Home Blog Page 8376

అన్నగారికి మించిన వెన్నుపోటు పవన్ కళ్యాణ్ కు…! తట్టుకోగలడా…?

 

రాష్ట్రంలో జనసేన పరిస్థితి రాజకీయంగా ఎలాంటిదో అందరికీ తెలిసిందే. నిర్దిష్టమైన ఓటుబ్యాంకు ఉన్నా కూడా ప్రజలను మెప్పించడంలో పవన్ ఘోరంగా విఫలం అయ్యాడు అన్నది జగమెరిగిన సత్యం. అయితే జనసేన పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినా కూడా రాపాక అనూహ్యంగా గెలిచారు. ఇక జన సైనికులకు ఆ దెబ్బతో బోల్డంత ఆత్మవిశ్వాసం వచ్చింది. అసెంబ్లీలో అధికార పక్షానికి ఒక సీటు తోనే తమ సత్తా చూపిస్తాం అంటూ రెచ్చిపోయారు క్రమక్రమంగా వారికి షాకుల మీద షాకులు ఇస్తూ వైఎస్సార్సీపీకి రాపాక దగ్గర అయిపోయారు.

మొదటి నుండి రాపాక…. తనకు పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదు అని పదే పదే అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. నిజానికి రాపాక పై అధికార పార్టీ అడ్డగోలు కేసులతో వేధింపులకు పాల్పడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా స్పందించారు. తానే స్వయంగా దిగాల్సి వస్తుందని హెచ్చరించగా అప్పుడు రాపాక దాని నుంది బయట పడ్డాడు.

ఆ తర్వాత రాపాక భయపడ్డాడో ఏమో కానీ అధికార పార్టీకి అడుగడుగునావత్తాసు పలుకుతూ కనిపించాడు. కానీ ఆయన ఎన్ని చేసినా కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు బహిరంగంగా అతని పై విమర్శలు చేసింది లేదు. అధినేత మాట్లాడే వరకు శాంతంగా ఉండమని నాయకులు కూడా జన సైనికులని హెచ్చరిస్తూనే ఉన్నారు రాపాక ను ఇంకా వారి మనిషి గానే చూస్తున్నారు తప్ప వైసిపి కి మద్దతు ఇస్తున్నాడు అన్న ఉక్రోషం, ఆగ్రహం ఏ మాత్రం లేకపోవడం గమనార్హం

అయితే తాజాగా రాపాక కు సంబంధించిన ఒక వీడియో వెలుగుచూసింది. కొన్ని కారణాలతో వైసీపీ లో మంచి అవకాశం దక్కించుకోలేకపోయానని…. అందుకే జనసేనలో చేరానని…. జనసేన నుంచి గెలిచిన వెంటనే జగన్ ని కలిస్తే ‘కలిసి పనిచేద్దాం’ అని జగన్ చెప్పారని…. అప్పటి నుండి తను వైసీపీ నేతగా చెలానణీ అవుతున్నానని వీడియోలో చెప్పారు. రాపాక చెప్పింది నిజమైతే అతను చేస్తున్న పనికి ‘నమ్మకద్రోహం’ ‘వెన్నుపోటు’ అనే మాటలు చాలా చిన్నవి అని జనసైనికులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంకా ఇంత జరిగినా కూడా దీనికి పవన్ స్పందించేది అనుమానమే. అయితే బయట ట్రెండ్ అవుతున్న సామెత ఏమిటంటే “పులికి గా తోకగా ఉండడం కన్నా పిల్లికి తలగా ఉండడమే మనిషికి గౌరవం అట.”

కేసీఆర్ తో ఫైట్.. జగన్ తట్టుకుంటాడా?


‘కంటబడ్డావా కనికరిస్తానేమో.. వెంటబడ్డావా వేటాడిస్తా’ అన్న సినిమా డైలాగ్ లాగానే తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహారశైలి ఉంటుందని ఆయనను దగ్గర నుంచి చూసిన వారు చెబుతుంటారు. ఇన్నాళ్లు ఏపీ సీఎం జగన్ ను సోదరుడిగా భావించి స్నేహ హస్తం అందించారు కేసీఆర్. కానీ తెలంగాణకే పుల్లలు పెట్టే పరిస్థితి వచ్చేసరికి కేసీఆర్ కూడా ఫ్లేట్ ఫిరాయించాడు. ‘ఇక ప్రాజెక్టులపై తాడో పేడో తేల్చేస్తాం’ అంటూ ఫైర్ అయ్యారు.

Also Read: బీజేపీలోకి మాజీ ఎంపీ రాథోడ్?

నిజానికి ఏపీలో సీఎంగా జగన్ గెలవడానికి ఎన్నికల ముందర కేసీఆర్ అందించిన సహకారం మరువలేనిదంటారు. అందుకే గెలవగానే కేసీఆర్ ఇంటికి జగన్ వచ్చి ఆప్యాయంగా ఇద్దరూ మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు ప్రాజెక్టులు, సాగునీటి పారుదల, నీటి విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంచాయితీ మొదలైంది.

ఏపీ ప్రభుత్వం.. జగన్ పట్టుబట్టి మరీ రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో శ్రీశైలం నుంచి నీటిని సీమకు పట్టుకుపోవడం అక్రమమని తెలంగాణ వాదిస్తోంది. తద్వారా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎండిపోయి దక్షిణ తెలంగాణకు సాగు, తాగు నీటికి ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళనగా ఉంది. ఏపీని సీమ ఎత్తిపోతల ఆపమన్నా వినకుండా ముందుకెళుతుండడంతో కేసీఆర్ సర్కార్ సుప్రీంకోర్టుకు ఎక్కింది. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు ఆపాలని ఫిర్యాదులు చేసింది. ఇదే కేసీఆర్ కంటగింపుగా మారింది.

నిజానికి గోదావరిలో వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో పోతోంది. దాన్ని పట్టిసీమ ద్వారా రాయలసీమకు తరలించుకుపోవాలని కేసీఆర్ స్పష్టంగా జగన్ కు చెప్పారు. కానీ దాన్ని వినకుండా రాయలసీమ ఎత్తిపోతల పెట్టి శ్రీశైలం, నాగార్జున సాగర్ లను ఎండబెట్టడంపై కేసీఆర్ సర్కార్ ఆగ్రహంగా ఉంది.

Also Read: అర్థగంటలోనే కరోనా రిజల్ట్!

అందుకే కేసీఆర్ రంగంలోకి దిగారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు నీటివాటాలో అన్యాయంపై తాజాగా నినదించారు. నాగార్జున సాగర్ సహా ఎగువ కృష్ణ, తుంగభద్ర, బీమా ప్రాజెక్టులు ఏపీకే పోయాయని నిప్పులు చెరిగారు. ఇక అపెక్స్ కౌన్సిల్ లోనూ తెలంగాణకు సాగునీటి రంగంలో జరిగిన అన్యాయంపై కడిగేస్తానంటూ సర్వం చేస్తున్నారు. వాగ్ధాటి, ఎంతో నైపుణ్యం గల కేసీఆర్ వాదన ముందు ఏపీ సీఎం జగన్ సహా ఏపీ అధికారులు తట్టుకోవడం కష్టమేనన్న వాదన ఉంది. కేసీఆర్ రంగంలోకి దిగితే ఆయనంత పరిజ్ఞానం ప్రాజెక్టులపై ఎవరికి లేదనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. ప్రత్యర్థులందరూ తేలిపోవడం ఖాయమంటున్నారు.

