Home Blog Page 8580

నారప్ప కూడా వచ్చేసాడు..

తెలుగు సినిమా పరిశ్రమ ఎన్నడూ చూడని గడ్డు పరిస్థితుల్లో వుంది.కరోనా వైరస్ కారణం గా సినిమా విడుదలలు షూటింగులు కూడా ఆగిపోతున్నాయి తాజాగా మరో సీనియర్ హీరో చిత్రం యొక్క షూటింగ్ కూడా ఆగిపోయింది .

ఎఫ్ 2 , వెంకీ మామ చిత్రాల విజయం తో జోరు మీదున్న విక్టరీ వెంకటేష్ తన 74వ చిత్రం ‘నారప్ప’ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల తమిళనాడు లో స్టార్ట్ చేయడం జరిగింది .ఆ రాష్ట్రములోని తిరుచందూర్ తెరికాడులోని రెడ్ డెసర్ట్ ప్రాంతంలో ఈ చిత్రం షూటింగ్ జరుపు కొంది. తమిళ చిత్రం అసురన్ రీమేక్ గా రూపొందుతున్న నారప్ప పూర్తిగా గ్రామీణ వాతావరణం లో తయారౌతోంది. అందుచేత తమిళ చిత్రం షూటింగ్ జరుపుకున్న ప్రాంతాల్లోనే తెలుగు సినిమా కూడా చిత్రీకరించడం జరిగింది. కాగా అక్కడ కొన్ని యాక్షన్ సీన్స్ ను పూర్తి చేసి ఈ సినిమా షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పారు. ప్రస్తుతం యూనిట్ మొత్తం హైదరాబాద్ చేరుకొంది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్నందున ఆ విపత్తు పూర్తిగా తగ్గాకే ” నారప్ప” తదుపరి షెడ్యూల్ ను ప్లాన్ చేయనున్నారు. ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో రెండవ హీరోయిన్ పాత్రలో మలయాళ నటి రెబ్బ మోనిక జాన్ ( అను ఇమ్మానుయేల్ సోదరి ) నటించనుంది. కాగా తమిళనాడులో జరిగిన షెడ్యూల్ లో ఇద్దరు హీరోయిన్ లు , వెంకటేష్ పాల్గొన్న కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేశారట. దళితుల ప్రతినిధి గా పూర్తి వైవిధ్యంగా విక్టరీ వెంకటేష్. కనిపించే ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సామ్.కె నాయుడు, సంగీతం: మణిశర్మ, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్. కాగా అడ్డాల శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు. .
Safety measures are more important than shooting

Shraddha Das Ultra Glamorous Pics

Kiara Advani Hot Photos

నిర్భయ దగ్గరకే ఆ నలుగురు!

2012 నిర్భయ సామూహిక అత్యాచారం మరియు హత్య కేసులో నలుగురు దోషులను ఉరి తీయడానికి ఇంక కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. రేపు తెల్లారేసరికి వారి జీవితాలు పోనున్నాయి. దేశంలో సంచలనం సృష్టించిన కేసుకి దేశం నిద్రపోయి లేచేసరికి ఆ నలుగురి కథ ముగిసిపోనుంది. ఇప్పటివరకు చట్టంలో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ వచ్చిన నిందితులు ఇక ఒక్క అవకాశం కూడా లేక పోవడంతో మృత్యుగడియలు ముంచుకొచ్చాయి. క్షణమొక గండంగా అనుక్షణం భయపడుతూ మరి కొన్ని గంటలలో అనంతలోకాలలో కలిసిపోనున్నారు. ఆనాడు నిర్భయ చేసిన రోదన ఎంత భయంకరమో ఈనాడు వారికీ తెలిసి వస్తుంది.కానీ చివరికి ఆ నిర్భయ చేరిన మృతుఒడిలోకే నిందితులు వెళ్లనున్నారు.

నలుగురు దోషుల ఉరిశిక్షలను నిలిపివేయాలని కోరుతున్న పిటిషన్‌ ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. దింతో చివరి అవకాశం కూడా ముగిసిపోయింది. నలుగురు దోషులను తీహార్ జైలులో రేపు ఉదయం 5:30 గంటలకు ఉరి తీయనున్నారు.

