Home Blog Page 220

నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ప్రమాదం.. ఈ అలవాట్లతోనే నయం..

Blood Pressure Management
Blood Pressure Management

Blood Pressure Management: భారతదేశంలో హైబీపీ (అధిక రక్తపోటు) ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన ‘సైలెంట్ కిల్లర్’గా మారుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా All India Institute of Medical Sciences కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ అంబుజ్ రాయ్ వెల్లడించిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో ప్రతి ఏడాది సుమారు 16 లక్షల మంది హైబీపీ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన తెలిపారు. గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు వంటి తీవ్రమైన వ్యాధులకు హైబీపీ ప్రధాన కారణంగా మారుతోందని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలు పెద్దగా కనిపించకపోవడంతో చాలా మంది తమకు ఈ సమస్య ఉందనే విషయం ఆలస్యంగా తెలుసుకుంటున్నారు. అయితే హైబీపీ రాకుండా ఉండాలంటే జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా అవసరం. అవేంటంటే?

ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 30 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని అంచనా. పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత వేగంగా పెరుగుతోంది. నగరాల్లో సుమారు 33 శాతం మంది, గ్రామీణ ప్రాంతాల్లో 25 శాతం మంది హైబీపీతో బాధపడుతున్నారని నిపుణులు వెల్లడించారు. మారుతున్న జీవనశైలి, అధిక ఒత్తిడి, శారీరక శ్రమ తగ్గిపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.

హైబీపీని ‘సైలెంట్ కిల్లర్’ అని పిలవడానికి కారణం, ఇది చాలా కాలం పాటు ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకుండానే శరీరాన్ని లోపల నుంచి దెబ్బతీయడం. కొందరికి తలనొప్పి, తల తిరగడం, అలసట వంటి స్వల్ప లక్షణాలు కనిపించినా, చాలామందిలో ఏ సంకేతాలూ కనిపించవు. దీంతో పరీక్షలు చేయించుకునే వరకు సమస్య బయటపడదు. అప్పటికే గుండె, మెదడు, కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది.

వైద్యుల అభిప్రాయం ప్రకారం, హైబీపీని పూర్తిగా నివారించలేకపోయినా, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా రోజూ తీసుకునే ఉప్పు పరిమాణాన్ని తగ్గించడం చాలా అవసరం. అధిక ఉప్పు ఉన్న ప్యాకేజ్డ్ ఫుడ్స్, నిల్వ పచ్చళ్లు, చిప్స్, బేకరీ పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్స్ వంటి వాటిని తగ్గించాలి. నూనె, మసాలాలు అధికంగా ఉండే ఆహారాన్ని తరచుగా తినడం కూడా రక్తపోటును పెంచుతుంది.

శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడం కూడా హైబీపీ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఊబకాయం ఉన్నవారిలో రక్తపోటు సమస్య ఎక్కువగా కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడక, యోగా లేదా ఇతర వ్యాయామాలు చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. అలాగే సరిపడ నిద్ర, మానసిక ప్రశాంతత కూడా ఎంతో అవసరం.

ఇప్పటి జీవనశైలిలో ఒత్తిడి కూడా హైబీపీకి ప్రధాన కారణంగా మారింది. ఉద్యోగ ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, నిద్రలేమి వంటి కారణాల వల్ల రక్తపోటు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ధ్యానం, యోగా, శ్వాస వ్యాయామాలు వంటి అలవాట్లు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. కుటుంబ సభ్యులతో సమయం గడపడం, హాబీలకు సమయం కేటాయించడం వంటి చిన్న మార్పులు కూడా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు హైబీపీ ప్రమాదాన్ని మరింత పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొగతాగడం వల్ల రక్తనాళాలు దెబ్బతింటాయి. మద్యం అధికంగా తీసుకోవడం వల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి వీటిని పూర్తిగా మానేయడం లేదా తగ్గించడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

వైద్యులు సూచిస్తున్న మరో ముఖ్యమైన విషయం రెగ్యులర్ హెల్త్ చెకప్. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి వ్యక్తి నిరంతరం రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. కుటుంబంలో ఇప్పటికే హైబీపీ లేదా గుండె జబ్బుల చరిత్ర ఉంటే మరింత జాగ్రత్త అవసరం. ప్రారంభ దశలోనే గుర్తిస్తే మందులు, జీవనశైలి మార్పులతో ఈ సమస్యను సమర్థంగా నియంత్రించవచ్చు.

చిరంజీవి ఇంకా ఎన్ని సినిమాలు చేస్తారో తెలుసా..?

Chiranjeevi
Chiranjeevi

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. గత 50 సంవత్సరాల నుంచి ఆయన సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చో బెట్టాయి. ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా ఆయన పలు జాగ్రత్తలు తీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు… 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా ఆయన ఇప్పటికి హీరోగా రాణిస్తూ కమర్షియల్ సక్సెస్ లను సాధిస్తున్నాడు అంటే నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి. చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలు తన రేంజ్ కి సరిపడా లేవని కొన్ని విమర్శలైతే వస్తున్నాయి. ఇక వీటన్నింటికి చెక్ పెట్టడానికే ఇప్పుడు వరుసగా మరో రెండు సినిమాలకైతే కమిట్ అయ్యాడు. బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమాతో కమర్షియల్ సక్సెస్ ని సాధించడమే కాకుండా విమర్శకుల నుంచి వచ్చే కామెంట్లను కూడా మూయించాలనే ప్రయత్నంలో చిరంజీవి ఉన్నాడు.

ఇక ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమా చేయడానికి కూడా తను సన్నాహాలు చేసుకుంటున్నాడు. వీళ్లిద్దరి సినిమాల తర్వాత నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయంలో కూడా సరైన క్లారిటీ రావడం లేదు. ఇంకా ఎన్ని సినిమాలు చేస్తాడు సోలో హీరోగా అతను ఎప్పటి వరకు రాణిస్తాడు అనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది…

నిజానికి చిరంజీవి తన చివరి శ్వాస వరకు ఇండస్ట్రీ లోనే కొనసాగుతానని గతంలో చాలాసార్లు చెప్పాడు. ఇక ఏది ఏమైనా కూడా మిగతా హీరోలందరు సరైన సక్సెసులు లేక సతమతమవుతుంటే చిరంజీవి మాత్రం మంచి విజయాలను సాధించినా కూడా అతని రేంజ్ సక్సెసు లైతే రావడం లేదనేది విమర్శకుల వాదన…

రాబోయే రోజుల్లో చిరంజీవి ఇంతకు ముందు సాధించిన విజయాలను దాటి భారీ విజయాన్ని సాధించాల్సిన అవసరమైతే ఉంది… దానికితోడు ఇప్పుడున్న స్టార్ హీరోలందరు పాన్ ఇండియాలో తమ హవాను క్రియేట్ చేస్తుండడం కూడా చిరంజీవి మీద కొంత ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది… మొత్తానికైతే సీనియర్ హీరోల్లో ప్రస్తుతం చిరంజీవి మొదటి స్థానంలో కొనసాగుతుండటం విశేషము…

ప్రభాస్ ను తప్పుగా అర్థం చేసుకున్న స్టార్ డైరెక్టర్...

Prabhas
Prabhas

Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఉన్న ఇమేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చో బెట్టాయి. ప్రస్తుతం పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరో కొనసాగుతున్న నటుడు కూడా తనే కావడం విశేషం…ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. రీసెంట్ గా ‘రాజాసాబ్’ సినిమాతో కొంతవరకు డీలా పడ్డప్పటికి ఆయన స్టాండర్డ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. తన మార్కెట్ ను కూడా విపరీతంగా విస్తరించుకున్నాడనే చెప్పాలి. ఇప్పుడు ప్రభాస్ తో ఒక సినిమా చేస్తే అది సూపర్ సక్సెస్ సాధిస్తే ఈజీగా 2000 కోట్ల మార్క్ ను అందుకోవచ్చనే కాన్సెప్ట్ తోనే దర్శక నిర్మాతలు ఉన్నారు…

గతంలో ప్రభాస్ చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యాన్ని చూపిస్తూ వచ్చాడు. అయితే ఆయన కొరియోగ్రాఫర్లను ఎక్కువగా ఎంకరేజ్ చేసిన విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా రాఘవ లారెన్స్, ప్రభుదేవా లాంటి వాళ్లతో సినిమాలను చేశాడు.

