వరుస ఎన్కౌంటర్లలో తీవ్రంగా దెబ్బతింటూ నాయకత్వం ఉనికినే కోల్పోతున్న మావోయిస్టులు అదను కోసం ఎదురు చూస్తూ, కాపు కాచి, గాలింపు చర్యల అనంతరం తిరిగి వెడుతున్న సాయుధ దళాలలను చుట్టుముట్టి దండకారణ్యంలో చావుదెబ్బ తీశారు. పోలీస్ బలగాలను తమ ఉచ్చులోకి దింపి కాల్పులకు తెగబడినట్లు చత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
పోలీస్ దళాల రాకను ముందే పసిగట్టడంతో, వ్యూహాత్మకంగా వారి గాలింపు పూర్తయ్యేవరకు కనబడకుండా దాక్కొంటూ, ఇక్కడెవ్వరు మావోయిస్టులు లేరనికొని తిరిగి వెడుతున్న సమయంలో ఎత్తైన ప్రదేశాల నుండి మాటు వేసి కాల్పులు జరిపి దెబ్బ తీశారు. ఊహించని పరిణామం కావడం, దట్టమైన అడవి కావడంతో తేరుకొనే లోపే తీవ్ర నష్టం జరిగిపోయింది.
చింతగుఫా పోలీసు స్టేషన్ పరిధిలోని ఎల్మాగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టు కీలక నేత హిడ్మా ఆధ్వర్యంలో నగేష్, వినోద్, దేవా, తదితర నేతలతో పాటు 300మంది మావోయిస్టులు సమావేశమయ్యారని చత్తీస్గఢ్ ఇంటిలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. దాంతో డోర్నపాల్ పోలీసు స్టేషన్ నుంచి 200 మందిని, బూర్కాపాల్ క్యాంపు నుంచి 150 మందిని ఈ ప్రాంతానికి నేరుగా కూంబింగ్ ఆపరేషన్ కోసం పంపారు.
శనివారం మధ్యాహ్నం గాలింపు పూర్తి చేసుకొని బలగాలు తిరుగుముఖం పట్టాయి. అయితే మావోలు అంబూష్ చేయడంతో బలగాలు చిక్కుకుపోయాయి. బలగాలు తమను సమీపిస్తున్నాయన్న సమాచారం తెలుసుకున్న మావోలు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్లు ధరించి సిద్ధమయ్యారని తెలుస్తున్నది.
భారీ అటవీ ప్రాంతానికి బలగాలు చేరుకోగానే అక్కడే దారికాచి ఉన్న సాయుధులైన మావోలు అన్నివైపుల నుంచి కాల్పులకు దిగారు. పక్కా ప్రణాళికతో ఉన్న మావోయిస్టులు గుట్టలపై అప్పటికే ఏర్పాటు చేసుకున్న సురక్షిత ప్రదేశాల నుంచి గ్రెనేడ్స్, రాకెట్ లాంచర్లు, అత్యాధునికి ఆయుధాలతో జవాన్లపై విరుచుకుపడ్డారు. దీంతో మావోయిస్టులదే పైచేయిగా మారింది. దాదాపు 2 గంటలపాటు ఇరుపక్షాల నడుమ హోరా హోరీ కాల్పులు జరిగినట్లు సమాచారం.
అప్పటికే కూంబింగ్ చేసి అలసిపోవడంతో ఈ దాడిని భద్రతా జవాన్లు అసలు ఊహించలేకపోయారు. ఆకస్మాత్తుగా కాల్పులు జరగడంతో వెంటనే అప్రమత్తమైనా ఫలితం లేకపోయింది. మావోలు తూటాల వర్షం కురిపించడంతో భద్రతా బలగాలు చెల్లాచెదురయ్యాయి. అనంతరం రెండున్నర గంటల తర్వాత కాల్పులు ఆగిపోగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బలగాలు క్యాంప్కు చేరుకున్నాయి.
మావోలు అపహరించిన జవాన్ల కోసం ఆదివారం డ్రోన్ల సాయంతో అన్వేషించారు. ఈ క్రమంలో కాల్పులు జరిగిన ప్రాంతానికి 7 కిలోమీటర్ల దూరంలో అదృశ్యమైన 17మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. వెంటనే మృతదేహాలను బలగాలు అడవి నుంచి బయటకు తీసుకొచ్చాయి. ఈ ఘటనలో 12మంది డీఆర్జీ, ఐదుగురు ఎస్టీఎఫ్ సిబ్బంది చనిపోయినట్లు నక్సల్స్ ఆపరేషన్ డీజీపీ అవస్థీ ప్రకటించారు.
ఛత్తీ్సగఢ్ ప్రభుత్వం ఇటీవల ‘ఆపరేషన్ ప్రహార్’తో మావోయిస్టులను అణచివేసే కార్యక్రమం చేపట్టింది. దీంతో జవాన్లు దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం జవాన్లు కూంబింగ్కు వెళ్లారు.
ఆపరేషన్ ప్రహార్కు ప్రతీకారంగా మావోయిస్టు కేంద్ర కమిటీ ఛత్తీ్సగఢ్లో ప్రత్యేక బెటాలియన్లను ఏర్పాటు చేసుకుంది. ఎప్పటికప్పుడు జవాన్ల సంచారాన్ని పసిగట్టి, పక్కా ప్రణాళికతో జవాన్లను దెబ్బ కొట్టడం బెటాలియన్ పని.




ప్రపంచ వ్యాప్తంగా వరుసగా పెరగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో ఆందోళన చెందుతున్న ప్రపంచ దేశాలు వరుసగా లాక్ డౌన్ లను ప్రకటిస్తున్నాయి. భారత్ లో ఆదివారం అంతా జనతా కర్ఫ్యూ అమలు చేయగా, సోమవారం నుండి కనీసం 13 రాష్ట్రాలలో ఈ నెలాఖరు వరకు పూర్తిగా లోక్ డౌన్ ప్రకటించారు. మరో కొన్ని రాష్ట్రాలలో పాక్షికంగా ప్రకటించారు. రైళ్లు, అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు, మెట్రో రైళ్లు విమానాలు అన్ని మూతబడ్డాయి.
తమిళ చిత్ర రంగంలోఒక విప్లవం తెచ్చి తమిళ సినిమాలను జాతీయ స్థాయిలో నిలబెట్టిన దర్శక మేధావి కె బాలచందర్ గారికి ప్రియతమ శిష్యుడైన దర్శక , రచయిత విసు నేటి మధ్యాహ్నం (మార్చ్ 22 ) తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయాడు. గత కొన్నేళ్లుగా కిడ్నీసంబంధిత వ్యాధితో బాధ పడుతున్న” విసు” చివరకు ఇవాళ్టితో విముక్తం చెందాడు. ఒక పక్షం రోజుల ముందు 1981 లో తన రచనలో రూపుదిద్దు కొన్న రజనీకాంత్ చిత్రం ” నెట్రిక్కాన్ ” ( తెలుగులో ముసలోడికి దసరా పండుగ ) సినిమాని రజనీకాంత్ అల్లుడు ధనుష్ రీమేక్ చేస్తున్నాడని తెలిసి దానిపై తన అభ్యంతరం తెలిపే క్రమంలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు


కరోనా వైరస్ కట్టడి చేసేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగుతోంది. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు కరోనా నియంత్రణకు పనిచేస్తున్న వైద్యులు, అత్యవసర సేవలు అందిస్తున్న యంత్రాంగానికి యావత్ భారతావని చప్పట్లు కొడుతూ ధన్యవాదాలు తెలిపింది.


దేశం వ్యాప్తంగా కరోనా కేసులున్న 75 జిల్లాల్లో జనతా కర్ఫ్యూను మార్చ్ 31 వరకు పొడిగించమని ప్రధాన మంత్రి కార్యాలయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఈ జిల్లాల్లో అత్యవసర సేవలు తప్ప మిగిలినవన్నీ బంద్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. రైళ్లు, అంతర్ రాష్ట్ర బస్సులు, మెట్రో రైల్ సేవలు కూడా స్థంబింప చేయనున్నారు.

మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్లలో చిరు-152మూవీ తెరకెక్కుతున్న సంగతి తెల్సింది. ఈ మూవీకి ‘ఆచార్య’ టైటిల్ ఫిక్స్ చేశారు. చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. పవర్ ఫుల్ ఎండోన్మెంట్ అధికారికంగా రఫ్ఫాడించనున్నాడు. అలాగే ఫ్లాష్ బ్యాక్ ఓ పాత్రలో నటిస్తాడని సమాచారం. అదేవిధంగా రాంచరణ్ ఈ మూవీలో ఓ కీలక రోల్స్ చేస్తున్నాడు. దాదాపు ఆయన 30నిమిషాల సినిమాలో నటించనున్నాడని సమాచారం. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ వేగంగా జరుగుతుంది. తాజాగా కరోనా ఎఫెక్ట్ షూటింగ్ వాయిదా పడింది.
తమిళ నటుడు విక్రమ్ ప్రభు తాజా చిత్రం ద్వారా ఇద్దరు ముద్దుగమ్మలు రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు. తమిళం, తెలుగు, కన్నడ సినిమాల్లో శ్రీవిద్య, లక్ష్మీమీనన్ నటించి మెప్పించారు. పక్కింటి అమ్మాయిలా కన్పించే ఈ ముద్దుగుమ్మలు గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా శివాజీ గణేషణ్ మననువడు విక్రమ్ ప్రభు తాజాగా నటించే మూవీలో వీరిద్దరు ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ మూవీని సుశీంద్రన్ తెరకెక్కిస్తున్నాడు. కుటుంబ కథతో తెరకెక్కనున్న ఈ మూవీని నల్లుసామి పిక్చర్స్ బ్యానర్పై నిర్మిస్తుంది
అసలుకే తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జగన్ ప్రభుత్వం కేంద్రం రాష్ట్రాలకు అందించే ప్రాయోజిత పధకాలకు సంబంధించిన నిధులను సహితం భారీగా కోత విధిస్తూ ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడుతున్నది. ఈ విషయమై కేంద్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలదీయలేక పోవడంతో ప్రభుత్వానికి దిక్కు తోచడంలేదు.
నందమూరి హీరోలు బాలకృష్ణ, కల్యాణ్ రామ్ నటిస్తూనే సొంత బ్యానర్లు ఏర్పాటు చేసుకున్నారు. తమ సొంత బ్యానర్లో సినిమాలను నిర్మిస్తూ నిర్మాణరంగంలోనూ రాణిస్తున్నారు. బాలకృష్ణ ‘ఎన్బీకే’ సంస్థను ఏర్పాటు చేయగా కల్యాణ్ రామ్ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ ఏర్పాటు చేసి మూవీలను నిర్మిస్తున్నారు. తన తండ్రి గుర్తుగా త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ ఓ బ్యానర్ ఏర్పాటు చేసేందుకు సన్నహాలను చేస్తున్నట్లు సమాచారం.
అది చేస్తే.. కరోనా రాదంటున్న బోల్డ్ బ్యూటీ
నిత్యం సోషల్ మీడియాలో వివాదస్పద పోస్టులు పెడుతూ అందరిని తనవైపు తిప్పుకోవడం శ్రీరెడ్డికి కొత్తేమీకాదు. ‘స్థిరమైన శృంగారం చేయడం వల్ల కరోనా నివారణ నిరూపితమయిందని.. అలాగే మాస్కులు, హెల్మెట్లు, కండోమ్ లను ధరించండి.. దేవుడి ముందు మాత్రం నగ్నంగా ఉండండి.. అంటూ సెన్సషల్ కామెంట్ చేసింది. అయితే ఆమె వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు శ్రీరెడ్డి వ్యాఖ్యలు లైట్ తీసుకుంటున్నారు.
నేడు భారత ప్రధాని మోడీ ఇచ్చిన ‘జనతా కర్ఫ్యూ’ పిలుపు మేరకు ప్రజలంతా స్వచ్ఛంధంగా బంద్ లో పాల్గొంటున్నారు. కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాయి. బస్సులు, ట్రైన్లు, విమానాలన్నీ బంద్ పాటిస్తున్నాయి. పోలీస్, వైద్య, ఫైర్, వాటర్ డిపార్ట్ మెంట్ మినహా అందరూ బంద్ లో పాల్గొంటున్నారు.