కరోనాపై స్పందించిన మెగాస్టార్

కరోనా భయం యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కరోనాకు మందు లేకపోవడంతో.. దాని నివారణే మార్గమని ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి. అంతేకాకుండా పలువురు ప్రముఖులు, సినీనటులు కూడా తమ వంతు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే హీరో రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు తమ బాధ్యతగా కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతూ వీడియోలు విడుదల చేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా వీడియో ద్వారా ప్రజలకు ధైర్యాన్ని.. సలహాలను పంచుకున్నారు.

“అందరికి నమస్కారం.. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకి గురి చేస్తున్న సమస్య కరోనా.. అయితే మనకి ఎదో అయిపోతుందన్న భయం కానీ, మనం ఏమీ కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండు పనికిరావు. జగ్రత్తగా ఉండి, దైర్యంగా ఎదురుకోవాల్సిన సమయం ఇది.. జనసముహానికి వీలైనంత వరకూ దూరంగా ఉండండి. ఈ ఉద్రుత్తం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవ్వడం ఉత్తమం.

వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..మోచేతి వరకు చేతులను సబ్బుతో శుభ్రంగా సుమారు 22 సెకెండ్ల పాటుగా కడుక్కోండి! తుమ్మున, దగ్గిన కర్చీప్ లాంటివి అడ్డం పెట్టుకోవడం లేదా టిష్యు పేపర్ లను అడ్డు పెట్టుకోవడం తప్పనిసరి.. ఆ వాడిన టిష్యు పేపర్ కూడా చేత్తబుట్టలో వేయండి. మీ చేతిని కళ్ళకి,కంటికి మొఖానికి,తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం,జలుబు,దగ్గు, అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి! ఈ జాగ్రత్తలు తీసుకుంటే కరోనా ప్రమాది కారి కాకపోయినప్పటికీ, నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అవకాశం ఉంది. అలా కాకుండా చూసుకునే భాద్యత మన పైన ఉంది. ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయ ప్రకారం నమస్కారం చేద్దాం.. అదే ఉత్తమం ” అని చిరంజీవి పేర్కొన్నారు.

 

https://youtu.be/hTAeqbdKzlM

కరోనా సోకని ఒకే ఒక సురక్షిత ప్రాంతం

నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నుండి తప్పించుకోవడానికి ఎక్కడకు వెళ్లాలో ఎవ్వరికీ తెలియడం లేదు. ఎక్కడికి వెళ్లినా ఆ వైరస్ కు గురయ్యే ప్రమాదం ఉన్నదని భయపడుతున్నారు.

అయితే భూ ఆవరణలో ఈ వైరస్ సోకని ఒకే ఒక సురక్షిత ప్రాంతం ఒకటి ఉన్నట్లు అమెరికాలోని నాసా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ కేంద్రం ఒక్కటే సురక్షితం అని స్పష్టం చేస్తున్నారు.

ప్రస్తుతం 164 దేశాలకు కరోనా విస్తరించింది. 2 లక్షల మంది దీని బారిన పడగా దాదాపు 8 వేల మంది మృత్యువాత పడ్డారు. ఈ మహమ్మారి నుంచి బయటపడేందుకు ప్రపంచ దేశాలు వైరస్ పై యుద్ధమే చేస్తున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ సోకని సురక్షిత ప్రాంతం ఈ భూమండలం మీదే లేదంటున్నారు నిపుణులు. అయితే భూ సమీప కక్ష్యలో తిరుగుతున్న స్పేస్ స్టేషన్ సురక్షితమంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే, సుమారు ఇరవై ఏళ్లలో ఈ స్టేషన్లోని ఓ ఆస్ట్రోనాట్ కు జలుబు మాత్రమే చేసిందట. ఈ కేంద్రంలో హెల్త్ స్టెబిలైజేషన్ ప్రోగ్రాం కొన్నాళ్లుగా కొనసాగుతున్నందున ఈ కేంద్రానికి వైరస్ సోకే చాన్స్ లేదు. ఈ కేంద్రానికి పంపించే వారికి పది రోజులపాటు అన్ని వైద్యపరీక్షలు చేసిన తర్వాతే వారిని అనుమతిస్తారు.