ఇప్పుడు సీమ ఎత్తిపోతలకు ధీటుగా తెలంగాణ సర్కార్ శ్రీశైలం నుంచి ఎడమ కాలువ ద్వారా విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని తరలించే ప్రయత్నాలు ప్రారంభించారు. అలా ఏపీ కొల్లగొట్టే ప్రయత్నాలకు చెక్ చెబుతూ నీటిని నాగార్జున సాగర్ కు తరలించే ఎత్తుగడ సిద్ధం చేశారని తెలిసింది. వృథాగా నీటి విడుదలపై ఏపీ ప్రభుత్వం కూడా తాజాగా కృష్ణ బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఇలా ఏపీ ప్రయత్నాలకు ధీటుగా కేసీఆర్ తెలంగాణ నీటివాటా కోసం ఎంతకైనా చేయడానికి తొడగొట్టడం తెలుగు రాష్ట్రాల్లో హీట్ పెంచింది.

-నరేశ్

టబును ఘాడంగా ప్రేమిస్తున్నాడట !


ప్రేమకు వయస్సు అడ్డు కాదని ఇప్పటికే ఎందరో ముదురు ప్రేమికులు తమ ప్రేమ విరహంతో నిరూపించారు. అయినా ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ పుడుతుందో ఎవరు మాత్రం చెప్పగలరు ? అనే ఒక పాత డైలాగ్ ఉండనే ఉందాయ్యే. అందుకే ఓ బాలీవుడ్ దర్శకుడు మాజీ బ్యూటీ టబును తెగ ప్రేమిస్తున్నాడట. వయసు పెరిగినా ఏ మాత్రం తరగని అందంతో ఇప్పటికి బోల్డ్ క్యారెక్టర్స్ తో కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ మాజీ గ్లామరస్ హీరోయిన్ అంటే… అ ముసలి దర్శకుడికి పిచ్చి అట. ఆ మధ్య పెళ్లాం కాలం చేయడం.. పిల్లలు యూఎస్ లో సెటిల్ అవడం.. ఇక ఈ డైరెక్టర్ కి ఏమి చేయాలో తెలియక మొత్తానికి ప్రేమలో పడ్డాడు.

Also Read: కియారా జోరు మామూలుగా లేదుగా..

టబు కూడా ప్రేమకు వ్యతిరేఖం కాదాయే. ఇప్పటికే ఎన్నో ప్రేమ వ్యవహారాల్లో ముదిరిపోయిన హీరోయిన్. పైగా వయసు ఆయిపోయినా ఇంకా పెళ్లి కాకుండా ప్రేమ పక్షిగా మిగిలిపోయినా హీరోయిన్. మరి ఆ ముసలి దర్శకుడి బాధను అర్ధం చేసుకుని ఆయనకు తన ప్రేమ రుచిని చూపిస్తుందేమో చూడాలి. ఆన్నట్టు ఆ మధ్య టబు తనకు తల్లి కావాలని ఉందని కూడా ఒక స్టేట్ మెంట్ ఇచ్చిన యవ్వారం తెలిసిందే. కాకపోతే లేటు వయసులో తల్లి అయితే ఇక సినిమాలతో పాటు టూర్లను తగ్గించుకోవాలని.. ముఖ్యంగా యాత్రలు, విదేశీ ప్రయాణాల వంటివి లైఫ్ స్టయిల్ నుంచి తొలగించి ఆ సమయం మొత్తాన్ని తల్లి తనానికి పెట్టుబడిగా పెట్టే ఓపిక తనలో లేవు అని.. అందుకే పెళ్లి జోలికి తాను వెళ్లలేదని ఇలా ఏదేదో చెప్పుకొచ్చింది.

Also Read: నిజంగానే ఎన్నికల కోసం ఆ హీరోయిన్ ని వాడుకుంటున్నారా…?

ఏమైనా హీరోయిన్ గా ఇంకా సినిమాలు చేస్తోన్న టబుకు గ్లామర్ మీద ఉన్న ఇంట్రస్ట్ , పెళ్లి మీద లేకపాయే. మరి ఆ ముసలి దర్శకుడు ఆమెను పెళ్ళి వరకూ తీసుకువెళ్తాడో లేక ప్రేమతోనే సరదాగా టైం పాస్ చేస్తాడో చూడాలి. ఇంతకీ ఆ బాలీవుడ్ దర్శకుడు గతంలో షారుక్ ఖాన్ కు మూడు సూపర్ హిట్ సినిమాలను అందించాడు. అలాగే సంజయ్ దత్ తో కూడా ఒక సినిమా చేసాడు. ప్రెజెంట్ సినిమాలకు దర్శకత్వం వహించకపోయినా తన శిష్యుల సినిమా సెట్స్ లో సరదాగా కాసేపు గడిపి వస్తాడట.

కరోనాను ఆ దేశం తరిమికొట్టిందా?


కరోనా పేరు చెబితేనే ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. ప్రతీరోజు ప్రపంచ వ్యాప్తంగా లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. పేద, ధనిక, చిన్న, పెద్దా అనే తేడా లేకుండా కరోనా మహమ్మరి అందరిని కబళించేందుకు చూస్తోంది. కరోనా నిబంధనలు పాటించకుండా ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో.. వారినే టార్గెట్ చూస్తూ ముందుకెళుతున్నారు. అగ్రరాజ్యాలు సైతం కరోనా దాటికి విలవిలలాడిపోతున్నాయి. ఇక చిన్న చితక దేశాల సంగతి ఇంకా చెప్పనక్కర్లేదు.

Also Read: టిడిపిలో ఆ మాజీ మంత్రి మిస్సింగ్..! దొరికితే కటకటాల వెనక్కే…?

చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ క్రమంగా ప్రపంచ దేశాలకు పాకింది. ఇక్కడ.. అక్కడ అనే తేడా లేకుండా ప్రపంచమంతటా కరోనా వ్యాపించింది. కరోనా రోజురోజుకు విజృంభిస్తుండటంతో కొన్ని దేశాలు లాక్డౌన్ విధించి వైరస్ కట్టడికి పూనుకున్నాయి. దీంతో కొంతమేర మాత్రమే కరోనా కట్టడి అయింది. అయితే అది పూర్తిస్థాయిలో కరోనా కట్టడి కాలేదు. దీంతో ఆయా ప్రభుత్వాలు డబ్ల్యూహెచ్ నిబంధనలు పాటించేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. దీంతో ప్రజలంతా మాస్కులు ధరించడం.. చేతులను శానిటైజ్ చేసుకోవడం.. భౌతిక దూరం పాటిస్తున్నారు.

ఇదిలా ఉంటే న్యూజిలాండ్ దేశం కరోనాపై పూర్తిస్థాయి విజయం సాధించింది. అక్కడ గడిచిన వంద రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని తాజాగా న్యూజిలాండ్ ప్రభుత్వమే ప్రకటించింది. అక్కడ ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చిన 23మందికి మాత్రమే కరోనా ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. వీరందరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత వందరోజులుగా ఒక్క క‌రోనా కేసు న‌మోదు కాకపోవడం గొప్ప విష‌య‌మ‌ని అక్క‌డి హెల్త్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ యాష్లే బ్లూమ్‌ఫీల్డ్ తెలిపారు.

Also Read: ఈ సారి జగన్ సెగ డైరెక్ట్ కోర్టుకే తగిలింది..! అంత తొందర ఏల నాయకా…?

ఇక న్యూజిలాండ్ జ‌నాభా మొత్తం సుమారు 50ల‌క్ష‌లు. దేశంలో కరోనా ఎంట్రీ ఇవ్వడంతోనే మార్చి 19 నుంచే న్యూజిలాండ్లోకి విదేశీయుల రాకను నిలిపివేసింది. ఫిబ్ర‌వ‌రిలో న్యూజిలాండ్‌లో 1,219 క‌రోనా కేసులు ఉండగా ఇప్పుడు పూర్తిస్థాయి కంట్రోల్ చేయగలిగింది. న్యూజిలాండ్లో మాస్కుల‌ను ధ‌రించ‌డాన్ని త‌ప్ప‌నిస‌రి చేశారు. అలాగే భౌతిక దూరం నిబంధ‌న‌ను ప్రజలు క‌చ్చితంగా పాటించేలా చర్యలు తీసుకున్నారు. విదేశాల నుంచి వ‌చ్చే వారిని 14రోజులపాటు క్వారంటైన్ చేసింది.

