చైనాలోని వూహాన్ ప్రారంభమైన కరోనా వైరస్ క్రమంగా ప్రపంచాన్ని చుట్టిముట్టింది. ప్రస్తుతం ఇటలీ దేశాన్ని కబలించేందుకు సిద్ధమవుతోంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలోకి దిగి తక్షణ చర్యలు చేపడుతుంది. అలాగే ప్రపంచ దేశాలకు హెచ్చరికలను జారీ చేస్తుంది. కరోనాపట్ల ఏమరుపాటుగా ఆ దేశంలో మృతుఘోష తప్పదంటుంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలను ప్రపంచ దేశాలను పాటిస్తున్నాయి. దీంతోపాటు చైనా దేశం కరోనా నివారించేందుకు చేసిన లాక్డౌన్ సత్ఫలివ్వడంతో క్రమంలో ఆయా దేశాలు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి.
భారత్ లో కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో లాక్డౌన్ చర్యలు చేపట్టాలని కేంద్రం ఆయా రాష్ట్రాలకు ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటికే మహారాష్ట్ర, కేరళ, తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ ఈనెల 31వరకు లాక్డౌన్ దిశగా చర్యలు తీసుకున్నాయి. ఇందులో భాగంగా టీఎస్ సర్కార్ కరోనా పట్ల నిర్లక్ష్యం వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణలో 1897 చట్టం ప్రకారం లాక్డౌన్ ప్రవేశపెట్టామని.. ఇందుకు సంబంధించిన నిబంధనలను సీఎస్ సోమేష్ కుమార్-తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరించారు.
నేటి నుంచి మార్చి 31 వరకు తెలంగాణ లాక్డౌన్ అమల్లో ఉంటుంది. ప్రజాలెవరూ రోడ్లపైకి రాకుడదు. ఒక కాలనీలో వాహనాలు ఒకటి- రెండు కిలోమీటర్లు మాత్రమే తిరగాలి. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి. పోలీసుల దృష్టిలో ఎక్కువసార్లు పడితే ఆ వాహనాన్ని సీజ్ చేస్తారు. ఈ వాహనాలను వైరస్ తీవ్రత తగ్గిన తర్వాతే ఇస్తారు. నిత్యావసర వస్తువులు క్యారీ ప్రైవేట్ వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రతీ బైకుపై ఒక వ్యక్తి.. కారు-ఇతర ఫోర్ వీలర్ వాహనాల్లో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుంది. చట్టం అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తారు. చట్టం ఉల్లంఘిస్తే ఆరు నెలల జైలు శిక్ష వంటి కఠిన చర్యలు ఉంటాయి.
ప్రతీఒక్కరు స్వీయ నియంత్రణ పాటించినట్లయితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం విధించే నిబంధనలు తూచ తప్పకుండా పాటించడంతోపాటు. కరోనాపై అవగాహన పెంచుకుంటే ఈ మహమ్మరికి దూరంగా ఉండొచ్చు. ఆ దిశగా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.








పూరీ జగన్నాధ్ దర్శకత్వం లో గత ఏడాది వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని మస్తుగా అలరించింది. మరీ ముఖ్యంగా యూత్ ని బాగా ఆకట్టుకొంది. ఇక ఈ సినిమా విజయంలో హీరోయిన్ల పాత్ర మరువలేనిది ఇద్దరికి ఇద్దరు గ్లామర్ ఒలక పోయడంలో పోటీపడ్డారు. ఇపుడు మళ్ళీ అదే కాంబినేషన్ మరో సినిమాలో రాబోతుంది .కాకపొతే ఇక్కడ హీరో మారాడు .

కరోనా వైరస్ ప్రభావం తో అతలా కుతలం అవుతున్న వివిధ రంగాలలో సినీ రంగం కూడా ఒకటి .ప్రభుత్వం విధించిన ఆంక్షల వల్ల వేలాది సినీ కార్మికులు రోడ్డున పడ్డారు. షూటింగ్ ఉంటేనే గాని రోజు గడవని స్థితి వాళ్ళది. అటువంటి నిరుపేద సినీ కళాకారుల్ని ఆదుకొనేందుకు హీరో రాజశేఖర్ ముందుకొచ్చాడు .









సూపర్ స్టార్ రజనీ కాంత్ రియల్ లైఫ్ లో చేసిన సాహసం నేటి రాత్రి 8గంటలకు ప్రసారం కానుంది. రజనీకాంత్ ఇటీవల ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’పేరిట తీసిన డాక్యమెంటరీలో నటించారు. ఈ సాహస యాత్ర ప్రసారాన్ని డిస్కవరీ ఛానల్ ఈ రోజు రాత్రి 8గంటలకు ప్రసారం చేయనుంది. దీంతో అభిమానులు రజనీ సాహసయాత్ర చూసేందుకు అత్రుతగా ఎదురు చూస్తున్నారు.


మన తెలుగు హీరోలకు ముందు చూపు ఎక్కువ అవుతోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టు కోవాలన్న ఆలోచన వారిలో బాగా పెరిగింది. ఆ క్రమంలో రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. ఆల్రెడీ రామ్ చరణ్ భాగస్వామిగా ‘ ట్రూ జెట్ ‘ అనే విమాన సంస్థలో పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ కూడా సెలబ్రిటీ లకు కార్లను లీజ్ కి ఇచ్చే ఒక బడా కంపెనీ లో పార్టనర్ గా జాయిన్ అయ్యాడు .