ఒకప్పుడు సామాజిక విపత్తులు వచ్చి సంక్షోభం ఏర్పడి నపుడు తెలుగు సినీ పరిశ్రమ నుంచి దర్శకరత్న దాసరి నారాయణరావు గారు ముందుండి అందర్నీ నడిపించే వారు. కానీ ఆయన చనిపోయాక ఇండస్ట్రీ జనాలను ముందుకు నడిపేది ఎవరన్న ప్రశ్నకు ఇపుడు సమాధానం దొరికింది .
దేశ మంతా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ తెలుగు సినిమా రంగం నుంచి మెగాస్టార్ చిరంజీవి ముందుకు వచ్చి ఒక్కసారిగా అందరిలో కదలిక తేవడం జరిగింది. ఇప్పటికే ఇండస్ట్రీ జనాలకు చిన్న చిన్నసహాయాలు చేస్తూ..ఉన్నాడు. అందర్నీ ఆప్యాయంగా పలుకరిస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరి ఫంక్షన్ లకు హాజరవుతూ , చిన్న వారిని దీవిస్తూ వచ్చాడు. నెమ్మదిగా టాలీవుడ్కు పెద్ద దిక్కుగా మారిపోయాడు.
ఇప్పుడు కరోనా వైరస్ ప్రజానీకం చేస్తున్న పోరులో సినీ పరిశ్రమను భాగస్వామిని చేసి ముందుకు నడిపిస్తున్నది కూడా చిరంజీవే కావడం విశేషం. చిరంజీవి చేస్తున్న ఈ మహత్ కార్యానికి మిగతా మెగా హీరోలు కూడా గొప్పగా తోడ్పాటు అందిస్తున్నారు.
కరోనా భాదితుల సహాయార్ధం అందరికన్నా ముందుగా పవన్ కళ్యాణ్ రూ.2 కోట్ల భారీ విరాళంతో కదలిక తెస్తే..దానికి చిరంజీవి స్పందిస్తూ సినీ కార్మికుల కోసం 1 కోటి రూపాయలు విరాళం ప్రకటించడం జరిగింది.
వెంటనే రామ్ చరణ్ తన వంతుగా ప్రభుత్వానికి రూ.70 లక్షలు , సినీ కార్మికుల కోసం ఇంకో రూ.30 లక్షల విరాళం ప్రకటించాడు. అలాగే అల్లు అర్జున్ రూ.1.25 కోట్ల భారీ విరాళం ప్రకటించాడు. వరుణ్ తేజ్ రూ.20 లక్షలిస్తే.. సాయిధరమ్ తేజ్ రెండు విడతలుగా రూ.10 పదేసి లక్షల చొప్పున 20 లక్షలు విరాళం ఇచ్చాడు.ఆ లెక్కన కేవలం మెగా ఫ్యామిలీ నుంచే దాదాపు 5 కోట్ల 65 లక్షలు విరాళాలు పోగయ్యాయి.
కేవలం తాము విరాళాలు ఇవ్వడమే కాదు.. మిగతా వాళ్లను కూడా ఆ దిశగా నడిపించడంలో కూడా మెగా ఫామిలీ గ్రాండ్ సక్సెస్ అయ్యింది . a stich in time saves nine




లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా తరలిస్తున్న ఎక్సైజ్ శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థానికులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే తూర్పు గోదావరి జిల్లా రాయవరం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రెడ్డి త్రినాథ్ అక్రమంగా మద్యాన్ని కారులో తరలిస్తున్నాడు. కుతుకులూరు లో స్థానికులు త్రినాధ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి కి సమాచారం అందించారు. ఎక్కడికి చేరుకున్న ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి చేపట్టారు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దాతృతంతో నిజంగా ‘బాహుబలి’ అనిపించుకున్నాడు. ఇప్పటికే కరోనా నివారణలో భాగంగా ప్రభాస్ రెండు తెలుగు రాష్ట్రాలకు 50లక్షల చొప్పున కోటి రూపాయాలను ప్రకటించారు. అదేవిధంగా ప్రధాన మంత్రి సహాయనిధికి రూ.3కోట్లను విరాళంగా ప్రకటించిన సంగతి తెల్సిందే. తాజాగా సీనీ కార్మికుల సంక్షేమం కోసం చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘సీసీసీ మనకోసం’ సంస్థకు రూ.50లక్షల విరాళాన్ని ప్రభాస్ ప్రకటించారు. దీంతో ప్రభాస్ ఒక్కేడే రూ.4.5కోట్ల విరాళం ప్రకటించినట్లయింది.