కరోనా మహమ్మరిపట్ల న్యూజిలాండ్ పకడ్భందీ చర్యలు చేపట్టి విజయం సాధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. న్యూజిలాండ్ ను ఆదర్శంగా తీసుకొని అన్నిదేశాల కరోనా కట్టడి చర్యలు తీసుకుంటే కరోనాపై విజయం సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Deepthi Sunaina Red Dress Cool Photos

Amala Paul Photoshoot Stills

Payal Rajput Beauty Clicks

Johar Actress Naina Ganguly Latest Stills

సచిన్ పైలట్ తిరిగి రాక దేనికి సంకేతం?

దేశవ్యాప్తంగా సచిన్ పైలట్ తిరుగుబాటు కాంగ్రెస్ లో పెద్ద సంచలనం సృష్టించింది. ఎంతోమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు సచిన్ పైలట్ తిరుగుబాటు పై ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ఆత్మవిమర్శ చేసుకోవాలని దిగజారిపోతున్న పరిస్థితుల్ని చక్కదిద్దే చర్యలు చేపట్టాలని అభిప్రాయపడటం జరిగింది. ఈ నేపధ్యంలోనే సంజయ్ ఝా లాంటి కాంగ్రెస్ అధికార ప్రతినిధుల్ని సాగనంపటం కూడా జరిగింది. అదేసమయంలో ఎవరూ ధైర్యంగా ముందుకొచ్చి గాంధీ కుటుంబాన్ని ప్రశ్నించినది లేదు. త్వరలో రాహుల్ గాంధీ అధ్యక్షపదవి చేపట్టాలనే ప్రకటనలు ఇచ్చారు. కానీ లోలోపల అసంతృప్తి వ్యక్తపరుస్తూనే వున్నారు. ఇది ఓ టిపికల్ కాంగ్రెస్ నాయకుల మనస్తత్వం. అందరూ సచిన్ పైలట్ తిరుగుబాటు ఎలా మారుతుందని ఆసక్తిగా ఎదురు చూసారు. చివరకు కధ సుఖాంతమయ్యింది.

అయోమయం లో కాంగ్రెస్ 

కాంగ్రెస్ కి ఒక దశ దిశా లేకుండా అయిపోయింది. ఎవరి ఇష్టం వారిది. కొంతమంది రామమందిర నిర్మాణంపై మద్దత్తుగా మాట్లాడుతుంటే మరికొందరు ఇప్పటికీ అది తప్పనే మాట్లాడుతున్నారు. చివరకు ప్రియాంక గాంధీ సానుకూలంగా ట్వీట్ చేయటం కొంతమేర సద్దుమనిగిందని అనుకుంటే కేరళ లో ముస్లిం లీగ్ అసంతృప్తి వ్యక్తంచేసింది. మారిన సామాజిక పరిస్థితుల్లో హిందూ అనుకూల వైఖరి తీసుకోకపోతే హిందూ వ్యతిరేక పార్టీగా ముద్రపడే అవకాశముంది. కానీ అదేసమయంలో ముస్లిం ప్రజల్లో అనుమాన బీజాలు మొలకెత్తే అవకాశముంది. సమాజం అంతగా సమీకరించబడిందనేది అందరూ అంగీకరించే అంశం. దానికి కూడా కాంగ్రెస్ అవకాశవాద సెక్యులర్ విధానాలే కారణం. బిజెపి బలపడిందాంట్లో కాంగ్రెస్ పాత్ర చాలా వుంది.

ఇదే అయోమయం నిర్మాణ సమస్యల్లోనూ వుంది. రాహుల్ గాంధీ అధ్యక్షుడైన తర్వాత యువకులకు పార్టీలో పెద్ద పీట వేయాలని భావించాడని వార్తలు వచ్చాయి. వెంటనే కురు వృద్ధులు అందరూ సోనియా గాంధీ పంచన చేరి మొరపెట్టుకోవటంతో మళ్ళీ పరిస్థితులు మొదటకే వచ్చాయి. రాహుల్ గాంధీ రాజీనామా తో సీనియర్లకు తిరిగి మహర్దశ వచ్చింది. రాజస్తాన్, మధ్యప్రదేశ్ , ఛత్తీస్ గడ్ ల్లో ప్రజలు కాంగ్రెస్ ని గెలిపిస్తే రాజస్తాన్, మధ్యప్రదేశ్ లలో తిరిగి పాతతరాన్ని నెత్తిన పెట్టుకున్నారు. దానితో పాత కొత్త తరాల అంతర్యుద్ధం పెరిగి పెద్దదయ్యింది. మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా బయటకు వెళ్ళిన తర్వాత కూడా మార్పు దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. చివరకు అది రాజస్తాన్ సంక్షోభానికి దారి తీసింది.

కధ సుఖాంతమైనా శేష ప్రశ్నలు మిగిలే వున్నాయి 

ముందుగా కాంగ్రెస్ పార్టీ బిజెపి పై చేసిన ఆరోపణలు ఏమయ్యాయో చెప్పాల్సివుంది. ఇదంతా బిజెపి కుట్రలో భాగమేనని ప్రజల్ని నమ్మించటానికి ప్రయత్నించింది. కొంతమేరకు ప్రజలు కూడా మధ్యప్రదేశ్ ఉదంతం తో ఈ ఆరోపణలు నిజమేనని నమ్మారు. సచిన్ పైలట్ నేను బిజెపి లో చేరను అని ప్రకటించిన తర్వాత కూడా కాంగ్రెస్ అధికార ప్రతినిధులు ఈ ఆరోపణలని వెనక్కు తీసుకోలేదు. అశోక్ గెహ్లాట్ అయితే ఇంకో అడుగు ముందుకేసి వ్యక్తిగతంగా బాణాలు ఎక్కుపెట్టాడు. మరి ఇప్పుడు ఈ ఆరోపణలు ఏమైనట్లు? అంటే బిజెపి తో ‘కుమ్మక్కైన’ సచిన్ పైలట్ ని తిరిగి వెనక్కు తీసుకొని పదవులు అప్పచెబుతారా? వేల కోట్ల రూపాయలు చేతులు మారాయయని చేసిన ఆరోపణలు ఏమైనట్లు? నిజంగా అన్ని డబ్బులు తీసుకొని కుట్రకు సహకరించి వుంటే తిరిగి స్వంత గూటికి ఎందుకొచ్చారు? డబ్బులుతీసుకొని పార్టీ మారే అలవాటు వున్న వాళ్ళు తిరిగి రావాలన్నా అంతకన్నా ఎక్కువ డబ్బులు ముట్టినప్పుడే వస్తారు కదా? సచిన్ పైలట్ ఈ కుట్రకు సూత్రధారి అయినప్పుడు ఈ ‘అవినీతి’ అంతా తనే చేసినట్లు కదా? ముడుపులు తీసుకున్నారని పెట్టిన కేసులు ఎందుకు విరమించుకున్నారు? అంటే ఇదంతా అశోక్ గెహ్లాట్ సృష్టించిన కట్టు కధేనా? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పై , రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై వుంది. ఈ ప్రశ్నలు శేష ప్రశ్నలుగా మిగిలిపోతే ప్రజలు కోర్టు కెళ్ళి వీటికి జవాబులు రాబట్టాల్సిన అవసరం వుంది.

సచిన్ పైలట్ భవిష్యత్తు నిరాశాజనకమేనా?

