Home Blog Page 8439

అరెస్టులతో జగన్.. కోర్టులతో టీడీపీ నేతలు


పాత ప్రత్యర్థులు వారు.. పచ్చగడ్డి వేసినా వేయకున్నా భగ్గుమంటది. అలాంటి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య యుద్ధం మొదలైంది. వైఎస్ జగన్ గద్దెనెక్కిన ఏడాది తర్వాత వేట మొదలుపెట్టారు. అవినీతిలో దొరికిన టీడీపీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిలను జైలుకు పంపారు. వాట్ నెక్ట్స్ అని అనుకుంటున్న సమయంలోనే టీడీపీ సీనియర్లు అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పలు చిక్కారు. వారి చుట్టూ ఎస్సీ ఎస్టీ కేసులు బిగుసుకుంటున్న వేళ హైకోర్టుకెక్కిన టీడీపీ సీఎం జగన్ కు షాకిచ్చింది.

తాజాగా టీడీపీ నేతలు ముగ్గురు అయ్యన్న, యనమల, నిమ్మకాయలపై నమోదైన ఎస్సీ ఎస్టీ కేసుల్లో అరెస్ట్ ముంగిట హైకోర్టు ఊరటనిచ్చింది. వారికి బెయిల్ మంజూరు చేసింది.

జగన్ నెక్స్ట్ టార్గెట్ ఆ మాజీ మంత్రేనా?

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్ పై ఏపీ హైకోర్టు తాజాగా స్టే ఇచ్చింది. తనపై పెట్టిన నిర్భయ కేసు కొట్టివేయాలంటూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో హైకోర్టులో అయ్యన్నపాత్రుడికి ఊరట లభించింది.

నర్సిపట్నం మున్సిపల్ కమిషనర్ ను దూషించారంటూ అయ్యన్నపాత్రుడిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. అయ్యన్నపై నమోదైన ఈ కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ తప్పదా?

మరో వైపు మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు , నిమ్మకాయల చినరాజప్పలపై నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపైనా హైకోర్టులో విచారణ జరిగింది. వారిని అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలు జారీచేశారు.

టీడీపీలో సీనియర్ నేతలు మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన్నరాజప్పలపై ఇటీవలే ఒక దళిత మహిళ తూర్పుగోదావరి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తన భర్తకు వేరే మహిళను ఇచ్చి వివాహం చేసేందుకు యనమల, చిన్నరాజప్ప ప్రయత్నించారని.. తనను కలవనీయకుండా అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు.

ముందుచూపుతో పరిహారం అందించిన కేసీఆర్..!

దళిత మహిళ ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ లో యనమల, చిన్నరాజప్పపై కేసు నమోదైంది. తన భర్త రాధాకృష్ణతో అనంత లక్ష్మీ అనే మహిళ రెండో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించిందని.. ఇద్దరు మాజీ మంత్రులు యనమల, చిన్నరాజప్పలు ఆమెకు సహాయం చేశారని ఆమె ఫిర్యాదు చేసింది. ఈ ఇద్దరు టీడీపీ నేతల అరెస్ట్ కు రంగం సిద్ధమైన వేళ హైకోర్టులో యనమల, నిమ్మకాలయకు ఊరట లభించింది.

రేపటి నుంచి పూరీ రథయాత్ర.. సుప్రీం గ్రీన్ సిగ్నల్


ఒడిశాలోని పూరి జగన్నాథుడి రథయాత్రకు ప్రపంచస్థాయి గుర్తింపు ఉంది. ఎన్నో శతబ్ధాలుగా పూరి రథయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ప్రతీయేటా నిర్వహించే పూరి జగన్మాథుడి రథయాత్రను ఈ ఏడాది కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జూన్ 23నుంచి రథయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రథయాత్ర నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ ఓ స్వచ్చంధ సంస్థ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన కోర్డు ఈనెల 18న పూరి జగన్నాథ్ రథయాత్ర నిలిపివేయాలంటూ ఆదేశాలిచ్చింది.

ముందుచూపుతో పరిహారం అందించిన కేసీఆర్..!

సుప్రీం తీర్పుపై దేశంలోని పలు హిందూ సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీనిపై కేంద్రం, ఒడిశా ప్రభుత్వం మరోసారి తీర్పును పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశాయి. దీనిపై సుప్రీం త్రిసభ్య ధర్మాసనాన్ని సోమవారం ఏర్పాటు చేసి విచారించింది. అంతకముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రథయాత్రలో ప్రజలు పాల్గొనకుండా నిర్వహిస్తామని న్యాయస్థానానికి హామీ ఇచ్చాయి. ఒకసారి రథయాత్ర ఆపితే 12ఏళ్ల వరకు నిర్వహించరాదనే ఆచారం ఉందని కోర్టుకు విన్నవించాయి.

ఎన్నో శతాబ్దాలుగా పూరీలో దేవదేవుడి రథయాత్ర కొనసాగుతోందని వివరించారు. కరోనా కారణంగా రథయాత్రను ఆపడం సరికాదని న్యాయస్థానానికి ప్రభుత్వం విన్నవించింది. ఇది కోట్లాది మంది విశ్వాసానికి, మనోభావాలకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజలు రథయాత్రలో పాల్గొనకుండా నిర్వహిస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు. ఆలయ పూజారులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాకే రథయాత్రలో పాల్గొనేందుకు అనుమతి ఇస్తామని చెప్పాయి.

తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ తప్పదా?

రథయాత్ర నిర్వహించేందుకు తమకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. దీంతో ధర్మాసనం కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందున రథయాత్రకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది. రథ యాత్రను ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోర్టు ఆదేశించింది. సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగా రథయాత్రను నిర్వహిస్తామని ఒడిశా ప్రభుత్వం న్యాయస్థానానికి నివేదించింది. దీంతో సుప్రీంకోర్టు పూరీ జగన్నాథ్ రథయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈమేరకు న్యాయస్థానం సూచనల మేరకు రేపు సాయంత్రం పూరీ జగన్నాథ్ ప్రారంభం కానుంది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పూరీ రథయాత్ర ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అధికారులు, ఆలయ ధర్మకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని తగు ప్రణాళికలను రూపొందించారు. ఇదిలా ఉంటే భక్తుల్లేకుండా రథయాత్ర ప్రభుత్వం ఎలా నిర్వహిస్తారనేది ఆసక్తిని రేపుతోంది.

ముందుచూపుతో పరిహారం అందించిన కేసీఆర్..!


భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందారు. ఆయనతోపాటు మరో 19మంది అమరులయ్యారు. భారత జవాన్ల మృతిపట్ల యావత్ భారత్ నివాళి అర్పించిన సంగతి తెల్సిందే. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో సూర్యాపేట జిల్లాకు వెళ్లారు. అక్కడి నుంచి విద్యానగర్లోని సంతోష్ బాబు నివాసానికి వెళ్లి సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించారు.

తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ తప్పదా?