‘సిద్’ పాట పాడక పోయినా నష్టం లేదు

ఇప్పుడు తెలుగు చిత్రాల్లో సిద్ శ్రీరామ్ గొంతు ఒక ప్రత్యేక ఆకర్షణ. ఇండియన్ అల్ టైం బ్లాక్ బస్టర్ సామజవరగమనా పాట దగ్గర్నుంచి రాబోయే మగువ మగువా పాట దాకా అన్నీ చార్ట్ బస్టర్లే….గతంలో కూడా ఇంకేం ఇంకేం కావాలె ,ఏ మై పోయావే , ఉండి పోరాదే , యంత్ర లోకపు సుందరివే , నువ్వుంటే నా జతగా అంటూ తన శ్రావ్యమైన గొంతుతో శ్రోతల్ని మైమరిపించాడు. అలాగే రాబోయే లో- బడ్జట్ చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ లో కూడా నీలి నీలి ఆకాశం అంటూ తన గానం తో మెస్మరైజ్ చేస్తున్నాడు. అలా చిన్నా చితకా సినిమాల్లో కూడా సిద్ శ్రీరామ్ తో పాట పాడించడం పరిపాటి అయిపోయింది. సిద్ పాట పాడితే దానికి యూత్ లో ఆకర్షణ ఉండడం తో వేరే సింగర్ల కంటే చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నా కానీ సిద్ శ్రీరాంతో పాట పాడిస్తున్నారు. తమన్ కి కూడా సిద్ శ్రీరామ్ రేంజ్ ఏమిటో సామజవరగమనా పాటతో తెలిసి వచ్చింది. అందుకే వకీల్ సాబ్ లో మగువ మగువ పాటని అతనితోనే పాడించాడు.

ఇంత పాపులర్ ఫిగర్ అయినా గాని దేవిశ్రీ ప్రసాద్ మాత్రం సిద్ శ్రీరామ్ తో పాట పాడించుకోవడం లేదు. సిద్
శ్రీరామ్ లేకుండానే హిట్ సాంగ్స్ చేయాలని, తన సత్తా చూపించాలని దేవి శ్రీ ప్రసాద్ బాగా ట్రై చేస్తున్నాడు. ఆ క్రమం లో ఉప్పెనలో వచ్చిన రెండు పాటలు సిద్ శ్రీరామ్ పాడకపోయినా కానీ సూపర్ హిట్ అయ్యాయి. నీ కన్ను నీలి సముద్రం , ధక్ ధక్ ధక్ అనే పాట ఇపుడు సంగీత ప్రియులకు శ్రవణ పేయాలయ్యాయి .ఆ లెక్కన దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో సిద్ శ్రీరామ్ పాడితే ఎలా ఉంటుందో వినాలనే సంగీత ప్రియులు కోరిక ఇప్పట్లో తీరేలా లేదు .
Confidence is his strength

‘బుట్టబొమ్మ’కి రేట్ పెరిగింది

కెరీర్ ఆరంభంలో సరైన హిట్ సినిమాలు లేక ఇబ్బందిపడి ఆ తరవాత నిలదొక్కు కొన్న వాళ్ళు ఎందరో ఉన్నారు. జగపతి బాబు కెరీర్ ఆరంభంలో సుమారు ఎనిమిది ప్లాప్ చిత్రాలను చవి చూసాడు. అలాగే హీరోయిన్ రమ్యకృష్ణ కెరీర్ ఆరంభం లో పదిహేడు సినిమాలు చేస్తే వాటిలో చక్రవర్తి ( చిరంజీవి చెల్లి ),సూత్రధారులు అనే సినిమాలు మాత్రమే ఒక మోస్తరు విజయాన్ని చవి చూశాయి. ఆ తరవాతే అల్లుడుగారు చిత్రం తో స్టార్ హీరోయిన్ అయ్యింది . .

