Home Blog Page 240

వడదెబ్బ మృతులకు రూ.4 లక్షలు: ప్రభుత్వం సంచలన ప్రకటన..

Ex Gratia for Heat Stroke Victims
Ex Gratia for Heat Stroke Victims

Ex Gratia for Heat Stroke Victims: తెలంగాణలో తీవ్రమైన ఎండలు మరియు వడగాలుల ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి:

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పెరుగుతున్న తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల ఇప్పటివరకు 16 మంది వడదెబ్బతో మృతి చెందినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారికంగా వెల్లడించారు. ఈ 16 మరణాలు ఏడు జిల్లాల్లో నమోదయ్యాయి. వీటిలో జయశంకర్ భూపాలపల్లిలో నాలుగు, వరంగల్ అర్బన్, కరీంనగర్ , నిజామాబాద్ జిల్లాల్లో చెరో మూడు, అలాగే జోగులాంబ గద్వాల, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మరణాలు నమోదైనట్లు మంత్రి తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో బాధిత ప్రతి కుటుంబానికి రూ. 4 లక్షల చొప్పున పరిహారాన్ని వెంటనే అందజేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

సచివాలయంలో అధికారులతో నిర్వహించిన అత్యవసర సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, మే 26 వరకు తీవ్రమైన వడగాలులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని చెప్పారు. ఎల్ నినో (El Nino) ప్రభావంతో ఎండలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయని, కాబట్టి ఏ చిన్న అజాగ్రత్త కూడా ప్రాణనష్టానికి దారితీస్తుందని హెచ్చరించారు. ముఖ్యంగా కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.

ఇదిలా ఉండగా.. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పలు చర్యలు చేపట్టింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు మరియు రద్దీగా ఉండే ప్రాంతాల్లో చల్లని తాగునీరు, మజ్జిగ, మరియు ఓఆర్‌ఎస్ (ORS) కేంద్రాలను అందుబాటులో ఉంచాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి జిల్లా స్థాయి ఆసుపత్రుల వరకు అత్యవసర మందులు, బెడ్లు మరియు సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. పగలు 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, వృద్ధులు మరియు పిల్లల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కోరారు.

నిర్మాణ రంగ కార్మికులు, రోడ్డు పనులు చేసేవారు మరియు వ్యవసాయ కూలీలకు ఎండల తీవ్రత నుండి రక్షణ కల్పించేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో పక్షులు, మూగ జీవాల కోసం నీటి తొట్టెలను ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులను సూచించారు.

రవితేజ 'ఇరుముడి' మూవీ మొత్తం వాళ్ల మీదే నడుస్తుందా..?

Irumudi movie updates
Irumudi movie updates

Irumudi movie updates: రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ సినిమా చాలా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో రవితేజ అయ్యప్ప స్వామి మాల ధరించిన వ్యక్తిగా కనిపించబోతున్నాడు… ఇక ఈ సినిమాలో రవితేజకి కూతురైతే ఉంటుంది. తన కూతుర్ని సేవ్ చేయడానికి రవితేజ ఎలాంటి మార్గాన్ని ఎంచుకున్నాడు. అయ్యప్ప మాలలో ఉన్న తను ఎలాంటి ఇబ్బందులకు గురయ్యాడు. వాటి నుంచి ఆయన ఎలా సేవ్ అయ్యాడు అనేదే ఈ సినిమా కథగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిస్తున్నారు. రవితేజ ఈ మధ్యకాలంలో మొత్తం కమర్షియల్ సినిమాల వైపే అడుగులు వేశాడు.

కానీ ఇప్పుడు ఇరుముడి సినిమాతో ఒక కొత్త ప్రయోగాత్మకమైన సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ ని సాధిస్తే రవితేజ మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. అలాగే శివ నిర్వాణ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పించడం లేదు.

మొత్తానికైతే ఈ సినిమా సక్సెస్ తో తను ఫామ్ లోకి వచ్చి మరోసారి స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. రవితేజ ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తాడట. ఇక తన బాడీ లాంగ్వేజ్ లో కానీ, డైలాగ్ డెలివరీ లో గాని తన యాక్టింగ్ విషయంలో కానీ చాలా వేరియేషన్స్ ఉంటాయని పలువురు సినిమా మేధావులు చెబుతున్నారు…

తొందరలోనే టీజర్ రిలీజ్ చేసి సినిమా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయడానికి సన్నహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక మూవీ షూటింగ్ ను శరవేగంగా కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే రవితేజ ఈ మూవీతో నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ ఆయనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక రీసెంట్ గా రవితేజ చేసిన సినిమాలు ప్రేక్షకులకు చిరాకు తెప్పించాయి…అందుకే ఈ మూవీకి మంచి ఆదరణ దక్కుతుందని ఆయన భావిస్తున్నాడట…

పాకిస్తాన్‌ ఉగ్రవాదుల అడ్డా.. అంతా ఒక్కచోట చేరి..

Pakistan terrorist hub
Pakistan terrorist hub
Pakistan terrorist hub: పాకిస్తాన్‌ ఉగ్రవాదులకు అడ్డా.. ఇదివరకే చాలాసార్లు నిరూపితమైంది. తాజాగా ఇటీవల పాకిస్తాన్‌లో హతమైన పుల్వామా దాడి సూత్రధారి హమ్జా బుర్హాన్‌ అంత్యక్రియల వీడియో వెలుగులోకి వచ్చింది. ఇందులో హిజ్‌బుల్‌ ముజాహిద్దీన్‌ చీఫ్‌ సయ్యద్‌ సలాహుద్దీన్, అల్‌–బదర్‌ సంస్థ నాయకుడు భక్త్‌ జమీన్‌ ఖాన్‌ వంటి భారత్‌ మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టులు ఒకేచోట కనిపించడం, పాకిస్తాన్‌ ఉగ్రవాదానికి ఇప్పటికీ సేఫ్‌ హెవెన్‌గా మిగిలి ఉందన్న నిజాన్ని మరోసారి ఎత్తి చూపుతోంది. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన భయంకరమైన సూసైడ్‌ బాంబు దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ దాడికి ప్రధాన సూత్రధారి అని భారత ఏజెన్సీలు గుర్తించిన హమ్జా బుర్హాన్‌ పాకిస్తాన్‌ భూభాగంలోనే హతమయ్యాడు. అతని అంత్యక్రియలకు వచ్చిన ఉగ్రవాద నాయకుల జాబితా చూస్తే ఆందోళన కలగకమానదు. గుర్తుతెలియని వ్యక్తుల బెదిరింపుల భయంతో భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య వారు హాజరవడం పాక్‌ అధికారులు ఈ ఉగ్రవాదులను రక్షిస్తున్నారనే అనుమానాలను మరింత బలపరుస్తుంది.
పాకిస్తాన్‌ డబుల్‌ గేమ్‌..
పాకిస్తాన్‌ ప్రభుత్వం అంతర్జాతీయ వేదికలపై ‘‘మేము ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తున్నాం’’ అని ప్రకటించినప్పటికీ, వాస్తవం పూర్తి వ్యతిరేకం. హమ్జా బుర్హాన్‌ అంత్యక్రియలు ఈ డబుల్‌ గేమ్‌ను మరోసారి బయటపెట్టాయి. హిజ్‌బుల్‌ ముజాహిద్దీన్‌ వంటి సంస్థలు పాక్‌ సైన్యం, ఐఎస్‌ఐ మద్దతుతోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని భారత్‌ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. అల్‌–బదర్‌ వంటి ఇతర సంస్థలు కూడా కాశ్మీర్‌లో హింసను ప్రేరేపిస్తున్నాయి. ఇలాంటి ఉగ్ర నాయకులు పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా తిరగడం, పబ్లిక్‌గా అంత్యక్రియలు జరపడం ఆ దేశం ఉగ్రవాదాన్ని రాజ్యాంగ భాగంగా చేసుకుందని సూచిస్తోంది.
వీడియో వైరల్‌..
హమ్జా బుర్హాల్‌ అంత్యక్రియల వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అందులో ఉగ్రవాద సంస్థలకు చెందిన కీలక నేతలు ఉండడంతో దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘‘పాకిస్తాన్‌ టెర్రరిస్టుల స్వర్గధామం’’ అని మండిపడుతున్నారు. వారి కోపం సహజమే. ఎందుకంటే భారత్‌లో ఉగ్రవాద దాడులకు ప్రతీసారీ పాకిస్తాన్‌ నుంచే మద్దతు ఉంటుందని చరిత్ర చెబుతోంది. ఈ ఘటన భారత భద్రతా వ్యవస్థకు మరో హెచ్చరిక. మనం కేవలం ఖండనలు మాత్రమే చేసి సరిపెట్టకూడదు. దౌత్యపరమైన ఒత్తిడిని మరింత పెంచాలి. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్‌పై ఒత్తిడి తెచ్చాలి. సరిహద్దు భద్రతను మరింత బలోపేతం చేయాలి. కాశ్మీర్‌లో స్థానిక యువతను ఉగ్రవాద సాయకత్వం నుంచి దూరం చేసే సమగ్ర వ్యూహం అవసరం.
పాకిస్తాన్‌ తన భూమిని ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ద్వారా చివరికి తనకే ప్రమాదం తెచ్చుకుంటోంది. ఉగ్రవాదం ఒక్క దేశానికి మాత్రమే కాదు – ప్రపంచ శాంతికి ముప్పు, హమ్జా బుర్హాన్‌ అంత్యక్రియలు కేవలం ఒక వ్యక్తి మరణం కాదు. అది పాకిస్తాన్‌ అసలు రూపాన్ని మరోసారి బయటపెట్టిన ఘటన. భారత్‌ ఇక మాటలు కాదు, ఫలితాలు చూపించే సమయం వచ్చింది. ఉగ్రవాదాన్ని పోషించే దేశాలు చివరికి తమే దాని బాధితులవుతారన్న వాస్తవాన్ని పాకిస్తాన్‌ అర్థం చేసుకోవాలి.

ఈ స్కూటర్ మనుషులతో పాటు బరువులను మోసుకెళ్తుంది..

River Indie Gen 3 electric scooter
River Indie Gen 3 electric scooter

River Indie Gen 3 electric scooter: భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ‘రివర్ ఇండీ’ (River Indie) ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త మోడల్ ను పరిచయం చేసింది. ‘Gen 3’ వెర్షన్ తో వచ్చిన ఇది ‘స్కూటర్ల SUV’గా ప్రాచుర్యం పొందుతోంది. ఇది కేవలం సాధారణ ప్రయాణానికే కాకుండా, భారీ లోడ్లు మోయడానికి, కఠినమైన రోడ్లపై ప్రయాణించడానికి రూపొందించబడింది. దీని పనితీరు ఎలా ఉందంటే?

River Indie Gen 3 స్కూటర్ లో అత్యంత శక్తివంతమైన 6.7 kW పీక్ పవర్ కలిగిన మిడ్ డ్రైవ్ మోటార్‌ ను అమర్చారు. ఇందులో 4 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది, ఇది ‘ఇండియన్ డ్రైవింగ్ సైకిల్’ ప్రకారం ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 163 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది. గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఇందులో ఈకో, రైడ్, రష్ అనే మూడు రైడింగ్ మోడ్లు ఉన్నాయి. 14 అంగుళాల పెద్ద అల్లాయ్ వీల్స్ ఉండటం వల్ల గుంతలు, ఎగుడుదిగుడు రోడ్లపై కూడా ఇది చాలా సులభంగా, స్థిరంగా ప్రయాణిస్తుంది.

భద్రత పరంగా చూస్తే ఇందులో ఉన్న 200mm డిస్క్ బ్రేక్స్ (ముందు, వెనుక), కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) దీనికి అదనపు బలాన్ని ఇస్తాయి. పార్కింగ్ సులభతరం చేయడానికి ‘రివర్స్, ఫార్వర్డ్ పార్కింగ్ అసిస్ట్’ ఫీచర్ కూడా ఉంది. వర్షాలు, దుమ్ము వంటి వాటి నుండి రక్షణ కోసం మోటార్ మరియు బ్యాటరీకి IP67 రేటింగ్ ఇచ్చారు.

ఎవరికి ఉపయోగకరం?
ఈ స్కూటర్ ప్రధానంగా రోజువారీ ప్రయాణాలతో పాటు, అదనపు అవసరాలు ఉండే వారికి ఒక వరంలా ఉంటుంది. కుటుంబాలు ప్రయాణం చేయడానికి, సామాగ్రి రవాణాకు 43 లీటర్ల భారీ అండర్ సీట్ స్టోరేజ్ , 12 లీటర్ల గ్లోవ్ బాక్స్ కలిపి మొత్తం 55 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీంతో నిత్యం కిరాణా సరుకులు, బ్యాగులు లేదా ఇతర వస్తువులు మోసుకెళ్లే వారికి చాలా ఉపయోగకరం.

ఇందులో ఫ్రంట్ ఫుట్-పెగ్స్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉండటం వల్ల, పొడవుగా ఉన్న వ్యక్తులు కూడా సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఇది దీర్ఘకాలిక ప్రయాణాల్లో అలసటను తగ్గిస్తుంది. దీనికి ఉన్న ‘స్టీల్ ట్యూబులర్ ఛాసిస్’ 18 డిగ్రీల గ్రేడబిలిటీ కారణంగా, కొండ ప్రాంతాల్లో లేదా కఠినమైన రోడ్లపై ప్రయాణించే వారికి ఇది ఎంతో నమ్మదగినది.

కేవలం ఆఫీసుకో లేదా కాలేజీకో వెళ్లేవారికే కాకుండా, వ్యాపార అవసరాలకు లేదా అడ్వెంచర్ రైడ్స్‌కు కూడా ఉపయోగపడేలా రివర్ ఇండీ Gen 3ని డిజైన్ చేశారు. లోడ్ ఎక్కువ మోసుకెళ్లాల్సి వస్తే లేదా సౌకర్యవంతమైన భారీ స్కూటర్ కోసం చూస్తుంటే ఇది సరైన ఎంపిక కావచ్చు.

Oppo కొత్త ఫోన్లు.. పెర్ఫామెన్స్ అదిరిపోయాయి..

Oppo Reno 16 features
Oppo Reno 16 features

Oppo Reno 16 features: Oppo తన ప్రతిష్టాత్మక ‘రెనో’ (Reno) సిరీస్‌లో భాగంగా తదుపరి వెర్షన్ ‘ఒప్పో రెనో 16’ (Oppo Reno 16) సిరీస్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ మొబైల్ అధికారికంగా మే 25, 2026న చైనాలో విడుదల కానుంది. దీంతో పాటు 16 ఫ్రో కూడా మార్కెట్లోకి రానంది. అయితే ఇప్పటికే ఈ ఫోన్ల గురించిన వివరాలు వీడియోల ద్వారా ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ ఫోన్ ఎప్పడు మార్కెట్లోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్నార. వీడియోల ప్రకారం ఈ ఫొన్ ఎలా ఉండబోతుందంటే?

Oppo Reno 16, 16 ఫ్రో ఫోన్లు ప్రీమియం లుక్‌తో రానున్నాయి. రెనో 16 మోడల్ 6.32-అంగుళాల ఫ్లాట్ OLED డిస్‌ప్లేతో ఉండనుంది.ఇది 1.5K రిజల్యూషన్ తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుందని సమాచారం. ఇక ప్రో వేరియంట్ మరింత పెద్దదైన 6.78-అంగుళాల ఫ్లాట్ OLED ప్యానెల్‌ను కలిగి ఉంటుంది . ఈ ఫోన్లు గెలాక్సీ పర్పుల్, హార్ట్‌బీట్ , మూన్‌లైట్ ఈజ్ డార్క్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో లభించనున్నాయి.

ఈ సిరీస్ కలిగి ఫోన్లు పర్ఫార్మెన్స్ పరంగా చాలా పవర్‌ఫుల్‌గా ఉండనున్నాయి. రెనో 16 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 చిప్‌సెట్‌తో పనిచేయనుండగా, ప్రో వేరియంట్ మరింత శక్తివంతమైన డైమెన్సిటీ 9500s ప్రాసెసర్‌ను కలిగి ఉంటుందని అంచనా. ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ OS 16పై రన్ అవుతాయి. 12GB ర్యామ్ నుంచి 256GB స్టోరేజ్ నుంచి గరిష్టంగా 16GB ర్యామ్ 1TB స్టోరేజ్ వరకు వివిధ వేరియంట్లలో లభించే అవకాశం ఉంది.

కెమెరా విభాగంలో ఒప్పో ఈసారి భారీ మార్పులు చేస్తోంది. రెండు మోడళ్లలోనూ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించనున్నారు. ఇందులో 200 మెగాపిక్సెల్ శామ్సంగ్ HP5 ప్రైమరీ సెన్సార్ , 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండనున్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చినట్లు తెలుస్తోంది.

బ్యాటరీ సామర్థ్యాన్ని ఈ సిరీస్‌లో గణనీయంగా పెంచారు. రెనో 16లో 6,700mAh బ్యాటరీని, ప్రో వేరియంట్‌లో ఏకంగా 7,000mAh బ్యాటరీని అందించనున్నారు. ఈ ఫోన్లు 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి, ప్రో మోడల్ అదనంగా 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా కలిగి ఉంటుంది. వీటితో పాటు, IP69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ ను కలిగి ఉంది. కొత్తగా ‘స్నాప్ కీ’ (Snap Key) వంటి ఫీచర్లను ఒప్పో ఇందులో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం చైనాలో ప్రీ-రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి. భారతదేశంలో ఈ సిరీస్ వచ్చే జూలై నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.

టెస్లా కారును ఇలా కూడా వాడతారా.. మస్క్ ఏమైపోవాలి..

Tesla car viral video
Tesla car viral video

Tesla car viral video: టెస్లా.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మానస పుత్రిక. దీని తయారీ ద్వారా మస్క్ వేల కోట్లు సంపాదించాడు.. ఇటీవల సైబర్ ట్రక్ అనే మోడల్ తీసుకొచ్చాడు.. ఇది పూర్తిగా ఎలక్ట్రానిక్ వెహికల్.. అంటే చార్జింగ్ చేస్తే.. రోడ్డుమీద రయిమంటూ దూసుకుపోతుంది. టెస్లా కార్లలో అద్భుతమైన సౌకర్యాలు ఉంటాయి.. పైగా ఇది మామూలు కార్ల మాదిరిగా ఉండదు.. పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా.. టెస్లా కార్లలో అనేక రకాల సౌలభ్యాలు ఉంటాయి.

మస్క్ ఆ మధ్య విడుదల చేసిన వీడియో ప్రకారం టెస్లా కార్లు ధ్వంసం కావు. డ్రైవింగ్ కూడా పూర్తి విభిన్నంగా ఉంటుంది. జిపిఎస్ ఆధారంగా కారు గమనాన్ని ఎప్పటికప్పుడు చూడొచ్చు.. పైగా ఇందులో ఉన్న ఏసీ సౌకర్యం.. హిమాలయాల్లో ఉన్న అనుభూతి కలిగిస్తుంది. సీటింగ్.. కూషన్ వంటివి ఇందులో సరికొత్తగా ఉంటాయి.. మనదేశంలో అయితే కుడి వైపు కూర్చొని డ్రైవింగ్ చేయవచ్చు. టెస్లా కార్లు ఎక్కువగా విదేశాలలో కనిపిస్తాయి కాబట్టి.. అక్కడి నిబంధనల ప్రకారం ఎడమవైపు కూర్చొని డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది.

టెస్లా కార్లకు అధికంగా ధర ఉండడానికి ప్రధాన కారణం.. దాని తయారీకి ఉపయోగించే మెటల్. ఇది కేవలం టెస్లా కార్లలో మాత్రమే వాడుతారు. పైగా టెక్నాలజీ కూడా ఇందులో అద్భుతంగా ఉంటుంది. ఆటో నావిగేషన్.. టైర్లు.. ఇంజన్.. ఇతర సామర్థ్యాలు టెస్లా కార్లలో అంతకుమించి అనే స్థాయిలో ఉంటాయి. అందువల్లే టెస్లా కార్లకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మనదేశంలో కూడా తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు మస్క్ ఆ మధ్య ఆసక్తి చూపించారు. ఆ తర్వాత అమెరికాలో తయారు చేసిన కార్లను ఇండియాలో అమ్ముతామని పేర్కొన్నారు. దానికి భారత ప్రభుత్వం ఒప్పుకోలేదు. దీంతో టెస్లా కార్ల తయారీ యూనిట్ ఇండియాలో ఏర్పాటు సాధ్యం కాలేదు.

టెస్లా కార్లను కొనుగోలు చేసిన వారు చాలా జాగ్రత్తగా వాడుతుంటారు. కానీ సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఒక వీడియోలో మాత్రం ఒక వ్యక్తి చాలా విచిత్రంగా వాడాడు. టెస్లా కార్ల మీద సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేశాడు. ఆ ఫ్యాన్స్ ద్వారా సంగ్రహించుకున్న సూర్య కాంతి నుంచి కారు ఇంజన్ కు శక్తిని అందించే ఏర్పాటు చేశాడు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. సోషల్ మీడియాలో మాత్రం విస్తృతంగా సర్కులేట్ అవుతోంది. ఆ వీడియోలో కనిపించిన దృశ్యాల ప్రకారం విదేశాలలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. మస్క్ తయారుచేసిన కారు ఇలా వాడుతున్నారు అంటే అతడు ఏమైపోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Anderson Westfield (@lmg2kool)

చట్టాల మీద గౌరవం లేదు.. భయం అంతకంటే లేదు.. లాయర్లను వదలరా? ఇంత క్రూరమా..

Advocate Khaja Moinuddin
Advocate Khaja Moinuddin

Advocate Khaja Moinuddin: సినిమాల్లో హీరో, విలన్ మధ్య పోరాటాలు జరుగుతుంటాయి. ముందుగా విలన్ హీరోను అంతం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆ తర్వాత హీరో విలన్ ను చంపేస్తుంటాడు.. వీరిద్దరి మధ్య జరిగే పోరాట సన్నివేశాలు వీరోచితంగా ఉంటాయి. విలన్ గాని.. హీరో గాని ఎంతటి హింసాత్మక ఘటనలకు పాల్పడినప్పటికీ పోలీసులు పట్టించుకోరు. మన వ్యవస్థలు ఏమి చేయలేవు. జస్ట్ వాళ్లు కొట్టుకుంటుంటే.. చుట్టుపక్క వారు వినోదం చూస్తుంటారు. చివరికి హీరో విలన్ ను చంపేసి సినిమాకు శుభం కార్డు వేస్తుంటాడు. ఒక మనిషిని చంపినప్పటికీ కూడా హీరో మీద ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకోరు.

సినిమాలంటే కల్పితాలు కాబట్టి అలా జరిగిపోతూ ఉంటుంది. కానీ రియల్ లైఫ్ లో కూడా అలా జరిగితే దాన్ని ఏమనాలి.. అప్పట్లో మంథని ప్రాంతంలో న్యాయవాద దంపతులను నడిరోడ్డు మీద నరికి చంపారు. పాతబస్తీలో ఇంకా అనేక రకాల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంది. అవన్నీ కూడా సభ్య సమాజంలో భయం కలిగించాయి. నేరాలు జరిగిన తర్వాత.. వాటికి పాల్పడిన వారి మీద న్యాయస్థానాలు.. పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. వారికి శిక్ష పడేలా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ చాలామందిలో మార్పు రావడం లేదు. పైగా చట్టం అంటే భయం లేదు. పోలీసులంటే వణుకు లేదు. సాటి మనుషుల ప్రాణాలు అంటే ఏమాత్రం లెక్కలేదు. దూకుడుగా వస్తున్నారు. దాడులు చేసి చంపేస్తున్నారు. చివరికి తమ పగ చల్లారని తర్వాత పోలీసుల ముందు లొంగిపోతున్నారు.

