
నందమూరి బాలకృష్ణకు ఆయన తండ్రి ‘విశ్వవిఖ్యాత నట సార్వభౌమా నందమూరి తారకరామారావు’ అంటే ఎనలేని అభిమానం. అందుకే ఎన్టీఆర్ ను ఎవరు తలచుకున్నా బాలయ్య పొంగిపోతారు. ఇక ఏకంగా ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్య పుస్తకాల్లో ప్రచురిస్తే.. బాలయ్య ఆనందానికి అవధులు ఏమి ఉంటాయి. అందుకే బాలకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తన ఆనందాని వ్యక్తం చేస్తూ.. ‘కళకి, కళాకారులకి విలువ పెంచిన కథానాయకుడు, తెలుగోడి ఆత్మగౌరవాన్ని దిల్లీ పీఠాన్ని కదిలించేలా వినిపించిన మహానాయకుడు, ఎన్నో సాహసోపేతమైన ప్రజారంజక నిర్ణయాలతో ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజానాయకుడు, మద్రాసీయులమనే పేరుని చెరిపి భారతదేశపటంలో తెలుగువాడికి, తెలుగు వేడికి ఒక ప్రత్యేకతని తెచ్చిన తెలుగుజాతి ముద్దు బిడ్డ మా నాన్నగారు నందమూరి తారక రామారావు. కాగా భవిష్యత్తు తరాలకి స్ఫూర్తినిచ్చేలా ఆయన గురించి 10వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకంలో పాఠ్యాంశంగా చేర్చిన తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి నా హృదయ పూర్వక ధన్యవాదాలు’ అని తన ఫేస్ బుక్ ఎంకౌట్ లో పోస్ట్ చేశారు.
Also Read: నాని ‘వి’ మూవీ రివ్యూ
ఇంతకీ కేసీఆర్ ఉన్నట్లు ఉండి ఎన్టీఆర్ జీవితాన్ని 10వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకంలో పాఠ్యాంశంగా చేర్చడానికి ఓ కారణం ఉందట. కేసీఆర్ రాజకీయ జీవితానికి పునాది వేసింది ఎన్టీఆరే అని, పైగా కేసీఆర్ స్వతహాగా సీనియర్ ఎన్టీఆర్ కి వీరాభిమాని అని.. ఆ అభిమానంతోనే కేసీఆర్, తన కుమారుడి పేరు కూడా తారక రామారావు అని ఎన్టీఆర్ పేరే పెట్టుకున్నారని.. అంతటి అభిమానం ఉంది గనుకనే ఎన్టీఆర్ జీవితాన్ని ఇలా పాఠంగా మలిచారని తెలుస్తోంది. ఎన్టీఆర్ రాజకీయ పార్టీ స్థాపించిన వెంటనే కేసీఆర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం పని చేసి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. మొత్తానికి తానూ సీఎం అయ్యాక ఎన్టీఆర్ మీద అభిమానాన్ని ఈ విధంగా ప్రదర్శించారు కేసీఆర్.




బిహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన 65 స్థానాలను ఉప ఎన్నికలు కూడా నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన సొలిపేట రామలింగారెడ్డి ప్రాతినిధ్యం వహించిన దుబ్బాక నియోజకవర్గానికీ ఉప ఎన్నిక అనివార్యం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కూడా ఈ నయోజకవర్గానికి సంబంధించి త్వరలోనే ఒక రిపోర్టను పంపించనున్నట్లు సమాచారం.
రేవంత్.. యూత్ ఫాలోయింగ్ ఉన్న లీడర్. కొడంగల్ టైగర్.. ఏదైనా సమస్య పరిష్కారానికి ఎక్కడి వరకైనా పోదాం పద అంటూ తెగువ చూపే నాయకుడు. ఏ పార్టీలో ఉన్నా తన వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకునే శైలిలీ ప్రసంగాలు చేయడంలో ధిట్ట. ఉత్సాహం, పోరాటం, ఆరాటం కలిగిన నేత. అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో నిద్రపోయే పర్సన్. ఇలా ఆల్రౌండర్గా పేరు తెచ్చుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. రెండో సారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేసరికి తుడిచిపెట్టుకుపోతున్న కాంగ్రెస్ ఎంతో కొంత బూస్ట్ ఇచ్చింది రేవంత్రెడ్డి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఎక్కడ ఆయనకు పీసీసీ ప్రెసిడెంట్ పదవి వస్తుందోనని కాంగ్రెస్ సీనియర్లంతా కూడగట్టుకొని అడుగడుతునా ప్రయత్నం చేస్తున్నట్లు బహిరంగంగా తెలిసిన విషయమే. కానీ.. రేవంత్ మాత్రం వాటిని లెక్కచేయకుండా తనదైన శైలిలో ముందుకు సాగుతున్నాడు. ఒకానొక సందర్భంలో కొత్త పార్టీ పెడుతాడంటూ ప్రచారాలు వినిపిస్తున్నాయి.
అగ్రరాజ్యం.. ప్రపంచ దేశాలకు పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికాలో ఎన్నికలకు వేళ అయింది. ప్రతి నాలుగేళ్లకోసారి వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనా, ఫలితాలపైనా ప్రపంచవ్యాప్తంగా అదే స్థాయిలో ఆసక్తి ఉంటుంది. ఇక ఈ ఎన్నికల్లో ఇండో–అమెరికన్ల ప్రభావం గట్టిగానే ఉంటుంది. గత టర్మ్లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందారు. ఆయన వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ట్రంప్.. ఈ నాలుగేళ్లలో భారతీయులకు అనుకూలంగానో.. వ్యతిరేకంగానో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో అందరికీ తెలిసిందే. మరోమారు బరిలో నిలుస్తున్న ట్రంప్కు ఈసారి ఇండో అమెరికన్లు మద్దతు తెలుపుతారా..? భారత్ ప్రధాని నరేంద్ర మోదీ తనకు మంచి మిత్రుడని.. ఆయన నుంచి తమకు గొప్ప మద్దతు ఉందని అంటున్నారు. అటు డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా జో బిడెన్, ఉపాధ్యక్ష పదవికి కమలా హ్యారిస్ బరిలో నిలుస్తున్నారు. కమలా హ్యారిస్ ఆసియా అమెరికన్. ఈ పదవికి పోటీ చేస్తున్న తొలి నల్లజాతి మహిళ. మరి ఇప్పుడు మన వాళ్లు ఎవరికి సపోర్టుగా నిలుస్తారో చూడాల్సి ఉంది.
