అలాగే ముగమూడి (తెలుగులో మాస్క్ ) చిత్రం తో కెరీర్ ఆరంభించిన పూజా హెగ్డే కి వరుసగా ముకుంద , ఒక లైలా కోసం ,మొహెంజో దారో వంటి ప్లాప్ చిత్రాలు వచ్చాయి. ఆ తరవాత దువ్వాడ జగన్నాధం వంటి యావరేజ్ చిత్రం వచ్చింది ఆ తరవాత మళ్ళీ సాక్ష్యం చిత్రం వచ్చి అపజయం పాలైంది ..అరవింద సమేత , మహర్షి , గద్దలకొండ గణేష్,హౌస్ ఫుల్ 4 వంటి చిత్రాలు హిట్ అయినా పెద్ద ఉపయోగం కలగ లేదు. అలా పూజా హెగ్డే కి సరైన హిట్ లేదు అని మాట్లాడేవాళ్ళకి ” అల వైకుంఠపురములో” బ్లాక్ బస్టర్ సక్సెస్ తో నోళ్లు మూతలు పడ్డాయి. ఇప్పుడు ఆమెకి తెలుగు చిత్ర సీమలో ఫుల్ డిమాండ్ ఉంది. అదే సమయంలో బాలీవుడ్ లో కూడా పూజా హెగ్డే కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు.

ఇప్పుడు సల్మాన్ ఖాన్ హీరోగా ” కభీ ఈద్ కభీ దీవాలి ” అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. సల్మాన్ పక్కన యువ నటీమణులకు అవకాశం ఇస్తే పారితోషికం పెద్దగా ఇవ్వరు. కానీ పూజా హెగ్డే బాగా బిజీ కావడంతో ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చారు..

ఒక రకంగా ఇది తెలుగు నిర్మాతలకు ఇబ్బంది కలిగించే విషయమే . ఎందుకంటే తెలుగులో ఆమె పారితోషికం ఇంత వరకు కోటిన్నర దాటలేదు. హిందీలో ఇస్తున్నారని ఆమె ఇక్కడ రేట్ పెంచేస్తే హీరోయిన్ గా ఇక్కడ ఛాన్సులు తగ్గుతాయి.ఇక సల్మాన్ సినిమా హిట్ అయిందంటే మాత్రం మునుపటిలా పూజా హెగ్డే తెలుగులో రెగ్యులర్ గా కనిపించక పోవచ్చు
Every dog has it’s own day

సచివాలయం మార్పు పై ఉద్యోగుల మండిపాటు

corona-in-ap-secretariat

తమతో అసలు ఎటువంటి చర్చలు జరుపకుండా అర్ధాంతరంగా సచివాలయాన్ని అమరావతి నుండి విశాఖపట్నంకు మార్చడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల పట్ల సచివాలయం ఉద్యోగులు మండిపడుతున్నారు. పైగా ఈ విషయమై ఏ క్షణంలో అయినా ప్రభుత్వ ఉత్తరువులు రావచ్చని అంటూ తమ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఏకపక్షంగా ప్రకటించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా వైరస్ నెపంతో సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయకుడినా కార్యనిర్వాహకవర్గ సమావేశంలోనే ఈ నిర్ణయం ప్రకటించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు విశాఖలో సచివాలయం ఎక్కడ ఉన్నదని, ఏ భవనాన్ని ఎంపిక చేసారని నిలదీస్తున్నారు. మొత్తం సచివాలయం ఒకేచోట ఉంచేందుకు అనువైన భవనం విశాఖలో అసలు లేదని అంటూ కొట్టిపార వేస్తున్నారు.

సచివాలయాన్ని ఒక్క చోట కాకుండా ముక్కలు ముక్కలుగా చేసి అనేకచోట్ల పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ విధంగా చేస్తే ఉద్యోగులు చెల్లాచెదురై అనేక ఇబ్బందులు పడవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం అమరావతిలో ఉన్న సచివాలయంలో ఆఫీస్‌ స్పేస్‌ 5 లక్షల చదరపు అడుగులు ఉందని, ఈ స్థలం సరిపోక అనేక మంది సలహాదార్లకు ఇంకా చాంబర్లే కేటాయించని విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. వైజాగ్‌లో 5 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ అందుబాటులో ఉన్న భవనాన్ని గుర్తించారా అనే విషయాన్ని అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి స్పష్టంగా చెప్పి ఉండాల్సిందని నిలదీస్తున్నారు.

ఉద్యోగుల సౌలభ్యం, పనిచేసే వాతావరణం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం చెప్పినదానికి తల ఊపే సంఘం అధ్యక్షుడి ధోరణి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘం సచివాలయ ఉద్యోగులకు ప్రతినిధిగా వ్యవహరిస్తోందా లేక ప్రభుత్వానికి ప్రతినిధిగా వ్యవహరిస్తోందా అని నిలదీస్తున్నారు.

వికేంద్రీకరణ పేరుతో ఇప్పటికే సచివాలయంలో భాగమైన విజిలెన్స్‌ కమిషన్‌, కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీ్‌సని కర్నూలుకు తరలిస్తూ జీవోలు ఇచ్చారని, అది కోర్టులో ఉండగానే ఇప్పుడు తరలింపునకు సిద్ధంగా ఉండాలంటూ అధ్యక్షుడు చెప్పడాన్ని ఉద్యోగులు తప్పుబడుతున్నారు.

ఇలా ఉండగా, కనీసం తమ సమస్యలు, ఇబ్బందులు ఏమిటో తెలుసుకోకుండానే తమ వ్యక్తిగత డేటా, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు ఇవ్వాలంటూ.. ఒక ప్రొఫార్మాను ఉద్యోగులకు సంఘం పంపడాన్నీ ఉద్యోగులు ఆక్షేపిస్తున్నారు. ఏ ఉద్దేశంతో తమ నుంచి ఈ వివరాలు కోరుతున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

జేమ్స్ కామెరాన్ ‘అవతార్ 2’ ఆగిపోయింది

హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కేమెరాన్ 2009లో నిర్మించిన గ్రాఫికల్ వండర్ `అవతార్`.ప్రపంచ వ్యాప్తంగా అనేక సంచలనాలు సృష్టించింది జేమ్స్ కేమెరాన్ అద్భుత సృష్టిగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని అబ్బురపరిచిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అనేక రికార్డ్స్ నమోదు చేసింది. దరిమిలా “అవతార్” చిత్రానికి సీక్వెల్స్ రూపొందించే పనిలో దర్శకుడు జేమ్స్ కేమెరాన్ రెడీ అయ్యాడు కాగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 17న రిలీజ్ చేయాలని కూడా ప్లాన్ చేశాడు.

అయితే జేమ్స్ కేమెరాన్ ఆలోచనల్నికరోనా వైరస్ దెబ్బతీసేలా కనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి కరాళ నృత్యం తో వ్యవస్థలన్నీ అస్తవ్యస్తం అయ్యాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా సినిమా షూటింగ్ లు ఏవీ సరిగ్గా జరగడం లేదు. తాజాగా ఈ లిస్ట్ లోకి జేమ్స్ కేమెరాన్ ఫిల్మ్ `అవతార్ 2` కూడా చేరింది.
జేమ్స్ కేమెరాన్ రూపొందిస్తున్న `అవతార్ 2` చిత్రీకరణ ప్రస్తుతం న్యూజిలాండ్లో జరుగుతోంది. కరోనా వైరస్ ప్రభలుతుండటంతో సినిమా షూటింగ్ని ఆపేస్తున్నట్టు చిత్ర నిర్మాతల్లో ఒకరైన జాన్ లాండా ఒక పత్రికా ప్రకటన లో వెల్లడించారు. అయితే విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం యదాతదంగా జరుగుతాయని స్పష్టం చేశారు. దీంతో ఈ సినిమా రిలీజ్ ముందు అనుకున్న డిసెంబర్లో కాకుండా వచ్చే ఏడాది జనవరిలో విడుదలయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిసింది.
Carona spares no one

కరోనాపై ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం..

కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో  తెలంగాణ ట్రాఫిక్  పోలీసులు తమవంతుగా ప్రజలను చైతన్యపరిచేందుకు చర్యలు చేపట్టారు. సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ ను నిలిపి కరోనా నివారణకు చేపట్టాల్సిన చర్యలు మైకులో వివరించారు. ముఖ్యంగా చేతులు కడుక్కునే విధానాన్ని చూపారు. జాగ్రత్తలు పాటిస్తే కరోనాను దూరంగా ఉంచడం సాధ్యమేనని చాటిచెప్పారు.

 

https://youtu.be/iMjPbOaG6tk

Kapilakshi Malhotra Latest Photo Stills

రాజ్యాంగంలో `సామ్యవాదం’ పదాన్ని తొలగించండి!

దేశంలో అత్యవసర పరిస్థితి అమలులో ఉన్న సమయంలో దొడ్డిదారిన నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ రాజ్యాంగం పీఠికలో చేర్చిన `సామ్యవాదం’ పదాన్ని తొలగించాలని కోరుతూ నాలుగున్నర దశాబ్దాల తర్వాత ఇప్పుడు రాజ్యసభ ముందు ఒక బిల్ రాబోతున్నది. బిజెపి సభ్యుడు రాకేష్ సిన్హా ప్రతిపాదించిన ఈ బిల్ శుక్రవారం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితులలో ఆ పదానికి అర్ధం లేదని, ఒక ఆలోచనకు పరిమితం కాకుండా ఆర్ధిక అంశాలను చర్చించే వీలు కల్పిస్తూ ఆ పదాన్ని తొలగించాలని ఆయన కోరుతున్నారు.

శుక్రవారం ప్రైవేట్ సభ్యుల బిల్లులకు కేటాయించిన సమయంలో ఈ బిల్లును ప్రవేశ పెట్టడం కోసం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అనుమతో కోరుతూ రాకేష్ సిన్హా లేఖ వ్రాసారు. ఆయన నోటీసు ను బుధవారం అనుమతించారు. అత్యవసర పరిస్థితి సమయంలో, ప్రతిపక్ష నేతలు అందరు దాదాపుగా జైళ్లల్లో ఉన్న సమయంలో రాజ్యాంగంలో `సామ్యవాదం’ పదంతో పాటు `లౌకికవాదం’ పదాన్ని చేరుస్తూ 42వ రాజ్యాంగ సవరణలో చేర్చారు.

`సామ్యవాదం’ ఒక ఆర్ధిక అంశమని, దానిని రాజ్యాంగ భూమికగా పరిగణించలేమని స్పష్టం చేస్తూ ఆ పదాన్ని తొలగించాలని కోరుతూ 1991లో నాటి స్వతంత్ర పార్టీ మహారాష్ట్ర విభాగం ముంబై హైకోర్టు లో ప్రజావాజ్యంను వేసింది. వాజ్యం వేసిన ఇద్దరు మృతి చెందారు గాని, ఇప్పటి వరకు హై కోర్ట్ ఆ అంశాన్ని చేపట్టే ప్రయత్నం చేయక పోవడం గమనార్హం. 2015 రిపబ్లిక్ దినోత్సవం నాడు ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలలో ప్రచురించిన రాజ్యాంగం పీఠికలో `సామ్యవాదం’, `లౌకికవాదం’ పదాలు లేకపోవడంతో ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి.

అయితే రాకేష్ సిన్హా తీర్మానంలో `సామ్యవాదం’ అనే పదాన్ని తొలగించమని లేకపోవడం గమనార్హం. మన సంస్కృతిలోని లౌకిక స్వభావం నెలకొన్నా ఆ పదానికి చాల అర్ధాలు ఉన్నాయని, కొందరు ఆ పదం అవసరమని భావించే అవకాశం ఉన్నదని చెప్పారు. కానీ, ప్రస్తుత సామజిక, ఆర్ధిక అభివృద్ధి నేపథ్యంలో సామ్యవాదం పదం అర్ధం లేనిదని స్పష్టం చేశారు.