సచిన్ పైలట్ కాంగ్రెస్ లో తిరుగుబాటు బావుటా ఎగరవేసి ఎంతోమంది కాంగ్రెస్ అభిమానుల్లో  ఆశలు చిగురించాడు. గాంధీ కుటుంబంతో బ్రష్టు పట్టి పోయిన కాంగ్రెస్ ప్రతిష్టను ఇంకో రూపంలో సచిన్ పైలట్ నిలబెడతాడని ఆశించిన వాళ్లకు నిరాశే మిగిలింది. ఈ రోజుకి పాత కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడిన కాంగ్రెస్ శ్రేయోభిలాషులు దేశంలో ఎంతోమంది వున్నారు. బిజెపి కి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ని తీర్చిదిద్దాలని వువ్విల్లూరిన ఎంతోమందికి ఇది నిరాశే. ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ చివరికి గాంధీ కుటుంబం చేతిలో బందీ అవటం దురదృష్టం. నెహ్రు-ఇందిరా గాంధీ ల  మీద గౌరవం వుండటం వేరు, కాంగ్రెస్ ని బతికించు కోవటం వేరు. 21వ శతాబ్దపు తరం వారసత్వ రాజకీయాల పై నమ్మకంలేదు. అంతర్గత ప్రజాస్వామ్యం పై పార్టీని నడినప్పుడే పార్టీ వైపు యువత ఆకర్షించబడతారు. ముఖ్యంగా గాంధీ కుటుంబం సోనియా గాంధీ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఆర్ధిక అవినీతి ఆరోపణలని ఎదుర్కోవాల్సి వచ్చింది. రాజీవ్ గాంధీ బోఫోర్స్ కుంభకోణం లో కూడా ఇటలీ ఖత్రోచీదే ప్రధాన పాత్ర. దొంగచాటుగా తనని దేశం దాటవేయటం తో గాంధీ కుటుంబం ప్రతిష్ట మసకబారింది. సుబ్రహ్మణ్య స్వామి నేషనల్ హెరాల్డ్ కేసు తో వీరి అవినీతి దేశం మొత్తానికి పూర్తిగా బట్టబయలయింది . కొన్నాళ్ళు ఈ కుటుంబం పదవులనుంచి తప్పు కుంటేనే కాంగ్రెస్ పునరుజ్జీవం పొందుతుంది. లేకపోతే మోడీ జగన్నాధ రధ చక్రాల ధాటికి విలవిలా కొట్టుకుంటూనే వుంటుంది. కొత్త తరాన్ని ఆకర్షించాలంటే గాంధీ కుటుంబేతర వ్యక్తి చేతిలో అంతర్గత ప్రజాస్వామ్య పద్దతిలో కాంగ్రెస్ కి  నూతన జవసత్వాలు కల్పించాలి.

సచిన్ పైలట్ ఆధ్వర్యం లో ఆ పని జరుగుతుందని చాలామంది ఆశించారు. అయితే శరద్ పవర్, మమతా బెనర్జీ , జగన్ మోహన రెడ్డి లాంటి ఉదంతాలు చూపించి అది సాధ్యం కాదని కొంతమంది గాంధీ కుటుంబ భక్తి బృంద మేధావులు తేల్చేసారు. కానీ వాళ్లకు అర్ధం కానిదేమిటంటే ఇంతకుముందు వచ్చిన వాళ్ళందరూ ఆయా ప్రాంతాల నాయకులే తప్ప దేశవ్యాప్తంగా ప్రభావం చూపించగలిగిన వాళ్ళు కాదు. ఇందుకు కొంతమేర శరద్ పవార్ మినహాయింపుగా మేధావులు అనుకోవచ్చు. ఈదేశంలో హిందీ ప్రాంతానికి చెందినవాడు కాకపోతే ఒక జాతీయ పార్టీని నిర్మించటం సాధ్యం కాదు. బిజెపి ఉదాహరణ ఇక్కడ వర్తించదు. అది హిందుత్వ సిద్ధాంతం తో ఆర్ ఎస్ ఎస్ మద్దత్తు తో పనిచేస్తుందని మరిచిపోవద్దు. అయినా ఈ స్థాయికి రావటానికి ఎన్నో దశాబ్దాలు పట్టింది. సచిన్ పైలట్ యువకుడు, ముఖ్యంగా హిందీ ప్రాంతానికి చెందినవాడు, కాంగ్రెస్ లో యువ నాయకుల్లో పేరు వున్నవాడు, గత ఆరు సంవత్సరాలు ఒక హిందీ రాష్ట్రం లో పార్టీని    కిందనుంచి ఇటుక ఇటుక పేర్చుకుంటూ వచ్చినవాడు కావటం తో ఒక ఇమేజ్ పార్టీలో నాయకులతో పాటు ప్రజల్లో కూడా వచ్చింది. కాంగ్రెస్ పార్టీని సరైన పంధాలో నడపటానికి ఇంతకన్నా బంగారు అవకాశం ఎప్పుడూ రాదు. అందునా బిజెపి లో చేరను అని ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో , ఉదార వాద మేధావుల్లో కొత్త ఆశలు చిగురించాయి. అదే మాటమీద నిలబడి వుంటే 2024 కి ఒక బలమైన ఉదారవాద పార్టీగా ముందు కొచ్చేది. బిజెపి కి ప్రత్యామ్నాయంగా ఇంకో జాతీయ నాయకుడు ( గాంధీ కుటుంబేతర) తయారయ్యేవాడు. ఇంత మంచి అవకాశం జారవిడుచుకొని సచిన్ పైలట్ తిరిగి కాంగ్రెస్ లో అందరిలో ఒకడిగా గాంధీ కుటుంబ భక్తి బృందం లో సభ్యుడిగా తిరిగి చేరటం తన రాజకీయ జీవితం లో చేసిన పెద్ద పొరపాటు. అవకాశాలు మనం కావాలనుకున్నప్పుడు రావు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటమే  నాయకత్వ లక్షణం. ఐ పిటీ సచిన్ పైలట్.

టిడిపిలో ఆ మాజీ మంత్రి మిస్సింగ్..! దొరికితే కటకటాల వెనక్కే…?

తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఏళ్లుగా ఉంటూ…. 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు వరకూ ఓ వెలుగు వెలిగిన బడా నేతలు అంతా ఇప్పుడు అసలు అడ్రస్ లేకుండా పోయారు. అందరూ ఎంతో కొంత యాక్టివ్ గా ఉన్నా కూడా అమరావతిలో ఉన్న కొంతమంది నేతలు మాత్రం అస్సలు కనిపించడం లేదు. వారిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పేరు పత్తిపాటి పుల్లారావుది. గత టీడీపీ ప్రభుత్వం లో రాజధాని అమరావతి ప్రాంతం నుండి ఆయన అత్యంత కీలక నేత. చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి. సీఆర్డీఏ చట్టంలో ఆయనది అత్యంత కీలక పాత్ర.

 

అంతెందుకు గత సంవత్సరం సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకు వైసిపి పార్టీ పైన నిప్పులు చెరిగారు. జగన్ పేరు చెబితేనే అంత ఎత్తున లేచే ఆయన ఇప్పుడు మాత్రం జగన్ మూడు రాజధానులు ఏపీ లో స్థాపించేందుకు ఎన్నో ఎత్తుగడలు వేసినా కూడా కనీసం ఒక్క మాట కూడా ఎత్తడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. ఎప్పుడో అడపాదడపా ప్రెస్ మీట్ లలో తారసపడుతున్నా…. క్రియాశీలకంగా అతనికి ఉనికి మొత్తం పోయింది.

