spot_img
Homeఆంధ్రప్రదేశ్‌కేంద్ర నిధులలో భారీ కోతతో జగన్ ఇరకాటం!

కేంద్ర నిధులలో భారీ కోతతో జగన్ ఇరకాటం!

అసలుకే తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జగన్ ప్రభుత్వం కేంద్రం రాష్ట్రాలకు అందించే ప్రాయోజిత పధకాలకు సంబంధించిన నిధులను సహితం భారీగా కోత విధిస్తూ ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడుతున్నది. ఈ విషయమై కేంద్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలదీయలేక పోవడంతో ప్రభుత్వానికి దిక్కు తోచడంలేదు.

కొన్ని పథకాల్లో నిధులను పెంచినట్లు చూపిస్తున్న కేంద్రం మరికొన్ని పథకాల్లో దారుణంగా కోతలు పెడుతోంది. దాంతో మొత్తం నిధుల్లో భారీగా గండి పడుతోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తయారుచేసిన నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి.

రాష్ట్ర అభివృద్ధి పథకాలకు కేంద్ర సాయం చేసే నిధుల్లో ఇంకా రు.4,392 కోట్లు రావాల్సి ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో రు.13,925 కోట్లు వస్తాయని అంచనా వేయగా, ఇప్పటివరకు రు.9,533 కోట్లు మాత్రమే వచ్చినట్లు చెబుతున్నారు. మరో ఏడెనిమిది రోజులలో ఈ ఆర్ధిక సంవత్సరం పూర్తి కావస్తు ఉండడంతో కేంద్రం ఈ నిధుల గురించి మాట్లాడక పోవడంతో రాష్ట్ర ప్రభుతానికి పాలుపోవడం లేదు.

ఇదే సమయంలో కీలకమైన 17 పథకాలకు సంబందించి వచ్చిన నిధులపైనా లెక్కలు తేల్చారు. అందులో తొమ్మిది పథకాల్లో భారీగా కోతలు పడగా, ఎనిమిది పథకాల్లో స్వల్పంగా నిధులు పెరిగాయి. అయితే పెరిగిన నిధుల కన్నా… కోతలు పడిందే ఎక్కువగా ఉన్నాయి. తొమ్మిది పథకాలకు గత ఏడాది రు.5,138 కోట్లు రాగా, ఈ ఏడాది రు.2,948 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే మొత్తం మీద రు.2,165 కోట్లు తగ్గాయి.

ఇందిరా ఆవాస్‌ యోజన, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనల కింద రు.977 కోట్లు తగ్గగా, స్మార్ట్‌ సిటీలకు రూ.372 కోట్లు, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (గ్రామీణ) విభాగంలో రు.315 కోట్లు, ఉపాధి హామీ పథకంలో రు.304 కోట్లు కోతలు పడ్డాయి. రూసా, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (అర్బన్‌), విద్య, ఎస్‌ఎబిఎల్‌ఎ వంటి పథకాల్లో కూడా కొంతవరకు కోతలు పడ్డాయి.

రూసా, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం, స్వచ్ఛభారత్‌ మిషన్‌ (అర్బన్‌), విద్య, ఎస్‌ఎబిఎల్‌ఎ వంటి పథకాల్లో కూడా కొంత వరకు కోతలు పడ్డాయి. అయితే మరో ఎనిమిది పథకాల్లో మాత్రం స్వల్పంగా నిధులు పెంచారు. ఈ పథకాలకు సంబంధిరచి గత ఏడాది రూ1,785 కోట్లు రాగా, ఈ ఏడాది రు.2,432 కోట్లు వచ్చాయి.
అంటే రు.647 కోట్లు అదనంగా వచ్చాయి.

మొత్తం రావాల్సిన రు.13,925 కోట్లలో ఎక్కువ స్థానిక సంస్థలకు సంబందించినవి కాగా, ఆరోగ్యం, సంక్షేమం, విద్య, గృహనిర్మాణం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో కోతలు తీవ్రంగా వున్నాయి.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Venkatesh Kalyan Ram Movie

Anil Ravipudi Movie : వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఈ...

Anil Ravipudi Movie : వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రీసెంట్ గానే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ , కృతి శెట్టి...
CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Oktelugu Epaper