తాజాగా హైదరాబాదులో మాసాబ్ ట్యాంక్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో కాజా మొయినుద్దీన్ అనే అడ్వకేట్ ఉన్నారు. తన ఇంటి ముందు ఆయన కారులో ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా.. కొంతమంది కారుతో వేగంగా వచ్చి గుద్దేశారు. దీంతో మొయినుద్దీన్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.. ఈ సంఘటన హైదరాబాద్ నగరవాసుల్లో భయాన్ని కలిగించింది. ఈ తరహా సంఘటనలు ఇటీవల కాలంలో విరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. సరిగ్గా ఈ ఘటన కంటే ముందు ఒకరోజు విజయవాడ నగరంలో ఇద్దరు యువకులు పరస్పరం వాహనాలతో ఢీకొట్టుకున్నారు. ఈ ఘటనలో కొంతమంది గాయపడ్డారు. అయినప్పటికీ జనాలలో మార్పు రావడం లేదు. సినిమాలు.. పాత పగలు.. వ్యక్తిగత కక్షలు.. కారణాలు ఏమైనా సరే సాటి మనుషులను చంపడానికి.. అత్యంత క్రూరంగా హింసించడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు.

పోలీసులు కేసులు నమోదు చేస్తున్నప్పటికీ.. న్యాయస్థానాలు శిక్షలు విధిస్తున్నప్పటికీ.. ప్రజల్లో పెద్దగా మార్పు రావడం లేదు. పైగా దారుణాలకు పాల్పడే తీరు మరింత తీవ్రంగా ఉంటున్నది. హింస కూడా అధిక స్థాయిలో ఉంటున్నది.

కెసిఆర్ ఫామ్ హౌస్ లో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా..

KCR farmhouse latest news
KCR farmhouse latest news

KCR farmhouse latest news: ఎమ్మెల్యేగా.. ఎంపీగా.. కేంద్ర మంత్రిగా.. ఉద్యమ నాయకుడిగా.. ముఖ్యమంత్రిగా.. ప్రతిపక్ష నాయకుడిగా.. ఇలా అనేక పాత్రలను పోషించారు కేసీఆర్. సుదీర్ఘ రాజకీయ అనుభవంలో కేసీఆర్ ఎన్నో ఆటుపోట్లను చవిచూశారు. ఉద్యమ సమయంలో అనేక రకాల విమర్శలు ఎదుర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలపాటు రాష్ట్రాన్ని పరిపాలించారు.. 2023 ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు.

2024 పార్లమెంటు ఎన్నికల్లో 0 సీట్లు వచ్చినప్పటికీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లోను ఆశించిన స్థాయిలో స్థానాలు లభించకపోయినప్పటికీ.. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో నమ్మకం కోల్పోకుండా ఉండేందుకు కేసీఆర్ అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.. పార్టీ 25 సంవత్సరాల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఇటీవల జగిత్యాల సభలో సూపర్ స్పీచ్ తో ఆకట్టుకున్నారు. పార్టీకి మళ్ళీ జవసత్వాలు అందించేందుకు కెసిఆర్ కృషి చేస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు పార్టీ క్రియాశీలక సభ్యత్వాల నమోదును కూడా ప్రారంభించారు. ఇప్పటికే అన్ని జిల్లాల బాధ్యులతో కేసీఆర్ మాట్లాడారు.

కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎక్కువ శాతం ఆయన వ్యవసాయ క్షేత్రానికి పరిమితం అవుతారు. ఆయనకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. పైగా గజ్వేల్ ప్రాంతంలో ఆయనకు విస్తారమైన వ్యవసాయ క్షేత్రం ఉంది. అందులో ధాన్యం పంటలు.. వాణిజ్యం పంటలు అన్ని పండుతాయి. క్యాప్సికం.. ముల్లంగి.. స్ట్రాబెరీ.. ఇంకా రకరకాల పంటలు అందులో సాగు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో వరి కోతలు సాగుతున్నాయి. దీనికి సంబంధించి వరి కోతకు వచ్చిన హార్వెస్టర్ డ్రైవర్ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కెసిఆర్ ఫామ్ హౌస్ లో వరికోస్తున్నామంటూ అతడు ఒక వీడియో తీసి పోస్ట్ చేశాడు. అది కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది. చివరికి కేసీఆర్ ఫామ్ హౌస్ లో వరి కోస్తున్న వీడియో కూడా ఈ తీరుగా సంచలనం సృష్టిస్తోందంటే మాటలు కాదని నెటిజన్లు అంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Johndeere (@harvester_standard26)

మళ్లీ యుద్ధం తప్పదా

US Iran war
US Iran war

US Iran war: అమెరికా–ఇరాన్‌ మధ్య శాంతి చర్చలు కొలిక్కి రాలేదు. సీజ్‌ఫైర్‌ మాత్రం కొనసాగుతోంది. శాశ్వతం అగ్రిమెంట్‌ కుదరడం లేదు. అమెరికా షరతులను ఇరాన్‌ అంగీకరించడ లేదు. ఇరాన్‌ కండీషన్లను అమెరికా ఒప్పుకోవడం లేదు. మరోవైపు హర్మూజ్‌పై ఆధిపత్యం కోసం ఇరు దేశాలు పోటీ పడుతున్నాయి. ఇరాన్‌ తీరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఇరిటేషన్‌ తెప్పిస్తోంది. ఇప్పటికే పలుమార్లు వార్నింగ్‌ ఇచ్చారు. మరోవైపు ఇరాన్‌ యూఏఈపై దాడులు ట్రంప్‌కు మరింత కోపం తెప్పిస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఇరాన్‌ తన గగన తలాన్ని తాత్కాలికంగా మూసివేయడం మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలను పెంచింది. ఈ చర్య సాధారణ భద్రతా జాగ్రత్త కాకుండా, సైనిక సన్నాహాల సంకేతంగా అంతర్జాతీయ విశ్లేషకులు చూస్తున్నారు.

ఎయిర్‌ స్పేస్‌ ఎందుకు మూసినట్లు?
సోమవారం ఉదయం వరకు ఇరాన్‌ తన ఆకాశ సరిహద్దులను వాణిజ్య విమానాలకు మూసివేసినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం దేశంలోని ప్రధాన విమానయాన మార్గాలను ప్రభావితం చేసి, అంతర్జాతీయ విమానాలు మరల్చడానికి దారితీసింది. ఇరాన్‌ ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కార్ప్‌స్‌(ఐఆర్‌జీసీఈ) ఈ పరిణామాలను దగ్గరగా పర్యవేక్షిస్తూ, ఏ విధమైన దాడికైనా తగిన ప్రతీఘాతం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చర్చలు విఫలమైతే సైనిక చర్యలకు ప్లాన్‌ చేస్తున్నారనే వార్తలు ఇరాన్‌ను అప్రమత్తం చేశాయి. ఇరాన్‌ ఈ చర్య ద్వారా తన భూభాగం పైన ఎలాంటి దాడి జరిగినా బలమైన స్పందన ఇస్తామని స్పష్టం చేసింది.

ఉద్రిక్తతల మూల కారణాలు..
అణు కార్యక్రమం నుంచి హార్ముజ్‌ వరకుప్రస్తుత ఉద్రిక్తతలు ఇరాన్‌ అణు కార్యక్రమం, హార్ముజ్‌ జలసంధి ద్వారా చమురు రవాణా సమస్యలు, గతంలో జరిగిన సైనిక ఘర్షణల నుంచి ఉద్భవించాయి. ట్రంప్‌ పాలన ఇరాన్‌పై కఠిన వైఖరి అనుసరిస్తుండటంతో చర్చలు సానుకూల ఫలితం ఇవ్వడం కష్టంగా మారింది. ఇరాన్‌ తన ఆకాశ ప్రాంతాన్ని మూసేయడం గతంలో కూడా ఇలాంటి ఉద్రిక్తతల సమయంలో చేసిన చర్యలను గుర్తు చేస్తోంది. ఇది విమానయాన సేవలపై మాత్రమే కాకుండా, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతోంది. చమురు ధరలు ఇప్పటికే పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం మార్కెట్లను మరింత అస్థిరపరచవచ్చు.

శాంతి చర్చల సవాళ్లు…
ప్రస్తుతం రెండు దేశాల మధ్య మధ్యవర్తుల ద్వారా చర్చలు జరుగుతున్నప్పటికీ, కీలక అంశాలపై అవగాహన ఏర్పడలేదు. ఇరాన్‌ తన రక్షణా సన్నాహాలను బలోపేతం చేస్తుండగా, అమెరికా తన మిత్రదేశాలతో సమన్వయం చేసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఉద్రిక్తతలు మధ్యప్రాచ్యంలో మాత్రమే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతాయి. హార్ముజ్‌ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో గణనీయమైన భాగం వెళ్తుంది. ఏ విధమైన ఘర్షణ జరిగినా ధరలు మరింత పెరిగి, ప్రపంచవ్యాప్త ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చు.

