విజయవాడ సమీపంలోని కంచికచర్ల లో దారుణం చోటు చేసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నివారించేందుకు విధించిన లాక్ డౌన్ కారణంగా కన్న తల్లిని చివరి చూపు చూడడానికి కుమార్తెకు అవకాశం లభించలేదు. హృదయ విధారకమైన ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే కంచికచర్ల కు చెందిన రామతులశమ్మ(80) నిన్న సాయంత్రం అనారోగ్యం తో మృతి చెందింది. ఆమె కుమార్తె గుంటూరు నగరంలోని ఏ.టి అగ్రహారం లో నివాసం ఉంటుంది. తల్లి మరణవార్త విని తల్లడిల్లిపోయిన ఆమె తల్లిని చివరిసారిగా చూసుకునేందుకు రావడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గుంటూరు పోలీసులు, రెవెన్యూ అధికారులను అనుమతి కోరగా వారు అంగీకరించలేదు.
చేసేది లేక ఆమె బంధువులు స్మార్ట్ ఫోన్ లో వీడియో కాల్ లో కడసారి చూపు చూసుకుంది. తల్లిని చివరిసారిగా చూసుకొని కన్నీరు మున్నీరుగా విలపించింది.