ఈ సందర్భంగా కల్నల్ సంతోష్ చిత్రపటానికి పూలమాలతో నివాళ్లర్పించారు. సంతోష్ బాబు కుటుంబ సభ్యులతో మాట్లాడి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కాసేపు సంతోష్ బాబు పిల్లలతో ముచ్చటించారు. అనంతరం సంతోష్ బాబుకు తెలంగాణ ప్రభుత్వం తరుఫున ప్రకటించిన ఐదు కోట్ల రూపాయాల భారీ సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు

సంతోష్ బాబుకు పిల్లల పేరిట 4కోట్ల చెక్కును ఆయన భార్య సంతోషికి అందించారు. అదేవిధంగా కేబీఆర్ పార్క్ సమీపంలో 711గజాల భూమికి సంబంధించిన పత్రాలు, గ్రూప్-1 ర్యాంకు స్థాయి ఉద్యోగానికి సంబంధించిన నియమక పత్రాన్ని సీఎం కేసీఆర్ అందించారు. అదేవిధంగా సంతోష్ బాబు తల్లిదండ్రుల పేరిట ఒక కోటి రూపాయాల చెక్కును అందించారు. డబ్బుల విషయంలో కుటుంబంలో గొడవలు జరుగకుండా ఆయన ముందుచూపుతో వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఇది కేసీఆర్ ముందుచూపు నిదర్శనంగా తెలుస్తోంది.

మోడీ సెల్ఫ్ గోల్ వేసుకున్నాడా?

అనంతరం సంతోష్ బాబు భార్య సంతోషి, తల్లిదండ్రులు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. తమకు ఎలాంటి సాయం కావాలన్నా తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారని వారు తెలిపారు. సంతోష్ బాబుతోపాటు అమరులైన కుటుంబాలకు కూడా త్వరలోనే పరిహారం అందజేస్తాయని సీఎం తెలిపారని చెప్పారు. అదేవిధంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా తమ కుటుంబానికి అన్నివిధలా సహాయసహకారాలు అందిస్తున్నారని చెప్పారు.

వీరజవాను మృతిపట్ల కేసీఆర్ సక్రమంగా వ్యవహరించలేదని గతంలో వచ్చిన విమర్శలకు సీఎం కేసీఆర్ నేడు చెక్ పెట్టినట్లయింది. ఏదిఏమైనా తెలంగాణ ప్రభుత్వం అందించిన భారీసాయం పట్ల సంతోష్ కుటుంబ సభ్యులను ఆదుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

అపాయింట్మెంట్ విషయంలో జగన్ నిర్ణయం ఇదే..!


రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అపాయింట్మెంట్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు దొరకడం లేదని సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీఎం దిద్దుబాటు చర్యలు చేపట్టారు. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీఎం చుట్టూ అదే సామాజిక వర్గానికి చెందిన కోటరీ ఉందని విమర్శలు చేశారు. మరి కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు బయట ఇదే అభిప్రాయం ఉన్నా బయటపడటం లేదు. ముఖ్యమంత్రి జగన్ అపాయింట్మెంట్ దొరకటం ఎమ్మెల్యేలు, ఎంపీలకు గగనంగా ఉందనే వాదనలు ఉన్నాయి.

సొంత పార్టీ ప్రజాప్రతినిధుల విమర్శలకు విరుగుడుగా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రోజుకు పది మంది ఎమ్మెల్యేలకు, ఒక ఎంపీకి అపాయింట్మెంట్ ఇవ్వాలని సీఎం అధికారులను అదేశించారు. ఒక పద్ధతి ప్రకారం అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అవకాశం లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విధంగా పార్టీలో నెలకొన్న అసంతృప్తిని చాలా వరకూ చల్లార్చాలని భావిస్తున్నారు. వెంటనే ఈ విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి పని చేసిన సమయంలో ఎమ్మెల్యేలు ఎవరు అపాయింట్మెంట్ అడిగినా వెంటనే ఇచ్చేవారు, ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గంలో సమస్యలు చెప్పిన వెంటనే తగిన చర్యలు తీసుకునేవారు. అందుకే ఆయన అంటే ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు అభిమానం. అందుకే వైఎస్సార్ వారసుడిగా ఆ విధానాన్నే పాలో అవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఏడాది కాలంగా సుదీర్ఘ కాలం వేచి చూసిన ఎమ్మెల్యేలకు నియోజకవర్గ సమస్యలు విన్నవించుకోవడానికి అవకాశంగా ఆపార్టీ నేతలు చెబుతున్నారు.

‘సూపర్ మచ్చి’ చివ‌రి షెడ్యూల్‌ లో మెగా అల్లుడు !


కల్యాణ్ దేవ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘సూపర్ మచ్చి’. పులి వాసు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి నిరోధంలో భాగంగా విధించిన లాక్‌ డౌన్‌ ను ఎత్తివేశాక ఈ సినిమా షూటింగ్ నేడు రామానాయుడు స్టూడియోస్‌లో పునఃప్రారంభ‌మైంది. హీరో హీరోయిన్లు క‌ల్యాణ్‌దేవ్‌, ర‌చితా రామ్‌తో పాటు ఒక కీల‌క పాత్ర చేస్తున్న అజ‌య్‌ పై కొన్ని ప్ర‌ధాన స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు.

తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ తప్పదా?

ప్ర‌భుత్వ నియ‌మ నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి, అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకుంటూ షూటింగ్ జ‌రుపుతున్నారు. ఈ షెడ్యూల్‌తో సినిమా మొత్తం పూర్త‌వుతుంది. మ‌రోవైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను కూడా నిర్వ‌హిస్తున్నామ‌ని చిత్ర బృందం తెలిపింది.మ్యూజిక్ సెన్సేషన్ తమన్ స్వరాలు కూర్చిన ఐదు పాటలు ‘సూపర్ మచ్చి’ సినిమాకు ఎస్సెట్ కానున్నాయి. నిర్మాతలు మాట్లాడుతూ “తొలి సినిమా ‘విజేత’తోనే నటనతో ఆకట్టుకున్న కల్యాణ్ దేవ్ ‘సూపర్ మచ్చి’లో మరింత చక్కటి పర్ఫార్మెన్సుతో అలరిస్తారు. అటు మాస్ ఆడియెన్సుకీ, ఇటు ఫ్యామిలీ ఆడియెన్సుకీ ఆయన క్యారెక్టర్ కనెక్టవుతుంది. సినిమాకు కన్నడ హీరోయిన్ రచితా రామ్ ప్లస్సవుతుంది. తమన్ మ్యూజిక్ హైలైట్ అవుతుంది. ఇప్పటికి తీసిన పాటలు చాలా అందంగా వచ్చాయి.

జగన్ నెక్స్ట్ టార్గెట్ ఆ మాజీ మంత్రేనా?

‘సూపర్ మచ్చి’ టైటిల్ సాంగ్ బ్రహ్మాండంగా వచ్చింది. ఆడియో బ్లాక్ బస్టర్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కు ఈ సినిమాతో మంచి సక్సెస్ వస్తుంది. రాజేంద్రప్రసాద్, నరేష్ అందించే కామెడీ అమితంగా అలరిస్తుంది. హీరోకి సపోర్టింగ్ గా నరేష్ గారి క్యారెక్టర్ ఉంటుంది. వాళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు మంచి వినోదాన్ని అందిస్తాయి. అలాగే రాజేంద్రప్రసాద్, హీరో కాంబినేషన్ సీన్లు కూడా ఆకట్టుకుంటాయి. ఇది లవ్ స్టోరీ మిక్స్ చేసిన చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్‌” అని చెప్పారు.

మెగా అభిమానుల కోసం మెగా కాంబినేషన్ !


క్రియేటివ్ డైరెక్టర్ త్రివిక్రమ్ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో సినిమా వస్తోందని మెగా ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఆశగా ఎదురుచూస్తున్నారు, ఇప్పటికే త్రివిక్రమ్ కనబడ్డ ప్రతి ఆడియో ఫంక్షన్ లో మెగాస్టార్ తో సినిమా చేయమని డిమాండ్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ డ్రీమ్ కాంబినేషన్స్ లో ఈ కాంబినేషన్ ఒకటి. పైగా ఈ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందుకే ఎప్పటికైనా త్రివిక్రమ్ తో చిరు సినిమా చేస్తే చూడాలనేది మెగా అభిమానులు ఎప్పటినుండో కోరుకుంటున్న కోరిక. మొత్తానికి ఆ కోరిక భవిష్యత్తులో తీరేలా ఉంది.

చిరు పవన్ ల మధ్య అగ్రతాంబూలమే అడ్డు..!

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తోన్న సినిమా తరువాత, త్రివిక్రమ్ చిరుతో సినిమా చేసే అవకాశం కనిపిస్తోంది. ఎప్పుడో గతంలోనే త్రివిక్రమ్ చిరుకు ఒక లైన్ కూడా చెప్పారు. పూర్తి ఫుల్ కమర్షియల్ ఎంటెర్టైనర్ లా త్రివిక్రమ్ మెగాస్టార్ తో సినిమాని చేస్తాడట. పైగా త్రివిక్రమ్ సినిమా అంటే.. ఎమోషన్ అండ్ యాక్షన్ తో పాటు హీరో డిసెంట్ కామెడీ చేయాల్సిందే. ఇక ఎలాగూ హాస్యాన్ని పండించడంలో చిరు నైపుణ్యం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ తప్పదా?

అలాంటి ఈ ఇద్దరి కలయికలో ఎంటెర్టైనర్ వస్తే. అది ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించడానికే గొప్ప థ్రిల్ గా అనిపిస్తోంది. ఇకపోతే మెగాస్టార్ ప్రస్తుతం క్లాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ సినిమా కోసం స్క్రిప్ట్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు.

RRR ట్రయల్ షూట్.. డేట్ ఫిక్స్ చేసిన జక్కన్న


కరోనా ఎఫెక్ట్ సినీ పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీసింది. ఈ మహమ్మరి కారణంగా jదేశంలో, రాష్ట్రంలో లాక్డౌన్ విధించారు. దీంతో సినిమా షూటింగులు, థియేటర్లు మూతపడగా సెలబ్రెటీలంతా ఇంటికే పరిమితయ్యారు. షూటింగులు నిలిచిపోవడంతో సినీ కార్మికులు రోజువారి ఉపాధిలేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. వీరిని ఆదుకునేందుకు టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సీసీసీ మనకోసం ఛారిటీని ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటున్నారు. సీసీసీకి సినీ ప్రముఖులు భారీగా విరాళాలు అందించడంతో మూడునెలలుగా కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది.

జగన్ టార్గెట్ ఇప్పుడు చంద్రబాబు. ఆ రెండు పత్రికలు

ఇదిలా ఉంటే సినీపెద్దలు సినిమా షూటింగులు ప్రారంభించేలా తెలుగు రాష్ట్రాల సీఎంలను కలిశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిలు షూటింగులు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చారు. ప్రభుత్వం నిబంధనల మేరకు షూటింగులను చేసుకోవాలని సూచించారు. ఈనేపథ్యంలో ఇప్పటికే టీవీ షూటింగులు ప్రారంభమయ్యాయి. అయితే సినిమా షూటింగులు మాత్రం ప్రారంభం కాకపోవడం గమనార్హం. దర్శకులు సినిమాలు చేసేందుకు ముందుకొస్తున్న స్టార్ హీరోహీరోయిన్లు కొద్దిరోజులు వేచిచూసే ధోరణిలో ఉండటంతో టాలీవుడ్లో ఇంకా షూటింగుల సందడి మొదలుకాలేదని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి ట్రయల్ షూట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో షూటింగ్ ప్రారంభంకాలేదని తెలుస్తోంది. తాజాగా ఆర్ఆర్ఆర్ షూటింగులకు అన్ని అనుమతులు రావడంతో ఈనెల 25న ట్రయల్ షూట్ కు దర్శకుడు రాజమౌళి అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ శివార్లలోని గండిపేటలో రెండు రోజుల పాటు ట్రయల్ షూట్ చేయనున్నాడు.

చిరు పవన్ ల మధ్య అగ్రతాంబూలమే అడ్డు..!

ఈ ట్రయల్ షూట్లో రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇతర నటీనటులతో షూటింగ్ చేయనున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు తక్కువ సిబ్బందితో షూటింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎవరెవరూ ఏయే డిపార్ట్మెంట్లలో పని చేయాలో రాజమౌళి ప్లాన్ చేశారట. అదేవిధంగా సెట్లో థర్మామీటర్లు, పీపీఈ కిట్లు, శానిటైజర్లు కూడా అందుబాటులో ఉంచుతున్నారట. ఈ ట్రయల్ షూట్లో మంచి రిజల్ట్స్ వస్తే.. రెగ్యులర్ షూటింగ్ కొనసాగించనున్నారు. లేకుంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదని ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తుంది.

తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ తప్పదా?


తెలంగాణలో కరోనా మహ్మమర్మి పంజా విసురుతోంది. కొద్దిరోజులుగా తెలంగాణ కేసులు భారీగా పెరగడమేగానీ తగ్గుముఖం పట్టడం లేదు. రాష్ట్రంలో లాక్డౌన్ కఠినంగా అమలు చేసినప్పుడు కొంతమేరకు కరోనా కేసులు కట్టడిలోనే ఉండేవి. ఎప్పుడైతే లాక్డౌన్ సడలింపులు రాష్ట్రంలో భారీగా అమలయ్యే నాటి నుంచి కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. రోజుకు పదుల సంఖ్యల్లో ఉండే కేసులు ప్రస్తుతం 500లపైనే నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.

జగన్ నెక్స్ట్ టార్గెట్ ఆ మాజీ మంత్రేనా?

గత మూడురోజులుగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం 3297 టెస్టులు చేయగా ఆదివారం 730మందికి పాజిటివ్ వచ్చింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 659మంది కరోనా పాజిటివ్ రావడం గమనార్హం. గురువారం 3188 టెస్టులు చేయగా 546మందికి, జూన్ 19న 2477మందిని టెస్టు చేయగా 499పాజిటివ్‌గా తేలింది. కరోనా టెస్టుల సంఖ్య పెంచడంతో కొత్తగా భారీగా కేసులు నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

తెలంగాణలో గడిచిన 21 రోజుల్లో 5,104 పాజిటివ్ కేసులు వచ్చాయి. మార్చి 22 నుంచి మే 31వరకు కొనసాగిన లాక్డౌన్లో 2,676మాత్రమే నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో అన్‌లాక్‌ మొదలైన తర్వాత పరిస్థితి‌ కరోనా కేసుల విజృంభణ మొదలైంది. గడిచిన మూడు రోజులుగా సగటున రోజుకు 500లపైబడి కేసులు నమోదవుతోన్నాయి. హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో ఈ ప్రాంతాల్లోనూ టెస్ట్‌లను పెంచారు.