ఇరాన్‌ ఎయిర్‌ స్పేస్‌ మూసేయడం ఒక సాధారణ భద్రతా చర్య కాదు. ఇది రెండు దేశాల మధ్య కొనసాగుతున్న దీర్ఘకాలిక అపనమ్మకం. ఇది మళ్లీ యుద్ధం తప్పదా అన్న సంకేతాలు ఇస్తోంది. శాంతి చర్చలు విజయవంతం కావాలంటే రెండు వైపులా రాజీలకు సిద్ధపడాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో మధ్యప్రాచ్యం మరోసారి అగ్నిగుండంగా మారి, ప్రపంచానికి భారీ ఆర్థిక, మానవీయ నష్టం కలిగించే ప్రమాదం ఉంది. ఈ సమయంలో దౌత్యం యుద్ధానికి మార్గం కాకుండా చూడడం అంతర్జాతీయ సమాజం ముందున్న కీలక సవాల్‌.

 

 

నాపై అలా రాస్తారా? ఆ బిగ్ టీవీ పై అనసూయ ఫైర్

Anasuya fire on Big TV
Anasuya fire on Big TV

Anasuya fire on Big TV: బుల్లితెర యాంకర్ గా.. అంతకుముందు న్యూస్ ప్రజెంటర్గా.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. అనసూయ అందరికీ సుపరిచితమే. సోషల్ మీడియాలో అనసూయ విపరీతమైన ఆక్టివ్ గా ఉంటారు. అప్పుడప్పుడు సమాజానికి సంబంధించిన విషయాలను మాట్లాడుతుంటారు. తనకు నచ్చిన కామెంట్లను చేస్తుంటారు. కాకపోతే అవి వివాదాస్పదమవుతుంటాయి.

ఇప్పుడు అనసూయ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. అది కాస్త సంచలనంగా మారింది. బిగ్ టీవీ గతంలో ఆమెను ఇంటర్వ్యూ చేసింది. ఆ సమయంలో ఆమె నేను మద్యం తాగుతానని ఒక కామెంట్ చేశారు. అప్పుడెప్పుడో చేసిన ఇంటర్వ్యూ కి సంబంధించిన కామెంట్ ఇప్పుడు బిగ్ టీవీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దానికి సంబంధించిన వీడియో లింకు కూడా ఇచ్చింది. ఇది అనసూయకు తీవ్రస్థాయిలో కోపం తెప్పించింది. అంతే వెంటనే తన అగ్రహాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేసింది.. జర్నలిజం అంటే ఇలా కూడా ఉంటుందా అంటూ మండిపడింది.

అనసూయ మద్యం తాగుతాను అనే విషయాన్ని మాత్రమే బిగ్ టీవీ హైలెట్ చేసింది. ప్రస్తుతం కేబీఆర్ పార్కు వద్ద చెట్లను తొలగిస్తున్న అంశంలో అనసూయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఆ చెట్లను తొలగించకూడదని.. పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆమె సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. అయితే బిగ్ టీవీ దానిని పక్కనపెట్టి.. కేవలం తాను మద్యం తాగుతాను అనే విషయాన్ని మాత్రమే ప్రస్తావించడం ఏమాత్రం సరైనది కాదని అనసూయ అభిప్రాయపడింది.

బిగ్ టీవీ చేసిన పోస్టును ఉటంకిస్తూ అనసూయ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది జర్నలిజం కాదంటూ మండిపడ్డారు. వ్యక్తిత్వ హననాకి పాల్పడటం జర్నలిజం అవుతుందా అంటూ ఆమె ప్రశ్నించారు. బి గ్రేడ్ స్థాయిలో వ్యవహరిస్తున్న వ్యక్తులు జర్నలిస్టులు అని ఎలా చెప్పుకుంటారు అంటూ ఆమె ఆ గ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు మీకు సిగ్గు లేదని.. ఇలాంటి రాతలు రాస్తే జనం ఎలా సహిస్తున్నారని ఆమె ప్రశ్నించారు.. సాధారణంగా అనసూయ సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేస్తే దానికి విపరీతమైన రీచ్ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఉంది. మరి దీనిపై బిగ్ టీవీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి.

హెడ్ తో గొడవ.. షేక్ హ్యాండ్ ఇవ్వని విరాట్ కోహ్లీ.. వైరల్ వీడియో

Kohli Vs Head
Kohli Vs Head

Kohli Vs Head: జాతీయ జట్టులోనే కాదు.. ఐపీఎల్ లో బెంగళూరు జట్టుకు ఆడుతున్న విరాట్ కోహ్లీ ఎప్పటికీ పతాక శీర్షిక స్థాయి వార్తలలోనే ఉంటారు. ఎందుకంటే విరాట్ కోహ్లీ వీరావేశం ఉన్న ఆటగాడు. బ్యాటింగ్ విషయంలో.. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో.. విరాట్ కోహ్లీ దూకుడుగా ఉంటాడు. అందులో ఏమాత్రం తగ్గడు. పైగా ప్రత్యర్థి ఆటగాళ్లలో ఎవరైనా తనను గెలికితే అప్పుడు మరింత రెచ్చిపోతాడు విరాట్.

శుక్రవారం బెంగళూరు, హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో హైదరాబాద్ గెలిచింది. ఈ మ్యాచ్లో విజయం సాధించిన అనంతరం రెండు జట్లకు సంబంధించిన ఆటగాళ్లు పరస్పరం అభినందనలు తెలుపుతున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు. అయితే విరాట్ కోహ్లీ హైదరాబాద్ ప్లేయర్లందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. హెడ్ కు మాత్రం అసలు ఇవ్వలేదు.. హెడ్ చెయ్యి ముందుకు చాపినప్పటికీ విరాట్ కోహ్లీ ఏ మాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు. దీని వెనక ఒక కారణం ఉంది.

బెంగళూరు జట్టు ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో.. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు. అప్పుడు హెడ్ ఏదో అన్నాడు. దీంతో కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నువ్వు వచ్చి బౌలింగ్ చేయి అన్నట్టుగా సంకేతాలు ఇచ్చాడు. అయితే అప్పటికే విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. నేను బౌలింగ్ చేసే సమయానికి నువ్వు లేవు అన్నట్టుగా హెడ్ సంకేతాలు చేశాడు. దీనిని మనసులో పెట్టుకున్న విరాట్ కోహ్లీ అతడికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెనక్కి వెళ్లిపోయాడు..

విరాట్ కోహ్లీ ఇప్పుడే కాదు.. గతంలో అనేక సందర్భాలలో ఆస్ట్రేలియా ప్లేయర్ల మీద ఇలానే వ్యవహరించాడు. ఎందుకంటే విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేస్తుంటే ఏమాత్రం నచ్చదు. గతంలో టీమ్ ఇండియా ప్లేయర్లు అంతగా స్పందించేవారు కాదు. ఎప్పుడైతే విరాట్ కోహ్లీ గట్టిగా కౌంటర్ ఇవ్వడం మొదలు పెట్టాడో .. అప్పటినుంచి ఆస్ట్రేలియా ప్లేయర్లు తగ్గడం మొదలుపెట్టారు. అంతేకాదు టీమ్ ఇండియా ప్లేయర్లు అంతకుమించి అనేలాగా ఇప్పుడు ఆస్ట్రేలియా ప్లేయర్లకు కౌంటర్ ఇస్తున్నారు. దీంతో ఆస్ట్రేలియా ప్లేయర్లు తగ్గి ఉంటున్నారు. అప్పుడప్పుడు హెడ్ తల బిరుసు తనం ప్రదర్శిస్తున్నప్పటికీ.. టీమిండియా ప్లేయర్లు గట్టిగా కౌంటర్ ఇస్తుండడంతో అతడు కూడా సైలెంట్ అయిపోతున్నాడు.