అసలు అంతటి నేత ఎందుకు మౌనంగా ఉన్నారన్న చర్చ ఇప్పుడు జోరుగా కొనసాగుతోంది. ఇక ఆ విషయానికి వస్తే స్సీఆర్డీఏ చట్టం అమలులో చాలా అవకతవకలు జరిగాయని…. అలాగే అమరావతి రాజధాని భూముల సేకరణ లో కూడా పత్తిపాటి పుల్లారావు చర్యలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని…. జగన్ ప్రభుత్వం అతనిపై అన్నీ సిద్ధం చేసి పెట్టుకుందని అధికార పార్టీ వర్గాల నుండి ఎన్నో మాటలు వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ పాలనలో జరిగిన అవినీతిని తవ్వుతామని…. వారిని తప్పక జైలుకు పంపుతామని వైసీపీ నేతలు పదేపదే చెబుతున్నారు. అంతే కాదు అచ్చెన్నాయుడు, జేసి ప్రభాకర్ రెడ్డి వంటి నేతలను కూడా శ్రీకృష్ణ జన్మ స్థలానికి పంపించారు. ఈ భయంతోనే పుల్లారావు మౌనంగా ఉన్నారని చర్చ సాగుతోంది.

మరికొందరైతే ఆయన ఏమి అవినీతికి పాల్పడలేదని…. కేవలం అమరావతి ప్రజలకు సమాధానం చెప్పలేక చెప్పుకోలేక ముఖం చాటేసుకుని తిరుగుతున్నారని అంటున్నారు. ఇక గతంలో పుల్లారావు కొడుకు పై అనేక ఆర్థిక దుశ్చర్య ఆరోపణలు ఉన్నాయి. కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. ఇలా ఇన్ని సర్పాలు తనని కాటేసేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో పత్తిపాటి పుల్లారావు అసలు బయటకు రాకపోవడం లోఎటువంటి విచిత్రం లేదనే చెప్పాలి. మరి అసలు ఆయనపై ఉన్న ఆరోపణలు నిజమా కాదా అన్న విషయం తెలియాలంటే ఆయన బయటికి వచ్చి సమాధానం చెప్పి తీరాల్సిందే…. లేకపోతే మనకు ఎలా తెలుస్తుంది..?

ఈ సారి జగన్ సెగ డైరెక్ట్ కోర్టుకే తగిలింది..! అంత తొందర ఏల నాయకా…?

ఆంధ్రప్రదేశ్ లో వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుండి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. గవర్నర్ ఆమోదించడంతో విశాఖకు రాజధాని తరలించేందుకు జగన్ సర్కారు ఇటీవల వేగం పెంచింది. విపక్షాలకు చెక్ పెడుతూ నిర్ణయం తీసుకున్న జగన్ ఇప్పుడు కూడా హైకోర్టు వారి నిర్ణయాన్ని ఛాలెంజ్ చేసే దిశగా ప్రయాణిస్తున్నాడు. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా అత్యవసర విచారణ చేపట్టాలని ప్రధాన న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది.

 

ఇదిలా ఉండగా మూడు రాజధానులు బిల్లు ను గవర్నర్ ఆమోదించినా…. ఏపీ హైకోర్టు మాత్రం ఈ నెల 14 వరకు స్టేటస్ కో విధించిన విషయం తెలిసిందే. దీని పై స్టే విధించాలని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే విచారణకు రాకపోవడంతో అత్యవసరంగా విచారించాలని సుప్రీంకోర్టు వారికి జగన్ రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశం అయింది. కరోనా సంక్షోభ సమయంలో అసలు ఈ రాజధాని గొడవ ఏమిటంటూ రాష్ట్ర ప్రజలు మరోపక్క ఆశ్చర్యపోతున్నారు. అంత అత్యవసర విచారణ జగన్ కు అవసరం ఏముందని ఇక్కడి ప్రశ్న? ఆగస్టు 16న ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ రాజధాని శంకుస్థాపన చేయాలని జగన్ నిర్ణయించుకున్నారని… దాని కోసం కోర్టు వారిని పట్టుబట్టేందుకు సిద్ధపడ్డారన్న మాటలు వినిపిస్తున్నాయి.

ఇక ఇదే సమయంలో ఏపీ పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు పై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఎత్తివేయాలంటూ ఏపీ ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ కు లేఖ రాసింది. ప్రతివాదులకు పిటిషన్ కాపీ పంపినందున వీలైనంత త్వరగా కేసుపై విచారణ జరపాలని ప్రభుత్వం లేఖలో కోరింది. అసలు ప్రతివాదులకు పిటిషన్ పంపడం ఆనవాయితీ అయినా దానివల్ల విచారణ త్వరగా జరపాలని ప్రభుత్వం కోరడంతో ఇప్పుడు ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో స్పీకర్ ను తొందర పెట్టినట్లు, గవర్నర్ ను ఇబ్బంది పెట్టినట్లుగా న్యాయస్థానాలను కూడా జగన్ ఇలా తొందర పెట్టడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరి దీనికి వైసిపి సపోర్టర్ల మాట ఏమిటో చూడాలి.

నిజంగానే ఎన్నికల కోసం ఆ హీరోయిన్ ని వాడుకుంటున్నారా…?

ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యను రాజకీయం చేస్తున్నారని ఆరోపణలు ముందు నుండి వస్తున్నాయి. హత్య జరిగి చాలా రోజులు అయిన తర్వాత బీహార్ అసెంబ్లీలో అతని టాపిక్ లేవనెత్తడం ఇక సీబీఐ విచారణకు పట్టుబట్టడం వంటివి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది అని పలువురు ఆరోపిస్తున్నారు.

 

ఇదే సమయంలో రాజకీయంగా లబ్ధి పొందేందుకే తనను సుశాంత్ ఆత్మహత్య కేసులో ఇరికిస్తున్నారని సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రబోతి చెప్పారు. ఈ విషయంలో కొన్ని మీడియా వర్గాలు ఇప్పటికే తనను దోషిగా నిర్ధారించేశాయి అని…. తన విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆమె వాపోతోంది. ఈ మేరకు మీడియా ట్రయల్ ను నిరసిస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రియా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని తనను ఇరికించి వారు పబ్బం గడుపుతున్నారని అంటోంది. బీహార్ లో తన పై ఎఫ్ఐర్ నమోదు కావడం కూడా రాజకీయంలో భాగమేనని ఆరోపిస్తోంది.

తనను ఇలా బలి చేయడం ఎంతవరకు సమంజసం అని తన పిటిషన్ లో ప్రతి ఒక్కటీ పేర్కొందని సమాచారం. ఇదివరకు మీడియా వారు 2జీ స్క్యామ్ తదితర వాటిల్లో అనేకమంది దోషులు అని మీడియా ప్రచారం చేసి ఆ తర్వాత వాళ్లందర్నీ కోర్టు తీర్పు ద్వారా నిర్దోషులుగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసింది. వందల వేల కోట్ల స్కాం లో ని విచారణలో సిబిఐ వంటి సంస్థలు జోక్యం చేసుకున్న తర్వాత కూడా పూర్తి కాలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఒక పక్క విచారణకు హాజరు అవుతూ ఆమె ఈ పిటిషన్లు దాఖలు చేయడం గమనార్హం.

స్వర్ణా ప్యాలెస్ ప్రమాదానికి బాధ్యులు ఎవరు?


విజయవాడలో జరిగిన స్వర్ణా ప్యాలెస్ (కోవిడ్ ఆసుపత్రి)లో అగ్ని ప్రమాదానికి ఎవరి వారే మా తప్పు లేదంటే… మా తప్పు లేదంటూ తప్పించుకోవాలని చూస్తున్నారు. ప్రభుత్వం తమ తప్పు లేదని ఇది ప్రభుత్వ ఆసుపత్రి కాదని చెబుతుంది. ప్రైవేటు ఆసుపత్రి కావడంతో… ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని తేల్చింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మీడియా సమావేశంలో విషయాన్ని వెల్లడించారు. ఆసుపత్రి యాజమాన్యం మాత్రం సంఘటనలో తమ తప్పు లేదని ప్రకటించింది. మహాత్మాగాంధీ రోడ్డులోని రమేష్ ఆసుపత్రిలో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేసినా అక్కడ 30 బెడ్ లు మాత్రమే ఉండటంతో పేషంట్ల నుంచి చికిత్సకు వినతులు ఎక్కువ అవడంతో స్వర్ణా ప్యాలెస్ హోటల్ ను అద్దెకు తీసుకుని ప్రభుత్వ అనుమతితోనే కోవిడ్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Also Read: ఇంతకీ ఆ గుమ్మడికాయల దొంగ ఎవరు నాగబాబు…?

ఆసుపత్రి యాజమాన్యం స్వర్ణపాలెస్ ను అద్దెకు తీసుకునేటప్పుడు ప్రమాదం జరిగినప్పడు అత్యవసర పరిస్థితి నెలకొంటే బయటకు వెళ్లేందుకు ఉన్న మార్గాలు, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అలారం, మంటలు ఆర్పేందుకు అవసరమైన పరికరాలు అందుబాటులో ఉన్నాయో లేదో చూడాల్సిన బాధ్యత ఆసుపత్రి యాజమాన్యానికి ఉండదా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. హోటల్ యాజమాన్యం మాత్రం ప్రమాదంపై ఇప్పటి వరకూ స్పందించలేదు. దీంతో ఆసుపత్రి యాజమాన్యం ప్రమాదానికి మా బాధ్యత లేదని తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కంప్యూటర్ రూం లో షార్ట్ సర్య్కూట్ కారణంగా మంటలు వ్యాప్తి చెంది రబ్బరు మాట్ లకు అంటుకోవడం అవి పెద్దవై పర్నీచర్కు వ్యాపించడం, అక్కడ నిల్వ ఉంచిన శానిటైజర్ లకు వ్యాప్తించి మంటలు మరింత తీవ్ర స్థాయికి చేరుకోవడం జరిగినట్లు ప్రాధమిక విచారణలో పోలీసులు తేల్చారు.

రమేష్ ఆసుపత్రి నిర్వహిస్తున్న ఈ కోవిడ్ సెంటర్ కు అనుమతి విషయంలో భిన్న వాదనలు ఉన్నాయి. రమేష్ ఆసుపత్రి యాజమాన్యం ప్రభుత్వ అనుమతితో కోవిడ్ ఆసుపత్రి నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మాత్రం తాము ఇక్కడ ఆసుపత్రి నిర్వహించేందుకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఇక్కడ కోవిడ్ ఆసుపత్రి ఉన్నట్టు తమ దృష్టికి రాలేదని రెవెన్యూ అధికారులు అంటున్నారు. కోవిడ్ ఆసుపత్రి నిర్వహించాలంటే అగ్నిమాపక శాఖ అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉందని, తాము ఈ కోవిడ్ సెంటర్ కు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జయరాం తెలిపారు. ఈ వ్యవహారం చూస్తుంటే ఇందులో ఎన్నో లొసుగులు ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: అమరావతి ప్రజలకు షాక్ ఇచ్చేలా జగన్ బంపర్ ఆఫర్…!

రమేష్ ఆసుపత్రి యాజమాన్యం విజయవాడ నగరంలో మొత్తం ఏడు హోటళ్లను అద్దెకు తీసుకుని కోవిడ్ కేర్ సెంటర్ లను నిర్వహిస్తున్న వెల్లడలయ్యింది. ఇప్పుడు వీటిలో ఎన్నింటికి ఆనుమతులు ఉన్నాయనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. రమేష్ ఆసుపత్రికి ఉన్న పేరుప్రతిష్టల కారణంగా ఈ సంస్థ నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్ లలో అధిక సంఖ్యలో కోవిడ్ రోగులు చేరుతున్నారు. వీరి వద్ద నుంచి రోజుకు రూ.35 నుంచి 55 వేలు వరకూ వసూలు చేస్తున్నారు. ఒక్కో రోగి నుంచి సుమారు రూ. 5 నుంచి 10 లక్షలు చికిత్స పూర్తయ్యే నాటికి వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్వర్ణా ప్యాలెస్ ప్రమాదంలో ఏ1 గా రమేష్ ఆసుపత్రి, ఎ2 గా స్వర్ణా ప్యాలెస్ హోటల్ పేర్కోంటూ స్థానిక తహశీల్దారు ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేశారు.

కియారా జోరు మామూలుగా లేదుగా..


కియారా… కియారా. బాలీవుడ్‌లో ఇప్పుడు ఈ పేరు మార్మోగుతుంది. వెబ్‌ సిరీస్‌లు అయినా… స్ట్రెయిట్‌ మూవీస్‌ అయినా.. దర్శకుల ఫస్ట్‌ చాయిస్‌ ఆమెనే అవుతుంది. 2014లో వచ్చిన హిందీ కామెడీ సినిమా ‘ఫుగ్లీ’తో వెండి తెరకు పరిచయమైంది ఈ ముంబై ముద్దుగుమ్మ. అయితే, కియారా మొదటి ఐదేళ్లలో చేసింది ఐదు సినిమాలే. కానీ, గత రెండేళ్లలోనే ఆమె ఆరు చిత్రాలు చేసింది. మరో నాలుగు సినిమాల్లో నటిస్తోందంటే బాలీవుడ్‌లో ఆమె జోరు ఎలా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. 2018లో మహేశ్‌ బాబు సరసన ‘భరత్‌ అనే నేను’తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఆమె గతేడాది రామ్‌ చరణ్‌తో ‘వినయ విధేయ రామ’లో కూడా నటించింది. కానీ, ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్‌పైనే దృష్టి పెట్టిందామె.

Also Read: కరోనా – బాలయ్య మధ్యలో బోయపాటి !

అర్జున్‌ రెడ్డి హిందీ రీమేక్‌ ‘కబీర్ సింగ్‌’ హిట్‌తో కియారా లైఫ్‌ టర్న్‌ అయింది. అగ్ర దర్శకులు, హీరోలు ఆమె వెంట పడుతున్నారు. ప్రస్తుతం ఇందూకీ జవానీ, భూల్‌ భులయ్యా 2, షేర్ షా, లక్ష్మీ బాంబ్‌ అనే సినిమాల్లో నటిస్తోందామె. అన్నీ భారీ చిత్రాలే. ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ఆమెను వరించింది. వరుణ్ ధావన్‌ హీరోగా రాజ్‌ మెహతా దర్శకత్వం వహించే చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. కరణ్ జోహార్ నిర్మించే ఈ చిత్రంలో అనిల్‌ కపూర్, నీతూ సింగ్‌ కూడా కీలక పాత్ర పోషించనున్నారు. ప్రి ప్రొడక్షన్‌ పనుల్లో ఉన్న మూవీ నవంబర్ లో సెట్స్‌పైకి వెళ్లనుంది. అక్షయ్‌ కుమార్ హీరోగా నటించిన హిట్‌ మూవీ ‘గుడ్‌ న్యూస్‌’లో కియారా ప్రదర్శన మెచ్చిన రాజ్‌ మెహతా ఆమెకు చాన్స్‌ ఇచ్చాడు. దాంతో, ఈ ఏడాది ఆమె ఏడో సినిమాకు సైన్‌ చేసినట్టయింది.

Also Read: రెమ్యునిరేషన్ పెంచితే న్యూడ్ సీన్స్ కైనా రెడీ !

ఇప్పటికే నెట్‌ ఫ్లిక్స్ ‌మూవీ గిల్టీ, అంగ్రేజీ మీడియం (స్పెషల్‌ సాంగ్‌)తో విజయాలు సొంతం చేసుకున్నాయి. అక్షయ్‌ కుమార్ సరసన నటించిన లక్ష్మీ బాంబ్‌తో పాటు ఇందూకీ జవానీ చిత్రకరణ జరుపుకొని రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా.. షేర్షా పోస్ట్ ప్రొడక్షన్‌ దశలో ఉంది. భూల్‌ భులయ్యా చిత్రీకరణ కరోనా కారణంగా ఆగింది. కియారా జోరు చూస్తుంటే ఈ మరికొన్ని ప్రాజెక్టులకు ఓకే చెప్పి ఒకే ఏడాది పది సినిమాలు చేసిన రికార్డు సొంతం చేసుకునేలా కనిపిస్తోంది. ఆమె ఊ అనాలే గానీ హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ్‌లోనూ ఆఫర్లు క్యూ కడతాయి. తెలుగులో ఇప్పటికే పలు చిత్రాల్లో కియారా పేరు వినిపించింది. కానీ, బాలీవుడ్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టిన ఈ ముంబై బ్యూటీకి దక్షిణాది కథలు వినే తీరిక కూడా లేదట. కియారా జోరు చూసి పలువురు స్టార్ హీరోయిన్లు, స్టార్ కిడ్స్‌ సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇదే ఊపు కొనసాగిస్తే మరో ఏడాదిలో కియారా బాలీవుడ్‌ అగ్ర కథానాయికగా మారిన ఆశ్చర్యం లేదు.

సోము వీర్రాజు ముందున్న సవాళ్లేంటి?


‘2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా బీజేపీకి వచ్చిన ఓటు బ్యాంకు శాతం దాదాపు 0.96శాతం. అంటే కనీసం 1 శాతం కూడా ఓట్లు రాని బీజేపీ 2024లో అధికారంలోకి వస్తుందా? కొత్తగా బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన ఎమ్మెల్సీ సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో బలమైన వైసీపీ, టీడీపీలను తోసి బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చే సత్తా సోము వీర్రాజులో ఉందో లేదో తెలుసుకుందాం..’

Also Read: అమరావతి ప్రజలకు షాక్ ఇచ్చేలా జగన్ బంపర్ ఆఫర్…!

ప్రస్తుతం సీఎం, వైసీపీ అధినేత జగన్ బలంగా ఉన్నారు. ఆయన ధాటికి తరతరాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న కమ్మ సామాజికవర్గం కకావికలం అవుతోంది. కమ్మనేతలు, టీడీపీ నేతలు భారీగా పెట్టుబడి పెట్టిన అమరావతి సౌధాన్ని కూల్చి విశాఖకు వెళుతున్న జగన్ వల్ల కమ్మ వారి వ్యాపారాలు, బలమైన మీడియా దారుణంగా దెబ్బతింది. కరోనాతో మునుపెన్నడూ లేని విధంగా టీడీపీ మీడియా కుదేలైంది. ఇన్ని ఉపద్రవాల మధ్య వయోభారంతో టీడీపీ అధినేత చంద్రబాబు చేతిలో ఆ పసుపు పార్టీ నిలబడలేకపోతోంది. దీంతో వైసీపీని ఎదుర్కొనే బలం.. బలగం టీడీపీకి లేకుండా పోతోందన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరి ఇంతటి బలమైన వైసీపీని ఢీకొట్టే సత్తా ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మాత్రమే ఉందా? అంటే రాజకీయాలు కలిసివస్తే ఏదైనా సాధ్యం కావచ్చు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎందుకంటే ప్రస్తుతం సీఎం జగన్ మెడ చుట్టూ కేసులున్నాయి. ఈడీ,సీబీఐ చేతిలోనే అవి ఉన్నాయి. దీంతో సోము వీర్రాజు ఇటీవల ఓ చానెల్ తో మాట్లాడుతూ.. ‘తమకు టీడీపీ, వైసీపీ రెండు కళ్లు.. రెండు తమకు ఏపీలో శత్రువులే.. ఏదీ తమకు దగ్గరిది కాదు.. తాము మూడో కన్ను తెరిస్తే ఖచ్చితంగా ఏపీలో అధికారంలోకి వస్తాం’ అని వివరించారు. దీన్ని బట్టి ఆయన మూడోకన్ను చంద్రబాబు, వైసీపీ బలహీనతలే అని అర్థం చేసుకోక తప్పదు.

ఏపీలో టీడీపీపై నేతల్లోనూ.. ప్రజల్లోనూ నమ్మకం సడలుతోంది. అందరూ వైసీపీ, బీజేపీ వైపు చూస్తున్నారు. చంద్రబాబు నాయకత్వంపై అపోహలు పెరుగుతున్నాయి. ఆయన పుత్రరత్నం లోకేష్ బాబు శక్తిసామర్థ్యాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిందని ఆ పార్టీ నేతలే అంటున్నారు.ఈ క్రమంలోనే వైసీపీ అంటే పడని వారి చూపు ఇప్పుడు మొత్తం బీజేపీ వైపే ఉంది. జనసేనాని పవన్ పార్ట్ టైం పాలిటిక్స్ పై ఎవరికీ నమ్మకం లేదు. సో ఏపీలో వైసీపీకి ప్రత్యామ్మాయం బీజేపీనే కనిపిస్తోంది.

Also Read: ‘జగన్ గారూ… మనం వరస్ట్?’ అటగా..!

ఇక కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు దూకుడుగా వెళ్తున్నారు. అటు పార్టీలో టీడీపీ వంత పాడేవారిని సస్పెండ్ చేస్తూనే.. ఇటు పార్టీని బలంగా తయారు చేసేందుకు కాపు నేతలను ఒక్కటి చేస్తున్నారు. బీజేపీలో ఉన్న టీడీపీ సానుభూతి పరుల నోళ్లు మూయిస్తున్నారు. ఇన్నాళ్లుగా పడిన బీజేపీపై టీడీపీ ముద్ర లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్ ను కలిసి ఏకతాటిపైకి తెచ్చాడు. తాజాగా ముద్రగడ, మాజీ జేడీ లక్ష్మీనారాయణతో భేటికి నిర్ణయించారని తెలిసింది. ఇలా అందరూ కాపు, దిగ్గజ నేతలను ఒక్కతాటిపైకి తెచ్చి మూడో ప్రత్యామ్మాయంను ఏపీలో తీసుకొచ్చి అధికారమే లక్ష్యంగా సోము వీర్రాజు ముందుకెళ్తున్నారు.

బీజేపీ ముందర ఇప్పుడు కేంద్రంలో అధికారమే బలంగా ఉంది. మంచి నాయకత్వం ఉంది. జగన్, చంద్రబాబుల మెడకు కేసుల ఉచ్చులు ఉండడం ఆ నేతలకు మైనస్ గా మారింది. రాబోయే ఎన్నికల నాటికి బీజేపీ బలపడాలని చూస్తోంది. ఈ క్రమంలోనే జగన్, చంద్రబాబులను సైడ్ చేయడం పెద్ద విషయం కాదు. అదే సమయంలో ఓటు బ్యాంకును 0 నుంచి పెంచుకోవడం బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ముందున్న అసలు సవాల్. ముఖ్యంగా బలమైన సామాజికవర్గంగా ఉన్న కాపులను ఒక్కతాటిపైకి తేవడం.. టీడీపీకి దూరమైన బీసీలను కలుపుకోవడం.. యువ నాయకత్వం.. కొత్త వారికి అవకాశాలు ఇస్తే బీజేపీ ఏపీలో నిలబడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మతతత్వ, హిందుత్వ భావజాలం లేని ఏపీలో బీజేపీ ఎదుగుదల అంటే కొద్దిగా కష్టమన్న భావన ఉంది. ఉత్తరాధితో పోలిస్తే ఏపీలో ఆ సెంటిమెంట్ వర్కవుట్ కాదు. సాంఘిక పరిస్థితులు ఏపీలో ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. అందుకే అభివృద్ధి , అసమానతలు తొలగింపే లక్ష్యంగా సోమువీర్రాజు ముందుకెళుతానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Also Read:ఇంతకీ ఆ గుమ్మడికాయల దొంగ ఎవరు నాగబాబు…?

ముఖ్యంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ, తీరప్రాంతం సహా రైతాంగం.. అభివృద్ధి విషయంలో తన వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందని సోము వీర్రాజు పేర్కొన్నారు. పైగా కుటుంబ పాలనకు అతీతంగా ఏపీలో బీజేపీ మాత్రమే ఉందన్న ఆయన వాదన సరైందే. ఈ నేపథ్యంలోనే ఇన్ని అంశాలు మేళవింపుగా సోము వీర్రాజు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది.

ఇక అంతిమంగా ఏపీలో బీజేపీ-జనసేన కలిసి పోటీచేయబోతున్నాయి. దీనికి ముద్రగడ, జేడీ లక్ష్మీనారాయణ సహా పలువురు కీలక నేతల మద్దతు కూడగడితే సోము వీర్రాజు అధికార లక్ష్యం నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకు అకుంఠిత దీక్ష, అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం అవసరం. ఈ క్రమంలోనే ఆ దిశగా సోము వీర్రాజు ఎంత వరకు సక్సెస్ అవుతాడన్నది వేచిచూస్తూ.. బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న సోము వీర్రాజుకు ఆల్ ది బెస్ట్ చెబుదాం..

-నరేశ్

మహేశ్‌ మూవీపై బాలీవుడ్‌ స్టార్ కన్ను!

భారత చిత్ర పరిశ్రమలో భాష, ప్రాంతీయ హద్దులు తొలగిపోయాయి. ఒకప్పుడు బాలీవుడ్‌ మూవీస్‌ ఇతర భాషల్లో డబ్‌ లేదా రీమేక్‌ అవడం సాధారణం. కానీ, ఇప్పుడు ప్రాంతీయ భాషల సినిమాలు హిందీకి వెళ్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది హిట్‌ చిత్రాలు బాలీవుడ్‌లో రీమేక్‌ల బాట పడుతున్నాయి. గతంతో పోల్చితే ఆ జాబితాలో ఈ మధ్య తెలుగు సినిమాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది.

Also Read: మాజీ మిస్ ఇండియా వరల్డ్ కు కరోనా.. ఆందోళనలో ఫ్యాన్స్

‘బాహుబలి’ వచ్చిన తర్వాత తెలుగు ఇండస్ట్రీపై ఉన్న చులకన భావం పోయింది. చాలా మంది బాలీవుడ్‌ బడా నటులు తెలుగులో నటిస్తున్నారు. ఇక్కడి హిట్‌ చిత్రాలను అక్కడ రిమేక్‌ చేసేందుకు పోటీ పడుతున్నారు. రీసెంట్‌గా అర్జున్‌ రెడ్డి.. కబీర్ సింగ్‌గా రీమేక్‌ అయి భారీ విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నువ్వోస్తానంటే నేనొద్దంటానా, వర్షం, పరుగు, క్షణం, కిక్‌, విక్రమార్కుడు, మర్యాద రామన్న.. వంటి చిత్రాలు బాలీవుడ్‌లో రీమేక్‌ అయి ప్రేక్షకులను అలరించాయి.

వీటికంటే ముందు మహేశ్‌ బాబు సూపర్ హిట్‌ మూవీ ‘పోకిరి’ని సల్మాన్‌ ఖాన్‌ ‘వాంటెడ్‌’గా తీసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మహేశ్‌ మరో మూవీ కూడా బాలీవుడ్‌ బాట పట్టనుంది. మహేశ్‌, సమంత హీరోయిన్లుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘దూకుడు’ తెలుగు బ్లాక్‌ బస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీనే ఇప్పుడు బాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఈ చిత్రం రైట్స్‌ ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ కొనగోలు చేసింది. స్టార్ హీరో అజయ్‌ దేవగణ్‌తో దీన్ని రీమేక్‌ చేయాలని చూస్తోందని సమాచారం.

Also Read: రెమ్యునిరేషన్ పెంచితే న్యూడ్ సీన్స్ కైనా రెడీ !

వాస్తవానికి ‘దూకుడు’ రీమేక్‌కు మొదట సల్మాన్‌ ఖాన్‌ను అనుకున్నారట. కానీ, ఇతర కారణాల వల్ల అతను ముందుకు రాకపోవడంతో అజయ్‌ దేవగణ్‌కు సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న అజయ్‌.. దూకుడు గురించి తెలుసుకొని ఓకే చెప్పినట్టు సమాచారం. సౌత్‌ మూవీస్‌ రీమేక్‌కు అతనికి కొత్తేం కాదు. ఇదివరకు సూర్య హీరోగా నటించిన ‘యముడు’ను అజయ్‌.. ‘సింగం’ పేరుతో రీమేక్‌ చేసి హిట్‌ కొట్టాడు. ఇప్పుడు దూకుడు రీమేక్‌తో అతని ఖాతాలో మరో 100 కోట్ల హిట్‌ పడడం పక్కా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అమరావతి ప్రజలకు షాక్ ఇచ్చేలా జగన్ బంపర్ ఆఫర్…!

AP people are saying that CM Jagan is wrong ..?
AP people are saying that CM Jagan is wrong ..?


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితికి తగ్గట్టు వ్యవహరించడంలో బాగా రాటుదేలిపోయాడు. ప్రస్తుతం కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లా వాసులు రాజధాని విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పై మండిపడుతున్నారు. ఇక అమరావతి రాజధాని ప్రాంత ప్రజలు అయితే తమను మోసం చేశారని రైతుల వద్ద భూములు తీసుకొని ఇప్పుడు అన్యాయం చేశారని తిట్టిపోస్తున్నారు. ఇలాంటి సమయంలో అసలు అటువైపు కన్నెత్తి చూడడానికి కూడా ఏ వైసిపి నేత సిద్ధంగా లేరు.

ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ క్లిష్టమైన పరిస్థితి నుంచి బయటపడేందుకు టిడిపి లీడర్ లకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. అది కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేతలకు అయితే నెక్స్ట్ లెవెల్ ఫేవర్స్ వైసీపీ ప్రభుత్వం నుండి రానున్నాయి. విషయమేమిటంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన టిడిపి వారు వైసీపీ కండువా కప్పుకుంటే వారికి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలలో ఏదో ఒక కీలకమైన అధికార పార్టీ తరఫున ఇస్తారు. అలాగే వారికి టికెట్లు, మంత్రి పదవి కూడా ఖాయం అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

పదవిలో లేకపోయినా ఆ నాయకుడు చేయాల్సింది ఏమిటంటే.. పైన చెప్పబడిన మూడు జిల్లాల్లో ఎక్కువగా ఉండే కమ్మ సామాజిక వర్గం వారి నుండి వచ్చే నేతలు మాత్రం అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చేలా ఇంకా ప్రతిపక్షం వైపుకి సమస్యను మళ్ళించేలా వ్యవహరించాలని జగన్ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే తమ పార్టీ నుండి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి ముఖ్య పదవులు ఇచ్చి మంచి స్థానాల్లో నిలబెడితే అమరావతి రైతుల నుండి వ్యతిరేకత ఎంతో కొంత తగ్గుతుంది అన్నది జగన్ వ్యూహంలా కనిపిస్తోంది. దీనికోసమే టిడిపి నుండి వచ్చే ఎవరికైనా ఈ బంపర్ ఆఫర్ రెడీగా ఉందని వచ్చి రెండు చేతులు చాచి అందిపుచ్చుకోవడమే లేట్ అని అని వైసీపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.