ఇదే సమయంలో అమ్మ రాజశేఖర్ తో కూడా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. కానీ అది అనుకోని కారణాలవల్ల ఆగిపోయిందట. రీసెంట్ గా ఇంటర్వ్యూ ఇచ్చిన అమ్మ రాజశేఖర్ ప్రభాస్ తనతో సినిమా చేస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చాడని చెప్పాడు. నిజానికి తను ప్రభాస్ ని అపార్థం చేసుకున్నాడని కొంతమంది చెబుతున్నారు.

కారణం ఏంటి అంటే అప్పుడున్న బిజీ వల్ల ప్రభాస్ అతనితో సినిమా చేయలేకపోయాడని ఆ తర్వాత అతను చెప్పిన కథ ప్రభాస్ ఇమేజ్ కి సరిపడా విధంగా లేకపోవడం వల్ల ఆ తర్వాత కూడా అతనికి ఛాన్స్ అయితే ఇవ్వలేదని మరి కొంతమంది చెబుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పటికీ ఇండియాలో ఉన్న చాలా మంది దర్శకులు ప్రభాస్ తో సినిమా చేయాలనుకుంటున్నారు. కాబట్టి వాళ్లందరికి అవకాశం దొరికే ఛాన్స్ లేదు. ఎవరైతే అతన్ని తన కథతో మెప్పిస్తారో వాళ్లకు మాత్రమే అవకాశాలైతే దక్కుతున్నాయి…

ఆ మూవీ హిట్ అయితే ఎన్టీఆర్ ను పట్టుకోవడం ఎవరి వల్ల కాకపోయేదా..?

Jr NTR
Jr NTR

NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి చాలా ప్రత్యేకమైన గుర్తింపైతే ఉంది. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రేక్షకులందరిని మెప్పించాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో కొద్దిగా డీలా పడ్డాడు. ముఖ్యంగా పాన్ ఇండియాలో ఆయన మార్కెట్ ను విస్తరించుకోవడంలో చాలావరకు వెనుకబడిపోయాడనే చెప్పాలి… కెరియర్ స్టార్టింగ్ లోనే మాస్ హిట్స్ ని సాధించిన ఆయన ఇప్పుడు పాన్ ఇండియా హీరోలతో పోటీ పడడంలో మాత్రం కొంతవరకు వెనకబడిపోతున్నాడు. కారణం ఏదైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇకమీదట నుంచి తను చేయబోతున్న సినిమాల విషయంలో చాలా స్పెషల్ కేర్ తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది.

ఇక ఇదిలా ఉంటే ఒకానొక సమయంలో ఆయన చేసిన ఒక సినిమా సూపర్ సక్సెస్ అయి ఉంటే ఆయనను ఆపడం ఎవరివల్ల అయి ఉండేది కాదని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన చేసిన ‘ఆంధ్రావాలా ‘ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది ఈ సినిమాకి ఉన్న హైప్ ఏ సినిమాకి లేదు.

అలాగే ఈ సినిమా సక్సెస్ సాధిస్తే కనుక ఎన్టీఆర్ నెంబర్ వన్ హీరోగా మారే అవకాశం ఉండేదని చాలామంది సినిమా మేధావులు సైతం ఇప్పటికి కొనియాడుతూ ఉంటారు. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా వల్ల చాలా వరకు నష్టపోయాడు. ఈ సినిమా నుంచి అతని ప్లాపు ల పరంపర కొనసాగుతూనే వచ్చింది. దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఒక సక్సెస్ కూడా లేకపోవడంతో ఆయన ఇతర హీరోల కంటే కూడా డౌన్ అయిపోయాడు.

ఇక ఆ తర్వాత రాజమౌళితో చేసిన ‘యమదొంగ’ సినిమాతో మరోసారి సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లోనే చాలా హై చూశాడు. కానీ ఇప్పుడు తను కొంతవరకు డౌన్ అయిపోవడం చూస్తున్నా అతని అభిమానులు తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు…

ఎన్టీఆర్ విషయంలో రాంగ్ స్టెప్ వేసిన అనిల్ రావిపూడి...

NTR Anil Ravipudi Movie
NTR Anil Ravipudi Movie

NTR Anil Ravipudi Movie: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఒక సినిమా అయితే రావాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. ‘సుప్రీమ్’ సినిమా సక్సెస్ అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కి కథ చెప్పాలని వెళ్ళాడు. అయితే ఎన్టీఆర్ కి అతను చెప్పిన కథ అంత పెద్దగా ఎఫెక్టివ్ గా అనిపించలేదు. దాంతో మరో కథతో వస్తానని చెప్పారట. మరో కొత్త చెప్పినప్పటికి ఎన్టీఆర్ బాబి డైరెక్షన్లో జై లవకుశ సినిమాకి కమిట్ అవ్వడం వల్ల అనిల్ రావిపూడి తో సినిమా చేయలేకపోయాను అని పలు సందర్భాల్లో చెప్పాడు. అనిల్ రావిపూడి ఎన్టీఆర్ మూవీ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఈ విషయాన్ని చెబుతూనే ఉన్నాడు. ఇక అభిమానులు సైతం వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా పడితే చూడాలని కోరుకుంటున్నారు… నిజానికి అనిల్ రావిపూడి అప్పుడే రాంగ్ స్టెప్ వేశాడని చెప్పాలి. ఎన్టీఆర్ చేత కామెడీని చేయించడం కంటే కూడా అతని చేత భారీ మాస్ అప్పీరెన్స్ చేయించే కథ చెబితే బాగుండేది.

అలాగే అతనికి తగ్గట్టు కథను కూడా రాసుకుంటే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉండేది అవి లేకపోవడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ అనిల్ రావిపూడి కథను రిజెక్ట్ చేశాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ అంటేనే మాస్ ప్రేక్షకులు ఎక్కువ కనెక్ట్ అవుతారు. కాబట్టి ఆ ఎలిమెంట్స్ ని ఎక్కువగా ఆడ్ చేసుకుంటే సినిమా చూసేవాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు…

అతను అభిమానులు కూడా ఎంజాయ్ చేసేవారు. ఫ్యూచర్లో ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడా? అతని స్వాగ్ ను అందుకోగలిగే కథని రెడీ చేయగలుగుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

మొత్తానికైతే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక అనిల్ సైతం ప్రస్తుతం వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి భారీ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…

మార్కో రూబియోకి ’మోదీ మార్క్‌’ ట్రీట్‌మెంట్‌.. అమెరికాకు స్పష్టమైన సందేశం!

Marco Rubio India Visit
Marco Rubio India Visit

Marco Rubio India Visit: అగ్రరాజ్యం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇటీవలి నాలుగు రోజుల భారత్‌ పర్యటన దౌత్య ప్రపంచంలో చర్చనీయాంశమైంది. సాధారణ ప్రోటోకాల్‌తో ముడిపడిన ఈ సందర్భం రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలను, భారత్‌ స్వతంత్ర విదేశీ నీతిని ప్రతిబింబించేలా ఉంది.

పర్యటన ఇలా..
భారత్‌కు వచ్చిన రూబియో పర్యటన కోల్‌కతాలో మదర్‌ థెరిసా సంస్థ సందర్శనతో మొదలైంది. అక్కడ అమెరికా రాయబారి ఆహ్వానం మాత్రమే ఉండగా, భారత్‌ తరఫున ఉన్నత అధికారులు ఎవరూ లేకపోవడం గమనార్హం. తర్వాత ఆగ్రా, జైపూర్‌లో మధ్యాహ్నం సమయంలో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల ఎండ, వేడికి రూబియో ఎదుర్కొన్న అసౌకర్యాలు కూడా చర్చకు లోనయ్యాయి. ఢిల్లీలో జరిగిన కీలక సమావేశాలు మినహా, మొత్తం పర్యటనలో వీవీఐపీ స్థాయి స్వాగతం లేదా ప్రత్యేక ప్రోటోకాల్‌ కనిపించలేదు. తిరిగి వెళ్లేటప్పుడు కూడా మామూలు వీడ్కోలు మాత్రమే జరిగాయి. ఇది సాధారణ దౌత్య ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నా, సందర్భం కారణంగా ప్రత్యేక ఆసక్తి కలిగించింది.

ఎందుకు ఇలా..?
ఇటీవలి కాలంలో అమెరికా వైఖరి భారత్‌ను అసంతృప్తి చెందించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్‌ను ‘డెడ్‌ ఎకానమీ‘గా వర్ణించడం
ఇష్టానుసారం టారిఫ్‌లు విధించడం, ఆపరేషన్‌ సిందూర్‌ వంటి సందర్భాల్లో అమెరికా ధోరణి ఇవన్నీ భారత్‌ స్పందనకు నేపథ్యం అని చెప్పవచ్చు. భారత్‌ తన జాతీయ ప్రయోజనాలను, సార్వభౌమత్వాన్ని ఎంత మాత్రం రాజీ పడకుండా కాపాడుకుంటుందని ఈ పర్యటన ద్వారా పరోక్ష సందేశం వెళ్లింది. విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ రూబియోతో జరిగిన చర్చల్లో ఆయిల్‌ దిగుమతులు వంటి అంశాలపై గట్టి స్థానం తీసుకోవడం ఇందుకు ఉదాహరణ.

రూబియో లక్ష్యాలు ఇవీ..
రూబియో నవంబర్‌ మధ్యంతర ఎన్నికల ముందు ఏదైనా సాధించినట్లు చూపించుకోవాలని భావించి వచ్చారని కొందరు విశ్లేషిస్తున్నారు. అమెరికా దశాబ్దాలుగా ఏర్పాటు చేసిన భారత్‌–అమెరికా బంధాన్ని స్థిరీకరించడం, రష్యా–చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడం అతని ముఖ్య లక్ష్యాలు. క్వాడ్‌ సమావేశాలు, ఇండో–పసిఫిక్‌ వ్యూహాలు ఇందులో భాగం. అయితే, జాయింట్‌ ప్రెస్‌ మీట్‌లో అమెరికాలోని జాత్యహంకార దాడులపై ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం లభించకపోవడం గమనార్హం. భారత్‌ ఏ దేశ ఒత్తిడికీ తలొగ్గదని, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఈ సందర్భం ద్వారా స్పష్టమైంది.

దీర్ఘకాలిక పరిణామాలు..
ఈ పర్యటన భారత్‌ అభ్యుదయం, ఆత్మనిర్భరతను హైలైట్‌ చేసింది. అగ్రరాజ్యంతో సంబంధాలు మెరుగుపరచాలని అమెరికా కోరుకుంటున్నా, సమానత్వం ఆధారంగా మాత్రమే అది సాధ్యమవుతుందని భారత్‌ స్పష్టం చేసింది. ట్రంప్‌ పాలనలో ఏర్పడిన పగులను సరిదిద్దడానికి రూబియో ప్రయత్నాలు ఇంకా కొనసాగాల్సి ఉంది. భారత్‌ ఇప్పుడు ఆర్థిక, సైనిక, సాంకేతిక రంగాల్లో బలపడుతోంది. ఏ దేశానికీ ఆధారపడకుండా స్వతంత్ర విదేశీ విధానాన్ని అనుసరిస్తోంది. రూబియో పర్యటన ఈ వాస్తవాన్ని మరోసారి ధృవీకరించిన అవకాశం ఉంది.

దౌత్యం అనేది పరస్పర గౌరవం, సమానత్వం మీద ఆధారపడి ఉంటుంది. ’మోదీ మార్క్‌’ అని పిలవబడిన ఈ ట్రీట్‌మెంట్‌ భారత్‌ ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. రెండు దేశాలు కూడా దీర్ఘకాలిక సహకారం కోసం ముందుకు సాగాలంటే పరస్పర ఆసక్తులను గౌరవించడం అనివార్యం.

బాలోచిస్తాన్‌ రిపబ్లిక్‌.. స్వతంత్ర దేశం నుంచి స్వాతంత్య్ర పోరాటం వరకు..

Balochistan Independence Movement
Balochistan Independence Movement

Balochistan Independence Movement: పాకిస్తాన్‌లో 50 శాతం విస్తీర్ణం కలిగిన అతిపెద్ద రాష్ట్రం బలూచిస్తాన్‌. దక్షిణ ఆసియా, మధ్య ఆసియా మధ్య సముద్ర తీరం, ఎడారి ప్రాంతాలను కలిపి ఉన్న విస్తృత భూభాగం. ఈ ప్రాంతం ప్రస్తుతం పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య విభజించబడి ఉంది. పాకిస్తాన్‌ నుంచి విడిపోయి స్వతంత్ర దేశం కోసం అక్కడి ప్రజలు ఐక్య పోరాటం చేస్తున్నారు. స్వతంత్ర ’బాలోచిస్తాన్‌ రిపబ్లిక్‌’ ఏర్పడితే, అది ప్రాంతీయ భౌగోళిక, ఆర్థిక, రాజకీయ దృక్పథాన్ని మార్చే అవకాశం ఉంది.

చారిత్రక విభజన.. ఏకీకరణ
19వ శతాబ్దంలో బ్రిటీష్‌ విస్తరణ సమయంలో బాలోచిస్తాన్‌ ’గ్రేట్‌ గేమ్‌’లో భాగమైంది. బ్రిటీష్‌–ఇరాన్‌ సరిహద్దు ఒప్పందాలు (1871–1896) ఈ ప్రాంతాన్ని తూర్పు, పశ్చిమ భాగాలుగా విభజించాయి. 1947–48లో పాకిస్తాన్‌ ఏర్పాటు సమయంలో తూర్పు బాలోచిస్తాన్‌ దానిలో విలీనం అయింది. ఉత్తర భాగం ఆఫ్ఘనిస్తాన్‌కు, పశ్చిమ భాగం ఇరాన్‌కు చెందింది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో 44 శాతం, ఇరాన్‌లో 28 శాతం, ఆఫ్గానిస్తాన్‌లో 28 శాతం కలిసింది. ఈ విభజన స్థానిక తెగల స్వయం పాలన సంప్రదాయానికి విఘాతం కలిగించింది.

స్వతంత్ర బలూచిస్తాన్‌ కోసం పోరాటం..
స్వతంత్ర బాలోచిస్తాన్‌ ఏర్పాటు అంటే ఈ మూడు దేశాల నుంచి భూభాగాలను ఏకం చేయడం, ఇది రాజకీయంగా అత్యంత సవాల్‌తో కూడుకున్న విషయం. రిపబ్లిక్‌ ఆఫ్‌ బాలోచిస్తాన్‌ రాజధాని క్వెట్టా. దీని వైశాల్యం 7.70 లక్షల చదరపు కిలోమీటర్లు, ఇక్కడ 2.5 నుంచి 3 కోట్ల జనాభా ఉంది. బలూచిస్తాన్‌లో ప్రధాన నగరాలు క్వెట్లా, గ్వాదర్, తర్బత్, ఖుజ్‌దార్, నుష్కి, జాహెదాన్, చాబహార్, డాల్‌బందిన్, సరావాన్‌. బలూచిస్తాన్‌ భాషలు..
ఇక్కడ అధికారిక భాషలు బలోచి (ప్రధానం), ఉర్దూ, పర్షియన్‌ (ద్వితీయ). అధికారిక మతం ఇస్లాం. ఈ దేశం ఎడారి, పర్వతాలు, అరేబియా సముద్ర తీరాన్ని కలిగి ఉంటుంది. తక్కువ జనసాంద్రత కారణంగా విస్తృత భూములు అందుబాటులో ఉంటాయి. బాలోచిస్తాన్‌ దక్షిణాసియాలో అత్యంత అనుకోకుండా ఉన్న వనరుల సంపదను కలిగి ఉంది:

అభివృద్ధి చెందని చమురు నిల్వలు
గాలి, సౌర శక్తి కోసం అనువైన విస్తృత ప్రాంతాలు ఉన్నాయి. గ్వాదర్, చాబహార్‌ వంటి తీర ప్రాంతాలు ద్వారా సముద్ర మార్గాలు మరియు ఇంధన రవాణా సామర్థ్యం ఉంది. రికో డిక్‌ వంటి ప్రపంచంలోనే అతిపెద్ద రాగి–బంగారు గనులు
బొగ్గు, క్రోమియం, ఇనుము, మార్బుల్, సున్నపు రాయి ఉన్నాయి. స్వతంత్ర దేశంగా ఈ వనరులు సమర్థవంతంగా వినియోగించుకుంటే, ఇది ఆర్థికంగా బలమైన దేశంగా అభివృద్ధి చెందవచ్చు. రెన్యూవబుల్‌ ఎనర్జీ, ఖనిజ ఎగుమతులు దాని ఆర్థిక వెన్నెముకగా మారవచ్చు.

వ్యూహాత్మక ప్రాముఖ్యత..
చైనా–పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌లో గ్వాదర్‌ పాత్ర, ఇరాన్‌తో సరిహద్దు – ఇవన్నీ బాలోచిస్తాన్‌ను భౌగోళిక రాజకీయాల్లో కీలకమైన స్థానంలో ఉంచుతాయి. స్వతంత్ర దేశంగా ఇది ప్రాంతీయ సమతుల్యాన్ని మార్చగలదు. అయితే, పొరుగు దేశాలతో సంబంధాలు, ఆంతర్జాతీయ గుర్తింపు మరియు భద్రతా సవాళ్లు పెద్ద సమస్యలు.

బాలోచిస్తాన్‌ రిపబ్లిక్‌ ఏర్పాటు అనేది చారిత్రక న్యాయం, ఆర్థిక సామర్థ్యం రెండింటినీ కలిగి ఉన్న ఆలోచన. అయితే, ఇది రాజకీయంగా అత్యంత క్లిష్టమైన మార్పు. స్థానిక ఐక్యత, శాంతియుత మార్గాలు, పొరుగు దేశాలతో సమన్వయం లేకుండా ఈ కల నిజం కావడం కష్టం. భవిష్యత్తులో ప్రాంతీయ స్థిరత్వం కోసం ఈ ప్రాంతం యొక్క వనరులు, జనుల సామర్థ్యాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం కీలకం.

అనిల్ రావిపూడి సినిమాలో వెంకటేష్ సీరియస్ గా కనిపిస్తాడా..? మరి కామెడీ ఎవరు చేస్తారు...

Venkatesh And Anil Ravipudi
Venkatesh And Anil Ravipudi

Anil Ravipudi And Venkatesh: అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేష్ హీరోగా ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. ఇక రీసెంట్ గా చిరంజీవితో అనిల్ రావిపూడి చేసిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాలో కూడా ఆయన గెస్ట్ రోల్లో నటించి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆయన వెంకటేష్, కళ్యాణ్ రామ్ లను పెట్టి ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ చాలా సీరియస్ పాత్రలో కనిపించబోతున్నాడట. నిజానికి అనిల్ రావిపూడి చేసిన అన్ని సినిమాల్లో వెంకటేష్ చాలా కామెడీ పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన స్పందన రాబట్టాడు. కానీ మొదటిసారి ఆయన సీరియస్ క్యారెక్టర్ ను చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఈ మూవీలో వెంకటేష్ సీరియస్ పాత్రలో నటిస్తే ఈ సినిమాలో కామెడీ ఎవరు చేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి.

నిజానికి ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కామెడీ చేయబోతున్నాడట. అతని కామెడీ టైమింగ్ కూడా అనిల్ రావిపూడి టెస్ట్ చేసి మరి అతని బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఆ క్యారెక్టర్ ను డిజైన్ చేసి కామెడీ పంచులను కూడా రాస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.

మొత్తానికైతే అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరమనే చెప్పాలి. ఆయన తక్కువ రోజుల్లో సినిమా చేసి భారీ విజయాన్ని అందిస్తున్నాడు. కాబట్టి ఇండస్ట్రీలో ఎక్కువ మనీ జనరేట్ అవ్వడమే కాకుండా ప్రొడ్యూసర్లు కూడా చాలా సేఫ్ జోన్ లో ఉంటున్నారు…

ఇక ఇప్పటివరకు కళ్యాణ్ రామ్ సీరియస్ పాత్రలను పోషించాడు. కాబట్టి అతని చేత కామెడీ చేయించి, వెంకటేష్ చేత సీరియస్ పాత్రను వేయించాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ కాన్సెప్ట్ ను రెడీ చేయిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక వీళ్ళిద్దరిని డిఫరెంట్ గా ప్రజెంట్ చేయాలని చూస్తున్న కళ్యాణ్ రామ్ అనిల్ రావిపూడి ని ఎలా చూపిస్తాడు. ఈ సినిమాతో కూడా సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

రోజాపై కొత్త జంతువుల పేర్లతో షర్మిల దాడి.. రెడీగా ఉండాల్సిందే!

Roja Vs Sharmila
Roja Vs Sharmila

Roja Vs Sharmila: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు వివాదాస్పద అంశాల జోలికి వెళ్తూనే ఉంటారు. సాధారణంగా కుటుంబ వ్యవహారాలను నేతలు పెద్దగా ప్రస్తావించరు. కానీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ వ్యవహారంలో చాలామంది నేతలు మాట్లాడుతుంటారు. తాజాగా మహానాడులో ఇదే ప్రస్తావన వచ్చింది. గొడ్డలి పార్టీగా పేర్కొంటూ వైయస్ వివేకానంద రెడ్డి హత్య అంశం ప్రస్తావిస్తూ నేతలు ఆరోపణలు చేశారు. అయితే వీటిని తిప్పి కొట్టే క్రమంలో మాజీ మంత్రి రోజా.. ఎవరిది గొడ్డలి పార్టీ అంటూ ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి హత్య ఘటన ఎవరి హయాంలో జరిగింది అంటూ లాజిక్ ప్రశ్న వేశారు. అంతటితో ఆగకుండా జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లెలు షర్మిలకు ప్రపంచంలో ఏ అన్న ఇవ్వని విధంగా భారీగా ఆస్తులు ఇచ్చారని చెప్పుకొచ్చారు. వారి మధ్య జరుగుతున్న వివాదాన్ని ప్రస్తావించారు. మధ్యలో విజయమ్మ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. వివేకానంద రెడ్డి హత్య ఘటన చంద్రబాబు హయాంలో జరిగిందని.. ఆయనను నిలదీయాలని పిలుపునిచ్చారు.

* రాచమల్లు పై కుక్క అని ఆరోపణ..
మొన్న మధ్యన జగన్మోహన్ రెడ్డితో షర్మిల వివాదాన్ని ప్రస్తావించారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ప్రపంచంలోనే షర్మిల లాంటి సోదరి ఎవరికీ ఉండకూడదు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన అన్న తనను మోసం చేసిన తీరుపై షర్మిల చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారు. తాను తన అన్న జగన్మోహన్ రెడ్డి పై మాట్లాడుతుంటే.. కుక్కలతో మాట్లాడిస్తున్నారు అంటూ కామెంట్స్ చేశారు. అవును తాము జగన్మోహన్ రెడ్డి అనే యజమానికి కుక్కలం అంటూ రాచమల్లు స్టేట్మెంట్ ఇచ్చారు. వెంటనే స్పందించిన షర్మిల వైసిపి నేతలను కుక్కలు అనవద్దు.. కుక్కలు కూడా బాధపడుతున్నాయి అంటూ సెటైర్లు వేస్తూ కామెంట్స్ చేశారు.

* రోజాపై తప్పక రియాక్షన్..
ఇంత జరిగాక కూడా మాజీ మంత్రి రోజా ఇప్పుడు షర్మిల ప్రస్తావన తీసుకొస్తున్నారు. దీంతో రోజాపై షర్మిల ఎలా రియాక్ట్ అవుతారో అని ఎక్కువ మంది ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు కుక్క అని సంబోధించారు. ఇక కొత్త జంతువుల పేర్లను పెట్టి గట్టిగానే షర్మిల రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేతిలో తాను మోసపోయానని.. తన ఆస్తిని సైతం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారని.. ఆ కారణంతోనే ఆయనను విభేదించడం ప్రారంభించారు షర్మిల. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఏ చెల్లికి ఇవ్వనంత ఆస్తి.. షర్మిలకు ఇచ్చారంటూ రోజా వకాల్తా పుచ్చుకొని మాట్లాడారు. దీనిపై షర్మిల నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ ఉండబోతుంది.

నాగార్జున 100 వ సినిమా లో టబు చేసే పాత్ర ఏంటంటే..?

Nagarjuna 100th Movie
Nagarjuna 100th Movie

Nagarjuna 100th Movie: హీరోల్లో నాగార్జునకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒకప్పుడు ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల పాత్రలు చేయగలిగే కెపాసిటి నాగార్జున సొంతం. అలాంటి నాగార్జున తన వందో సినిమాను చాలా ప్రెస్టేజీయస్ గా తీసుకొని మరి చేస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయినప్పటికి ఇందులో ఐశ్వర్య రాజేష్ టబు లు కూడా నటిస్తున్నారు. ముఖ్యంగా నాగార్జునతో చాలా సంవత్సరాల తర్వాత టబు నటించడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో నాగార్జున ఎంగేజ్ లో ఉన్నప్పుడు టబు తన లవర్ గా కనిపిస్తుందట. అయితే ఇందులో నాగార్జున డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ మూవీ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందట.

మొత్తానికైతే టబు ఈ మధ్యకాలంలో తెలుగులో పెద్దగా సినిమాలైతే చేయడం లేదు. అలా వైకుంఠపురంలో సినిమాలో అల్లు అర్జున్ తల్లిగా నటించిన ఆమె ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తుంది. ఇక ఇప్పటికే ఆమె నుంచి వచ్చిన ప్రతి సినిమా డిఫరెంట్ అటెంప్ట్ గా మిగులుతుంది.

కాబట్టి ఈ సినిమాలో తన పాత్ర కూడా చాలా వేరియేషన్స్ ఉండడమే కాకుండా ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ ని కూడా ప్రేక్షకుడికి ఇస్తుందని ఆయన క్యారెక్టర్ ఈ సినిమా మొత్తానికి చాలా కీలకమని చెబుతున్నారు… ఇక ఏది ఏమైనా కూడా దర్శకుడు ఈ సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక నాగార్జున వందో సినిమాతో భారీ విజయాన్ని సాధించాల్సిన అవసరమైతే ఉంది.

ఆయన గత సంవత్సరం చేసిన కుబేర, కూలీ లాంటి సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించాడు. ఆ పాత్రలు ఆయనకి మంచి గుర్తింపుని తీసుకొచ్చాయి. తన 100 వ సినిమాతో మరోసారి తన సత్తా చాటుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ప్రొఫెసర్ నాగేశ్వర్ కు ఇవే మా సూటి ప్రశ్నలు.. సమాధానం చెప్పగలరా..

Professor Nageshwar
Professor Nageshwar

Professor Nageshwar: ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో ఏపీ ప్రభుత్వం ఎటువంటి దూకుడు ప్రదర్శించలేదు. జనసేన నాయకులు ఫిర్యాదు చేస్తే పోలీసులు వాటిని స్వీకరించారు. పెద్దగా కేసులు నమోదు చేసినట్టు కూడా కనిపించలేదు. కానీ వైసీపీ అనుకూల మీడియా.. సోషల్ మీడియా రెచ్చిపోయింది. ఏపీ పోలీసులు తెలంగాణలోకి వచ్చేశారు.. ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్ట్ చేయబోతున్నారు అన్నట్టుగా ప్రచారం చేసింది.

నాగేశ్వర్ మాట్లాడిన మాటలు తర్వాత టిడిపి అధినేత చంద్రబాబు గాని.. ఏపీ మంత్రి లోకేష్ గాని ఒక మాట కూడా మాట్లాడలేదు. నారా లోకేష్ పరోక్షంగా మాత్రమే విమర్శించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయం మీద మాట్లాడి.. దానిని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని ప్రకటించారు. అంతేకాదు కేసులు నమోదు చేయకూడదని పోలీసులకు సూచించారు. ఇక సోషల్ మీడియాలో నాగేశ్వర్ అరెస్టు అని జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఖండించారు. ఇదంతా కూడా చవకబారు ప్రచారం అంటూ ఆమె క్లారిటీ ఇచ్చేశారు.

నాగేశ్వర తన చేసిన వ్యాఖ్యలను విరమించుకున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా కేసులు పెట్టబోమని స్పష్టం చేసింది. కానీ మధ్యలో కొంతమంది సో కాల్డ్ (ఈ మాట అంటున్నందుకు ఎటువంటి పశ్చాతాపం లేదు. ఇబ్బంది అంతకంటే లేదు) జర్నలిస్టులు ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్దతుగా వచ్చామని ప్రకటించారు. హైదరాబాదులో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అందులో నారా చంద్రబాబునాయుడు ను.. ఏపీ మంత్రి నారా లోకేష్ ను.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించారు. పైగా తెలంగాణ అమరవీరులకు జోహార్లు అంటూ చివరిలో నినాదాలు చేశారు.

కేసు పెట్టబోమని ఏపీ ప్రభుత్వం చెప్పింది. తాను చేసిన వ్యాఖ్యలను నాగేశ్వర్ వెనక్కి తీసుకున్నారు. ఇక గొడవ ఎక్కడిది. వాస్తవానికి ఈ గొడవ కారణం ప్రొఫెసర్ నాగేశ్వర్. అనవసరంగా లేని వివాదాన్ని గెలుక్కున్నారు. తాను ఒక మేధావిని అనే విషయాన్ని పక్కన పెట్టి ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడారు. పైగా యుద్ధం మొదలుపెట్టారు.. ముగింపు నేను ఇస్తానని వీరలెవల్లో లెక్చర్లు ఇచ్చారు. ఆయనకు సంఘీభావంగా కొంతమంది ఊరు పేరు లేని వ్యక్తులు ప్రెస్ క్లబ్ లోకి వచ్చారు. పైగా నాగేశ్వర్ భుజాల మీద తుపాకీ పెట్టి తెలంగాణ వాదుల మీద కాల్పులు జరుపుతున్నారని పనికిమాలిన వ్యాఖ్యలు చేశారు.

ఇదంతా చూస్తుంటే నాగేశ్వర్ ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మారిపోయారని.. ఆయన చేసిన వ్యాఖ్యల తర్వాత కొంతమంది సో కాల్డ్ జర్నలిస్టులు తెరపైకి వచ్చారని.. రెండు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రణాళిక రూపొందించాలని టిడిపి కార్యకర్తలు అంటున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని పట్టించుకున్నప్పుడు.. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పోలీసులకు ఆదేశాలు జారీ చేసినప్పుడు ఎవరు కేసు నమోదు చేస్తారు? ప్రొఫెసర్ నాగేశ్వర్ ను ఎందుకు అరెస్ట్ చేస్తారు.. ఇక్కడ పత్రికా స్వేచ్ఛను తొక్కి వేసిన కుట్ర ఏముంది? అని టిడిపి కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో ఏపీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకముందే తెలంగాణ నుంచి పబ్లిష్ అయిన కొన్ని పత్రికల్లో నాగేశ్వర్ అరెస్ట్ అంటూ పతాక శీర్షిక స్థాయిలో వార్తలను ప్రసారం చేశారు. సోషల్ మీడియా గ్రూపులలో విపరీతంగా ప్రచారం చేశారు. అసలు వాస్తవానికి వీరంతా ఎందుకు తెరమీదకి వచ్చినట్టు.. ఎందుకు తెలంగాణ వాదాన్ని తీసుకొచ్చినట్టు.. ఉన్నట్టుండి ఏపీ ముఖ్యమంత్రికి.. తెలంగాణ ముఖ్యమంత్రి కి వ్యతిరేకంగా ఎందుకు నినాదాలు చేసినట్టు.. కేవలం ఒక మీడియాలో మాత్రమే వీరి వార్తలు ఎందుకు హైలెట్ అయినట్టు. . చూస్తుంటే రెండు పార్టీల కోసం వీరంతా పనిచేసినట్టు అర్థమవుతోంది.

హైదరాబాదులో ఏర్పాటు చేసిన సమావేశంలో పాత్రికేయులు నాగేశ్వర్ విషయాన్ని ప్రస్తావించకుండా.. ఆంధ్రా వాళ్లను తొక్కేస్తాం… తరిమి కొడతాం.. పాతి పెడతామంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిని బట్టి దీని వెనుక ఉన్నది ఎవరు.. ఎవరు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు.. ఎవరు వీరికి అమ్ముడుపోయారు.. అనే ప్రశ్నలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. అలాగని అవి సమాధానం లభించని ప్రశ్నలు కూడా కాదు. కాకపోతే ఈ వివాదాన్ని ప్రారంభంలోనే తొక్కిపడేయడంతో కొంతమంది సో కాల్డ్ జర్నలిస్టుల ఆటలు సాగలేదు. అందువల్లే రెండు రోజులు హడావిడి చేసిన వారు.. ఆ తర్వాత అన్ని మూసుకున్నారు. కానీ ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయం మాట్లాడుతూ.. తెలంగాణ అమరులకు జోహార్లు అని చెప్పడమే హాస్యాస్పదం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఏనాడు పాల్గొనని నాగేశ్వర్ గురించి.. తెలంగాణ ఉద్యమం గురించి ప్రస్తావించని ఆంధ్ర మూలాలు ఉన్న వ్యక్తులు మాట్లాడటం నిజంగా ఆశ్చర్యకరం..

అక్కినేని అఖిల్ కంటే శ్రీకాంత్ కొడుకు బెటరా..?

Akhil Akkineni And Roshan
Akhil Akkineni And Roshan

Akhil Akkineni And Roshan: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతుంది. యంగ్ హీరోలు స్టార్ హీరోలతో సైతం పోటీపడే రేంజ్ కి వెళ్ళిపోతున్నారు. కొత్త కథతో కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద వాళ్ళకంటూ ఒక అరుదైన గౌరవాన్ని కూడా పొందుతున్నారు. నాగార్జున కొడుకైన అఖిల్ కి సరైన సక్సెస్ లైతే రావడం లేదు. ఆయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 12 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటివరకు ఒక్క సక్సెస్ ని కూడా సాధించలేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరమైన విషయమనే చెప్పాలి. ఇక ప్రస్తుతం హీరో శ్రీకాంత్ కొడుకు అయిన రోషన్ సైతం ఇండస్ట్రీలో తన సత్తా చూపించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పటికే ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

‘ఛాంపియన్’ సినిమాతో ప్రేక్షకులందరిని మైమరపింపజేసిన ఆయన తొందర్లోనే స్టార్ డైరెక్టర్లతో సైతం సినిమాలు చేసే స్థాయికి ఎదుగుతున్నాడు. ఇక ఇప్పుడు అఖిల్, రోషన్ ఇద్దరిని పోలుస్తూ అఖిల్ కంటే రోషన్ చాలా బెటర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా అఖిల్ అసలు ఏ మాత్రం తన సత్తా చాటుకోలేకపోతున్నాడు.

ప్రస్తుతం లెనిన్ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తే పర్లేదు లేకపోతే మాత్రం చాలా వరకు డీలా పడిపోయే ప్రమాదం ఉంది. అతనితో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు ఆసక్తి చూపించకపోవచ్చు… ఇక ఏది ఏమైనా కూడా ఈ మధ్య ఆయన చేస్తున్న సినిమాలు అంత ఎఫెక్ట్ గా ఉండడం లేదనే వార్తలు కూడా వస్తున్నాయి. వీటన్నింటినీ ఓవర్కమ్ చేసి తనను తాను మరోసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకుంటే తప్ప అఖిల్ కి భారీ అవకాశాలైతే రావు… లెనిన్ సినిమా సక్సెస్ మీదనే ఆయన కెరీర్ ఆధారపడి ఉంది.

లేకపోతే మాత్రం ఆయన చాలా వరకు డీలా పడిపోయి అతని మార్కెట్ కూడా పూర్తిగా కోల్పోయే ప్రమాదమైతే ఉంది…చూడాలి మరి అఖిల్ రాబోయే సినిమాలతో సత్తా చాటి స్టార్ హీరో అవుతాడా? లేదంటే రోషన్ టాప్ హీరోగా మారతాడా అనేది…

జగన్ మారారు.. బిజెపి మనసు మార్చుతున్నారు!

YCP BJP Relations
YCP BJP Relations

YCP BJP Relations: బిజెపి విషయంలో జగన్మోహన్ రెడ్డి స్టాండ్ మారుతున్నట్లు అర్థం అవుతోంది. ఢిల్లీ వర్గాల్లో సైతం ఇది చర్చకు దారితీస్తుంది. వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఒక పక్కా ఆలోచనతో అడుగులు వేస్తున్నట్లు స్పష్టమౌతోంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పెంపును నిరసిస్తూ ఆందోళనలు, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ఓటమికి ఆయన విశ్లేషిస్తున్న కారణాలు.. భారతీయ జనతా పార్టీకి కోపం తెప్పిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బిజెపిని నమ్ముకుంటే రాజకీయంగా తనకు ఇబ్బందులు తప్పవని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో ఎన్డీఏ కూటమి బలంగా ఉన్న నేపథ్యంలో.. తనకు జాతీయస్థాయిలో ఏదో ఒక కూటమి అండ ఉండాలని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది ఢిల్లీ వర్గాల్లో. ఈ విషయం బిజెపి పెద్దల వరకు తెలియడంతో వారు సైతం జగన్మోహన్ రెడ్డి విషయంలో సాఫ్ట్ కార్నర్ విడిచి పెట్టే పరిస్థితి కనిపిస్తోంది.

* బిజెపి గెలుపు పై సందేహం..
ఏపీలో ప్రత్యేక ఓటరు సవరణ చేపడుతున్న సంగతి తెలిసిందే. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. రాజకీయ ప్రత్యర్థుల ఓట్లను తొలగించడమే దీని వెనుక ఉన్న ఎత్తుగడ అని చెబుతున్నారు జగన్. బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమికి ఓటరు జాబితా సవరణ కారణం అని తేల్చి చెప్పారు. తద్వారా బిజెపి గెలుపును తప్పుపట్టారు. ఎన్నికల సంఘం నిర్ణయాలను సైతం ఎత్తిచూపుతున్నారు. మొన్నటికి మొన్న డీజిల్ పెట్రోల్ ధర పెంపు పై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. పశ్చిమ ఆసియా పరిణామాల క్రమంలో పెంపు అనివార్యం అని తెలిసి కూడా.. ఇలా ఆందోళనలు చేయడం ఏంటనేది బిజెపి పెద్దల ప్రశ్న. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి బిజెపితో కటీఫ్ చెప్పేందుకే నిర్ణయించినట్లు తెలుస్తోంది.

* మరో కూటమి అండ కోసం..
ప్రస్తుతం ఏపీలో కూటమి బలంగా ఉంది. పైగా మూడు పార్టీల మధ్య సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో బిజెపిని నమ్ముకుంటే ఇబ్బందులు అని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. క్రమేపి కాంగ్రెస్ పెద్దలతో ఆయన రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్లు కూడా ప్రచారం ఉంది. తమిళనాడులో విజయ్ గెలుపుతో దక్షిణాది రాష్ట్రాల్లో ఒక ప్రత్యేక రాజకీయ శక్తిగా అవతరించాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే జగన్మోహన్ రెడ్డి వైఖరిలో వచ్చిన ఈ మార్పుతో బిజెపి పెద్దలు సైతం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. వైసిపి తో పాటు జగన్ విషయంలో సాఫ్ట్ కార్నర్ తగ్గించుకోవాలని పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

హైబ్రిడ్ మహానాడు.. టిడిపి ప్రయత్నం ఆదర్శమే!

TDP Hybrid Mahanadu
TDP Hybrid Mahanadu

TDP Hybrid Mahanadu: జాతీయస్థాయిలో ఇప్పుడు చర్చకు దారితీస్తోంది తెలుగుదేశం పార్టీ హైబ్రిడ్ మహానాడు. లక్షలాది మందిని ఒకే చోటకు చేర్చేది మహానాడు. కానీ ఇప్పుడు సరిహద్దులు అనేవి లేకుండా.. రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మందిని కలిపింది హైబ్రిడ్ మహానాడు. రాజకీయ సభల నిర్వహణ కష్టతరం అవుతున్న తరుణంలో.. టిడిపి సరికొత్త మార్గాన్ని చూపింది రాజకీయ పార్టీలకు. ఇంధన సంక్షోభంతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదురైన వేళ.. ఒక రాజకీయ మహాసభను ఎలా నిర్వహించాలో చేసి చూపించింది తెలుగుదేశం. ఇది నిజంగా గొప్ప విషయం. జాతీయస్థాయిలో మిగతా రాజకీయ పార్టీలకు ఆదర్శం కూడా. పశ్చిమ ఆసియా పరిణామాల క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపును.. ఇలా పాటించి హైబ్రిడ్ మహానాడు నిర్వహించి సక్సెస్ చేశారు చంద్రబాబు, లోకేష్.

* ఒకేసారి 20 లక్షల మంది..
సాధారణంగా మహానాడు అంటే ఏదో ఒక జిల్లాలో కానీ.. నగరంలో కానీ నిర్వహించడం ఆనవాయితీగా వచ్చేది. ఓ మూడు లక్షల మంది వరకు ఒక చోటకు చేరడం అనేది రికార్డ్. కానీ వాహనాలు ఖర్చు, ఆతిథ్యం తో పాటు భోజన ఖర్చు భారీగా ఉండేది. అయితే ఇప్పుడు హైబ్రిడ్ మహానాడు ద్వారా 20 లక్షల మంది టిడిపి శ్రేణులు కలిపారు. సొంత గ్రామంలో ఉండి టిడిపి నాయకత్వం ఆదేశాలతో పాటు నేతల దిశ నిర్దేశం పొందారు. మహానాడులో పాల్గొన్న అనుభూతిని సొంతం చేసుకున్నారు. అప్పట్లో గ్రామంలో పరిమిత సంఖ్యలోనే టిడిపి శ్రేణులు హాజరయ్యేవి. ఇప్పుడు మాత్రం టిడిపి సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరూ హాజరయ్యేందుకు ప్రయత్నం చేశారు.

* వరుస విపత్తుల వేళ..
దేశం ఒక విపత్తు నుంచి మరో విపత్తును ఎదుర్కొంటూ వస్తోంది. ఇటువంటి సమయంలో సంక్షోభాలను అధిగమించి ప్రయాణించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇంధన సంక్షోభ సమయంలో తెలుగుదేశం పార్టీ పాటించిన పొదుపు మంత్రం జాతీయస్థాయిలో సైతం ఆకట్టుకుంటుంది. అయితే ఈ హైబ్రిడ్ మహానాడు వెనుక లోకేష్ ఆలోచనలు ఉన్నాయని.. నేషనల్ మీడియాలో సైతం బలమైన చర్చ నడుస్తోంది. మొన్ననే పార్టీ కార్యనిర్వాహక బాధ్యతలను తీసుకున్నారు లోకేష్. ఇంతలోనే హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహించి అబ్బురపరిచారు. గతంలో అంతర్జాతీయ యోగా డేను విశాఖ వేదికగా నిర్వహించి ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు అందుకున్నారు. అప్పటినుంచి లోకేష్ నాయకత్వం పై మోడీకి గురి ఏర్పడింది. ఇప్పుడు అదే ప్రధాని ఇచ్చిన పిలుపుతో మహానాడు ను హైబ్రిడ్ విధానంలో నిర్వహించి అందరి మన్ననలు అందుకుంటున్నారు లోకేష్.

తెలంగాణలో జనసేన ను ఇక తట్టుకోలేరా?!

Janasena Joinings Committee
Janasena Joinings Committee

Telangana Janasena: తెలంగాణలో జనసేన యాక్టివ్ అయినట్టు కనిపిస్తోంది. అది కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ చేష్టల పుణ్యమా అని. పవన్ కళ్యాణ్ ఆ వివాదం అంతటితో ఫుల్ స్టాప్ అన్నట్టు మాట్లాడారు. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాత్రం యుద్ధం అంటూ సెలవిచ్చారు. తన కోటరీతో రెచ్చిపోయారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా తిట్టించడం ద్వారా పై చేయి సాధించాలని చూశారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసేదాకా వచ్చింది హైదరాబాదులో. పవన్ కళ్యాణ్ పై ఏ ప్రెస్ క్లబ్లో అయితే వ్యక్తిగత దాడి చేశారో.. అదే ప్రెస్ క్లబ్ లో విరుచుకుపడ్డారు తెలంగాణ జనసేన నేతలు. వారు ఇచ్చిన కౌంటర్ తీరు చూస్తుంటే.. ఇదే దూకుడుతో జనసేనను యాక్టివ్ చేస్తే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మంచి ఊపు సాధించుకునే అవకాశం ఉంది.

* వివాదం ముగుస్తుందనగా..
జనసేన ను పక్క రాష్ట్రం రాజకీయ పార్టీగా చిత్రీకరించే క్రమంలో.. ప్రొఫెసర్ నాగేశ్వర్ కొంచెం అతి చేశారు. దాదాపు వివాదం ముగుస్తుందన్న తరుణంలో ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయించారు. ఒకరిద్దరూ పవన్ కళ్యాణ్ పై విపరీత వ్యాఖ్యలు చేశారు. వివాదాన్ని సద్దుమణిగిస్తారనుకున్న జర్నలిస్టులతో పాటు మేధావులు రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడారు. సినిమా వాళ్లు అంటూ చులకన భావంతో చూశారు. వారికి చదువు రాదు అంటూ ఎద్దేవా చేశారు. పనికిరాని వారు మాత్రమే సినిమాల్లో నటిస్తారు అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలతో ఉన్న.. ఇంతటి వివాదానికి కారణమైన ప్రొఫెసర్ నాగేశ్వర్ పక్కనే ఉన్న వద్దని వారించలేదు. దీంతో ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన పని అని తేలిపోయింది. పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా దూషించడంతో ఆయన అభిమానులు బయటకు వచ్చారు. ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

* అంతా సంఘటితం
వాస్తవానికి తెలంగాణలో జనసేన సోషల్ మీడియాకే పరిమితం అవుతూ వచ్చింది. ఎవరికి వారే అన్నట్టు ఉండేవారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో జనసేన నేతలు, శ్రేణులు సంఘటితం అవుతున్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జనసేన నేత, నటుడు సాగర్ ప్రొఫెసర్ నాగేశ్వర్ తో పాటు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా దాడి చేసిన వారి పేర్లు ప్రస్తావిస్తూ.. ఒక్కొక్కరిపై టార్గెట్ చేస్తూ.. ఒక ప్లాన్ ప్రకారం చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణ ఉద్యమ ముసుగులో ఎవరెవరు ఏం చేశారు ఆయన బయట పెట్టేశారు. సరిగ్గా గ్రేటర్ ఎన్నికల సమయంలోనే జనసైనికులు అగ్గిరాజేశారు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఇదే దూకుడుతో జనసేన వ్యవహరిస్తే మాత్రం గ్రేటర్ పరిధిలో రాజకీయాలు సమూలంగా మారడం ఖాయం.

మూలాల్లోకి వెళ్తున్న పాకిస్తాన్.. ప్రపంచం ముందు తలవంచక తప్పదుగా..

Pakistan Indian Roots
Pakistan Indian Roots

Pakistan Indian Roots: మాది ముస్లిం దేశం. మాది ముస్లిం వ్యవహార శైలి.. మేము ఇస్లాం వ్యవహారాలను పాటిస్తూ ఉంటాం. మాకు అల్లా బోధనలు నిత్య కృత్యం.. ఖురాన్ మాకు అత్యంత పరమ పవిత్రం.. ఇదిగో ఇలా సాగిపోతుంటాయి పాకిస్తాన్ పాలకులు.. ఇతర వ్యక్తులు చెప్పే మాటలు. కానీ ఇస్లాం దేశాలకు.. పాకిస్తాన్ కు చాలా తేడా ఉంటుంది.

పాకిస్తాన్ పాలకులు చెబుతున్నట్టు అరబ్ సంస్కృతి ఉండదు. అలాగని మక్కా మదీనా మాదిరిగా వ్యవహారాలు కూడా వ్యవహారాలు సాగవు. దక్షిణాసియా మాదిరిగా ఇస్లాం మతం అక్కడ కనిపించదు. స్థూలంగా చెప్పాలంటే పాకిస్తాన్ థర్డ్ రేట్ అరబ్ కూడా కాదు. ముమ్మాటికి ఇండియన్ సంస్కృతి కనిపిస్తూ ఉంటుంది. పాకిస్తాన్ మన దేశం నుంచి వేరు పడిపోయింది. అంతేతప్ప మన మూలాల నుంచి కాదు.

పాకిస్తాన్ దేశంలో ప్రతి నగరాన్ని తరచి చూస్తే భారతీయ మూలాలు కనిపిస్తాయి.. కాకపోతే ఇస్లాం చాందసవాదులు పాకిస్తాన్ కోసం అనేక రకాలుగా మార్పు తీసుకొచ్చారు. ఈ క్రమంలో మెజారిటీ మతంగా వ్యాప్తి చెందిన హిందూ సంస్కృతిని నాశనం చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. కాకపోతే వారు పూర్తిస్థాయిలో విజయం సాధించలేకపోయారు. ఇప్పుడు పాకిస్తాన్ తన మూలాలను వెతుక్కునే పనిలో పడింది. ఆ మూలాలు కనుక వెలుగులోకి వస్తే పాకిస్తాన్ ప్రపంచం ముందు తలవంచుకునే పరిస్థితి ఏర్పడుతుంది.

ఇటీవల లాహోర్ నగరంలో అక్కడ హెరిటేజ్ ను కాపాడుకునేందుకు.. చరిత్రను పరిరక్షించుకునే పనులు చేస్తున్నారు. పాకిస్తాన్లో లాహోర్ అనేది అత్యంత కీలకమైన నగరం. ఈ నగరంలో ఉన్న ఇస్లాంపూర అనే ప్రాంతాన్ని కృష్ణా నగర్ గా మార్చేశారు. బాబ్రీ మసీద్ ప్రాంతాన్ని జైన్ మందిర్ గా మార్చారు. రెహమాన్ గల్లీ కాస్త రామ్ గల్లి అయిపోయింది. ఫాతిమా జీనా రోడ్డు క్వీన్స్ రోడ్డు అయిపోయింది.. మిగతా ప్రాంతాలకు కూడా పేర్లు మార్చే ప్రక్రియ అక్కడ జోరుగా సాగుతోంది. దీనికోసం 50 బిలియన్ పాకిస్తాన్ రూపాయలను ఖర్చు పెడుతున్నారు. గత ఎడాది మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ లాహర్లో ఈ పనికి శ్రీకారం చుట్టగా.. ఇన్నాళ్లకు అది కార్యరూపం దాల్చింది. మరియం పంజాబ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

ఇటీవల కాలంలో మన దేశంలో త్రివేండ్రం పేరు కాస్త తిరువనంతపురం అయింది.. కలకత్తా పేరు కాస్త కోల్కతా అయింది. కేరళ పేరు కాస్త కేరళం అయిపోయింది.. ఇలా భారతదేశంలో మూలాలను పరిరక్షించుకునే పని మొదలైన నేపథ్యంలో.. పాకిస్తాన్ కూడా హెరిటేజ్ ను కాపాడుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ లాహోర్లో ఈ ప్రాంతాలను పేరు మార్చడం పట్ల ముస్లిం మత ఛాందసవాదులు రంగంలోకి వచ్చారు. ఇలా పేర్లు మార్చి లాహోర్ నగరాన్ని పూర్తిగా భారతదేశంలో విలీనం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

అక్కడ కొద్దిరోజులుగా ఉద్యమాలు కూడా మొదలయ్యాయి. దీనిపై పంజాబ్ ముఖ్యమంత్రి మరియం వెనక్కి తగ్గడం లేదు.. ఆమెకు పాకిస్తాన్ ప్రధానమంత్రి సపోర్టు ఉంది. అయితే ఇది ఎక్కడదాకా దాడి తీస్తుందో తెలియదు గానీ.. పాకిస్తాన్ చేస్తున్న పని వల్ల ఇప్పుడు ఆ దేశ మూలాలు ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంది. ఇన్నాళ్లపాటు భారత్ మీద నిత్యం విషం చిమ్మి.. లేనిపోని ప్రచారాలు చేసిన పాకిస్తాన్ పాలకులు.. వారికి అనుకూలంగా ఉండే ఉగ్రవాదులు ఇప్పుడు ప్రపంచం ముందు తల వంచుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు.

అమెరికాలో భారతీయులకు ఎంతకాలం ఈ జాతి వివక్ష.. వైరల్ వీడియో

Indian Discrimination In America
Indian Discrimination In America

Indian Discrimination In America: గూగుల్ సీఈఓ గా సుందర్ పిచాయ్ ఉన్నాడు. మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల ఉన్నాడు. ఇంకా అనేక మంది భారతీయులు అమెరికా దేశంలో పేరు పొందిన కంపెనీలకు సారథ్యం వహిస్తున్నారు. చివరికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య కూడా భారతీయ మూలాలు ఉన్న మహిళ. ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికా ప్రస్థానంలో భారతీయులు చాలామంది ఉన్నారు. ఇకముందు కూడా ఉంటారు.

అమెరికా ఆర్థిక అభివృద్ధిలో.. భారతీయులు విశేషమైన కృషి చేస్తున్నారు. కొంతమంది భారతీయులు అక్కడే స్థిరపడి అమెరికన్ పౌరులుగా కొనసాగుతున్నారు. అమెరికా రాజకీయాలలో కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు.. ఇంతటి ఖ్యాతి ఉన్న భారతీయులను అమెరికా దేశస్తులు చులకనగా చూస్తున్నారు. దారుణంగా మాట్లాడుతున్నారు. భారతీయులతో పోటీ పడలేక.. భారతీయుల మాదిరిగా కష్టపడి పని చేయలేక.. చివరికి ద్వేషాన్ని నమ్ముకున్నారు. ఒళ్ళు వంచి పని చేయడం చేతకాక.. నోటికి పని చెబుతున్నారు. అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. గతంలో ఈ సంఘటనలు అనేకం జరిగాయి. భారతీయుల మీద అమెరికా దేశస్థులు వ్యవహరిస్తున్న తీరు పట్ల విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ అమెరికా దేశస్థులు తీరు మార్చుకోవడం లేదు.

తాజాగా అమెరికాలో ఒక దారుణం జరిగింది. భారతదేశానికి చెందిన ఇద్దరు రోడ్డు మీద నిలబడి ఉన్నారు. అక్కడికి అమెరికా దేశానికి చెందిన ఒక వ్యక్తి వచ్చాడు. “మీరు ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చారు.. మీరు భారతీయులా” ఇలా అనేక రకాలుగా ప్రశ్నలు అడిగాడు.. దానికి వారు పెద్దగా సమాధానం చెప్పలేదు..”మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు.. మీకు ఇండియా అంటే ఇష్టమైతే అక్కడే ఉండాలి కదా. ఇక్కడ దాకా రావడం ఎందుకు.. మీ దేశానికి వెళ్లిపోండి..”అంటూ తీవ్ర స్వరంతో మాట్లాడాడు. అంతేకాదు పరుష పదజాలాన్ని ఉపయోగించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆ భారతీయ కుటుంబం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

అమెరికాలో భారతీయులకు భద్రత అనేది ఎండమావిలాగా మారుతుంది. అమెరికాలో పేరుపొందిన కంపెనీలకు భారతీయులు నేతృత్వం వహిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కష్టపడి పని చేసే భారతీయులకు అక్కడ ఆ స్థాయిలో గౌరవం లభించడం లేదు. పైగా వేధింపులు పెరిగిపోతున్నాయి. పని ప్రదేశాలలో భారతీయులు నరకం చూస్తున్నారు. కొన్ని సందర్భాలలో అమెరికా దేశస్తులు భారతీయులను అంతం కూడా చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో భౌతికపరమైన దాడులకు కూడా పాల్పడుతున్నారు..కష్టపడి పని చేయడమే భారతీయులకు శాపంగా మారింది.. అందువల్లే అమెరికా దేశస్తులు ఈ స్థాయిలో దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా భారతీయుల మీద అమెరికా పౌరులు విపరీతమైన ద్వేషంతో ఉంటున్నారు.. ఇటీవల అమెరికా దేశస్థులపై భారతీయులు అక్కడి పోలీసులకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. అయితే అక్కడి పోలీసులు అంతగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు.