‘ఆర్ఆర్ఆర్’ మూవీలో మెగాపవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. దర్శక దిగ్గజం రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. ఈ మూవీలో ఎన్టీఆర్ కొమురంభీంగా, అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ కనిపించబోతున్నారు. ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ భామ ఓలివీయా, రాంచరణ్ సరసన బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ మూవీ తర్వాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీలో ఎన్టీఆర్ కు జోడీగా అలియాభట్ ను తీసుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా ఈ భామకు తీసుకునే విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని హారిక-హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ మూవీ మే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీలో తొలుత ఎన్టీఆర్ కు జోడీగా రష్మిక మందన్న, పూజా హెగ్డే పేర్లు ప్రముఖంగా విన్పించాయి. అయితే తాజాగా అలియాభట్ తెరపైకి వచ్చింది.
కరోనా ఎఫెక్ట్ తో ప్రస్తుతం సినిమా షూటింగ్ లన్నీ వాయిదాపడ్డాయి. దీంతో అలియాభట్ ఇంటికే పరిమితమైంది. త్వరలోనే ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్లో పాల్గొననుంది. చెర్రీకి జోడీగా అలియాభట్ కనపించనుంది. ఇందులో చరణ్-అలియాభట్ మధ్య ఓ స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించేందుకు రాజమౌళి ప్లాన్ చేసినట్లు తెల్సింది. ప్రస్తుతం అలియాభట్ బాలీవుడ్లో బీజీగా ఉంది. ప్రస్తుతం షూటింగ్ వాయిదాలతో ఆమె కాల్షీట్లు అటూఇటుగా మారే అవకాశం ఉంది. దీంతో ఎన్టీఆర్ మూవీలో ఆమె నటిస్తుందా? లేదా అనేది మాత్రం ఇప్పుడు చెప్పలేం. దీనిపై చిత్రబృందం త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.