మెగాస్టార్ 152వ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీకి ‘ఆచార్య’ అనే టైటిల్ ఖరారైన సంగతి తెల్సిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ‘ఆచార్య’ మూవీకి సంబంధించి ఫస్టు తేది ఖరారైందని ప్రచారం జరుగుతుంది. ఏప్రిల్ 2 శ్రీరామ నవమిని పురస్కరించుకొని ‘ఆచార్య’ ఫస్టు లుక్ ను చిత్రబృందం విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అక్షయ్ కుమార్ ప్రధాన మంత్రి షహాయ నిధి ” పీఎం కేర్స్ ఫండ్ ” కి పాతిక కోట్లు ఇవ్వడం దేశం మొత్తాన్ని నివ్వెర పరిచింది. ఇంకా చెప్పాలంటే టాక్ ఆఫ్ ద నేషన్ అయ్యింది.
కరోనా వైరస్ దెబ్బతో వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ ఇక ఈ సంవత్సరం జరిగే అవకాశం లేదు. వచ్చే ఏడాది జులై 23వ తేదీన మొదలుపెట్టి ఆగస్టు 8వ తేదీన ముగించాలని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), జపాన్ నిర్వాహకులు భావిస్తున్నట్టు జపాన్ మీడియా చెబుతోంది.
రాష్ట్రంలోని అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ప్రైవేటు ఆసుపత్రులపై కలెక్టర్లకు అధికారాలు అప్పగిస్తూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ మెడికల్ కళాశాలలు, ఆసుపత్రులు, ప్రైవేట్ వైద్యశాలలు ఎప్పుడైనా స్వాధీనం చేసుకునే అధికారాన్ని కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని ఆదేశించింది. కరోనా అనుమానిత లక్షణాలున్న వ్యక్తులకు ఐసోలేషన్ కోసం చర్యలు చేపట్టాని ప్రభుత్వం సూచించింది. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, టెక్నీషియన్లు, నర్సులు, ఇతర సిబ్బంది…అందుబాటులో ఉండాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అవసరాల మేరకు ఆసుపత్రులను ఇప్ప టికే గుర్తించిన ప్రభుత్వం… కరోనా కేసులు పెరిగితే ప్రైవేటు వైద్యశాలలు, మెడికల్ కళాశాలలు, అనుబంధంగా ఉన్న ఆసుపత్రులను స్వాధీనం చేసుకునేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 23కు చేరింది. దీంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి రాష్ట్రానికి చేరుకున్న వారు 29,672 మంది, వీరిలో హోమ్ ఐసోలేషన్ లో 29,496 మంది ఉన్నారు. హాస్పిటల్ ఐసోలేషన్ 178 మంది ఉన్నారు.



ఒకప్పుడు తెలుగులో తిరుగులేని సంగీత దర్శకుడి గా పేరు తెచ్చుకొన్న దేవిశ్రీ ప్రసాద్ ఈ మధ్య కాలంలో తన స్థాయికి తగని సంగీతం తో ప్రేక్షకుల్నినిరాశ పరుస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ కెరీర్లో ఎన్నడూ లేనంత సంక్షోభం ఇప్పుడు చవి చూస్తున్నాడు. ఈ ఏడాది ఆరంభం లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రం సక్సెస్ సాధించి కొంత ఊరట నిచ్చింది. కానీ దానికి పోటీగా వచ్చిన ఆల వైకుంఠపురం లో చిత్రం యొక్క సంగీతం ముందు చిన్న బోయింది.
కరోనా ప్రభావంతో రాష్ట్రంలో మరోసారి పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈనెల 31నుంచి 6తేదివరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా వీటిని వాయిదా వేస్తున్న తెలంగాణ విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. గతంలోనే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తుండగా హైకోర్టు ఉత్తర్వుల మేరకు పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. తాజాగా ప్రభుత్వం మరోసారి పదోతరగతి పరీక్ష వాయిదా పడటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబెలెత్తిస్తోంది. ప్రపంచంలోని 200దేశాలకు కరోనా పాకింది. కరోనా మహమ్మరి దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. కరోనా ఎఫెక్ట్ తో అన్నిరంగాలు దెబ్బతింటున్నాయి. కరోనా నివారణ చేసే పరిశోధనలకు విరాళం అందించేందుకు ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్ దంపతులు ముందుకొచ్చారు.


కరోనా వైరస్ ప్రజల్లో ఐకమత్యం తో పాటు మానవత్వాన్ని కూడా బాగా పెంచింది. అందరూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆ క్రమంలో సినిమావాళ్లు కూడా తమ దాతృత్వ గుణాన్ని చాటు కొంటున్నారు. మొన్నటికి మొన్న అక్షయ్ కుమార్ 25 కోట్లు ప్రధాని షహాయ నిధికి అందించి అందర్నీ విస్మయానికి గురి చేసాడు. ఇపుడు తాజాగా మరో హీరో సినీ కార్మికులను భారీ సంఖ్యలో ఆదుకోవడానికి ముందుకొచ్చాడు .

కేసీఆర్ కరోనా శాపం.. ఫలిస్తుందా?
కరోనా మహమ్మరి విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను ఆగమాగం చేస్తున్న వాళ్లకు కరోనా సోకాలని ముఖ్యమంత్రి కేసీఆర్ శాపం పెట్టారు. ఆదివారం సాయంత్రం కేసీఆర్ నిర్వహించిన మీడియాలో సమావేశంలో ఆయన రోటిన్ కు భిన్నంగా వారికి కరోనా శాపించడం ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో పలువురు చేస్తున్న వికృత ప్రచారం కేసీఆర్ కు కోపం తెప్పించడం వల్లనే ఆయన అలా అని ఉంటారని అర్థంమవుతోంది. వీరిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు.
కరోనాతో ప్రపంచం ఆగమాగం అవుతున్న సమయంలోనూ కొందరు చిల్లర ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లను ఎవరూ పట్టుకోరనే భ్రమలో ఉన్నారని.. అలాంటి వాళ్లను ప్రభుత్వం పట్టుకుంటుందని స్పష్టం చేశారు. వీరికి వందరెట్ల కఠిన శిక్షలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా సోషల్ మీడియాలో దుర్మార్గమైన ప్రచారం చేసే వాళ్లందరికీ కరోనా సోకుతుందన్నారు. ఆ దుర్మార్గులకు ఈ వైరస్ కచ్ఛితంగా సోకాలని శాపించారు. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు..
తెలంగాణలో ఆదివారం నాటికి 70కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. ఇందులో ఒకరు ఇప్పటికే ఒకరు డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. మరో 11మందికి టెస్టుల్లో నెగిటివ్ వచ్చిందని పేర్కొందన్నారు. వీరికి మరోసారి టెస్టు నిర్వహించిన త్వరలోనే డిశ్చార్జ్ చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. ప్రజలు ప్రభుత్వం, వైద్యుల సూచనలు పాటించాలని కోరారు.
ఏప్రిల్ 7వరకు తెలంగాణలో కరోనా కేసులు సున్నాకు చేరే అవకాశం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్ 15వరకు లాక్డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటించి కరోనా వైరస్ దూరంగా ఉండాలని ఆయన సూచించారు. అయితే కేసీఆర్ పెట్టిన శాపం ఈ డిజిటల్ యుగంలో ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే..