రామ్ చరణ్ సరసన ధృవ చిత్రం లో నటించి సూపర్ సక్సెస్ అందుకొన్న రకుల్ ప్రీత్ సింగ్ ఆ తరవాత ఎందుకో వెనుక బడింది. ధృవ చిత్రం అరవాత “విన్నర్ , రా రండోయ్ వేడుక చూద్దాం , స్పై డర్, జయ జానకి నాయక , ఎన్ టి ఆర్ కథానాయకుడు , మన్మధుడు 2 ” వంటి ఆరు చిత్రాలు చేస్తే వాటిలో ఒక్క `రా రండోయ్ వేడుక చూద్దాం ` మాత్రమే యావరేజ్ అయ్యింది . దాంతో అవకాశాలు తగ్గు ముఖం పట్టాయి.
కాగా ఇపుడు ఒక మంచి బ్యానర్లో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. `భీష్మ’ సినిమా విజయంతో మంచి జోరుమీద ఉన్న నితిన్ ఇపుడు మరోసారి అదే బ్యానర్లో ఇంకో చిత్రానికి కమిట్ అయ్యాడు. కాగా ఈ సినిమాలో కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం తమిళం లో రెండు , హిందీలో రెండు సినిమాలు చేస్తోంది .