పైగా, ఈ అంశంపై రాజ్యాంగ సభలో సవివరమైన చర్చ జరిగినదని, ఆ పాదంపై ఏకాభిప్రాయానికి వచ్చిన్నట్లు డా. అంబెడ్కర్ కూడా ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. `సమాఖ్య లౌకిక సామ్యవాద రాష్ట్రాల కూటమి’ అనే పదం చేర్చాలని కె టి షా సూచించగా అంబెడ్కర్ స్పష్టంగా తిరస్కరించారని చెప్పారు. కాలానుగుణంగా,మారిని పరిస్థితులను పరిగణలోకి తీసుకొని విధానాలలో కూడా మార్పులు చేసుకొంటూ పోవాలని రాకేష్ సిన్హా సూచించారు.

స్థానిక ఎన్నికలలో ఊహించని పరిణామాలు!

ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుప్రీంకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సమర్థిస్తూ.. ఎన్నికల నియమావళిని ఎత్తివేయడంతో ఎన్నికల నిర్వహణ ప్రశ్నర్ధకంగా మారింది.

అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి రోజు రోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రం స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయంపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ ను విచారణకు స్వీకరించిందని న్యాయనిపుణులు అంటున్నారు. ఎన్నికల సంఘం తీసుకున్న వాయిదా నిర్ణయాన్ని సమర్థించిన కోర్టు ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ఎన్నికల నియమావళి అమలును రద్దు చేసిందని వారంటున్నారు. అంతేగాక ఎన్నికల నిర్వహణకు ముందు నాలుగు వారాలు ఎన్నికల నియమావళి అమలులో ఉండేలా చూడాలని సూచించినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణ మళ్లీ మొదటికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటున్నారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ దీనికి బలం చేకూరుస్తుంది. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర బలగాలు అవసరమని, లేదంటే ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఎన్నికల కమిషనర్ రమేష్‌ కుమార్ ఆ లేఖలో స్పష్టం చేసిన విషయాన్ని న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. అంతేగాక రాష్ట్రంలో జరిగిన ఏకగ్రీవ ఎన్నికల విషయం కూడా ఆయన ప్రస్తావిస్తూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలను కేంద్రానికి గుర్తుచేయడం గమనార్హం. తనకు, తన కుటుంబానికి భద్రత కల్పించాలని ఆయన కోరడం పరిశీలించాల్సిన అంశమని వారంటున్నారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఘర్షణలు, ఏకగ్రీవ ఎన్నికలు, నామినేషన్లు దాఖలు చేయకుండా ఆటంకం కల్పించారని కమిషన్‌ కు పలు రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి ఎన్నికల ప్రక్రియను రద్దు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఎన్నికల వాయిదాపై సీఎం జగన్ పలువురు మంత్రులు, వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉండటంతో న్యాయస్థానాలు కూడా కమిషనర్ రమేష్‌ కుమార్‌ కు అనుకూలంగా ఉంటాయని వారు అభిప్రాయపడుతున్నారు.

విశ్వక్ సేన్ కొత్త చిత్రం ప్రారంభం

‘ఫలక్ నుమా దాస్’ మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న విశ్వక్ సేన్. ‘HIT’ మూవీతో ఘనవిజయం సాధించాడు. HIT మూవీ లో ఇన్ స్పెక్టర్ విక్రమ్ రుద్రరాజు క్యారెక్టర్ లో విశ్వక్ సేన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఈ రోజు విశ్వక్ సేన్ 5వ మూవీ పూజా కార్యక్రమం జరుపుకుంది.