పాకిస్థాన్ ఆటగాళ్లను ఓ ఆట ఆడుకున్న బంగ్లాదేశ్ ఆటగాళ్లు.. వైరల్ వీడియో

pakistan-players-trolled-by-bangladesh-cricketers-rizwan-viral-video
Pakistan cricket team : పాకిస్తాన్ దేశానికి మాత్రమే కాదు.. అక్కడి జాతీయ క్రికెట్ జట్టుకు కూడా పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. ఇటీవల కాలంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ జోగి జోగి రాసుకుని తిరుగుతున్నాయి. బూడిద రాలుతుందా.. ఇంకేం జరుగుతుందో తెలియదు గానీ.. ప్రస్తుతానికి అయితే ఆ రెండు దేశాలు ఇప్పుడు సయామీ కవలల మాదిరిగా ప్రవర్తిస్తున్నాయి. ఇటీవల పాకిస్తాన్ బంగ్లాదేశ్ కు మిస్సైల్స్.. యుద్ధ సామాగ్రి అమ్మేంది. పాకిస్తాన్ దేశంలో బంగ్లాదేశ్ ఆర్మీకి శిక్షణ కూడా ఇచ్చింది.
బంగ్లాదేశ్లో పాకిస్తాన్ ఇటీవల రెండు టెస్టుల సిరీస్ ఆడింది. రెండు మ్యాచ్ల్లో కూడా ఓడిపోయి వైట్ వాష్ కు గురైంది.. అంతకుముందు పాకిస్తాన్ దేశంలో బంగ్లాదేశ్ రెండు టెస్టులు ఆడింది. అప్పుడు కూడా పాకిస్తాన్ వైట్ వాష్ కు గురైంది.. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆటగాళ్ల మీద తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నప్పటికీ వైట్ వాష్ కు గురికావడం సిగ్గుమాలిన చర్య అంటూ పాకిస్తాన్ అభిమానులు సోషల్ మీడియాలో తమ జట్టు ప్లేయర్లను ఏకి పడేస్తున్నారు. సాల్ట్, కారం వేసుకుని బంగ్లాదేశ్ ప్లేయర్ల సంకనాకమని సూచనలు చేస్తున్నారు.
పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు జరుగుతున్నప్పుడు మైదానంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా సర్కులేట్ అవుతోంది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ సమయంలో రిజ్వాన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే అతడి కంటికి ఎదురుగా ఏదో ప్రకాశవంతమైన వస్తువు కనిపిస్తోంది. దీంతో అతడు బ్యాటింగ్ మీద దృష్టి కేంద్రీకరించలేకపోతున్నాడు. ఇదే విషయాన్ని అంపైర్ తో చెప్పాడు. మధ్యలో బంగ్లాదేశ్ ప్లేయర్లు కలగజేసుకున్నారు. అతడు ఎంతసేపటికి తన బాధను చెబుతున్నప్పటికీ.. అంపైర్ పట్టించుకోలేదు. బంగ్లాదేశ్ ప్లేయర్లు వినిపించుకోలేదు. అనేకసార్లు చెప్పినప్పటికీ ఉపయోగం లేకపోవడంతో రిజ్వాన్ సైలెంట్ అయిపోయాడు..
ఈ వీడియో చూసిన టీమిండియా అభిమానులు రిజ్వాన్ మీద వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. చివరికి బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్లేయర్లకు గౌరవం ఇవ్వడం లేదని.. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా పాకిస్తాన్ క్రికెట్ జట్టు తమ స్థాయి తెలుసుకొని వ్యవహరించాలని.. విలువ లేనిచోట ఉండకూడదని.. ఎందుకైనా మంచిది స్వదేశంలోనే ఇతర జట్లతో సిరీస్ లు ఆడాలని టీమిండియా అభిమానులు సూచిస్తున్నారు.

అలాంటి వాళ్లను మీరు ఓడించలేరు.. పూరి చెప్పిన సీక్రెట్స్...

Puri Jagannadh
Puri Jagannadh

Puri Jagannadh: ఒకప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్… ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించెవి. ఎప్పుడైతే ఆయన వరుస సినిమాలను చేయడం స్టార్ట్ చేశాడో అప్పటినుంచి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను సంపాదించుకున్నాడు. ఇక ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోతున్నాయి. అయితే ప్రేక్షకులు తనను దూరం పెట్టిన కూడా తను జనానికి దగ్గరగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆయన పూరి మ్యూజింగ్స్ అనే ఛానెల్ ద్వారా జనాలను మోటివేట్ నుంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా ఆయన ఆటిట్యూడ్ గురించి చాలా చక్కగా వివరించారు. ఎప్పుడు మన ఆటిట్యూడ్ పాజిటివ్ గానే ఉండాలని దానిని నెగెటివ్ గా మార్చుకుంటే అది చాలా ఇబ్బందిని కూడా కలిగిస్తుందని చెప్పాడు. అలాగే నదిలో కొట్టుకుపోయే ఒక ఇద్దరు వ్యక్తుల్లో ఒకడు చచ్చిపోతే మరొకడు ఏదో ఒక చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడుతూ బతుకుతూ ఉంటాడు. పాజిటివ్ అటిట్యూడ్ ఉన్నోడు అయితే కనీసం నేను బతికున్నాను కదా అనే ఒక ఆనందంతో ఉంటాడు.

అదే నెగెటివ్ ఆటిట్యూడ్ తో ఉన్నవాడైతే నాకే ఎందుకిలా జరిగింది. ఇప్పుడు నేను ఎలా బతకాలి అని ఒక నెగెటివ్ మైండ్ సెట్ తో ఆలోచిస్తాడు అంటూ ఆయన దానిలో పేర్కొన్నారు. ఇక ఎప్పుడు పాజిటివ్ ఆటిట్యూడ్ ఉంటేనే మనం ఏం చేయాలి అనేది మనకు క్లారిటి ఉంటుందని చెప్పాడు.

నెగెటివ్ మైండ్ సెట్ ఉన్నవాడికి దీవెనలు కూడా దరిద్రం గా అనిపిస్తాయని, కన్షియస్ మైండ్ లో ఉన్నవాడికి కష్టాలు కూడా అవకాశాల్లా అనిపిస్తాయని ఆయన క్లారిటి ఇచ్చే ప్రయత్నం చేశాడు…అలాగే ప్రపంచంలో ఏదీ నీకు వ్యతిరేకంగా జరగదు. జరుగుతున్న ప్రపంచంలో నువ్వున్నావ్ అంతే… ప్రతి దానికి కంప్లైంట్ ఇచ్చుకుంటూ వెళ్తే నీకే నష్టం కలుగుతుంది. ఎప్పుడు ఏడుస్తూ బ్రతకాలి అనుకునే వారికి చుట్టూ వేరే కారణాలు గుర్తొస్తుంటాయి.

కానీ ఏది జరిగినా అది మన చేతుల్లో లేదు మన పని మనం చేసుకుంటూ వెళ్దాం అంతే అనుకునే వారికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. రైట్ ఆటిట్యూడ్ తో ఉండే వాళ్ళు జీవితంలో ఏదో ఒకసారి సక్సెస్ ని సాధిస్తారు… ఎవరికి భయపడకుండా మీకు అనిపించింది చేసుకుంటూ వెళ్ళండి రైట్ ఆటిట్యూడ్ తో వెళ్ళిన వారికి ఎప్పటికీ సక్సెస్ లు వస్తూనే ఉంటాయి అంటూ ఆయన పాజిటివ్ ఆటిట్యూడ్ గురించి మోటివేట్ చేసే ప్రయత్నం అయితే చేశారు…

ఏందా బౌలింగ్ వెంకీ గారు.. కావ్య మారన్ ఎక్స్ ప్రెషన్ వీడియో వైరల్

Kavya Maran
Kavya Maran

Kavya Maran: హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మైదానంలో సందడి చేస్తూ ఉంటుంది. ప్రస్తుత ఐపీఎల్ లో కావ్య జట్టు ప్లే ఆఫ్ వెళ్ళిపోయింది. బెంగళూరు తో జరిగిన మ్యాచ్లో భారీ స్కోర్ చేసినప్పటికీ.. టాప్ 2 స్థానంలోకి వెళ్లలేకపోయింది. నెట్ రన్ రేట్ అధికంగా సాధించడానికి బెంగళూరు జట్టును 150 పరుగుల లోపు కట్టడి చేయాల్సి ఉండగా.. హైదరాబాద్ జట్టుకు అది సాధ్యం కాలేదు. కాకపోతే ఈ మ్యాచ్లో ఘనమైన విజయాన్ని అందుకుంది.

బెంగళూరు తో జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో.. ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. బ్యాటింగ్ చేస్తున్న నితీష్ కుమార్ రెడ్డికి క్రునాల్ పాండ్యా అత్యంత వేగవంతమైన బంతి వేశాడు. పైగా ఆ బంతిని కూడా బౌన్సర్ గా వేశాడు. ఒక ఫాస్ట్ బౌలర్ ఏ విధంగా అయితే వేస్తాడో.. అంతకుమించిన వేగంతో వేశాడు. అయితే ఆ బంతి వైడ్ వెళ్ళింది. దీంతో మ్యాచ్ చూస్తున్న కావ్య ఒకసారిగా ఆశ్చర్యపోయింది. తన పక్కనే ఉన్న విక్టరీ వెంకటేష్ తో సంభాషించింది.

దీనికి సంబంధించిన వీడియోను హైదరాబాద్ అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ చేస్తున్నారు. కావ్య తన జట్టు ఆటగాళ్లు ఎదుర్కొనే బంతులను కూడా అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తారని.. తన పక్కనున్న వారితో ఆ బంతుల గురించి చర్చిస్తారని హైదరాబాద్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. కాగా కావ్య అ బంతి గురించి వెంకటేష్ తో చర్చించారని.. బంతి అలా వేశాడు ఎందుకని ప్రశ్నిస్తే.. ఇలాంటివన్నీ జరిగిపోతూనే ఉంటాయని వెంకటేష్ బదులు ఇచ్చినట్టు అక్కడి దృశ్యాలను చూస్తే తెలుస్తోంది.

హీరో వెంకటేష్ క్రికెట్ విపరీతంగా చూస్తుంటారు. హైదరాబాద్ లేదా విశాఖపట్నంలో టీమిండియా ఆడే అంతర్జాతీయ మ్యాచ్లకు కచ్చితంగా హాజరవుతారు. ప్రస్తుత ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు ఉప్పల్ మైదానంలో ఆడుతున్న ప్రతి మ్యాచ్ కు వెంకటేష్ హాజరవుతున్నారు. పైగా ఆయన హైదరాబాద్ జట్టుకు సపోర్ట్ చేస్తున్నారు.. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా కనిపిస్తున్నాయి. క్రికెట్ మీద ఉన్న అభిమానంతో వెంకటేష్ తన సినిమా షూటింగ్ కూడా క్యాన్సిల్ తీసుకుంటారని ప్రచారంలో ఉంది.

ట్రంప్‌ను ట్రాప్‌ చేసేందుకు డ్రాగన్‌ గూడచర్యం.. వెయిటర్‌ ఫొటోలతో గుట్టు రట్టు!

Donald Trump China Visit
Donald Trump China Visit

Donald Trump China Visit: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్‌ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ను వెంటపెట్టుకుని ఇటీవల చైనా పర్యటనకు వెళ్లారు. రెండు రోజులు చైనాలో గడిపారు. చైనా కూడా ట్రంప్‌కు రెడ్‌ కార్పెట్‌తో స్వాగతం పలికింది. అయితే అనుమానాల నడుమ సాగిన ఈ పర్యటన, సమావేశాలలో అనేక ఉద్రిక్తతలు కూడా చోటుచేసుకున్నాయి. ఇరు దేశాలు అగ్రస్థానం కోసం పోటీ పడుతున్నాయి. ఈ పరిస్థితలో ట్రంప్‌ రాకను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నించింది. అమెరికా ఆధిపత్యం చెలాయించకుండా చెక్‌ పెట్టింది. అయితే ట్రంప్‌ చైనా పర్యటన సందర్భంగా జరిగిన అధికారిక విందు వేడుకలో ఎలాన్‌ మస్క్‌ వెనుక నిలబడిన ఎర్ర దుస్తుల మహిళ సాధారణ సర్వర్‌ కాదని, చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) ఉన్నత అధికారి అనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. స్వతంత్ర బ్లాగర్‌ జెన్నిఫర్‌ జెంగ్‌ ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో బయటపెట్టడంతోపాటు, చైనా గూఢచర్య వ్యవస్థ ఎలా పని చేస్తుందనే దానిపై మళ్లీ ప్రశ్నలు లేవనెత్తారు.

ఏం జరిగింది..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నేతృత్వంలోని బృందం చైనాలో అధికారిక సందర్శనలో భాగంగా సీసీపీ ఆతిథ్యం ఇచ్చిన గ్రాండ్‌ బ్యాంకెట్‌లో ఈ సంఘటన జరిగింది. ఎలాన్‌ మస్క్‌తో సహా అనేక అమెరికన్‌ టెక్, వ్యాపార నాయకులు హాజరయ్యారు. జెన్నిఫర్‌ జెంగ్‌ రెండు ఫొటోలను పోస్ట్‌ చేశారు.. ఒకటి ఎర్రటి వెయిటర్‌ యూనిఫామ్‌లో, మరొకటి సైనిక యూనిఫామ్‌లో ఉన్న మహిళ. ఆమెను మేజర్‌ చెంగ్‌ చెంగ్‌గా గుర్తించారు. ఆమె పీఎల్‌ఏ హానర్‌ గార్డ్‌ సెరిమోనియల్‌ బ్రిగేడ్‌లో బెటాలియన్‌ కమాండర్‌గా పని చేస్తున్నట్లు, మహిళా హానర్‌ గార్డ్‌ వ్యవస్థను రూపొందించడంలో కీలక పాత్ర పోషించినట్లు, అధికారిక చైనా సోర్సెస్‌ ప్రకారం ఆమె రికార్డు ఉంది. జెంగ్‌ మరింత ముందుకు వెళ్లి, ఆమె ఎర్ర దుస్తుల కింద ఆయుధం దాచి ఉంచి ఉండవచ్చని ఊహించారు. ఇది సాధారణ ఆతిథ్య సిబ్బంది కాకుండా, ఉన్నత స్థాయి విదేశీ అతిథుల కదలికలు, సంభాషణలపై నిఘా పెట్టడానికి ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేసిన ఏర్పాటు అని ఆమె వాదన.

చైనా గూఢచర్య వ్యూహాలు..
చైనా ప్రభుత్వం విదేశీ ప్రముఖులు, టెక్నాలజీ నాయకులపై రహస్య నిఘా ఉంచడం కొత్త విషయం కాదు. పశ్చిమ దేశాల నిఘా సంస్థలు ఇప్పటికే చైనా ఏజెంట్లు కార్పొరేట్, దౌత్య, టెక్‌ రంగాల్లోకి మారువేషాల్లో చొరబడుతున్నారని పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. జెన్నిఫర్‌ జెంగ్‌ గతంలో కూడా చైనా కమ్యూనిస్టు పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2023లో కెనడాలో హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనుక చైనా హస్తం ఉండవచ్చని ఆరోపణలు వచ్చాయి. కానీ ఆ నిందను భారత్‌పైకి మళ్లించడం ద్వారా పశ్చిమ దేశాలు–భారత్‌ మధ్య విభేదాలు సృష్టించాలని చైనా ప్రయత్నించిందని ఆమె అన్నారు. ఈ తాజా ఘటనలో కూడా అదే వ్యూహం కనిపిస్తోంది. దీనిపై చైనా ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. అయినప్పటికీ, ఇది చైనా యొక్క రాజకీయ–సైనిక వ్యవస్థలో ఉన్న లోతైన అనుమానాలను ప్రతిబింబిస్తుంది. విదేశీ నాయకులు, పారిశ్రామికవేత్తలు చైనాతో వ్యాపార ఒప్పందాలు చేసేటప్పుడు భద్రతా ప్రమాదాలను తక్కువ అంచనా వేయకూడదు. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలోని సున్నితమైన సమాచారం సమకాలీన ప్రపంచంలో అతి విలువైనది. చైనా తన ఆర్థిక, సైనిక శక్తిని విస్తరించుకోవడంలో రహస్య వ్యూహాలను ఉపయోగిస్తుందనే అంతర్జాతీయ అనుమానాలు ఇలాంటి సంఘటనలతో మరింత బలపడుతున్నాయి.

