Home Blog Page 8327

ముఖేశ్‌ ఫ్యామిలీ లగ్జరీ లైఫ్‌ అంచనా వేయగలమా..!

Mukesh Ambani
రిలయన్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపనీస్‌ నుంచి ఇద్దరు అన్నదమ్ములైన అనిల్ అంబానీ, ముఖేశ్‌ అంబానీ ఏళ్ల క్రితమే విడిపోయారు. దీంతో ముఖేశ్‌ అంబానీ జియో కమ్యూనికేషన్‌ను స్టార్ట్‌ చేశారు. ఇప్పుడు ఆ జియో కమ్యూనికేషన్‌ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. గ్రామాల స్థాయి వరకూ ఇప్పుడు ఇంటర్నెట్‌ చేరిందంటే ఆ క్రెడిట్‌ జియోదే అని చెప్పాలి.

Also Read: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్

అలా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ ముఖేశ్‌ అంబానీ కోట్లకు పడగలెత్తారు. అపర కుబేరుడిగా ఘనత సాధించారు. ప్రపంచ కుబేరుల్లో ఆరో స్థానంలో నిలిచారు. భారతదేశంలో అత్యంత ధనవంతుడిగానూ కొనసాగుతున్నారు. బడా వ్యాపార వేత్త.. బిలియనీర్‌‌గా ప్రఖ్యాతలు గడించిన అంబానీ ఫ్యామిలీ ఎంత లగ్జరీగా ఉంటుందో అంచనా వేయగలమా. ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్ కిషోర్ బియానీ ఫ్యూచర్ గ్రూప్‌ను రూ.24,713 కోట్లకు కొనుగోలు చేసిందని ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. ఈ మొత్తం నికర విలువ 79.7 బిలియన్ డాలర్లలో స్వల్పంగా మాత్రమే తగ్గింది.

ముఖేశ్ అంబానీ బిజినెస్ వ్యవహారాల మాట అటుంచితే.. అంబానీ ఫ్యామిలీ లగ్జరీ లైఫ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతో విలాసవంతంగా ఉంటుంది. అంబానీ కొనుగోలు చేసిన కొన్ని ఖరీదైన వస్తువులకు ఇంట్రెస్టింగ్‌ విషయాలు ఎన్నో ఉన్నాయి. సామాన్యుడు కూడా ఊహించలేని అందులో ఆ ఐదు ఖరీదైన అంబానీ సొంతమైన వాటి గురించి తెలుసుకుందాం..

కొన్ని రోజుల క్రితం, ఫోర్బ్స్ మ్యాగజైన్ 20 బిలియనీర్ల గృహాల జాబితాను విడుదల చేసింది. ఆ ఫోర్బ్స్ జాబితాలో అంటిలియా అగ్రస్థానంలో నిలిచింది. ఒక బిలియన్ డాలర్ల విలువైన ఈ 27 అంతస్తుల భవనం ఎవరిదో కాదు.. ముంబైలోని ముఖేష్ అంబానీ ఫ్యామిలీ నివాసం. ఇందులో 9 హై-స్పీడ్ ఎలివేటర్లు, గ్రాండ్ బాల్రూమ్, థియేటర్, స్పా, టెంపుల్, మల్టీ టెర్రస్ గార్డెన్లు ఉన్నాయి. అంటిలియా భవనంలో చల్లని పిల్లగాలుల్లా వీచే స్నో రూమ్ ఆకర్షణీయంగా ఉంటుంది. అంటిలియాలో కృత్రిమంగా మంచు కురుస్తున్న ఫీలింగ్ అనిపిస్తుంటుంది. చల్లగా ఉండే ఆ గదిలోకి వెళ్లగానే మంచు ప్రదేశంలో తేలియాడుతున్న ఫీలింగ్‌ వస్తుంది. భారతదేశంలో అంబానీ స్నో రూమ్ చాలా స్పెషల్. ఇందులో 168 కార్ల వరకు పార్క్ చేయొచ్చు. దీని పైకప్పుపై మూడు హెలిప్యాడ్లు ఉన్నాయి.

Also Read: రామ మందిరం ఓకే.. మరి బాబ్రీ నిర్మాణం ఎలా ఉండబోతోంది..?

ఎంతో ఖరీదైన బుల్లెట్ ప్రూఫ్ BMW కారును ఇటీవలే అంబానీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ముఖేష్ అంబానీ సుమారు రూ.8.5 కోట్ల విలువైన బుల్లెట్ ప్రూఫ్ కారు BMW 760Li కారును వాడుతున్నారు. BMW ఫ్యూయిల్ ట్యాంక్ ఆటోమాటిక్ -సీలింగ్ కెవ్లార్‌తో తయారు చేశారు. మంటలు కూడా అంటుకోదు. ప్రతి విండో 65 మి.మీ మందంతో బుల్లెట్ ప్రూఫ్ 150 కిలోల బరువు ఉంటుంది. ముఖేష్, నీతా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ద్వారా నాలుగు సార్లు ఐపీఎల్, రెండుసార్లు CLT20 ఛాంపియన్స్, ముంబై ఇండియన్స్ (MI)లకు ప్రాంచైజీగా వ్యవహరిస్తోంది. ఈ టీమ్ 2008లో ఏర్పడింది. 2017లో 100 మిలియన్ డాలర్ల విలువను అధిగమించిందని ది ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. ముఖేష్ అంబానీ ఫోర్బ్స్ ది వరల్డ్స్ రిచెస్ట్ స్పోర్ట్స్ టీం ఓనర్స్ జాబితాలో 2019లో ముంబై ఇండియన్స్‌ టీంతో ముఖేశ్ టాప్ ర్యాంకులో నిలిచారు.

కేసీఆర్ రెవిన్యూ ప్రక్షాళన విప్పిన ఫామ్ హౌస్ గుట్టు..!

 

No Buyers For KCR's Ginger | KCR Worried About His Ginger Farm

“కెసిఆర్”, “ఫామ్ హౌస్” ఈ రెండు పదాలను చాలా రోజులుగా మనం కలిపే వింటున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వంద ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. అందులో ఎకరన్నర విస్తీర్ణంలో ఒక భారీ భవంతి కూడా ఉంది. అయితే ఈ 100 ఎకరాల్లో కేసీఆర్ కే కాదు. అతని కొడుకు కేటీఆర్ కూడా వాటా ఉంది. చివరికి ఈ విషయాన్ని స్వయంగా కేటీఆర్ విడమర్చి చెప్పే పరిస్థితి వచ్చింది. దీనంతటికీ కారణం అతను తన రాష్ట్రంలో విప్లవాత్మకంగా తీసుకురావాలనుకుంటున్న రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన అంశమే అని అర్థమవుతోంది. గతంలో ఈ అంశానికి సంబంధించి కిందిస్థాయి వ్యక్తుల వద్ద ఫీడ్ బ్యాక్ తీసుకున్న కేసీఆర్ ఇప్పుడు కిందిస్థాయి సిబ్బందితో ప్రక్షాళన అంశాలను డిస్కస్ చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామపంచాయతీ కార్యదర్శి రమాదేవికి సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి ఇళ్ల నిర్మాణం, అనుమతులు, పన్నులు వంటి విషయాలపై మాట్లాడారు. ఇదే సందర్భంలో పొలంలో కట్టుకున్న ఇల్లు నమోదు చేసుకోవడానికి ఎవరూ ఇష్టపడటం లేదని…. ఆ పంచాయతీ కార్యదర్శి చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ తన సొంత ఫామ్ హౌస్ ప్రస్తావన తీసుకువచ్చారు. అసలు పొలంలో కట్టిన ఇళ్ళు ని నమోదు చేసుకోవడానికి ఎవరూ ముందుకు రానున్న తరుణంలో తన ఫాంహౌస్ ఎంత ఉంది…. అందులో ఎంత స్థలం లో ఇల్లు ఉంది దానికి పర్మిషన్ ఎలా తెచ్చుకున్నాడు అనే వివరాలను ఆమెకు చెప్పారు. దీంతో పొలం లో ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్న వారు ఇవన్నీ తీసుకోవాల్సిందేనని లేకపోతే ఇబ్బంది పడతారని ఆయన సూచించారు.

ముందు నుండి ఈ ఫామ్ హౌస్ పై ఎన్నో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే చాలా సందర్భాల్లో అమెరికాలో ఉద్యోగం చేసిన కేటీఆర్ అలా వచ్చిన సొమ్ముతో దీనిని కొనుగోలు చేశారని చెబుతారు. అయితే ఎలక్షన్ అఫిడవిట్ లో కేసీఆర్ పేరు మీద కూడా కొన్ని భూములు ఉన్నట్లు పేర్కొన్నారు. మరి కేటీఆర్ ఉద్యోగం చేస్తేనే ఇవన్నీ కూడా వచ్చాయా..? ఇది ఎవరికీ తెలియదు. ఇక వంద ఎకరాల స్థలం…. అందులో ఒక డబల్ బెడ్ రూమ్ డూప్లెక్స్ హౌస్ కట్టుకునేంత కేటీఆర్ సంపాదించారా అని అనుమానం. ఇటీవల కాలంలో దాన్ని పడగొట్టి మళ్లీ పెద్ద ఇల్లు కట్టాడు. ఆ ఫోటోలు ఎలా ఉంటాయో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కానీ కేసీఆర్ నోటి నుండి మాత్రమే ఎకరన్నర విస్తీర్ణంలో ఆ ఇల్లు ఉంటుందని అన్న మాట వచ్చింది. మరి విపక్షాలకు ఈ మాత్రం చాలదా అతని పై రెచ్చిపోయేందుకు…

మావోయిస్టులు ఎందుకు కనుమరుగయ్యారు?

maoists
మావోయిస్టు ప్రభావిత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం ప్రభుత్వం  మావోయిజంపై  కొన్నేళ్ల క్రితమే మల్టీ వార్ ఫేర్ వ్యూహాన్ని  (బహుముఖ యుద్ధం).ప్రారంభించాయి. మావోయిజాన్ని అణచివేసేందుకు  ఆర్థికంగా(నిధులు అందకుండా ), భౌతికంగా(ఆయుధంతో అణచివేయడం ), మానసికంగా( క్యాడర్ ను గందరగోళానికి గురిచేయడం ) అనే బహుముఖ యుద్ధ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు విశ్లేషకులు  పేర్కొంటున్నారు. 
 

Also Read: నిరుద్యోగ తెలంగాణ

మాజీ సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004లో మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపిన కొద్ది నెలలకే, వివిధ  రాష్ట్రాల్లో వివిధ పేర్లతో ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న విప్లవ గ్రూపులన్ని నవంబర్ 2004 లో విలీనమై మావోయిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(మావోయిస్టు )గా ఏర్పడి ప్రభుత్వాలకు మింగుడుపడని విధంగా తయారయ్యారు. అప్పటికే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  నక్సల్స్ కార్యకలాపాలు పతాకస్థాయికి చేరాయి. గ్రామాల్లో అధికారపార్టీ ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి నెలకొంది. 
 
మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి  2004లో నక్సల్స్ సమస్య పరిష్కారానికి ఎస్ అర్  శంకరన్ (ఐ ఏ ఎస్)ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శాంతి చర్చల కమిటీ, నక్సల్స్ తో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అనంతరం జరిగిన ఎన్కౌంటర్లలో మావోయిస్టులు భారీఎత్తున క్యాడర్ ను కోల్పోయినా నక్సల్స్ కార్యకలాపాలు  తగ్గకపోగా, మరింతగా విస్తరించాయి.   1997లో గ్రే హౌండ్స్ సృష్టికర్త కె ఎస్ వ్యాస్ (ఐ పి ఎస్)ను, మరో ఐ పి ఎస్ అధికారి ఉమేష్ చంద్ర ను 1999లో హైదరాబాద్ నడిబొడ్డున నక్సల్స్ కాల్చి చంపారు.  1998లో అప్పటి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వ శాసనసభాపతి దుద్దిళ్ల శ్రీపాద రావును కిడ్నాప్ చేసి మంథని అడవుల్లో కాల్చి  చంపగా,తెలుగుదేశం ప్రభుత్వం లో హోం మంత్రిగా పనిచేసిన ఎలిమినేటి మాధవరెడ్డిని నడిరోడ్డుపై మందుపాతరతో పేల్చి హత్య చేశారు. తిరుపతిలో అలిపిరి వద్ద నవంబర్ 2003లో డైరెక్షనల్ ల్యాండ్ మైన్ తో అప్పటి సీఎం  నారా చంద్రబాబు నాయుడును చంపేందుకు చేసిన ప్రయత్నం,  ఆంధ్రప్రదేశ్ లో  నక్సల్స్ కార్యకలాపాల స్థాయికి నిదర్శనం. ఒకవిధంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులే నక్సల్స్ సమస్యతో నిర్బంధం లాంటి సమస్యను ఎదుర్కొన్నారు.  శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో మావోయిజం నిర్మూలనకు ఆర్థిక వనరులు అందే మార్గాలపై దెబ్బ కొడుతూనే,  భౌతిక దాడులతో తీవ్ర నిర్బంధాన్ని కొనసాగిస్తూ…  మావోయిస్టులపై మానసిక యుద్ధ వ్యూహాన్ని అమలు చేసేందుకు పోలీసులకు కావలసిన వరులను ప్రభుత్వాలు సమకూర్చాయి. 
 
మానసిక యుద్ధ వ్యూహంలో ప్రధానంగా… నాయకత్వానికి, క్యాడర్ కు మధ్య ఒకరిపై ఒకరికి అపనమ్మకం కల్గించడం. దళాల్లో డబ్బుకు లొంగిపోయేవారిని, విలాసవంతమైన జీవితం కోరుకునేవారిని గుర్తించి, వారితో కోవర్ట్ ఆపరేషన్ న్లు చేయించడం, లొంగుబాట పడుతున్నారంటూ ప్రచారం చేయడం  ఈ వ్యూహంలో ప్రధాన అంశం. 
 
ప్రస్తుత పెద్దపల్లి జిల్లా  కమాన్ పూర్ మండలం బేగంపేట రామగిరిఖిల  గుట్టపై జరిగిన “ఘటన” ఈ వ్యూహం అమలు చేసిన తర్వాత తెలంగాణలో  జరిగిన మొట్టమొదటి కోవర్ట్ ఆపరేషన్. దళం నిద్రిస్తుండగా సెంట్రీ విధులు నిర్వహిస్తున్న జడల నాగరాజు అనే దళసభ్యుడు దళంపై కాల్పులు జరిపి ఆయుధంతో పోలీసులకు లొంగిపోయాడు. ఈ కాల్పుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి విజయ్ చనిపోయాడు. రెండో ఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం శ్రీరాములపల్లిలో జరిగింది. మిరప చేనులో నిద్రిస్తున్న భూపతి దళాన్ని కత్తుల సమ్మయ్య, ఆయన భార్య, మరో సభ్యుడు విజయ్ లు భూపతితోపాటు మరో ఇద్దరు దళ సభ్యులను హతమార్చి పోలీసులకు లొంగిపోయారు. ఆ తర్వాత జరిగిన కోవర్ట్ ఆపరేషన్లతో మావోయిస్టు పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బతినగా, పోలీసులు భారీ విజయాలను చవిచూశారు.  అనతి కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల కార్యకలాపాలు నామమాత్రపు చర్యలకే ప్రరిమితమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల కట్టడికి అనుసరించిన వ్యూహాన్నే ,ఇప్పుడు దండకారణ్యంతో పాటు 19 రాష్ట్రాల్లో విస్తరించిన  మావోయిస్టులపై తెలంగాణ నమూనా (లొంగుబాట) మానసిక యుద్ధాన్ని  అమలు చేస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు .
 

Also Read: కేసీఆర్ రెవిన్యూ ప్రక్షాళన విప్పిన ఫామ్ హౌస్ గుట్టు..!

ఈ క్రమంలోనే,  దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల పోలీసు, నిఘా వర్గాలు “లొంగు బాట ” వ్యూహాన్ని  అమలుచేస్తున్నాయి . పార్టీ క్యాడర్ ను  గందరగోళానికి గురిచేసి నిజమేదో తెలుసుకునేలోపే టార్గెట్ ను దెబ్బతీసేలా , నిఘా వ్యవస్థలు పనిచేస్తున్నాయి.  అగ్రనాయకులను పసిగట్టి టార్గెట్ చేయడంలో తెలంగాణ పోలీసులది అందెవేసిన చేయి. 
 
90వ దశకంలో అప్పటి పీపుల్స్ వార్ పార్టీ బెంగుళూరు డెన్ కీపర్ గా  గోవిందరెడ్డి వ్యవహరించిన సమయంలో జరిగిన  ఎన్కౌంటర్ లో రాష్ట్ర కమిటీ కార్యదర్శి పులి అంజయ్య దంపతులతో పాటు, కొయ్యూరు ఎన్కౌంటర్ లో నల్లా ఆదిరెడ్డి, శీలం నరేష్ అగ్రనేతలతో పాటు మరో నేత  హతమయ్యారు. బెంగళూరు డెన్ ను పసిగట్టింది హైదరాబాద్ కు చెందిన  ఇంటలిజెన్స్ నిఘా బృందం. ఆనాటి బెంగళూరు సమావేశానికి లేటుగా వచ్చిన కేంద్ర కమిటీ సభ్యుడు,ప్రస్తుతం లొంగుబాట పట్టాడని ప్రచారం జరుగుతున్న  గణపతి  ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నాడని అప్పట్లో  ప్రచారమైంది.ఆనాటి ఎన్కౌంటర్ దేశ వ్యాప్తంగా సంచలమైంది. ఈ ఎన్కౌంటర్ తో నక్సలిజం తగ్గుముఖం పడుతుందని  పోలీసులు భావించారు .కాని, పోలీసులు, ప్రభుత్వం  ఉహించినదానికి వ్యతిరేకంగా  నక్సలిజం ఉవ్వెత్తున ఎగసిపడి ఇతర రాష్ట్రాలకు వ్యాపించింది.అందుకే,  నక్సలైట్లపై అణచివేతతో పాటు నక్సలిజం నిర్మూలనకు ఇతర మార్గాలను అప్పటినుంచే అన్వేషించడం మొదలుపెట్టారు. అందులో భాగమే  మావోయిస్టు అగ్రశ్రేణి నాయకత్వం పై వివిధ రకాల ప్రచారాన్ని నిర్వహిస్తూ  “లొంగుబాట”పట్టేలా పోలీసు, నిఘా వర్గాలు పనిచేస్తున్నాయి. మావోయిస్టు పార్టీకి అత్యున్నత నిర్ణాయక  వ్యవస్థ ఐన సెంట్రల్ కమిటీ, పొలిట్ బ్యూరో  సభ్యులను “లొంగు బాట ” పట్టించి మావోయిస్టు పార్టీకి భారీగా నష్టం కలిగించాలానేది పోలీసుల వ్యూహంగా పరిశీలకులు పేర్కొంటున్నారు. రాజ్యం ముందు ఎవరైనా, ఎప్పటికైనా  చివరికి తల వంచాల్ సిందే అనే మెసెజ్ మావోయిజం పట్ల ఆకర్షితులయ్యే వర్గాల్లోకి వెళుతుందనేది పోలీసుల వ్యూహం. అందుకే మావోయిస్టు పార్టీకి ఆయువుపట్టు  లాంటి సెంట్రల్ కమిటీకి చెందిన  గణపతికి వయసు రీత్యా సంక్రమించిన అనారోగ్య సమస్యలను ఆసరా చేసుకొని , మరో నలుగురు ముఖ్య నేతలు లొంగు‘బాట’వ్యూహానికి  తెలంగాణ పోలీసులు చాలా రోజుల క్రితమే స్కెచ్ వేసినట్టు సమాచారం. నక్సల్స్ అణచివేతలో తెలంగాణ పోలీసులది చురుకైన పాత్ర . ఎప్పుడూ ఎన్కౌంటర్లతో దేశవ్యాప్త సంచలనాలకు కారకులయ్యే తెలంగాణా పోలీసులు… ఈసారి “మావోయిస్టు అగ్రనేతల లొంగుబాట “ద్వారా మావోయిస్టు క్యాడర్ తో “మానసిక “యద్ధం చేయాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం.ఎందుకంటే,  అగ్రనేతల లొంగుబాటుతో కింది స్థాయి క్యాడర్లో ఆత్మస్థైర్యం దెబ్బతినడమేకాక, మానసికంగా కుంగుబాటుకు లోనవుతారు.కుటుంబాలను విడిచి ఉద్యమంలో పనిచేస్తున్నవారు పునరాలోచనలో పడతారు.  తద్వారా ఉద్యమమే నీరుగారిపోతుంది. పోలీసులకు కావాల్సిందికూడా ఇదే. దీనిద్వారా, సుమారు 4 దశాబ్దాలుగా పోలీసులకు, ప్రభుత్వాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న నక్సల్స్ సమస్యకు ముగింపు దొరుకుతుందని పోలీసులు, ప్రభుత్వాలు భావిస్తున్నాయి. 
 
గడచిన కొన్ని దశాబ్దాలుగా జరిగిన ఎన్కౌంటర్ల వల్ల మావోయిస్టు ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించిందేతప్ప, తగ్గలేదు. దీన్ని గుర్తించిన పోలీసు మేధావులు … మావోయిస్టులను భౌతికంగా నిర్ములించడంకన్నా, మానసికంగా కుంగదీయడం  ద్వారా ఉద్యమాన్ని నిర్ములించవచ్చనే నిర్ణయానికి పోలీసులు, ప్రభుత్వాలు వచ్చాయి. కొన్ని  సత్ఫలితాలను కూడా సాధించాయి . ఎన్కౌంటర్ లో మావోయిస్టు నేతలను  హతమార్చే అవకాశం ఉన్నా లొంగుబాటు కే ప్రాధాన్యమివ్వాలని పోలీసులు నిర్ణయించుకున్నట్టు సమాచారం.అందుకు,  మావోయిస్టు నేతలను తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడికి గురిచేసి లొంగుబాట మినహా మరో గత్యంతరం లేని పరిస్థితిని భద్రతాదళాలు కల్పిస్తున్నాయి.అందుకే,  నెత్తురు చుక్క చిందకుండా  మావోయిస్టులపై యుద్ధంలో విజయం సాధించాలనే వ్యూహాన్ని పోలీసులు, ప్రభుత్వాలు అమలుచేస్తున్నాయి. 

దీనిలో భాగంగానే  గత కొంత కాలంగా స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) ఈ అంశంలో చాకచక్యంగా పావులు కదుపుతున్నట్టు సమాచారం.  మావోయిస్టు పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూ, ముఖ్య నక్సల్ నేతలను ‘లొంగుబాటు’ దిశగా పయనింపజేయడంలో ఈ విభాగం సఫలీకృతమవుతున్నట్టు తెలుస్తోంది. 1990వ దశకంలో అప్పటి పీపుల్స్ వార్ పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి పులి అంజయ్య దంపతులను, కొయ్యూరు ఎన్కౌంటర్ ద్వారా నల్లా ఆదిరెడ్డి, శీలం నరేష్, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి వంటి అగ్రనేతలను, 2011లో పశ్చిమబెంగాల్ మిడ్నపూర్ అడవుల్లో ఎన్కౌంటరైన పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ, ఓదెల మండలం గూడెం గ్రామానికి చెందిన సంద రాజమౌళి అలియాస్ ప్రసాద్, కాల్వశ్రీరాంపూర్ మండలం మంగపేటకు చెందిన బుర్ర చిన్నన్న లను   మట్టుబెట్టిన తరహా సంచలన ఘటనల  విధంగా కాకుండా, మావోయిస్టులను లొంగిపోయేలా చేసి, తెలంగాణా పోలీసు శాఖ తన చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించే పనిలో ఉన్నట్టు నిఘా  వర్గాలనుంచి అందుతున్న సమాచారం  .
అందుకు,  ఈసారి ఎన్కౌంటర్ ఘటన ద్వారా కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే ‘లొంగుబాటు’ ఉదంతం ద్వారా సంచలనం సృష్టించేందుకు పోలీస్ ఉన్నతాధికారులు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి లొంగిపోనున్నారనే వార్తలు ఎలక్ట్రానిక్,   సోషల్ మీడియాలో  చక్కర్లు కొడుతున్నాయి. గణపతి వంటి అగ్రనేత లొంగుబాటు అంశంపై జరుగుతున్న ప్రచారంపై ‘హక్కుల సంఘం’ నేతలు గాని, ఇతరత్రా విప్లవ సానుభూతిపరులుగాని  ప్రకటనలు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు.

 

Also Read: రేవంత్ కొత్త రాజకీయ పార్టీ…. కాంగ్రెస్ కు షాక్ తప్పదా….?

సాధారణంగా ఇటువంటి ప్రచార సందర్భాల్లో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలను సమర్థించే సంస్థల నేతలు వెంటనే స్పందిస్తుంటారు. అంతేగాక ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కూడా స్పందిస్తుంటారు . పార్టీపై జరిగే ఈ తరహా ప్రచారపు వార్త సంబంధీకులకు చేరడానికి ఇప్పుడు గతంలో మాదిరిగా వ్యవధి కూడా అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా నిమిషాల్లోనే విషయం విశ్వవ్యాప్తమవుతోంది. కానీ గణపతి లొంగుబాటు అంశంలో మావోయిస్టు పార్టీ నాయకులుగాని, దాని అనుబంధ, సానుభూతి సంస్థలకు చెందినవారు గాని ఎటువంటి ప్రకటన చేయడం లేదు. కారణం … మావోయిస్టులకు సంబంధించి దేశ వ్యాప్తంగా ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే స్పందించే ఒకేఒక వ్యక్తి విప్లవ కవి వరవర రావ్. ఇతనిపై అర్బన్ నక్సల్ ముద్ర వేసి కోరేగావ్ (ప్రధాని ని హత్య చేసేందుకు )కుట్ర కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో తమకూ ఇదే పరిస్థితి ఎదురవుతుందని హక్కుల సంఘాలు కాని, సానుభూతి పరులుకాని స్పందించడంలేదని వివిధ వర్గాలు పేర్కొంటున్నాయి.ఏంజరిగిందో చెప్పేందుకు మావోయిస్టుల తరపున ఎవరూ లేకపోవడంతో  మావోయిస్టులకు సంబందించిన సమాచారం ఏకపక్షంగా ప్రచారమవుతోంది. దీన్తో, దండకారణ్యంలో ఏంజరుగుతోందో, ఏది నిజమో  బయటి ప్రపంచానికి అర్థం కాని పరిస్థితి నెలకొంది.ఈ నేపథ్యంలోనే తెలంగాణా పోలీసు శాఖ మరో భారీ విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకోబోతున్నదనేది ప్రస్తుత  ప్రచారపు సారాంశం. మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతితో పాటు మరో నలుగురు ముఖ్య నేతలు కూడా లొంగుబాటను ఎంచుకున్నారనేది తాజా ప్రకంపనల సారాంశం. వీరిలో పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన  మల్లొజుల వేణుగోపాల్ అలియాస్ వివేక్,  పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాస్త్రులపల్లికి చెందిన మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, కడారి సత్యానారాయణ అలియాస్ కోసాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ, గణపతి సహా ఐదుగురు మావోమయిస్టు పార్టీ నేతలు కేంద్ర కమిటీ సభ్యులు కావడం గమనార్హం.ఈ నాయకుల లొంగుబాటుకు చాలా కాలం నుంచే ఎస్ఐబీ విభాగపు పోలీసులు పెద్ద ఎత్తున కసరత్తు చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. తెలంగాణా పోలీసుల కృషి ఫలితంగా మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్య నేతలు లొంగుబాటను ఎంచుకున్నారనేది తాజా ‘బ్రేకింగ్’ ప్రచారం. ఈ లొంగుబాట్ల అంశంలో ఉత్తర తెలంగాణాకు చెందిన ఒకరిద్దరు ముఖ్య ప్రజాప్రతినిధులు మధ్యవర్తిత్వం జరిపారనేది కూడా మరో ప్రచారం. మరోవైపు నక్సలైట్లు ఎవరు లొంగిపోయినా తాము స్వాగతిస్తామని తెలంగాణా పోలీసు శాఖ వర్గాలు ప్రకటించినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి.

గణపతి సహా మావోయిస్టు పార్టీకి చెందిన  కేంద్ర కమిటీ సభ్యులు లొంగుబాటలో పయనిస్తే తెలంగాణాలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలన ఘటనగా నమోదవుతుందనడంలో సందేహం లేదు. రెండు రోజుల్లో గణపతి, మరికొందరు ముఖ్య నేతలు పోలీసులకు లొంగిపోయే ఛాన్స్ ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తంగా  లొంగుబాట్ల ప్రచారపు అంశం విప్లవోద్యమ చరిత్రలో సంచలన దృశ్యాన్ని ఆవిష్కరిస్తుందా ?  లేక ఉవ్వెత్తున ఎగసిపడుతుందా ?  కొద్ది రోజుల్లో తేలిపోనుంది.

 
-శ్రీరాముల కొంరయ్య

నిరుద్యోగ తెలంగాణ

Sunday special

సండే స్పెషల్: తెలంగాణ.. పోరాటాలకు పురిటి గడ్డ. తిరుగుబాటుకు తిరుగులేని గడ్డ. ఉద్యమాలకు ఊపిరి పోసిన గడ్డ. భూమి కోసం.. భుక్తి కోసమంటూ జరిగిన మొదటి దశ పోరాటం.. తర్వాత తర్వాత నీళ్లు.. నిధులు.. నియామకాలు అంటూ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం మొదలైంది. ప్రత్యేక రాష్ట్రం వస్తేనే బాధలు పోతాయని పిల్లాజెల్లా.. ముసలి ముతక.. అందరూ రోడ్ల పైకి వచ్చారు. రాష్ట్రం వచ్చే దాకా కొట్లాడారు. మరికొందరు ఏకంగా ప్రాణాలే అర్పించారు. ఎంతో మంది త్యాగజనుల ఫలితమే ఈ మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం.2018 జూన్‌ 6న కొత్త రాష్ట్రం ఏర్పాటైంది. ఇక మన నిధులు.. మన నీళ్లు.. మన నియామకాలు మనకే వస్తాయని అందరూ సంబురపడ్డారు. అనుకున్నట్లుగానే ఉద్యమం ఉర్రూతలూగించిన కేసీఆర్‌‌ సీఎం పగ్గాలు చేపట్టారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఏయే లాభాలు ఉంటాయో ఉద్యమ సమయంలో ఎన్నో చెప్పారు ప్రజలకు. ఒక టర్మ్‌ ముగిసింది.. మళ్లీ ఎన్నికలు వచ్చాయి. మరోసారి కేసీఆరే సీఎం అయ్యారు.కానీ.. ఏం లాభం ఒకప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు లక్షల కోట్ల అప్పులో మునిగిపోయింది.

ఇక నీళ్ల ముచ్చట ఆలోచిస్తే.. ప్రతిష్ఠాత్మకంగా కాళేశ్వరం నిర్మించినా దాని నుంచి ఒక్క ఎకరా పారింది లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులే ఇప్పుడు ఆదుకుంటున్నాయి. ఇక నియామకాల విషయానికొస్తే.. రాష్ట్రంలో కొత్తగా నియామకాలు చేపట్టాల్సిన సర్కార్‌‌ ఎంత మందికి ఇచ్చిందో అందరికీ తెలుసు. మన రాష్ట్రం మనకు వస్తే ఇంటికో ఉద్యోగం అంటూ ప్రగల్బాలు పలికిన సీఎం కేసీఆర్‌‌.. ఇప్పుడు చేస్తున్నదేంటి. నెలనెలా సర్కార్‌‌ ఉద్యోగులు రిటైర్మెంట్‌ అవుతున్నా ఏ శాఖలోనూ కొత్త రిక్రూట్‌మెంట్‌ లేదు. దీనికి తోడు కాంట్రాక్ట్‌ వ్యవస్థను ఒకటి తర్వాత ఒకటి రద్దు చేస్తూనే ఉన్నారు. అంటే.. ఉన్న కొలువులు కూడా ఊడుతున్నాయన్నమాట. మరి ప్రత్యేక రాష్ట్రంలో మనం కోరుకున్నది ఇదేనా అని ఇప్పుడు ప్రజల్లో హాట్‌ టాపిక్‌ అయింది.

ఒక్కసారి రాష్ట్రవ్యాప్తంగా డిపార్ట్‌మెంట్లు.. వాటిలో పనిచేస్తున్న ఎంప్లాయిస్‌ సంఖ్య పరిశీలిస్తే ఇలా ఉంది..రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో లక్షా 51 వేల 116 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఏకంగా సర్కారే గుర్తించింది. వాటిలో 58,240 పోస్టులను ఆరేండ్లలో భర్తీ చేయగా.. 92,876 ఖాళీగా ఉన్నాయి. ప్రతినెలా అన్ని డిపార్ట్మెంట్లలో కలిపి ఆరేడు వందల మంది రిటైర్ అవుతున్నారు. ఇవి కలిపితే ఖాళీల సంఖ్య లక్షకు పైనే ఉంటుంది.రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ దాదాపుగా నిలిచిపోయిందనే చెప్పాలి. అత్యవసరమైన వాటిని మాత్రం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో టెంపరరీగానే భర్తీ చేస్తున్నారు. వివిధ డిపార్ట్మెంట్లలో లక్షకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నా రిక్రూట్మెంట్ఊసేలేదు. ఇచ్చిన నోటిఫికేషన్లను కూడా ప్రభుత్వం వాయిదా వేస్తోంది. కొత్తగా చేసే నియామకాలు అన్నింటికీ కాంట్రాక్టు పద్ధతిని లింక్ పెడుతోంది. తాజాగా పోలీస్‌ డిపార్ట్‌ మెంట్‌లో 2,092 పోస్టులను కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో రిక్రూట్ చేయాలని నిర్ణయించింది. ఇదే డిపార్ట్మెంట్‌లో నిరుడు భర్తీ చేసిన 190 పోస్టుల కాంట్రాక్టును ఇంకో ఏడాది పొడిగించింది. ఈ లెక్కన ఇక రెగ్యులర్ రిక్రూట్మెంట్జాడ లేనట్టేనని మరోసారి స్పష్టమైంది. సర్కారీ జాబ్లకు ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుందా అని ఎదురుచూస్తున్న లక్షల మంది నిరుద్యోగులు.. ఇప్పుడు టెంపరరీ పోస్టుల కోసం పోటీపడే పరిస్థితి నెలకొంది. గతేడాది జరిగిన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల రిక్రూట్మెంట్ మూడేళ్ల కాంట్రాక్టు పద్ధతినే చేపట్టింది.

Also Read: మావోయిస్టులు ఎందుకు కనుమరుగయ్యారు?

తెలంగాణ ఏర్పడిన తర్వాత 661 గురుకులాలు ప్రారంభించారు. వాటిలో టీచింగ్‌‌‌‌‌‌‌‌ స్టాఫ్‌‌‌‌‌‌‌‌  రెగ్యులర్‌‌‌‌‌‌‌‌ పోస్టులు శాంక్షన్‌‌‌‌‌‌‌‌ చేసినా కొన్ని మాత్రమే రిక్రూట్‌‌‌‌‌‌‌‌ చేశారు. మిగతా ఖాళీ టీచింగ్‌‌‌‌‌‌‌‌ పోస్టుల్లో సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌  అసోసియేట్స్‌‌‌‌‌‌‌‌ను ఔట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ పద్ధతిలో రిక్రూట్‌‌‌‌‌‌‌‌ చేశారు. నాన్‌‌‌‌‌‌‌‌ టీచింగ్‌‌‌‌‌‌‌‌ పోస్టులైతే మొత్తంగా ఔట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. ఇలా మూడు వేల మందికిపైనే ఔట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ లో రిక్రూట్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. సంక్షేమ శాఖల్లో అవసరమైన పోస్టులను కూడా ఇలాగే రిక్రూట్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారు.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి 2.10 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 1.45 లక్షల మంది ఔట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌‌‌‌‌, 65 వేల మందిని కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేశారు. ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌, హెల్త్‌‌‌‌‌‌‌‌, రెవెన్యూ, మున్సిపల్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్మెంట్లలోనే ఈ టెంపరరీ ఎంప్లాయీస్ ఎక్కువ. చాలా మందికి జీతాలు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకే ఉన్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏజెన్సీ కమిషన్‌‌‌‌‌‌‌‌, ఇతర కటింగ్ల రూపంలో మరింతగా కోతలు పెడుతున్నారు. రెగ్యులర్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నా వారికి ఎలాంటి బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌ వర్తించని పరిస్థితి ఉంది.

Also Read: రేవంత్ కొత్త రాజకీయ పార్టీ…. కాంగ్రెస్ కు షాక్ తప్పదా….?

అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌మెంట్‌లో 200 మంది ఏఈవోలను ఔట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ పద్ధతిన రిక్రూట్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో కంప్యూటర్‌‌‌‌‌‌‌‌ ఆపరేటర్లు, ఇతర సిబ్బంది 1,500 మందికిపైనే ఔట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్‌లో పనిచేస్తున్నారు. 2,500 మందికిపైగా లష్కర్‌‌‌‌‌‌‌‌లను నియమించాలని సర్కారు నిర్ణయించింది. ఈ నియామకాలు కూడా ఔట్సోర్సింగ్విధానంలోనే ఉండనున్నట్టు తెలిసింది. మిషన్‌‌‌‌‌‌‌‌ భగీరథలో ఇంజినీర్లు, పాత ఆర్‌‌‌‌‌‌‌‌డబ్ల్యూఎస్‌‌‌‌‌‌‌‌ స్టాఫ్‌‌‌‌‌‌‌‌ మినహా అందరూ ఔట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులే. జిల్లా, మండల పరిషత్ ఆఫీసుల్లో ఫోర్త్‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌‌‌‌‌ ఎంప్లాయీస్‌‌‌‌‌‌‌‌, పరిషత్ స్కూళ్లలో స్వీపర్లు తాత్కాలిక పద్ధతిన పనిచేస్తున్నారు. వీళ్లు 15 వేల మంది వరకు ఉంటారని చెప్తున్నారు. కరోనా ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌ కోసం ఏర్పాటు చేసిన టిమ్స్‌‌‌‌‌‌‌‌ సహా అన్ని గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ హాస్పిటళ్లలో డాక్టర్లు, ఇతర మెడికల్‌‌‌‌‌‌‌‌ స్టాఫ్‌‌‌‌‌‌‌‌ రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ చేపట్టారు. దాదాపు 3,500 మందిని కాంట్రాక్టు పద్ధతిలో రిక్రూట్‌‌‌‌‌‌‌‌ చేయడానికి నోటిఫికేషన్లు ఇచ్చారు. కాంట్రాక్టు విధానంలో పనిచేయడానికి డాక్టర్లు, నర్సులు ముందుకు రాలేదు. దీంతో రెండు, మూడు సార్లు నోటిఫికేషన్లు ఇవ్వాల్సి వచ్చింది. మొత్తంగా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వెయ్యి మంది వరకు డాక్టర్లను రిక్రూట్‌‌‌‌‌‌‌‌ చేశారు. మిగతా 6 వేల మంది వరకు హెల్త్‌‌‌‌‌‌‌‌  సిబ్బంది ఔట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ విధానంలో నియామకమైన వారే.

-శ్రీని

ఎన్-95 మాస్క్ ను మళ్లీ మళ్లీ వాడాలంటే ఇలా చెయ్యండి!

1

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా నుంచి తమను తాము రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్ లు ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. అన్ని రకాల మాస్కుల కంటే ఎన్-95 మాస్క్ 95% వైరస్ వ్యాప్తి నుండి మనల్ని రక్షిస్తుంది. మార్కెట్లో ఈ మాస్క్ ల ధర దాదాపు 400 రూపాయలు ఉంది. ప్రతిరోజు ఇంత ఖరీదైన మాస్క్ ను మార్చాలి అంటే అది వీలుకాని పరిస్థితి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఈ మాస్క్ ను తిరిగి వాడవచ్చా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అయితే వాడవచ్చని చెబుతున్నారు నిపుణులు. అలాంటి ఆ మాస్కు ఏ విధంగా వాడాలి అనేది ఇక్కడ తెలుసుకుందాం.

Also Read : బ్రేకింగ్: చంద్రబాబు కాన్వాయ్ కు ప్రమాదం

ఎన్-95 మాస్క్ ను ధరించి బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఆ మాస్క్ ని పడేయాల్సిన అవసరం లేదు. మరి మరి తిరిగి వాడొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఎన్-95 మాస్ కును వివిధ రకాల పద్ధతులలో తిరిగి వాడవచ్చు. అంటే అల్ట్రావైలెట్ రేడియేషన్ వంటి ప్రయోగాల ద్వారా ఖచ్చితమైన ఫలితం లభిస్తుందని వెల్లడైంది.

అల్ట్రా వైలెట్ రేడియేషన్ పద్ధతి అందరికీ అందుబాటులో ఉండదు.. కాబట్టి ఒక గిన్నెలో నీరు పోసి ఆ నీటిని 85 డిగ్రీల వరకు వేడి చేయాలి. ఆ నీటిలో ఈ మాస్క్ ను ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి తరువాత ఆ మాస్క్ ను బయట ఆరవేయాలి. ఇలా చేయడం ద్వారా మాస్క్ లోని ఫిల్టరేషన్ సామర్థ్యం దెబ్బతినకుండా ఉంటుంది.

ఇలా చేయడం ద్వారా మాస్క్ ను తిరిగి దాదాపు పది సార్లు వాడవచ్చు. సబ్బు, నీరు, ఆల్కహాల్, బ్లీచ్ వంటి వాటిలో రాత్రి అంతా నిల్వ ఉంచి మాస్క్ లను ఉతకడం మంచిదికాదని ఒక అధ్యయనంలో వెల్లడైంది. అలా చేయడం వల్ల వైరస్ వ్యాప్తిని అరికట్టే సామర్థ్యం మాస్క్ కోల్పోతుంది. ఇలా తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా అతి భయంకరమైన కరోనా వైరస్ వ్యాప్తి నుండి బయటపడవచ్చు.

Also Read : బాబు ఇంత జరిగినా మారలేదా… తిట్టినా ఆ పార్టీనే కావాలా…?

బాబు ఇంత జరిగినా మారలేదా… తిట్టినా ఆ పార్టీనే కావాలా…?

chandrababu try to aliance on bjp again

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకుంటాడని ఆ పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటూ ఉంటారు. అవసరం అనుకుంటే చంద్రబాబు బద్ధ శత్రువులు ఉన్న పార్టీతో సైతం జత కట్టగలడు. అవసరం తీరిపోతే ఆ పార్టీ నేతలపై తనకు సన్నిహితంగా ఉండే నేతలతో ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయించగలడు. అవసరానికి తగినట్టు సమయస్పూర్తితో వ్యవహరించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య.

Also Read : జగన్ ఆ నేతలకు ప్రాధాన్యత ఇచ్చి తప్పు చేస్తున్నాడా…?

రాజకీయ చాణిక్యుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు 2014లో అధికారమే లక్ష్యంగా బీజేపీ, జనసేనతో జత కట్టాడు. అయితే చంద్రబాబును అదృష్టం వరించడంతో 108 సీట్లతో 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన కొత్తలో బీజేపీని ఆకాశానికెత్తిన చంద్రబాబు నాలుగేళ్ల అనంతరం బీజేపీని, మోదీని తిడుతూ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

2019 ఎన్నికల నాటికి బీజేపీతో శత్రుత్వం ఏర్పడటం, జనసేన సొంతంగా పోటీ చేయడానికి మొగ్గు చూపడంతో టీడీపీ చరిత్రలో కనీవిని ఎరువని చవిచూడాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం చంద్రబాబు 2024 ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. బీజేపీ జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు ఎన్ని విమర్శలు చేస్తున్నా ఆ విమర్శలను పట్టించుకోవద్దంటూ పార్టీ నేతలకు సూచిస్తున్నాడు.

బీజేపీ నేతలు తిడుతున్నా ఆ పార్టీతో సన్నిహితంగా మెలగడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. అయితే ఇప్పటికే ఒకసారి చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని పొందిన అనుభవాల నేపథ్యంలో బీజేపీ చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగే అవకాశాలు సమీప భవిష్యత్తులో కనిపించడం లేదు. అయితే చంద్రబాబు పట్టు వదలని విక్రమార్కుడు కాబట్టి సమీప భవిష్యత్తులో బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read : బ్రేకింగ్: చంద్రబాబు కాన్వాయ్ కు ప్రమాదం

రేవంత్ కొత్త రాజకీయ పార్టీ…. కాంగ్రెస్ కు షాక్ తప్పదా….?

Revanth reddy start a new political party in telangana

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి మాటతీరు కానీ ఆయన ఎంచుకునే దారి కానీ మిగతా నేతలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసే నేతగా, ఏ విషయంలోనైనా దూకుడుతో వ్యవహరించే నేతగా రేవంత్ రెడ్డికి పేరుంది. రేవంత్ టీడీపీలో ఉన్నా, కాంగ్రెస్ లో ఉన్నా ఆయన తీరులో ఏ మాత్రం మార్పు రాలేదు. ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి తాజాగా కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది.

Also Read : కేసీఆర్ మరో సంచలనానికి శ్రీకారం

రేవంత్ రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు కోసం రహస్యంగా సర్వేలు చేయిస్తున్నాడని సమాచారం అందుతోంది. ఫైటింగ్ నేచర్ తో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రేవంత్ కొత్త పార్టీ పెడితే అది మరో సంచలనమే అవుతుంది. ఏ పార్టీలో చేరినా తక్కువ సమయంలోనే ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడంతో అనతి కాలంలోనే పదవులు దక్కించుకోవడం రేవంత్ కు వెన్నతో పెట్టిన విద్య. అతని పనితనమే కాంగ్రెస్, టీడీపీలలో అధినేతలకు అతనిని దగ్గర చేసింది.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఊపు రావడానికి కూడా ఒక రకంగా రేవంత్ రెడ్డే కారణం అని చెప్పవచ్చు. ఒకానొక దశలో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ను ఫైనల్ చేసినట్టు వార్తలు వచ్చినా ఆ వార్తలు నిజం కాలేదు. అయితే తాజాగా రేవంత్ రాజకీయ పార్టీ ప్రచారం తెలంగాణలో ఊపందుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు సూచనలతోనే రేవంత్ కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.

రేవంత్ రాజకీయంగా ఎదిగితే కేసీఆర్ కు ఇబ్బందులు తప్పవని బాబు భావిస్తున్నారని సమాచారం. రేవంత్ పార్టీ పెడితే రెడ్డి సామాజిక వర్గమంతా ఆయనకు అండగా నిలబడే అవకాశం ఉంది. టీడీపీ కార్యకర్తలు సైతం రేవంత్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే రేవంత్ వర్గం మాత్రం జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తోంది. జిహెచ్ఎంసి ఎన్నికలపై దృష్టి పెట్టి రేవంత్ రెడ్డి సర్వే చేయిస్తున్నాడని ఆయన వర్గం చెబుతోంది. గత అనుభవాల నేపథ్యంలో రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికలను ఎంపీ ఛాలెంజ్ గా తీసుకున్నారని తెలుస్తోంది. అయితే రేవంత్ సర్వే కొత్త పార్టీ కోసమా….? కాదా…? అనే విషయం తెలియాల్సి ఉంది.

Also Read : అన్న ఎన్టీఆర్ ను మరవని కేసీఆర్..

జగన్ ఆ నేతలకు ప్రాధాన్యత ఇచ్చి తప్పు చేస్తున్నాడా…?

is Jagan making a mistake by giving priority to those leaders

సాధారణంగా ఏ రాజకీయ పార్టీలో అయినా పని చేసే నేతలకు, ప్రజల్లో గుర్తింపు ఉన్న నేతలకు ప్రాధాన్యత దక్కుతుందనే సంగతి తెలిసిందే. అయితే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఔట్ డేటెడ్ నేతలకు జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని… జగన్ ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో పార్టీకి నష్టం కలుగుతుందని ఆ పార్టీ ముఖ్య నేతలు, శ్రేయోభిలాషులు భావిస్తున్నారు.

Also Read : ఏపీ జనాలకు జగన్ కన్నా మోదీ పైనే నమ్మకం ఎక్కువా..? 

జగన్ పార్టీలో చేర్చుకుంటున్న వారిలో ఒక్కరికి కూడా ప్రజల్లో పెద్దగా గుర్తింపు లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు తిరస్కరించిన నేతలను పార్టీలో చేర్చుకుంటే పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖకు చెందిన పంచ‌క‌ర్ల ర‌మేష్‌బాబును జగన్ కొన్ని రోజుల క్రితం పార్టీలో చేర్చుకున్నారు. గంటాకు సన్నిహితుడుగా పేరు పొందిన పంచకర్లకు ప్రజల్లో పెద్దగా గుర్తింపు లేదు.

ఈయన వల్ల పార్టీకి ఎలాంటి ప్రయోజనం లేదని ఇలాంటి రాజకీయ నాయకులను జగన్ ఎందుకు పార్టీలో చేర్చుకుంటున్నారో అర్థం కావడం లేదని వైసీపీ నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. రాజమండ్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ ను కూడా జగన్ పార్టీలో చేర్చుకున్నారు. ఆయన కుటుంబానికి మేయర్ పదవి ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆ పార్టీ నేతలకే నచ్చడం లేదు.

ఒకప్పుడు వైసీపీకి బద్ధ శత్రువుగా వ్యవహరించిన క‌డ‌ప జిల్లా జ‌మ్మల‌మ‌డుగుకు చెందిన రామసుబ్బారెడ్డిని సైతం జగన్ పార్టీలో చేర్చుకున్నారు. ఈయనను పార్టీలో చేర్చుకోవడంపై జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. కొన్ని నెలల క్రితమే జగన్ తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులును పార్టీలో చేర్చుకున్నారు. ఈయన వల్ల పార్టీకి పెద్దగా ఒరిగేది ఏమీ లేదు. ఇలాంటి నేతలకు జగన్ ప్రాధాన్యత ఇవ్వకుండా పార్టీ కోసం పని చేసేవారికి ప్రాధాన్యత ఇస్తే మంచిదని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి..

Also Read  : ఏపీ మళ్లీ నంబర్ 1.. కేంద్రం ప్రకటన

కేసీఆర్ మరో సంచలనానికి శ్రీకారం

తెలంగాణ సీఎం కేసీఆర్ మరో సంచలనానికి శ్రీకారం చుట్టబోతున్నారు. కొత్తగా నిర్మించబోయే సెక్రటేరియట్లో మందిరం.. మసీదును ప్రభుత్వమే నిర్మిస్తుందని సీఎం కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. ఈనేపథ్యంలో తెలంగాణలోని క్రిస్టియన్లు సైతం కొత్త సెక్రటేరియట్లో చర్చిని కూడా నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిని చేసింది. దీనిపై క్యాబినెట్లో సుదీర్ఘంగా చర్చించి చర్చిని కూడా నిర్మించేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: రేవంత్ కొత్త రాజకీయ పార్టీ…. కాంగ్రెస్ కు షాక్ తప్పదా….?

తెలంగాణలో ఉన్న సెక్రటేరియట్ శిథిలావస్థకు చేరుకోగా ప్రభుత్వం కొత్త సెక్రటేరియట్ నిర్మించేందుకు గతంలోనే శంకుస్థాపన చేసింది. పాత సెక్రటేరియట్ ను ప్రభుత్వం కూల్చకుండా ప్రతిపక్షాలు హైకోర్టును ఆశ్రయించాయి. సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో ప్రభుత్వం పాత సచివాలయాన్ని కూల్చే పనులు చేపట్టింది. ఈక్రమంలోనే సెకట్రేరియట్ శిథిలాలు పక్కనే మసీదు, మందిరాలపై పడ్డారు. దీంతో ఈ రెండు నిర్మాణాలు కూలిపోయాయి. దీనిపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి ఊహించిన విధంగా ఈ సంఘటన జరిగినట్లు ప్రకటించారు.

కొత్త సెక్రటేరియట్లో ప్రభుత్వమే అన్ని ఖర్చులతో మసీదు, మందిరం నిర్మాణం చేస్తుందని హామీ ఇచ్చారు. దీనిపై తాజాగా క్యాబినెట్లో చర్చించినట్లు నిర్ణయం తీసుకున్నట్లు సీఎం వెల్లడించారు. 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో మసీదు నిర్మిస్తుందని తెలిపారు. నిర్మాణం పూర్తయిన వెంటనే వక్ఫ్ బోర్డుకు ప్రభుత్వం అప్పగిస్తుందని తెలిపారు. అదేవిధంగా 1500 అడుగుల విస్తీర్ణంలో మందిరాన్ని నిర్మిస్తుందని తెలిపారు. నిర్మాణం పూర్తికాగానే దేవాదాయశాఖ మందిరాన్ని అప్పగిస్తుందని తెలిపారు.

Also Read: మావోయిస్టులు ఎందుకు కనుమరుగయ్యారు?

ఈ రెండు నిర్మాణాలతోపాటు కొత్త సెక్రటేరియట్లో చర్చిని కూడా నిర్మించనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. క్రిస్టియన్ల కోరిక మేరకు ఈ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలను సమానంగా ఆదరిస్తామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తికాగానే గంగా జమునా తహజీబ్ కు అద్దంపట్టేలా అన్నింటికి ఒకేరోజు శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

బ్రేకింగ్: చంద్రబాబు కాన్వాయ్ కు ప్రమాదం

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పెద్ద ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు కాన్వాయ్ లోని రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో భద్రతా సిబ్బందికి స్పల్పగాయాలుకాగా చంద్రబాబు నాయుడు క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: జగన్ ఆ నేతలకు ప్రాధాన్యత ఇచ్చి తప్పు చేస్తున్నాడా…?

చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ కు ఎదురుగా ఓ ఆవు సడెన్ గా వచ్చింది. వెంటనే డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో కాన్వాయ్ లోని రెండు, మూడుకార్లు ఒకదానికొకటి ఢీకొన్నారు. అయితే చంద్రబాబు సహా ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదని సమాచారం.

యాదాద్రి-భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఒక్కసారిగా కాన్వాయ్‌లోని ముందు ఉన్న ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొట్టింది. ఆ తర్వాతి వాహనంలోనే చంద్రబాబు ఉండటంతో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే క్వాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో కారు ముందుభాగం దెబ్బతింది. ఈ వాహనంలోని భద్రతా సిబ్బందికి సల్ప గాయాలైనట్లు సమాచారం.

Also Read: బాబు ఇంత జరిగినా మారలేదా… తిట్టినా ఆ పార్టీనే కావాలా…?

ఈ ఘటన అనంతరం చంద్రబాబు కాన్వాయ్ యథావిధిగా హైదరాబాద్‌కు పయనమైంది. గతంలోనూ చంద్రబాబుకు ఓ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తిరుపతిలోని అలిపిరి వద్ద గతంలో నక్సలైట్లు బాంబు దాడి చేశారు. ఈ ఘటన నుంచి ఆయన ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడు అనిపించుకున్నారు. అప్పట్లో చంద్రబాబుపై వచ్చిన సానుభూతి మాత్రం ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆయన కలిసి రాలేదు. ఈ రెండు కూడా కారు ప్రమాదాలే కావడం గమనార్హం. తాజాగా చంద్రబాబు మరోసారి కారు ప్రమాదం నుంచి తప్పించుకోవడంపై టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.

బాబు అత్యాశకు… జగన్ అడ్డగోలుతనానికి సరిపోయింది.. మళ్లీ ఎన్నికలంట..!

AP Election Exit Poll results 2019: 2 pollsters say Chandrababu Naidu will  retain Andhra Pradesh, 2 others say Jagan will oust him | India News -  Times of India

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనరంజక పాలన సాగుతోందని ఒకపక్క వైసిపి నాయకులు డప్పు కొట్టుకుంటున్నారు. కరోనా మహమ్మారి పంజా విసురుతున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయిన సమయంలో సంక్షేమ పథకాలు అందిస్తున్నామని గొప్పలకు పోతున్నారు. ఇటువైపు టిడిపి మాత్రం అదే స్థాయిలో వారిపై బురదజల్లే కార్యక్రమం కూడా పెట్టుకుంటోంది. కొన్ని సరైన విమర్శలు ఉన్నప్పటికీ కొన్ని మాత్రం చాలా ఖచ్చితంగా వారిని టార్గెట్ చేసి ఎటువంటి ప్రూఫ్ లేకుండా మాట్లాడుతున్నట్లు ఉంటాయి. ఇక గంటకు 9 కోట్లు అప్పు చేస్తూ జగన్ రాష్ట్రాన్ని అప్పుల చేస్తున్నారని చంద్రబాబు ఇటీవల విమర్శించారు. అటు వైపు చూస్తే ప్రజా సంక్షేమ పథకాలకు టిడిపి అడ్డుపడుతోంది అని వైసీపీ వారు అంటున్నారు.

ఇలాంటి దశలో ఏ క్షణంలో అయినా ఎన్నికలు వస్తాయని…. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని టిడిపి అధిష్టానం తమ శ్రేణులకు పిలుపునిచ్చింది. దానికి వైసిపి వారు కూడా కౌంటర్ వేశారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సీఎం కావడం కల అని…. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టిడిపికి మరోసారి ఘోర పరాభవం తప్పదని మంత్రి కొడాలి నాని అంటున్నారు.

ఒక పక్కేమో జగన్ పాలనలో అసమర్ధత పూర్తిగా తేటతెల్లమైపోయింది. రాష్ట్ర ప్రతిష్ట వైసీపీ పాలనలో దిగజారిపోయిందని చంద్రబాబు పదేపదే విమర్శిస్తున్నాడు. 15 నెలల పాలన లో జగన్ ప్రభుత్వం రెండు సార్లు కరెంటు చార్జీలు పెంచేసి రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని అన్నారు. ఉచిత విద్యుత్తు కి నగదు బదిలీ పథకాన్ని అడ్డుకుంటామని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతుల పొలాల్లో స్మార్ట్ మీటర్లు నిర్ణయాన్ని తప్పుపట్టారు. దీనివల్ల మెట్ట ప్రాంత, రాయలసీమ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు.

అయితే మొత్తానికి జగన్ కు పాలించడం చేత కాలేదని…. త్వరలోనే ఎన్నికలు ఉంటాయని అంటున్నారు. ఇప్పటికే ఎన్నికల లేనప్పుడే జరుగుతున్న ఈ వింత రాజకీయం ఏపీ ప్రజలు ఓర్వలేకపోతున్నారు. అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాష్ట్రం అభివృద్ధిని గాలికి వదిలేసిన పక్షంలో మరో ప్రత్యామ్నాయం వైపు చూసేందుకు ఏపీ ప్రజలకు ఇంకా సమయం పడుతుంది.

ఈ క్రమంలో మళ్లీ ఎన్నికలు…. ఎన్నికలు…. అంటూ ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. అటు ఎవరూ కూడా ఈ రెండు పార్టీల పనితీరు పట్ల ఏమాత్రం సంతోషంగా లేరు. ఇలాంటి సమయంలో ఎన్నికలు తెస్తాము అని ప్రతిపక్షం… మేము రెడీ అని అధికార పక్షం బీరాలకు పోతున్న నేపథ్యంలో…. రియాల్టీ ఎలా ఉన్నా…. అసలు వీరి సర్కస్ చూస్తుంటే… రాజకీయం అనే పదం మీద ప్రజలకు మరింత విరక్తి కలిగేలా ఉంది.

టీడీపీ నుంచి మరో కొత్త జర్నలిస్టు… ఆయన ఎవరంటే?

Nara Lokesh
తెలుగుదేశం పార్టీలో మిగతా నాయకులతో పోలిస్తే నారా లోకేశ్ కు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మీడియా ముందు ఎప్పుడూ నోరు కూడా మెదపని లోకేశ్ బాబు ట్విట్టర్ నుంచి జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు. ఆ ట్వీట్లు స్వయంగా నారా లోకేశ్ పోస్ట్ చేస్తాడో లేక మరెవరైనా ఆయనకు సహాయం చేస్తున్నారో తెలియదు కానీ ఆ ట్వీట్లలో వ్యాకరణ దోషాలు మాత్రం మచ్చుకైనా కనిపించవు.

Also Read : ఏపీ మళ్లీ నంబర్ 1.. కేంద్రం ప్రకటన

అదే లోకేశ్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే మాత్రం జయంతిని వర్ధంతి అని చెబుతూ టీడీపీ అవినీతి పార్టీ అని చెబుతూ పొరపాటు పడి చేసే వ్యాఖ్యలు ఆ పార్టీ నాయకులకే చికాకు తెప్పించే విధంగా ఉంటాయి. అయితే తాజాగా లోకేశ్ బాబు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. ఆయన కొత్తగా జర్నలిస్టు అవతారం ఎత్తారు. గత కొన్ని రోజులుగా నారా లోకేశ్ పేరుతో ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ పేజీలో లోకేశ్ వ్యాసాలు ప్రచురితం అవుతున్నాయి.

మొదట గత నెల 15 వ తేదీన ‘జ‌గ‌న్మోసావ‌తారం’ పేరుతో లోకేశ్ వ్యాసం ప్రచురితమైంది. సీఎం జగన్ తాడేపల్లిలో ఫిడేలు వాయించుకుంటూ కరోనాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోవడం లేదని వ్యాసంలో లోకేశ్ పేర్కొన్నారు. ప్రజలు సరైన సమయంలో వైద్యం అందక విలవిల్లాడుతున్నారని… రాష్ట్రంలో ఆంబులెన్స్ లు కూడా లేని దయనీయ పరిస్థితి నెలకొందని లోకేశ్ పేర్కొన్నారు.

తాజాగా ‘దళిత పక్షపాతి- ఎవరు, ద్రోహి ఎవరు?’ అనే శీర్షిక‌తో వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి దళితులపై దాడులు జరిగాయని లోకేశ్ వ్యాసంలో పేర్కొన్నారు. అయితే ఆ వ్యాసాలు చదివితే నారా లోకేశ్ వేరే వాళ్లతో వాటిని రాయిస్తున్నాడనే విషయం సులువుగానే అర్థమవుతుంది. లోకేశ్ ఈ విధంగా ఇతరులతో వ్యాసాలు రాయిస్తూ వాటిని తనవిగా చెప్పుకుంటే మరిన్ని విమర్శలు తప్పవని ఇలాంటి వేషాలకు లోకేశ్ దూరంగా ఉంటే మంచిదని నెటిజన్లు సూచిస్తుండటం గమనార్హం.

Also Read : ఏపీ జనాలకు జగన్ కన్నా మోదీ పైనే నమ్మకం ఎక్కువా..? 

పూరి కథలు.. మహేష్ తోనా ? రానాతోనా ?


కరోనా టైమ్ లో జనం ఎన్ని ఇబ్బందులు పడినా.. మన దర్శకులుకు మాత్రం కొత్త కథలు రాసుకోవడానికి మంచి అవకాశం దొరికింది. చాలామంది దర్శకులు ఇప్పటికే తమ కథలను పూర్తి చేశారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కూడా ఈ కరోనా టైమ్ లో ఓ స్క్రిప్ట్ ను రెడీ చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ యంగ్, న్యూ జనరేషన్ హీరో కోసం ఈ కథ తయారుచేసినట్లు.. బాలీవుడ్ వెర్షన్ లో ఓ స్టార్ వారసుడు నటిస్తే.. తెలుగు వెర్షన్ లో తన కుమారుడిని పెట్టి ఈ కథను తీయాలనేది పూరి ప్లాన్. అందుకే స్క్రిప్ట్ ను శరవేగంగా పూర్తి చేసి… ఎవర్ని ఒప్పించాలా అనే ఆలోచనలో ప్రస్తుతం పూరి ఉన్నాడట.

Also Read: యాక్షన్ కాంబినేషన్ లో ఫ్యామిలీ డ్రామా !

ఇదిలా వుంటే ఎప్పటి నుంచో పూరి మదిలో వున్న జనగనమణ సినిమా స్క్రిప్ట్ ను కూడా రెడీ చేసి మహేష్ కి వినిపించాలనేది పూరి చేస్తోన్న మరో ప్లాన్. నిజానికి అప్పట్లోనే మహేష్ బాబుకు పూరి ఈ కథను వినిపించాడు. అప్పుడు మహేష్ కి కథ నచ్చలేదు. మళ్ళీ మార్పులు చేసుకుని వస్తా అని చెప్పిన పూరి, ఆ తరువాత మళ్ళీ మహేష్ దగ్గరకు వెళ్ళలేదు. ఇప్పుడు చేసే మార్పులు కూడా మహేష్ కు నచ్చకపోతే.. రానాతో చేస్తాడట. అందుకే ముందు బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేయాలనుకుంటున్నాడు.

Also Read: బ్రేకప్ లు, డైవోర్స్ కథలో రామ్ ‌!

అన్నట్టు భారత దేశంలో అవినీతి జాఢ్యం నేపథ్యంలో ఈ జనగనమణ కథను పూరి రాస్తున్నాడట. అంటే ఈ కథ మొత్తం మన వ్యవస్థలో లోపాల చుట్టూ, అలాగే మన న్యాయ వ్యవస్థలోని డొల్లతనం చుట్టూ కథ సాగుతుందట. ఎలాగూ పూరి నుండి పవర్ ఫుల్ డైలాగులు ఉంటాయి. స్క్రిప్ట్ లో కాస్త విషయం ఉన్న.. దాన్ని పూరి బాగా ఎలివేట్ చేయగలడు. మరీ ఈ జనగనమణ స్క్రిప్ట్, మహేష్ కు నచ్చుతుందో లేక చివరకు రానా దగ్గరకు పోతుందో చూడాలి.

రైల్వే ప్రయాణీకులకు గుడ్  న్యూస్

దేశంలో కరోనా ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ విధించింది. దీంతో ప్రజారవాణా స్తంభించిపోయిన సంగతి తెల్సిందే. రైళ్లు, విమానాలు, బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈనేపథ్యంలోనే కేంద్రం ఆన్ లాక్ విధిస్తూ ప్రజారవాణాను తిరిగి గాడిలో పెడుతోంది. ఇప్పటికే అన్నిరంగాలు తిరిగి యథాస్థితికి చేరుకుంటున్న తరుణంలో ట్రైన్లను కూడా కరోనా నిబంధనలతో నడిపిందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది.

Also Read: రామ మందిరం ఓకే.. మరి బాబ్రీ నిర్మాణం ఎలా ఉండబోతోంది..?

ఆన్ లాక్ 4.0లో భాగంగా కేంద్రం రైల్వేశాఖకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 12నుంచి దేశంలో ప్రత్యేకంగా 80రైళ్లను నడిపించేందుకు రైల్వేశాఖ సన్నహాలు చేస్తోంది. రైలు ప్రయాణీకులు ఈనెల 10 నుంచి రిజర్వేషన్లు చేసుకోవచ్చని రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ తాజాగా ప్రకటించారు. రైల్వే శాఖ తాజాగా నిర్ణయంపై ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ట్రంప్‌ సంస్కరణలు ఇండో అమెరికన్ల ఓట్లు రాల్చేనా

ప్రస్తుతం రైల్వేశాఖ ప్రయాణికుల డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో 80 ప్రత్యేక రైళ్లను నడిపిస్తుందని తెలిపారు. పరిస్థితులను బట్టి ఈ సంఖ్య మరింత పెంచనుందని తెలుస్తోంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కోరితే పరీక్షల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించింది. అదేవిధంగా గతంలో ఆగిపోయిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును తిరిగి కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రజలు బస్సులు అందుబాటులోకి రాగా ట్రైన్లు కూడా ఈనెల 12నుంచి అందుబాటులోకి వస్తుండటంతో ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ జనాలకు జగన్ కన్నా మోదీ పైనే నమ్మకం ఎక్కువా..? 

PM Modi Dials AP CM YS Jagan, Enquires About COVID Centre Mishap

కొద్ది రోజుల క్రితం ఏపీలో తూర్పుగోదావరి జిల్లా సీతానగరం లో శిరోముండనం ఘటన జరిగినప్పుడు బాధితుడు పోలీసుల వద్ద, రాష్ట్ర ప్రభుత్వం వద్ద న్యాయం జరగక రాష్ట్రపతిని ఆశ్రయించిన విషయం తెలిసిందే. రామ్ నాథ్ కోవింద్ కూడా అందుకు తగినట్లు స్పందించి అతనికి అన్ని విధాలా సాయపడ్డారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని ఒక కంప్లైంట్ ప్రధాని నరేంద్ర మోడీ టేబుల్ వరకు వెళ్ళింది.

విషయం ఏమిటంటే…. తెలంగాణలో ఇప్పటి వరకు ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా బాధితులను నిట్టనిలువునా దోచుకుంటున్న ఉదంతాలు ఎన్నో చూశాం. దీనిపై తెలంగాణ హైకోర్టు తో పాటు తెలంగాణ గవర్నర్ తమిళ సై కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని చేసినా టిఆర్ఎస్ ప్రభుత్వం తీరు మారలేదు అనుకోండి అది వేరే విషయం… అయితే ఇక్కడ సంగతి ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రైవేటు ఆసుపత్రులు మేమేమీ పక్క రాష్ట్రం వారికి తక్కువ కాదు అన్న రీతిలో ప్రజలను దోచేసుకుంటున్నాయట.

ఇక కంప్లైంట్ ఇచ్చినా కూడా జగన్ ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవడంలో చూపిస్తున్న అలసత్వం వల్ల చిరాకు చెందిన ఒక వ్యక్తి ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ కి లేఖ రాశారు. ఏలూరు కి చెందిన వంశీకృష్ణ తనతోపాటు మరో 13 కుటుంబాల దగ్గర ఒక ప్రైవేటు ఆసుపత్రి కరోనా వైద్యం పేరుతో తమ వద్ద అధిక మొత్తాన్ని వసూలు చేశారని కంప్లైంట్ రాశారు. దీనికి వెంటనే వంశీకృష్ణకు పీఎం ఆఫీస్ నుండి సమాధానం కూడా వచ్చేసింది. ఇక ప్రధానమంత్రి ఆఫీస్ వారు ఈ విషయాన్ని తక్షణమే విచారించమని రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ అఫీషియల్ జనార్ధన్ కు తెలియజేసినట్లు సమాచారం.

వంశీకృష్ణ పీఎం కు రాసిన లేఖలో ఏలూరులోని మురళీకృష్ణ ఆసుపత్రి వారు ఇప్పటివరకు 13 కుటుంబాలకు నాలుగు లక్షల నుండి 14 లక్షల వరకు ఫీజులు వసూలు చేశారని…. పైగా వైద్యం కూడా సరిగ్గా అందించలేకపోయారు అని కంప్లైంట్ చేశారు. తనకు ఇక్కడా న్యాయం జరుగకపోతే ఇక కోర్టుకు వెళ్ళాల్సి వస్తుందని చెప్పారు. అయితే అంత అవసరం లేకుండా ప్రధానమంత్రి ఆఫీస్ వెంటనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హెల్త్ అథారిటీ లకు ఈ విషయాన్ని చేరవేసి వెంటనే దీనిపై స్పందించాలని ఆదేశించారు.

బ్రేకప్ లు, డైవోర్స్ కథలో రామ్ ‌!


ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ ఇప్పటికే తమిళ్ రీమేక్ ‘రెడ్’ సినిమాని చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ చేయటానికి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్స్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేస్తూ రామ్ మార్కెట్ రేంజ్ ను ఇంకా పెంచుతున్నాయి. అయితే రామ్ మరో తమిళ్ రీమేక్ లో కూడా నటించబోతున్నాడని తెలుస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో తమిళంలో ‘ఓ మై కడవులే’ సినిమా విడుదలై.. మంచి ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను దక్కించుకుంది. దాంతో పక్క భాషా నిర్మాతలు ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం అప్పట్లో బాగానే పోటీ పడ్డారు. అయితే ఆ పోటీలో పీవీపీ గెలిచారనుకోండి.

Also Read: యాక్షన్ కాంబినేషన్ లో ఫ్యామిలీ డ్రామా !

‘ఓ మై కడవులే’ సినిమా తెలుగు భాష రీమేక్ హక్కులను నిర్మాత పీవీపీ భారీ ధరకు దక్కించుకున్నాడు. పీవీపీ పక్కా బిజినెస్ మైండెడ్. మ్యాటర్ లేకపోతే రూపాయి కూడా పెట్టుబడిగా పెట్టడు. అలాంటిది ఆయన ఈ సినిమా రైట్స్ విషయంలో తెలుగులోనే కాకుండా మరి కొన్ని భాషలలో కూడా రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత ఈ సినిమా చేస్తారా? అని పీవీపీ అక్కినేని అఖిల్ ను అప్రోచ్ అయ్యారని, అయితే అఖిల్ మాత్రం ఈ సినిమాకి నో చెప్పాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా రామ్ దగ్గరకు వెళ్ళిందట.

Also Read: అవమానాలు భరించాను.. నాని హాట్ కామెంట్స్

నిజానికి ‘ఓ మై కడవలే’ సబ్జెక్ట్ రామ్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఈ జనరేషన్ యువత మనో భావాలకు అద్దం పట్టేలా కథ సాగడం, పైగా యూత్ ను ఆకట్టుకునే కంటెంట్ సినిమాలో దండిగా ఉండటం, ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు, బ్రేకప్ లు, డైవోర్స్ ఇలాంటి వ్యవహారాలు ఈ సినిమాలో బాగానే ఉంటాయి. పైగా రామ్ కు ఈ కథ చాల కొత్తగా కూడా ఉంటుంది.