లక్కీ మీడియా బ్యానర్ పై నూతన దర్శకుడు నరేష్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా #VS5 మూవీ రూపొందనుంది. చిత్ర యూనిట్ ఈ మూవీ టైటిల్ లోగో ను రిలీజ్ చేసింది. ‘పాగల్’ టైటిల్ తో రూపొందనున్న ఈ మూవీ కి ‘అర్జున్ రెడ్డి’ మూవీ ఫేమ్ రధాన్ సంగీతం అందించనున్నారు. సూపర్ హిట్ ‘హుషారు’మూవీ నిర్మాత బెక్కం వేణుగోపాల్ ‘పాగల్ ‘ మూవీ ని నిర్మిస్తున్నారు.

https://youtu.be/e2gyJr-WED4

కీలక నిర్ణయాలు తీసుకుంటున్న భారతీయ రైల్వే

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి గంట గంటకి పెరగటంతో దానిని నియంత్రిచేందుకు వివిధ శాఖలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం భారతీయ రైల్వేశాఖ భారీ స్థాయిలో రైళ్లను రద్దు చేసింది. ప్రయాణికులు వారి వారి ప్రయాణాలను రద్దు చేసుకుంటూ ఉండడంతో ఇండియన్ రైల్వే భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తోంది. ప్రధాన రైళ్లకు జనం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇప్పటికే 98రైళ్లను రద్దు చేసిన రైల్వేశాఖ రేపటి (20వ తేదీ) నుంచి దేశవ్యాప్తంగా మొత్తం 168 రైళ్లు రద్దు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈనెల 31వ తేదీ వరకు రద్దు అమల్లో ఉంటుందని, ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇందులో వెస్ట్, నార్తర్న్ సెంట్రల్ రైల్వేలో 11 రైళ్లు, దక్షిణ మధ్య రైల్వేలో 20, సదరన్ రైల్వేలో 32, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేలో 20, ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 5 రైళ్లు ఉన్నాయి. రద్దు చేసిన రైళ్లలో రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులకు ఫోన్ మెసేజ్ ద్వార సమాచారం అందిస్తామని రైల్వేశాఖ అధికారులు తెలిపారు.

విజయ్ దేవరకొండ మళ్ళీ గెలిచాడు

సినిమాల సక్సెస్ తో నిమిత్తం లేకుండా విజయ్ దేవరకొండ తనకు తానే సాటి అని ప్రూవ్ చేసుకొన్నాడు వరుసగా రెండోసారి హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టులో టాప్ ప్లేస్ లో నిలిచాడు .

విజయ్ దేవరకొండకు యూత్ లో ఉన్న క్రేజ్ ఇంకా తగ్గలేదని మరోమారు రుజువు అయ్యింది. అమ్మాయిలు కూడా ఇంకా విజయ్ దేవరకొండని మరిచి పోలేదని మరోసారి రుజువైంది. 2017లో రెండో స్థానంలో ఉన్న విజయ్ దేవరకొండ 2018 లో తొలిసారిగా ఈ జాబితాలో అగ్రస్థానం సంపాదించాడు.

2018 లో విజేతగా నిలిచిన సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తాను 2019 లో కూడా అగ్రస్థానంలోనే ఉంటానని విజయ్ దేవరకొండ చెప్పడం విశేషం. అన్నట్లే 2019 హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టులో నంబర్ వన్ గా గెలిచి చూపించాడు

ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టులో రెండో స్థానంలో నిలిచాడు. ఇక యువ కథానాయకుడు రామ్ (ఇస్మార్ట్ శంకర్ ), యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూడు మరియు నాలుగు స్థానాలు సాధించారు. ఆ తరవాతి స్థానాల్లో వరుణ్ తేజ్ (7), సుధీర్ బాబు (8), ప్రదీప్ మాచిరాజు (9) ఉన్నారు. అక్కినేని నాగచైతన్య 11వ స్థానంలో నిలవగా.. అల్లు అర్జున్ 12వ ర్యాంకు సాధించాడు. ఆశ్చర్యకరం గా జూనియర్ ఎన్టీఆర్ 19వ స్థానంలో ఉన్నాడు. విజయ్ దేవరకొండకు తానేం తక్కువ అన్నట్లు గా మాట్లాడే హిట్ హీరో విశ్వక్ సేన్ ఈ జాబితాలో 30వ స్థానంలో నిలవడం విశేషం .
Public opinion resembles craze