జగన్ టార్గెట్ ఇప్పుడు చంద్రబాబు. ఆ రెండు పత్రికలు

ఇదిలా తమిళనాడులోనూ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండగా ఆ రాష్ట్రంలో మరోసారి లాక్డౌన్ విధించారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ విధించారు. మరోవైపు ఏపీలోనూ కరోనా విజృంభిస్తున్న మూడు జిల్లాలో లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేయాలని నిపుణులు కోరుతున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

రాజధాని నిర్మాణాలపై మంత్రి బొత్స సమీక్ష ఎందుకో..!


రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వివిధ గృహ సముదాయాలను పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు. మంత్రి పర్యటన రాజధానిలో ఉత్కంఠ రేపింది. మంత్రి బొత్స సీఆర్డీఏ అధికారులతో కలిసి నేలపాడు, తుళ్లూరు, రాయపూడి ఏరియాల్లో అసంపూర్ణంగా వున్న గృహ సముదాయాల నిర్మాణాలను పరిశీలించారు. కరోనా ఉధృతి నేపథ్యంలో రాజధాని మార్పు అంశంపై ఇప్పుడు రాజధాని తరలింపు అంశం పక్కన పెట్టినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు, మంత్రి బొత్స నిర్మాణం నిలిచి పోయిన గృహ సముదాయాలను పరిశీలించడం రాజధాని వాసుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.

జగన్ టార్గెట్ ఇప్పుడు చంద్రబాబు. ఆ రెండు పత్రికలు

గృహ సముదాయాల పరిశీలన పూర్తయినా అనంతరం సీఆర్డీఏ అధికారులు, గృహ సముదాయాల కాంట్రాక్టర్లతో సమావేశం అవుతారని సీఆర్డీఏ అధికారులు తెలిపారు. రాజధానిని స్మశానం అని కామెంట్ చేసిన మంత్రి బొత్స అమరావతిలో పర్యటిస్తూ ఇప్పటి వరకు జరిగిన నిర్మాణాలపై ఆరా తీస్తున్నారు. ఈ సమీక్షకు ప్రాధాన్యత సంతరించికుంది. రాజధాని నిర్మాణంలో జరిగిన అవినీతిని గుర్తించేందుకే మంత్రి ఈ సమావేశం నిర్వహిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి భాద్యులైన వారిని అరెస్టు చేసే ప్రక్రియను వైసీపీ ప్రభుత్వం ప్రారంభించింది.

రాజధాని తరలింపుపై ప్రభుత్వం వెనక్కి?

రాజధాని అమరావతిలో పనులను సీఆర్డీఏ చైర్మన్ ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యవేక్షించగా, పురపాలక శాఖ మంత్రిగా నారాయణ అప్పట్లో పని చేశారు. రాజధాని వ్యవహారాలను మొత్తం సీఎం పర్యవేక్షణలో ఆయనే నిర్వహించారు. కేవలం నిర్మాణ పనులే కాకుండా, రాజధానిలో వందల ఎకరాల భూమిని వివిధ సంస్థలకు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల వద్ద అధిక మొత్తంలో డబ్బు వసూలు చేసిన అప్పటి ప్రభుత్వం, ప్రవేటు సంస్థలకు మాత్రం నామ మాత్రపు ధరకే భూములు కేటాయించింది. ఈ అంశంపైన అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సమీక్షలు టిడిపి వర్గాల్లో ఆందోళన నెలకొంది.

నయనతార, విఘ్నేశ్‌కు కరోనా…?


కరోనా వైరస్‌ దేశాన్ని కుదిపేస్తోంది. ప్రతి ఒక్కరి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. సామాన్యులకే కాదు సెలబ్రిటీలను కూడా హడలెత్తిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు సినిమా రంగం బాగా దెబ్బతిన్నది. షూటింగ్స్‌ ఆగిపోవడంతో పలువురు ఉపాధి కోల్పోయారు. ఇంటి పట్టునే ఉన్నప్పటికీ పలువురు సినీ ప్రముఖులకు కరోనా సోకింది. ఈ వైరస్‌ వల్ల బాలీవుడ్‌లో కొంత మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా దక్షిణాది చిత్ర పరిశ్రమ పెద్దలు సైతం వైరస్‌ బారిన పడుతున్నారు. ప్రముఖ తెలుగు నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఆయన తన ఇంట్లోనే ఉండి చికిత్స చేసుకుంటారు.

జగన్ టార్గెట్ ఇప్పుడు చంద్రబాబు. ఆ రెండు పత్రికలు

మరోవైపు చెన్నైలో కోరలు చాస్తున్న కరోనా కోలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురికి సోకింది. లేడీ సూపర్ స్టార్ నయనతార, ఆమె ప్రియుడు ప్రముఖ నిర్మాత విఘ్నేశ్‌ శివన్‌ కూడా కరోనా బారిన పడినట్టు వార్తలు రావడం సంచలనం సృష్టించింది. కొన్ని కొత్త సినిమాలకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనుల కోసం శివన్‌ ఇటీవల కొంత మంది సాంకేతిక నిపుణులను కలిశాడు. ఆయన కలిసిన వ్యక్తుల్లో ఒకరికి కరోనా పాటిజివ్‌ అని తేలింది. దాంతో విఘ్నేశ్‌కు కూడా పరీక్ష నిర్వహించగా.. వైరస్‌ నిర్దారణ అయినట్టు వార్తలు వచ్చాయి. అతను.. నయన్‌ను తరచూ కలుస్తుంటారు కాబట్టి ఆమెకు కూడా కరోనా సోకిందని కోలీవుడ్‌లో తెగ ప్రచార జరిగింది. ఈ ప్రేమ జంట త్వరగా కోలుకోవాలని అభిమానులు పూజలు, ప్రార్థనలు కూడా ప్రారంభించారు. . ఈ విషయం నయన్‌, శివన్‌ తెలియడంతో వాళ్లు స్పందించారు. తమకు కరోనా సోకలేదని, ఇవన్నీ ఒట్టి పుకార్లే అని కొట్టిపారేశారు. తాము సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నామని పీఆర్ టీమ్‌ ద్వారా ప్రకటన ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

జగన్ నెక్స్ట్ టార్గెట్ ఆ మాజీ మంత్రేనా?

నయనతార –శివన్ ఓ గుళ్లో పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. శివన్ ఇంట్లో పెళ్లి ఒత్తిడి ఎక్కువగా ఉన్న కారణంగా నయనతార కూడా పెళ్లి ప్రపోజల్ కి ఒప్పుకుంది అనే టాక్ నడిచింది. అయితే, రేపో మాపో పెళ్లి అనే వార్త హల్‌చల్‌ చేస్తుండగానే వాళ్లకు కరోనా వచ్చిందని పుకార్లు గుప్పుమనడం గమనార్హం.

అమృత కామెంట్స్ పై ఆర్జీవీ స్పందన..


ఫాదర్స్ డే సందర్భంగా సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ‘మర్డర్’ అనే టైటిల్ ఓ మూవీని అనౌన్స్‌ చేశారు. కుటుంబ కథా చిత్రం అనే ట్యాగ్ ‌లైన్‌, నిజ జీవిత కథ అని చెబుతూ ఓ పోస్టర్ ను రిలీజ్‌ చేశారు. పోస్టర్ విడుదల చేశారు. అప్పట్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ‘ప్రణయ్‌’ హత్యోదంతం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నట్లు ట్విట్టర్లో ప్రకటించాడు. అనంతరం వర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమృత పేరుతో సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు ట్రెండ్‌ అవుతున్నాయి. దీనిపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్లు చేశాడు.

జగన్ టార్గెట్ ఇప్పుడు చంద్రబాబు. ఆ రెండు పత్రికలు

‘మర్డర్ చిత్రం మూడు నైతిక సందిగ్ధతల మధ్య నడుస్తుంది. 1. తండ్రి తన బిడ్డపై నియంత్రణను పరిమితం చేయడం 2. ఒక కుమార్తె తనకు ఏది మంచిదో తెలియకపోయినా దాన్ని విస్మరించాలా? 3. వేరొకరి జీవితాన్ని మెరుగుపర్చడానికి ఒకరి జీవితాన్ని బలి తీసుకోవడాన్ని సమర్థించవచ్చా? అనే అంశాలపై ఉంటుంది. ఈ మూవీ గురించి అమృత చేసినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వ్యాఖ్యలపై నేను సమాధానం చెప్పాలని అనుకుంటున్నా. తాను, తన తండ్రి కథతో నేను సినిమా తీస్తున్నానని తెలుసుకుని ఆమె ఆత్మహత్య చేసుకోవాలని భావించారట. ఇది అమృతే రాసిందనుకున్నా లేదా ఓ పనిలేని వాడు రాసినా, నేను ఈ మూవీలో ఏం చూపించబోతున్నానన్న విషయంలో అనవసర ఆందోళనలతో ఉన్న వారి పట్ల స్పందించడం, వారి అనుమానాలను నివృత్తి చేయడం నా బాధ్యత అని భావిస్తున్నా.

మొట్ట మొదటగా.. మర్డర్ అనేది ఒక నిజమైన కథపై ఆధారపడినదని పోస్టర్ పైనేస్పష్టం చేశా. అంతేకాని ఇదే నిజమైన కథ అని నేను చెప్పుకోలేదు. అలాగే, నా చిత్రానికి సంంధించిన న్యూస్‌ కొన్నేళ్లుగా ప్రజాక్షేత్రంలో ఉంది. ఇందులో ఇన్వాల్వ్‌ అయిన వాళ్లు దాన్ని అంగీకరించారు కూడా. ‘మర్డర్’కు సంబంధించిన నా పాయింట్‌ను వివరించడానికి నేను ఉపయోగించిన నిజమైన ఫోటోలు ఇంటర్నెట్‌లో విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. అవి నాకు ఒకరు ఇచ్చినవు కావు, అందులో రహస్యం ఏమీ లేదు కాబట్టి ఒకరి నమ్మకాన్ని నేను వమ్ము చేయలేదు.

ఏపీ ఈఎస్ఐ స్కామ్ కు తెలంగాణకు సంబంధం ఏంటీ?

‘మర్డర్’కు సంబంధించి ఏది నిజమైన కథ అనేదానిపై అనేక అభిప్రాయాలు, భిన్న కోణాలు ఉన్నాయి. నా కోణం ఏంటో ఈ మూవీ రిలీజ్‌ అయిన తర్వాతే తెలుస్తుంది. కాబట్టి ముందుగానే కథనాన్ని ఊహించుకోవడం తొందరపాటు, అవివేకం అవుతుంది. కాబట్టి ఓ జర్నలిస్ట్ వార్త రాసినా, ఓ విచారణ అధికారి నివేదించినా, ఎవరైనా అనుమానాలు వ్యక్తం చేసినా, అది వారివారి ఆలోచనల మేరకు ఉంటుంది. ఓ ఫిల్మ్ మేకర్ గా ‘మర్డర్’ విషయంలో నా ఆలోచన నాది. నా స్వీయ ఆలోచనతో సినిమా తీసే హక్కు నాకుంది. అలాగే, ఈ వాస్తవ కథలో పాలుపంచుకున్న చెడ్డ వ్యక్తులను నేను హైలైట్‌ చేస్తానని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే ఈ లోకంలో ఎవ్వరూ చెడ్డవారు కాదు. కొన్ని చెడు పరిస్థితులు, వ్యక్తులు మాత్రమే వారిని చెడుగా ప్రవర్తించేలా చేస్తాయని నేను బలంగా నమ్ముంతా. ‘మర్డర్’లో నేను అన్వేషించబోయేది అదే. కాబట్టి సోషల్‌ మీడియాలో కనిపిస్తున్న కామెంట్లు అమృతవే అయినా.. మరెవరు రాసినా, నా ఫైనల్ మెసేజ్ ఇదే. ఎంతో బాధను అనుభవించిన వారి పట్ల నాకెంతో గౌరవం, సానుభూతి ఉన్నాయి. ఆ బాధను ‘మర్డర్’లో గౌరవిచడంలో నా చిత్తశుద్ధిని మీరు చూస్తారు’ అని ఆర్జీవీ స్పష్టం చేశారు.

మరో భారీ ఆఫర్ కొట్టేసిన రష్మిక!


రష్మిక మందన్న. తెలుగులో ఇప్పుడు సెన్సేషనల్‌ హీరోయిన్. ఛలో అనే చిన్న మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ గీత గోవిందం చిత్రంతో ఇక్కడ పాతుకుపోయింది. వరుస అవకాశాలు రావడం, చేసిన సినిమాలన్నీ విజయాలు సాధిస్తుండడంతో ఆమె కెరీర్ గ్రాఫ్‌ అమాంతం పెరిగింది. ఒక రకంగా ఇప్పుడు టాలీవుడ్ లో రష్మిక టైమ్‌ నడుస్తోంది. రష్మిక నటించిన గత రెండు చిత్రాలు సరిలేరు నీకెవ్వరు, భీష్మ.. సూపర్ హిట్స్‌ కావడంతో స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్ల కన్ను ఆమెపై పడింది. ఈ క్రమంలో సుకుమార్-, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘పుష్ప’లో అవకాశం ఆమెను వరించింది. ఈ చిత్రంలో రష్మిక ఫస్ట్‌ టైమ్‌ డిగ్లామర్ రోల్‌ పోషిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు తన పాత్రుకు తానే డబ్బింగ్‌ చెప్పుకోనుందట. ఫారెస్ట్‌ బ్యాక్‌ డ్రాప్‌లో గంధం చక్కల స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే ‘పుష్ప’ కోసం కొత్త యాస కూడా నేర్చుకుంటోందంట.

జగన్ నెక్స్ట్ టార్గెట్ ఆ మాజీ మంత్రేనా?

మరోవైపు తన మాతృక కన్నడలో ‘పొగరు’ సినిమాలో ధృవ సర్జతో కలిసి నటిస్తోందామె. అలాగే, కార్తి సరసన ‘సుల్తాన్‌’తో తమిళ్‌లో అడుగు పెట్టనుంది. ఈ మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. తెలుగు, కన్నడ, తమిళ్‌ మూడు భాషల్లో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న రష్మికను మరో భారీ ఆఫర్ వరించిందట. తమిళ సూపర్ స్టార్ విజయ్‌ 65వ మూవీలో హీరోయిన్‌ రష్మికనే అనే వార్త కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి విజయ్‌ గత చిత్రం ‘మాస్టర్’లోనే ఆమె నటించాల్సింది. కానీ ఏవో కారణాల వల్ల అది కుదరలేదు. కానీ, అరచేతిలో అదృష్ట రేఖ ఎక్కువే ఉన్న మందన్నను వెతుక్కుంటూ మరో ప్రాజెక్ట్‌ వచ్చింది. పైగా ఇది మామూలు సినిమా కాదు. మురుగదాస్ – విజయ్ కాంబోలో భారీ విజయం సాధించిన తుపాకీకి సీక్వెల్‌ అట. ఫస్ట్‌ పార్ట్‌లో నటించిన కాజల్ అగర్వాల్‌నే ఎంచుకున్నారని మొదట వార్తలు వచ్చినా ఇప్పుడు మందన్న వైపే మురుగదాస్‌ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఈ వార్త నిజమైతే కోలీవుడ్‌లో కూడా రష్మిక హవా మొదలవడం ఖాయమే.

