే సింగర్ల కంటే చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నా కానీ సిద్ శ్రీరాంతో పాట పాడిస్తున్నారు. తమన్ కి కూడా సిద్ శ్రీరామ్ రేంజ్ ఏమిటో సామజవరగమనా పాటతో తెలిసి వచ్చింది. అందుకే వకీల్ సాబ్ లో మగువ మగువ పాటని అతనితోనే పాడించాడు.
కెరీర్ ఆరంభంలో సరైన హిట్ సినిమాలు లేక ఇబ్బందిపడి ఆ తరవాత నిలదొక్కు కొన్న వాళ్ళు ఎందరో ఉన్నారు. జగపతి బాబు కెరీర్ ఆరంభంలో సుమారు ఎనిమిది ప్లాప్ చిత్రాలను చవి చూసాడు. అలాగే హీరోయిన్ రమ్యకృష్ణ కెరీర్ ఆరంభం లో పదిహేడు సినిమాలు చేస్తే వాటిలో చక్రవర్తి ( చిరంజీవి చెల్లి ),సూత్రధారులు అనే సినిమాలు మాత్రమే ఒక మోస్తరు విజయాన్ని చవి చూశాయి. ఆ తరవాతే అల్లుడుగారు చిత్రం తో స్టార్ హీరోయిన్ అయ్యింది . .
తమతో అసలు ఎటువంటి చర్చలు జరుపకుండా అర్ధాంతరంగా సచివాలయాన్ని అమరావతి నుండి విశాఖపట్నంకు మార్చడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల పట్ల సచివాలయం ఉద్యోగులు మండిపడుతున్నారు. పైగా ఈ విషయమై ఏ క్షణంలో అయినా ప్రభుత్వ ఉత్తరువులు రావచ్చని అంటూ తమ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఏకపక్షంగా ప్రకటించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



దేశంలో అత్యవసర పరిస్థితి అమలులో ఉన్న సమయంలో దొడ్డిదారిన నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ రాజ్యాంగం పీఠికలో చేర్చిన `సామ్యవాదం’ పదాన్ని తొలగించాలని కోరుతూ నాలుగున్నర దశాబ్దాల తర్వాత ఇప్పుడు రాజ్యసభ ముందు ఒక బిల్ రాబోతున్నది. బిజెపి సభ్యుడు రాకేష్ సిన్హా ప్రతిపాదించిన ఈ బిల్ శుక్రవారం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితులలో ఆ పదానికి అర్ధం లేదని, ఒక ఆలోచనకు పరిమితం కాకుండా ఆర్ధిక అంశాలను చర్చించే వీలు కల్పిస్తూ ఆ పదాన్ని తొలగించాలని ఆయన కోరుతున్నారు.






సినిమాల సక్సెస్ తో నిమిత్తం లేకుండా విజయ్ దేవరకొండ తనకు తానే సాటి అని ప్రూవ్ చేసుకొన్నాడు వరుసగా రెండోసారి హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టులో టాప్ ప్లేస్ లో నిలిచాడు .