అమెరికా వంటి దేశాలు తమ డెలిగేషన్ల భద్రతపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ఘటన ఒక్కటే కాదు, చైనా–పశ్చిమ దేశాల మధ్య సమ్మతి లేని గూఢచర్య యుద్ధం యొక్క ఒక చిన్న అధ్యాయం మాత్రమే కావచ్చు. ప్రపంచ రాజకీయాల్లో నమ్మకం ఎంత ఖరీదైనదో ఈ సందర్భం మరోసారి గుర్తు చేస్తోంది.

ఫ్లాష్ ఫ్లాష్.. రఘురామకృష్ణంరాజు కొత్త పార్టీ!

Raghurama Krishnam Raju
Raghurama Krishnam Raju

Raghurama Krishnam Raju: రఘురామకృష్ణం రాజు కొత్త పార్టీ పెడతారా? అందులో వాస్తవం ఉందా? ఇలా జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత? పొలిటికల్ సర్కిల్స్ లో దీనిపైన చర్చ నడుస్తోంది. టిడిపి తో పాటు కూటమిలో లేనిపోని వివాదాలకు రఘురామకృష్ణంరాజు కారణమవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అయితే తనకు అటువంటి ఉద్దేశం లేదని.. చంద్రబాబుతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు రఘురామకృష్ణంరాజు. మరోవైపు మంత్రి పదవి కోసమే ఇలా ప్రవర్తిస్తున్నారు అనేది ఒక కామెంట్ ఉంది. అయితే రఘురామకృష్ణం రాజుకు మంత్రి పదవి ఇవ్వడం కంటే ఆయన సొంత పార్టీ పెట్టుకోవడమే టిడిపికి మేలని ఆ పార్టీ క్యాడర్ భావిస్తోంది. వైసీపీలో ఉంటూ ఆ పార్టీపై తిరుగుబాటు చేసిన రఘురామ వల్ల టిడిపికి ప్లస్సు అయ్యింది. అదే సమయంలో చంద్రబాబు పిలిచి మరీ చివరి నిమిషంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఇచ్చారు. కానీ రఘురామకృష్ణం రాజు లేనిపోని వివాదాలతో ఇరకాటంలో పెడుతున్నారు.

* తెలుగు వీర లేవరా అంటూ..
రఘురామకృష్ణం రాజు తెలుగు వీర లేవరా అనే కొత్త పార్టీ పెట్టబోతున్నారు అనేది పొలిటికల్ వర్గాల్లో ఒక చర్చ. ఇటీవల జరిగిన పరిణామాలతో ఆయన ఈ సొంత పార్టీ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. ఇలా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు ఆయన. మరోవైపు తెలుగు వీర లేవరా అనేది సామాజిక వర్గంలో కష్టంలో ఉన్న వారికి ఆదుకునేందుకు రూపొందించిన ఒక ఫోరం అని.. అంతకుమించి ఏమీ లేదన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఇటీవల ఆకివీడు రామాలయ నిర్మాణానికి సంబంధించి.. రఘురామకృష్ణం రాజు చర్యల వల్ల టిడిపికి ఇబ్బందికర పరిస్థితిలు ఎదురయ్యాయి. రఘురామకృష్ణం రాజు చర్యలతో దళితులు టిడిపికి దూరమయ్యే ఛాన్స్ ఉందన్న టాక్ కూడా ఉంది. ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మందకృష్ణ మాదిగ, మహాసేన రాజేష్. అయితే అనవసరంగా లేనిపోని వివాదాలతో ఇబ్బందులు తెస్తున్నారన్న ఆగ్రహం రఘురామకృష్ణం రాజు పై టిడిపి నాయకత్వానికి ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.

* వైసీపీలో రెబెల్ గా మారి
2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు రఘురామకృష్ణంరాజు. గెలిచిన ఆరు నెలలకే ఆ పార్టీకి రెబెల్ గా మారిపోయారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఎదురైతే టిడిపికి కష్టం అన్న వారు ఉన్నారు. అందుకే రఘురామకృష్ణం రాజు కొత్త పార్టీ పెడదామంటే అడ్డుకునే ప్రయత్నం చేయకూడదని.. ఆయనను అలా వదిలేస్తే టిడిపికి లాభం అన్న వారు కూడా ఉన్నారు. కానీ తాను కొత్త పార్టీ అంటూ ఎటువంటిది లేదని.. అటువంటిది ఆలోచన ఏమి చేయలేదని చెబుతున్నారు రఘురామకృష్ణంరాజు. చూడాలి ఏం జరుగుతుందో..

పవన్ అను నేను.. కొత్త ఆవిష్కరణ

Pawan Anu Nenu Book Launch
Pawan Anu Nenu Book Launch

Pawan Anu Nenu Book Launch: పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆయన అభిమానులు కోరుతూ వస్తున్నారు. కానీ పవన్ మాత్రం తన బలాన్ని, తన బలహీనతలను అంచనా వేసుకుని మాత్రమే రాజకీయ అడుగులు వేస్తున్నారు. ఎవరు ఎన్ని రకాల ఒత్తిళ్లు చేసినా.. ఎన్ని రకాలుగా రచ్చ కొడుతున్నా రెచ్చిపోవడం లేదు. మరో 15 ఏళ్ల పాటు కూటమి అధికారంలో ఉండాలన్నది ఆయన అభిమతం. సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయకత్వాన్ని ఆయన హైలెట్ చేస్తూ వస్తున్నారు. ప్రత్యర్ధుల ట్రాప్ లో పడవద్దని.. తాను పొత్తు పెట్టుకుంది ఈ రాష్ట్ర ప్రయోజనాలకు తప్ప.. రాజకీయ ప్రయోజనాల కోసం కాదని.. మరో 15 సంవత్సరాలు పాటు కూటమి ఉండాలన్నది తన లక్ష్యం అని.. పరోక్షంగా చంద్రబాబు నాయకత్వానికి పవన్ జై కొడుతూ వచ్చారు.

* పొత్తు చెడగొట్టేందుకు..
ఏపీలో పొత్తు విచ్ఛిన్నం చేసేందుకు జరగని ప్రయత్నం అంటూ లేదు. తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన ను వేరు చేసేందుకు చాలా రకాల ప్రయత్నాలు జరిగాయి. ఏనాడైతే పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో చంద్రబాబు పరామర్శకు వెళ్లి ప్రకటన చేశారో.. నాటి నుంచి పొత్తు చెడగొట్టేందుకు చాలామంది ప్రయత్నాలు చేశారు. కాపు సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని మరి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వాటన్నింటినీ తట్టుకొని నిలబడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. తనతో ఉన్నవారు ఉండండి.. లేకుంటే బయటకు వెళ్ళిపోవచ్చు అని కూడా తేల్చి చెప్పారు. దీంతో చాలామంది నేతలు బయటకు వెళ్లిపోయారు. ముఖ్యంగా జనసేన ముసుగులో ఉన్న వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ మాటలు రుచించడం లేదు.

* కొత్త పుస్తకం ఆవిష్కరణ..
ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విధేయ నేతలు సైతం టిడిపి తో జనసేన కలిసి ఉన్నంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారం కష్టం అని తేల్చి చెప్పారు. అదే సమయంలో టిడిపి తో జనసేన పొత్తు చెడగొట్టేందుకు పతాక స్థాయిలో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి సమయంలో హైదరాబాదులో పవన్ అభిమానులు, జనసేన అభిమానులు ఒకరు పవన్ అను నేను పుస్తకాన్ని రాసుకోచ్చారు. ఏపీకి ముఖ్యమంత్రిగా పవన్ ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ పుస్తకాన్ని రాయగా ప్రముఖ నేతలు ఆవిష్కరించారు. అయితే ఇప్పటికే మంత్రిగా.. పవన్ అను నేను అని ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు. అయితే జనసైనికులు మాత్రం పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి స్థానంలో చూస్తున్నారు. ఈ పుస్తకావిష్కరణ ద్వారా.. ఆ బలాన్ని మరింత బలంగా చాటుకున్నారు.