జగన్ టార్గెట్ ఇప్పుడు చంద్రబాబు. ఆ రెండు పత్రికలు


అవును.. ఏపీ సీఎం జగన్ సరిగ్గా ఏడాది పాలన ముగిశాక తన ప్రతీకారం మొదలుపెట్టాడు. ఇప్పటికే తన ప్రత్యర్థులైన టీడీపీ నేతలు ఇద్దరిని అరెస్ట్ చేయించి జైలుకు పంపిన జగన్ ఇప్పుడు చంద్రబాబు కాళ్ల కిందకు నీళ్లు తెచ్చే పనిలో బిజీగా ఉన్నారు. అయితే నాటి ప్రతిపక్ష నేతల తప్పులే వారికి శిక్ష పడేలా చేస్తుండడం కూడా జగన్ పనిని సులువు చేస్తోంది.

జగన్ నెక్స్ట్ టార్గెట్ ఆ మాజీ మంత్రేనా?

అయితే నేతలు ఎప్పుడూ ప్రతీకారాలకు రెడీగానే ఉంటారు. హైకోర్టులకు ఎక్కి తమపై కేసులను నమోదు చేయకుండా.. ముందస్తు బెయిల్స్ తో కాలం గడుపుతారు. అందుకే జగన్ పక్కా ఆధారాలు సేకరించడానికి సంవత్సరం టైం తీసుకున్నారు. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిలకు బెయిల్ దొరక్కుండా వారికి కటకటాలను లెక్కించేలా చేస్తున్నారు.

వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉండగా ఆ రెండు పత్రికలు టీడీపీకి సపోర్టుగా చేసిన రాజకీయం అంతా ఇంతాకాదు. అది జగన్ ఎప్పుడూ మరిచిపోలేదు. కోడికత్తి నుంచి మొదలుపెడితే వైఎస్ వివేకా హత్యవరకు జగన్ ను ఆ రెండు పత్రికలు ఎంత అభాసుపాలు చేయాలో అంతా చేశాయి. ఎన్నోసార్లు జగన్ జైలు జీవితాన్ని దెప్పిపొడిచాయి. ఆయనపై దారుణంగా దుష్ప్రచారం చేశాయి. నాడు అధికారంలోని లేని జగన్ ఆ రెండు పత్రికలను కాచుకోలేదు.

రాజధాని తరలింపుపై ప్రభుత్వం వెనక్కి?

అయితే నేడు సీఎం జగన్ గా మారాడు. చేతిలో అధికారం ఉంది. దీంతో కొరఢా ఝలిపిస్తున్నాడు. జగన్ జూలు విదిల్చినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే తాజాగా చంద్రబాబుతోపాటు ఆయనకు సపోర్టు చేసే ఆ రెండు పత్రికలకు జగన్ ప్రభుత్వం నోటీసులు పంపింది.. బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కేసులు కూడా పెడుతామని స్పష్టం చేసింది. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని.. పౌరసరఫరాల శాఖ బియ్యం పంపిణీ కోసం అవసరమయ్యే సంచులను జగన్ కంపెనీ నుంచి ఎలాంటి టెండర్ లేకుండా కొనుగోలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. దాన్ని ఆ రెండు పత్రికలు ప్రచురించడమే జగన్ ఆగ్రహానికి కారణమైందట.. అందులో జగన్ పవర్ ప్రాజెక్టు కూడా ఉండడంతో ఆయనపై వ్యతిరేకంగా కథనాలను ఆ పత్రికలు వండివర్చాయి. ప్రభుత్వ వివరణను చిన్నగా మూలకు తొక్కేశాయి. దీంతో అపవాదు జగన్ మీద పడింది.

చిరు పవన్ ల మధ్య అగ్రతాంబూలమే అడ్డు..!

అందుకే ఇక ఉపక్షేంచకూడదని నిర్ణయించుకున్న సీఎం జగన్.. తాజాగా చంద్రబాబుతోపాటు ఆ రెండు పత్రికలకు నోటీసులు పంపారు. 15 రోజుల్లోగా భేషరతుగా క్షమాపణ చెప్పాలని..లేని పక్షంలో పరువు నష్టం దావా వేస్తామని.. సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాల కృష్ణ ద్వివేది ప్రభుత్వం తరుపున స్పష్టం చేశారు. ఖండనను ఏపీ ప్రభుత్వం ప్రచురించినా అది సంతృప్తికరంగా లేదని..మరో పత్రిక అసలు ఖండనను కూడా ప్రచురించలేదన్నారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్న ఆ రెండు పత్రికలను వదిలిపెట్టేది లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. సంచుల కొనుగోలు కోసం గత ఏడాది డిసెంబర్ 3న ఈనాడుతోపాటు టైమ్స్ ఆఫ్ ఇండియాలో టెండర్ ప్రకటన ఇచ్చామని పక్కాగానే టెండర్ నిర్వహించామని.. కొనుగోలు చేశామని ద్వివేది చెప్పారు. టెండర్లు లేకుండానే సొంత సంస్థ నుంచి కొన్నారని పత్రికలు రాయడం దుర్మార్గమన్నారు.

ఇలా చంద్రబాబు అధికారం కోల్పోయినా ఆ రెండు పత్రికలు జోష్ మాత్రం తగ్గడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబుకు బాకా ఊదడం.. జగన్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే చర్యలకు దిగుతూనే ఉన్నాయి. అందుకే ఇక ఉపక్షించరాదని జగన్ డిసైడ్ అయ్యారు. ఆ రెండు పత్రికలతోపాటు చంద్రబాబుకు నోటీసులు పంపారు. సివిల్, క్రిమినల్ కేసులకు రంగం సిద్ధం చేశారు. దీంతో జగన్ కౌంట్ డౌన్ స్ట్రాట్ చేసినట్టే కనిపిస్తోంది.

చైనాపై రెండు అస్త్రాలు.. భారత్ భారీ యాక్షన్ ప్లాన్


కర్ర విరగకుండా పామును (చైనా)ను చంపేయాలి? ఎలా? ఎలా అని ఆలోచించిన కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఇప్పుడు చైనాతో ఫైట్ కు భారీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్టు సమాచారం. ఓవైపు చైనాతో యుద్ధం వస్తే కాచుకోవడం పోరాడడమే కాదు.. ఏకంగా చైనాను ఆర్థికంగా దెబ్బతీయడానికి రెడీ కావడం కూడా భారత్ వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. ఇందుకోసం చైనా దురాక్రమణతో ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న దాని పొరుగుదేశం జపాన్ తోపాటు ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, యూరప్ దేశాల సాయం తీసుకునేందుకు భారత్ ప్లాన్ చేస్తున్నట్టు విశ్వసనీయం సమాచారం.

మోడీ సెల్ఫ్ గోల్ వేసుకున్నాడా?

చైనా ఇప్పటికే మన చుట్టుపక్కల ఉన్న పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలను మచ్చిక చేసుకొని భారత్ పైకి ఎగదోస్తోంది. తాజాగా మన మిత్రదేశం నేపాల్ కూడా మనకు వ్యతిరేకంగా మారింది. ఈ క్రమంలో భారత్ ఎట్టి పరిస్థితుల్లో చైనాకు లొంగకూడదని డిసైడ్ అయ్యింది. 20 మంది భారత సైనికులను చంపిన చైనాపై ప్రతీకారానికి రెడీ అవుతోంది.

ఈ క్రమంలో భారత్ కొనుగోలు చేసినా ఇంకా డెలివరీ కానీ ప్రపంచంలోనే నంబర్ 1 యుద్ధ విమానాలు ‘రాఫెల్’ను ఇవ్వాలని ఫ్రాన్స్ ను తాజాగా భారత్ కోరిందట.. తయారీ దశలో ఉన్న రాఫెల్స్ స్థానంలో ఫ్రాన్స్ దేశ సైన్యం వద్ద ఉన్న రాఫెల్స్ అత్యవసర యుద్ధం వస్తే ఇవ్వడానికి ఫ్రాన్స్ ఒప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. తమ దగ్గరున్న 35 రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ కోరితే ఇస్తామని ఫ్రాన్స్ చెప్పిందట.. ఇక ఆస్ట్రేలియా, జపాన్ లు కూడా చైనా దక్షిణ చైనా సముద్రంపై చేస్తున్న అరాచకాలకు చెక్ పెట్టడానికి భారత్ కు సాయం చేయడానికి రెడీ అయ్యాయి.

జగన్ నెక్స్ట్ టార్గెట్ ఆ మాజీ మంత్రేనా?

ఇక చైనాపై కోపంతో రగిలిపోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అమెరికన్ ఇంటెలిజెన్స్ తో భారత్ కు సాయం చేయడానికి చూస్తున్నాడట.. మోడీ-ట్రంప్ మధ్య స్నేహంతో అమెరికా కూడా భారత్ కు సపోర్టుగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. కరోనాను ప్రపంచానికి అంటించిన చైనా ఆగడాలకు చెక్ పెట్టాలంటే భారత్ కు అందరూ సపోర్ట్ చేయాలని పాశ్చాత్య దేశాలన్ని రెడీ అయ్యాయని తెలిసింది.

ఇక భారత్ కూడా సర్వ ప్రయత్నాలు చేస్తూ అన్నింటికి రెడీ అవుతోంది. చైనాను రెండు రకాలుగా దెబ్బకొట్టాలని తాజాగా భారత్ రెడీ అయ్యింది. యుద్ధానికి సిద్ధమవుతూనే చైనా వస్తువుల నిషేధం దిశగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. దేశమంతా చైనా వస్తువులు, యాప్స్ నిషేధించాలన్న డిమాండ్ పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకుంది.

చిరు పవన్ ల మధ్య అగ్రతాంబూలమే అడ్డు..!

తాజాగా చైనాతో ఉద్రిక్తత నేపథ్యంలో యుద్ధ సన్నాహాల కోసం 500 కోట్ల అత్యవసర నిధిని ఆయుధాల కొనుగోలుకు కేటాయిస్తూ భారత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక తాజాగా చైనా ఉత్పత్తుల దిగుమతుల జాబితాను సమర్పించాలంటూ ఇండియన్ కార్పొరేట్లకు ఆదేశాలను జారీ చేసింది.

మొత్తం భారత్ కు చైనా నుంచి దిగుమతుల వాటా 14శాతం ఉంది. మొబైల్స్, టెలికాం, పవర్, ప్లాస్టిక్ , ఫార్మా ముడిసరుకులను చైనా నుంచి భారత్ కు దిగుమతి అవుతున్నాయి. భారత ప్రభుత్వ ఆదేశాలతో ఈ జాబితాను అధికారులు రెడీ చేశారు. వీటన్నింటని వెంటనే దేశంలో ఉత్పత్తి చేయడానికి స్వావలంబన సాధించడానికి ప్రధాని కార్యాలయం కార్పొరేట్లతో కీలక సమావేశం నిర్వహించింది. ఈ పరిణామాలతో చైనా వస్తువుల బహిష్కరణ దిశగానే కేంద్రం అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. దీంతోపాటు ఆయుధాల కొనుగోలుతో అటు యుద్ధానికి రెడీ అవుతోంది. ఇలా భారత్ ఏకంగా చైనాతో డూ ఆర్ డై తేల్చుకోవడానికి రెడీ కావడం ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని వేడెక్కిస్తోంది.

-ఎన్నం

ఒక్కసారి రథయాత్ర ఆపితే.. అప్పటివరకు ఛాన్స్ లేదట..!


పూరి జగన్నాథుడి రథయాత్రకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ రథయాత్రకు ఎన్నోఏళ్ల ప్రాచీన చరిత్ర ఉంది. ఒడిశాలో ఎన్నో ఏళ్లుగా పూరి రథయాత్రం లక్షలాది భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ప్రతీయేటా ఈ రథయాత్రను 10నుంచి 12రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. దీనిని తిలకించేందుకు దేశవిదేశాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. జూన్ 23నుంచి రథయాత్రను నిర్వహించే ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కరోనా నేపథ్యంలో ఓ స్వచ్చంధ సంస్థ రథయాత్రను రద్దుచేయాలని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయడంతో విచారించిన న్యాయస్థానం రథయాత్ర బ్రేక్ వేసిన సంగతి తెల్సిందే.

మరోసారి విచారించనున్న ధర్మాసనం..
సుప్రీం తీర్పుపై దేశంలోని హిందూ సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈనేపథ్యంలో సుప్రీం ఇచ్చిన తీర్పును మరోసారి పరిశీలించాలని ఒడిశా ప్రభుత్వం, కేంద్రం న్యాయస్థానాన్ని అభ్యర్థించాయి. దీనిపై సోమవారం జస్టిస్ అరుణ మిశ్రా విచారణ చేపట్టి త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేయాలని సూచించారు. దీనికి చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే అంగీకరించి త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేశారు. అంతకముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రథయాత్రలో ప్రజలు పాల్గొనకుండా నిర్వహిస్తామని న్యాయస్థానికి విన్నవించాయి.

ఒకసారి రథాన్ని ఆపితే.. మళ్లీ అప్పటివరకు ఆగాల్సిందే..
పూరి జగన్మాథ్ రథయాత్రను ఒక్కసారి ఆపితే వరుసగా 12ఏళ్లపాటు నిర్వహించరాదనే ఆచారం ఉంది. గతంలోనూ ఇలాంటి సంఘటనలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నో శతాబ్దాలుగా రథయాత్ర కొనసాగుతోందని.. కరోనా కారణంగా రథయాత్రను ఆపడం సరికాదని తెలిపారు. కోట్లాది మంది విశ్వాసం, మనోభావాలతో ముడిపడి ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు విన్నవించారు. ఈసారి ప్రజలు రథయాత్రలో పాల్గొనకుండా నిర్వహిస్తామని చెప్పారు. ఆలయ పూజారులకు సైతం కరోనా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. కరోనా నెగెటివ్ వచ్చిన వారితోనే రథయాత్ర నిర్వహిస్తామని కోర్టు అనుమతించాలని కోరారు.

షరతులతో కూడిన అనుమతి వచ్చేనా..
దీనిపై గతంలోనే సుప్రీం కోర్టు ప్రజారోగ్యం, పౌరుల భద్రత దృష్ట్యా పూరిలో, ఇతర ప్రాంతాల్లో రథయాత్ర నిర్వహించొద్దని ఆదేశించింది. పెద్దసంఖ్యలో ప్రజలు హాజరైతే కరోనా వ్యాప్తి చెందుతుందని కోర్డు భావించి తీర్పు ఇచ్చింది. దీంతో కేంద్రం, ఒడిశా ప్రభుత్వం ప్రజలు పాల్గొనకుండా రథయాత్ర నిర్వహిస్తామని హామీ ఇస్తున్నాయి. తమకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఏన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారాన్ని కరోనా కారణంగా ఆపడం మంచిదికాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఈనేపథ్యంలోనే సుప్రీంతీర్పు ఎలా ఉండబోతుందనేది సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది.

జగన్ నెక్స్ట్ టార్గెట్ ఆ మాజీ మంత్రేనా?


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీడీపీ నాయకుల పై ఫుల్ ఫోకస్ పెట్టింది . అవినీతి రహిత పాలనే తమ పార్టీ ధ్యేయం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని మరియు అవకతవకలు వెలికి తీస్తాం అన్నారు. అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలేది లేదని చెప్పడం జరిగింది. దీనిలో భాగం ఇటీవలే టీడీపీ సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు మరియు జె సి ప్రభాకర్ రెడ్డిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఐతే ఇది ఇంతటితో ఆగేది కాదన్నది టీడీపీ నేతలకు బాగా తెలుసు. దీనితో వారు అరెస్టుల విషయంలో జగన్ పై ఎదురుదాడికి దిగుతున్నా… లోలోపల భయపడుతున్నారు.

చిరు పవన్ ల మధ్య అగ్రతాంబూలమే అడ్డు..!

ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం నెక్స్ట్ టార్గెట్ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అని తెలుస్తుంది. గత ప్రభుత్వంలో ఈయన నీటిపారుదల శాఖా మంత్రిగా ఉన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల కాంట్రాక్టుల కేటాయింపు, పట్టి సీమ ఎత్తిపోతల పథకం వంటి ప్రాజెక్ట్స్ లో భారీ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వీరిపై ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటి నుండే వైసీపీ నేతలు దేవినేని ఉమపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఇక వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక పోలవరం పనుల కాంట్రక్టుల విషయంలో సమూల మార్పులు చేశారు. జగన్ రివర్స్ టెండరింగ్ విధానం తీసుకురావడం జరిగింది.

ఏపీ ఈఎస్ఐ స్కామ్ కు తెలంగాణకు సంబంధం ఏంటీ?

మంత్రిగా ఆయన చేసిన కేటాయింపులు, ఒప్పందాలు వంటి కీలక అంశాలపై ఇప్పటికే సమాచారం సేకరించే పనిలో అధికారులు ఉన్నారన్న మాట వినబడుతుంది. కీలక ఆధారాలు దొరికిన నేపథ్యంలో దేవినేని ఉమను అరెస్ట్ చేయడం ఖాయం. టీడీపీ కీలకనేతల్లో ఒకరైన దేవినేని ఉమ అరెస్ట్ జరిగితే ఆ సెగ..టీడీపీ అధినేత చంద్రబాబు మరియు లోకేష్ లకు తగలడం ఖాయం. ఒకవేళ దేవినేని నిజంగా అవినీతికి పాల్పడితే దానివెనుక అధినేతల హస్తం ఉంటుంది కాబట్టి. ఈనేపథ్యంలో అరెస్ట్ ని తప్పించుకోవడానికి ఉమా తగు జాగ్రత్తలలో ఉన్నారని.. అన్ని రకాల న్యాయపరమైన లొసుగులు పరిశీలిస్తున్నారని సమాచారం. నిజంగా దేవినేని ఉమా అరెస్ట్ జరిగితే టీడీపీకి పెద్ద షాక్ అని చెప్పాలి.

ఆర్జీవీ పై ఫైర్ అయిన ప్రణయ్ భార్య అమృత


వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫాదర్స్ డే సందర్భంగా ‘మర్డర్’ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. తెలుగు రాష్ట్రాల్లో మిర్యాలగూడ హత్య ఉదాంతం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. అమృత ప్రేమ ఉదాంతంలో ఆమె భర్త ప్రణయ్ హత్యకు గురికాగా తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ సంఘటన ఆధారంగా రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తున్నట్లు ట్వీటర్లో ప్రకటించాడు. ‘మర్డర్’ టైటిల్.. కుటుంబ కథాచిత్రమ్ అనే సబ్ టైటిల్ తో ఫాదర్స్ డే రోజున సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదలచేసి అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకున్నాడు.

రాజధాని తరలింపుపై ప్రభుత్వం వెనక్కి?

‘మర్డర్’ సినిమాపై ప్రణయ్ భార్య అమృత తాజాగా స్పందించింది. రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన సినిమాకు తన జీవితానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆదివారం వర్మ విడుదల చేసిన ‘మర్డర్’ పోస్టర్ చూశాక ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని వాపోయింది. తన కథ తన సన్నిహితులకు తప్ప మరేవరికీ తెలియదని తెలిపింది. ఓ కట్టుకథకు తమ పేర్లు వాడుకొని దర్శకుడు అమ్ముకోవాలని చూస్తున్నాడని చెప్పింది.

ప్రణయ్ హత్య జరిగినప్పటి నుంచి తాను ఎంతో భావోద్వేగానికి గురవుతున్నట్లు తెలిపింది. తమ కథ ఆధారంగా తెరక్కించే సినిమాకు తమ అనుమతి తీసుకోవాలని తెలియదా? అంటూ ప్రశ్నించింది. మహిళలను ఎలా గౌరవించాలో చెప్పే తల్లి లేనందుకు అతడిపై జాలిపడుతున్నానని అమృత వ్యాఖ్యానించింది. తన జీవితం మరోసారి తలకిందులైందని వాపోయింది. వర్మ తీసే మూవీకి తన కథకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. వర్మ ఓ ఫేక్ ఫిలిం మేకరని ఆయన కంటే తానే ఎక్కువ జీవితాన్ని చూశానని చెప్పింది. ఆర్జీవీపై కేసు వేసి అతడికి పబ్లిసిటీ కల్పించే ఉద్దేశం లేదని తెలిపింది.

ఏపీ ఈఎస్ఐ స్కామ్ కు తెలంగాణకు సంబంధం ఏంటీ?

ఈ నేపథ్యంలో ఆర్జీవీ ‘మర్డర్’ సినిమా విషయంలో అమృతను కలుస్తారా? లేదా అనేది ఆసక్తిని రేపుతోంది. ఆర్జీవీ కేవలం మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తారా? లేదా అమృత వెర్షన్ కూడా తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది. అమృత అనుమతి లేకుండానే మూవీ తీస్తే ఆమె చెబుతున్నట్లు సినిమా ఓ కట్టుకథగా మిగిలే అవకాశం ఉంది. దీంతో ఆర్జీవీ ‘మర్డర్’ విషయంలో ఎలా ముందుకెళుతారనేది ఆసక్తిని రేపుతోంది.