Home Blog Page 214

బాలయ్య బాబు చిన్న కూతురు.. పోలా అదిరిపోలా.. ఇలా షేక్ చేసిందేంటి? వైరల్ డ్యాన్స్ వీడియో

Nandamuri Tejaswini Dance Video
Nandamuri Tejaswini Dance Video

Nandamuri Tejaswini Dance Video: సినీ, రాజకీయ రంగాల్లో నందమూరి కుటుంబానిది చెరగని ముద్ర. ఆ కుటుంబ మహిళలు రాజకీయాల్లో సైతం రాణించగలుగుతున్నారు. వ్యాపారాల్లో సైతం అగ్రగామిగా నిలిచారు. అయితే తాజాగా నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని డాన్స్ తో ఇరగదీసారు. ప్రస్తుతం ఆమె డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కొరియోగ్రాఫర్ తో లయబద్ధంగా డాన్స్ చేస్తున్న వీడియో అదరగొడుతోంది. నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సాధారణంగా సినిమాలతో పాటు పబ్లిక్ ఫంక్షన్లలో తేజస్విని కనిపించింది అరుదు. కానీ ఇటీవల తన తండ్రి నటించిన సినిమా నిర్మాణ బాధ్యతలు చూస్తున్నారు. ఇప్పుడు ఏకంగా డాన్స్ వీడియోతో అదరగొట్టారు.

* ఒక్కొక్కరిది ఒక్కో రూటు..
నందమూరి బాలకృష్ణ కు ముగ్గురు పిల్లలు. పెద్ద కుమార్తె బ్రాహ్మణి నారా చంద్రబాబు నాయుడు కోడలు. మంత్రి లోకేష్ భార్య. ప్రస్తుతం వాణిజ్య వేత్తగా రాణిస్తున్నారు. హెరిటేజ్ సంస్థల బాధ్యతలను చూస్తున్నారు. రెండో కుమార్తె తేజస్విని సినీ నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు. దశాబ్ద కాలం కిందట విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనుమడు శ్రీ భరత్ తో వివాహం జరిగింది. ప్రస్తుతం శ్రీ భరత్ విశాఖ ఎంపీగా కూడా ఉన్నారు. ఇక బాలకృష్ణ ఒక్కగానొక్క కుమారుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నాడు. అయితే గతంలో తేజస్విని ఓ టీవీ యాడ్లో కనిపించారు. తరువాత ఆమె నటన వైపు వచ్చిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు స్టెప్పులతో అలరించారు. ప్రొఫెషనల్ డాన్సర్ మాదిరిగా ఇరగదీశారు.

* తండ్రికి తగ్గ తనయగా..
నందమూరి బాలకృష్ణ కు ప్రస్తుతం 66 సంవత్సరాలు. అయినా సరే తనలో జోష్ తగ్గలేదని నిరూపిస్తున్నారు. సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో ముందుకు దూసుకుపోతున్నారు. అయితే ఇప్పుడు ఆయన కుమార్తె తేజస్విని స్టెప్పులతో వీర విహారం చేస్తుండడంతో అనేక అంచనాలు వెలువడుతున్నాయి. తనకు ఉన్న ప్రతిభకు.. సినీ రంగంలోకి ప్రవేశిస్తారా అని అడుగుతున్న వారు ఉన్నారు. నందమూరి ఫ్యామిలీలో ఇప్పటికే సినిమాల్లో రాణిస్తున్న వారు ఉన్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తన డాన్స్ ప్రతిభతో ప్రత్యేకమైన అభిమానులను సొంతం చేసుకున్నారు. అచ్చం జూనియర్ ఎన్టీఆర్ మాదిరిగానే ఇప్పుడు తేజస్విని సైతం డాన్స్ తో అదరగొట్టారు. సోషల్ మీడియాను షేక్ చేశారు. బాలయ్య బాబు బిడ్డ అంటే అట్లా ఉంటది అంటూ.. సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

హార్ముజ్‌ ఓపెన్‌... ట్రంప్‌ తీపికబురు!

Hormuz Strait
Hormuz Strait

Hormuz Strait: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల మధ్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కంపింపజేసిన హార్ముజ్ జలసంధి సమస్యలో కొత్త అధ్యాయం మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్‌ మీడియా సంస్థ అయిన ట్రూత్ సోషల్‌లో చేసిన ప్రకటన ప్రపంచానికి ఊరటనిచ్చింది. యుద్ధ సమయంలో అమెరికా విధించిన నావల్ బ్లాకేడ్‌ను ఎత్తేస్తున్నట్లు, జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించారు. ఇది దీర్ఘకాలిక ఉద్రిక్తతలను తగ్గించి, శాంతి చర్చలకు కొత్త బాట వేసే వ్యూహాత్మక నిర్ణయం.

ట్రంప్ సందేశం..
ట్రంప్ తన పోస్ట్‌లో స్పష్టంగా చెప్పినట్లు, చిక్కుకున్న నౌకలు ఇక సురక్షితంగా ఇంటికి వెళ్లవచ్చు. “మీ భార్యలు, భర్తలు, పేరెంట్స్, కుటుంబాలకు మీ ఫేవరెట్ ప్రెసిడెంట్ అయిన నా తరఫున హలో చెప్పండి” అని ఆయన రాయడం ద్వారా మానవీయ స్పర్శను జోడించారు. ఇది ట్రంప్ శైలి బలప్రయోగం ద్వారా ఒత్తిడి తెచ్చి, ఆ తర్వాత చర్చల ద్వారా ఫలితాలు సాధించడం. ఈ ప్రకటన వెనుక ఉన్న వాస్తవాలు మరింత లోతుగా ఉన్నాయి. 2026లో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ చర్యల నేపథ్యంలో హార్ముజ్‌లో బ్లాకేడ్ విధించింది. దీని వల్ల ప్రపంచ ఆయిల్ సరఫరాలో భారీ అంతరాయం ఏర్పడి, ధరలు పెరిగి, గ్లోబల్ సప్లై చైన్‌లు స్తంభించాయి. ఇప్పుడు ట్రంప్ బ్లాకేడ్‌ను ఎత్తేయడం, సీజ్‌ఫైర్‌ 60 రోజులు పొడిగింపు, ఇరాన్ అణు కార్యక్రమం పరిమితి వంటి అంశాలపై చర్చలు ముందుకు సాగే అవకాశం కనిపిస్తోంది.

ప్రపంచం ఊపిరి పీల్చుకుంది..
హర్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ ముడి చమురు రవాణాలో సుమారు 20 నుంచి 25 శాతం ఈ మార్గంగుండా సాగుతుంది. బ్లాకేడ్ సమయంలో ఈ ట్రాఫిక్ నామమాత్రపాలైంది. ఇప్పుడు తెరవడంతో:ఆయిల్ ధరలు స్థిరపడి, ఇంధన ఆధారిత ఆర్థిక వ్యవస్థలు (ముఖ్యంగా ఆసియా దేశాలు) ఊరట పొందతాయి. చిక్కుకున్న వందలాది నౌకలు, వాటి సిబ్బంది కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. సౌదీ అరేబియా, యూఏఈ, చైనా వంటి దేశాలు ఈ పరిణామాన్ని సానుకూలంగా చూస్తున్నాయి.

పూర్తి విజయం కాదు..
బ్లాకేడ్ ఇరాన్‌పై మాత్రమే కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. అంటే, ఒప్పందం పూర్తి కాకపోతే మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంది. ట్రంప్ యొక్క ‘ఆర్ట్ ఆఫ్ డీల్’ట్రంప్ ఎప్పుడూ బలం ద్వారా చర్చలకు రావాలని నమ్మేవాడు. ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చి, ఆ తర్వాత ఒప్పందం వైపు తీసుకెళ్లడం ఆయన వ్యూహం. ఇది స్వల్పకాలిక ఊరటనిస్తుంది కానీ, ఇరాన్ అణు సమస్య, ప్రాంతీయ స్థిరత్వం వంటి మూల సమస్యలు పరిష్కారం కావాలంటే ఇంకా చాలా దూరం నడవాలి. ఇరాన్ వైపు నుంచి పూర్తి స్పందన ఇంకా స్పష్టంగా రాలేదు. కానీ చర్చలు జరుగుతున్నాయన్నది సానుకూల సంకేతం. ప్రపంచం ఇప్పుడు ఒక్క విషయం కోరుకుంటోంది ఈ ఒప్పందం దీర్ఘకాలిక శాంతిని తెచ్చి, హార్ముజ్‌ను ఎప్పటికీ సురక్షితమైన మార్గంగా మార్చాలి.

ట్రంప్ ప్రకటన యుద్ధ భయాల నుంచి శాంతి వైపు మలుపు తిప్పిన ముఖ్యమైన అడుగు. అయితే ఇది మొదటి అడుగు మాత్రమే. పూర్తి ఒప్పందం, అమలు, పరస్పర విశ్వాసం లేకపోతే ఈ ఊరట తాత్కాలికంగానే మిగులుతుంది. ప్రపంచం ఇప్పుడు ట్రంప్-ఇరాన్ చర్చల తదుపరి అడుగుల వైపు ఆసక్తిగా చూస్తోంది. శాంతి సాధ్యమైతే అది కేవలం మధ్యప్రాచ్యం కాక, మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు బహుమతి అవుతుంది.

రమేష్ బాబు హీరోగా మహేష్ బాబు క్లాప్ కొట్టిన ఆ సినిమా ఆగిపోయిందా..?

Ramesh Babu
Ramesh Babu

Ramesh Babu: సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందించాడు. తన వారసులు సైతం ఇండస్ట్రీలో రాణిస్తూ ఉండడం విశేషం… కృష్ణ పెద్ద కుమారుడు అయిన రమేష్ బాబు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే ఫేడ్ ఔట్ అయిపోయాడు. అతనికి అనుకున్న సక్సెసులైతే రాలేదు. 1999 సంవత్సరంలో ‘భూలోకవీరుడు జగదేక సుందరి’ అనే ఒక సినిమా ఓపెనింగ్ అయితే జరిగింది. కొద్దిరోజుల పాటు షూటింగ్ జరుపుకున్న తర్వాత ఆ సినిమాని ఆపివేశారు. అయితే ఈ సినిమాను 1999 జూన్ 24వ తేదీన రామానాయుడు స్టూడియోలో ఓపెనింగ్ జరిగింది. దానికి మొదటి క్లాప్ ని మహేష్ బాబు కొట్టడం విశేషం… ఇక ఈ సినిమాని జానపద చిత్రంగా తెరకెక్కించాలనే ప్రయత్నం చేశారు. అయినప్పటికి అది వర్కౌట్ కాలేదు.

ఇక ఇంద్రజ ఇందులో హీరోయిన్ గా నటిస్తుందని కూడా తెలియజేశారు. అయినప్పటికి ఈ సినిమా ముందుకైతే సాగలేదు. ఇక జానపద బ్రహ్మ విఠలాచార్య కొడుకు అయిన శ్రీనివాస్ దీనికి దర్శకత్వం వహించాడు. కానీ ఈ సినిమా మధ్యలోనే ఆగిపోవడం ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేసింది.

నిజానికి ఈ సినిమా కనుక చేసి ఉంటే రమేష్ బాబు ఒక మంచి సక్సెస్ ని అందుకొని హీరోగా తన పరను కొనసాగించేవాడు అంటూ ఇప్పటికీ కృష్ణ అభిమానులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తుంటారు. ఇక మహేష్ బాబు మాత్రం ఆచి తూచి సినిమాలను ఎంచుకొని సక్సెస్ లను సాధిస్తూ స్టార్ హీరోగా ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరును కూడా సంపాదించుకున్నాడు.

రమేష్ బాబు ను హీరోగా నిలబెట్టలేకపోయిన కృష్ణ మహేష్ బాబు విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్ గా వ్యవహరించాడు. ప్రతి సినిమా కథని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అతనితో సినిమా చేయించే ప్రయత్నాలైతే చేశాడు. మొత్తానికైతే మంచి సినిమాలు చేసి సక్సెస్ అయ్యాడనే చెప్పాలి… ప్రస్తుతం మహేష్ బాబు వారణాసి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ను సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు…

ఆర్బిఐ కీలక నిర్ణయం.. ఇకపై కరెన్సీ నోట్లు ఉండవు

RBI Plastic Currency Notes
RBI Plastic Currency Notes

RBI Plastic Currency Notes: కరెన్సీ నోట్లు చూడగానే చాలామందికి ఒక రకమైన ఆనందం.. ఆసక్తి ఉంటాయి. ఆగర్భ శ్రీమంతుడి నుంచి మొదలు పెడితే పేదవాళ్ల వరకు కరెన్సీ నోట్లు చూస్తే మురిసిపోతారు. వాటిని అత్యంత జాగ్రత్తగా చూసుకుంటారు. తడిసిపోయినా.. వాటిని వేరే విధంగా మడతపెట్టినా.. అవి చినిగిపోతాయని భయపడిపోతుంటారు. పైగా కొంతకాలంగా అసలు నోట్లను పోలివున్న నకిలీ నోట్లు మార్కెట్లో విపరీతంగా కనిపిస్తున్నాయి.

నకిలీ నోట్లకు చెక్ పెట్టే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కాగితపు నోట్లను ఎక్కువ కాలం ఉండేవిధంగా.. ఆత్యాధునిక ఫీచర్లతో ప్లాస్టిక్ కరెన్సీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగం తెచ్చే అవకాశం కనిపిస్తోంది.

కోవిడ్ తర్వాత మన దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగిపోయాయి. చిన్న స్థాయిలో మాత్రమే యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. ఎక్కువ శాతం నగదు రూపంలో చెల్లింపులు జరుగుతున్నాయి. డిజిటల్ విధానంలో చెల్లింపులు జరిగితే ఆదాయపు పన్ను శాఖ అధికారులు దృష్టి పెడతారని చాలామంది భావిస్తున్నారు. అందువల్లే వ్యాపారులు నగదు ఇవ్వాలని కోరుతున్నారు. కొన్ని సందర్భాలలో ధర తగ్గించి చెల్లింపులు స్వీకరిస్తున్నారు.

ఇక మనదేశంలో గ్రామీణ ప్రాంతాలలో ఇంటర్నెట్ సదుపాయం అంతగా లేదు. స్మార్ట్ ఫోన్ల వినియోగం కూడా తక్కువగానే ఉంది. అందువల్లే ఆన్లైన్ చెల్లింపులు తక్కువ స్థాయిలో జరుగుతున్నాయి. అందువల్లే నగదు వినియోగం పెరిగిపోతున్నది. గత ఏడాది నుంచి ఇప్పటివరకు మన దేశంలో 42.86 లక్షల కోట్ల విలువైన కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి.

గత ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే ఇది 11.5% ఎక్కువగా ఉందని తెలుస్తోంది. అందువల్లే రిజర్వ్ బ్యాంకు ప్లాస్టిక్ కరెన్సీ ని తెరపైకి తీసుకురావాలని భావిస్తోంది.. ఇక మనదేశంలో పాత, చినిగిన కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ధ్వంసం చేస్తూ ఉంటుంది. వాటి స్థానంలో కొత్త నోట్లోను విడుదల చేస్తూ ఉంటుంది. 2023 – 24 సంవత్సరంలో కరెన్సీ నోట్ల ప్రింటింగ్ కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5,101 కోట్లను ఖర్చుపెట్టింది.

2024 -25 సంవత్సరంలో కరెన్సీ ప్రింటింగ్ ఖర్చు ఏకంగా 6372 కోట్లకు పెరిగింది. ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల వ్యయం ఎక్కువైంది. ఇక ఇటీవల కాలంలో పాట్నా, ముంబై నగరాలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు సమావేశాలు నిర్వహించింది. అక్కడ ప్లాస్టిక్ కరెన్సీ విషయం గురించి చర్చ నడిచింది. అయితే ముందుగా 10, 20 నోట్లను ప్లాస్టిక్ విధానంలో విడుదల చేయాలని.. ఆ తర్వాత ప్రజల నుంచి వచ్చిన స్పందన ఆధారంగా.. మిగతా నోట్లకు ఈ విధానాన్ని వర్తింపజేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

బట్టలిప్పేసి అర్థరాత్రి టాలీవుడ్ నటుడి వీరంగం...వైరల్ వీడియో...

Srikanth Iyengar
Srikanth Iyengar

Srikanth Iyengar: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నటులు వాళ్లు చేసే పాత్రలతో వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రేక్షకులందరిలో విశేషమైన మన్ననలను పొందుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే శ్రీకాంత్ అయ్యంగర్ ప్రతి పాత్రతో తను చాలా వరకు పాపులారిటి సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ‘బ్రోచేవారు ఎవరురా’ సినిమాతో ఆయనకు చాలా మంచి ఫేమైతే దక్కింది. ఇక అలాంటి శ్రీకాంత్ అయ్యంగర్ గత కొన్ని రోజుల నుంచి ఏదో ఒక విషయంలో కాంట్రవర్సీలో ఇరుక్కుంటున్నాడు. కావాలనే తను కాంట్రవర్సీని క్రియేట్ చేస్తున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకని ఆయన అలా చేస్తున్నాడు అనే విషయం ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు మరోసారి బట్టలిప్పుకొని వీడియో చేసి వార్తల్లో నిలిచాడు. ఆయన ఆ వీడియోలో ఏం మాట్లాడడంటే షర్ట్ లేకుండా వీడియోని రికార్డ్ చేస్తున్నాడు అనుకోకండి… ఏదో వర్కౌట్ కెళ్ళి అలసిపోయాను షర్టు లేకుండా వీడియో చేస్తున్నాను. దీన్ని రాద్ధాంతం చేసి షర్ట్ లేకుండా వీడియో చేశాడంటూ అనే కథనాలు పెట్టకండి అంటూ ఆయన మాట్లాడాడు. నిజానికి శ్రీకాంత్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు అనేది ఎవరికి అర్థం కావడం లేదు. ఈ మధ్యకాలంలో ఆయనకు అవకాశాలు కూడా పెద్దగా రావడం లేదు.

కారణం ఏంటి అంటే ప్రతి సారి ఎవర్నో ఒకరిని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడుతున్న మాటలు ఎవరికి పెద్దగా నచ్చడం లేదు. దాని వల్లే ఆయన మీద చాలా వరకు నెగెటివిటి వస్తుంది. దానివల్ల అతన్ని సినిమాల్లో తీసుకోవడానికి ఆయా దర్శకులు భయపడిపోతున్నారు.

కారణమేంటి అంటే నెగెటివిటి రావడం వల్ల ఆయా సినిమాల్లో అతను నటిస్తే సినిమా మొత్తానికి దెబ్బ పడే అవకాశం ఉంది. కాబట్టి అతన్ని సినిమాల్లో తీసుకోవడానికి కూడా దర్శకనిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు… ఒక నటుడు అంటే చాలా డిగ్నిటిని మెయింటైన్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉండాలి. అంతే తప్ప కాంట్రవర్సీ లను క్రియేట్ చేసిన వాళ్లను ఎవ్వరు పట్టించుకోరు. వాళ్లకి ఇండస్ట్రీ అవకాశాలు కూడా తగ్గిపోతాయి…

ఇంతకు ముందు చాలా మంది నటులు ఇలాంటి వాటినే ఎంచుకొని సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేక ఫేడ్ ఔట్ అయిపోయారు. మరి శ్రీకాంత్ అయ్యంగర్ ఇప్పటికైనా తన బాటను మార్చుకొని ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మంచి పాత్రలు చేయగలుగుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

రేయ్ బుడ్డోడా.. ఏడవకురా.. నిన్ను చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి

Vaibhav Suryavanshi Emotional
Vaibhav Suryavanshi Emotional

Vaibhav Suryavanshi Emotional: తన తోటి ఓపెనర్ ఒక్క పరుగుకే అవుట్ అయ్యాడు. కీలకమైన వన్ డౌన్ ఆటగాడు కొద్ది పరుగులు మాత్రమే చేసి వెనక్కి వెళ్లిపోయాడు. కెప్టెన్ చేతులెత్తేశాడు. మిగతా ప్లేయర్లు కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఓపెనర్ గా వచ్చిన అతడు దాదాపు చివరి వరకు ఉన్నాడు. ఏకంగా 96 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. తాను సెంచరీ కోల్పోయినప్పటికీ.. తిరుగులేని తెగువ చూపించాడు.

ఈ ఉపోద్ఘాతం మొత్తం వైభవ్ సూర్య వంశి గురించి. రాజస్థాన్ ఆటగాడిగా అతడు ఈ ఐపిఎల్ సీజన్లో తిరుగులేని రికార్డులను సృష్టించాడు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు. సెంచరీ, హాఫ్ సెంచరీలు చేసి తనకంటూ ఒక స్థాయిని ఏర్పాటు చేసుకున్నాడు. చివరికి గుజరాత్ గట్టుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో అదరగొట్టాడు. జట్టు కోసం చివరి వరకు గట్టిగా నిలబడ్డాడు. అయితే మిగతా ప్లేయర్ల నుంచి అతడికి అంతగా సపోర్ట్ లభించలేదు. అయినప్పటికీ ఒంటరి పోరాటం చేశాడు. గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

భారీగా పరుగులు చేసినప్పటికీ గుజరాత్ జట్టు చేతిలో రాజస్థాన్ ఓడిపోవడంతో వైభవ్ సూర్య వంశీ లో దుఃఖం కట్టలు తెంచుకుంది. అతడు తన ఆవేదన తట్టుకోలేక.. జట్టు ఓడిపోవడంతో మైదానంలో కూర్చుండిపోయాడు.. బౌండరీ లైన్ వద్ద కూర్చుని ఏడవడం మొదలుపెట్టాడు. తన జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించేందుకు సూర్య వంశీ ప్రాణం పెట్టి ఆడాడు.

గుజరాత్ జట్టుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో చివరి వరకు నిలబడ్డాడు. తోటి ప్లేయర్లు అవుట్ అవుతున్నప్పటికీ.. సహనంతో బ్యాటింగ్ చేశాడు. ఎంత ఓపికతో పరుగులు సాధించాడు. గుజరాత్ మందు రాజస్థాన్ 200కు పైగా టార్గెట్ విధించింది అంటే దానికి ప్రధాన కారణం సూర్య వంశీ. కానీ ఫైనల్ చేరుకునే క్రమంలో ఒక్క అడుగు దూరంలో రాజస్థాన్ జట్టు ఓడిపోయింది.

రాజస్థాన్ జట్టు ఓటమిని అతడు తట్టుకోలేకపోయాడు. మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నాడు. కేవలం 15 సంవత్సరాల వయసులోనే అతడికి ఆట మీద.. జట్టు మీద ఈ స్థాయిలో డెడికేషన్ ఉండడం పట్ల క్రికెట్ విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటువంటి ఆటగాడు ఈ తరంలో ఉండడం గొప్ప విషయమని వ్యాఖ్యానిస్తున్నారు.

రిచెస్ట్‌ రీజినల్‌ పార్టీ టీడీపీ.. ఇన్వెస్ట్‌ పార్టీ వైసీపీ!

TDP Richest Regional Party
TDP Richest Regional Party

TDP Richest Regional Party: దేశంలో రిచెస్ట్‌ రీజినల్‌ పార్టీగా టీడీపీ ఆవిర్భవించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) దేశంలోని ప్రాంతీయ రాజకీయ పార్టీల్లో అత్యధిక ఆదాయంతో రికార్డు సృష్టించింది. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, టీడీపీ రూ.228.31 కోట్ల ఆదాయంతో అగ్రస్థానంలో నిలిచింది. ఇది మొత్తం 36 పార్టీల ఆదాయంలో సుమారు 19.14% వాటా. ఇది టీడీపీకి మాత్రమే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో అధికారం సాధించిన తర్వాత పార్టీ ఆర్థిక బలం ఎంతగా పెరిగిందో చూపిస్తోంది. అయితే, ఈ నివేదిక మొత్తం రాజకీయ ఆర్థిక వ్యవస్థలోని లోపాలను, పారదర్శకత లోపాన్ని కూడా బయటపెడుతోంది.

పార్టీల వారీగా ఆదాయం..
టీడీపీ రూ.228.31 కోట్లు మొదటి స్థానంలో ఉండగా, టీఎంసీ రూ.219.35 కోట్లుతో రెండో స్థానంలో ఉంది. వైఎస్సార్‌సీపీ రూ.140.39 కోటుతో మూడోస్థానంలో ఉంది. 36 ప్రాంతీయ పార్టీలు కలిపి రూ.1,192.94 కోట్లు ఉంది.

ఖర్చుల్లో వైసీపీ ఫస్ట్‌..
ఇక డబ్బులు ఖర్చు చేయడంలో వైసీపీ రూ.340 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత బీజేడీ రూ.288 కోట్లు, టీఎంసీ రూ.228 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మిగతా 21 పార్టీలు తమ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేశాయి

టాప్‌ ఐదు పార్టీలు మొత్తం ఆదాయంలో 69 శాతం వాటా, ఖర్చుల్లో 77 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఇది రాజకీయ ఆర్థిక అసమానతలను స్పష్టంగా చూపిస్తోంది.

టీడీపీ ఆదాయం పెరగడానికి కారణం..
టీడీపీ ఆదాయం పెరగడానికి ప్రధాన కారణం 2024 ఎన్నికల్లో సాధించిన భారీ విజయం. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్‌ దాతలు, వ్యాపారవేత్తలు, సభ్యుల నుంచి వచ్చిన విరాళాలు భారీగా పెరిగినట్లు అనిపిస్తోంది. ఇది రాజకీయంగా విజయవంతమైన పార్టీలకు ఆర్థిక లాభాలు ఎలా అందుతాయో చూపే ఉదాహరణ.అయితే, వైఎస్సార్‌సీపీ ఖర్చు ఆదాయం కంటే దాదాపు రెట్టింపు ఉండటం ఆసక్తికరం. ఎన్నికల ప్రచారం, సంక్షేమ కార్యక్రమాలు, సభలు, ఆస్తి నిర్వహణ ఇవన్నీ భారీ ఖర్చులకు దారితీశాయి. ఇలాంటి లోటు దీర్ఘకాలంలో పార్టీని ఆర్థికంగా ఒత్తిడికి గురి చేస్తుంది.

ఆడిట్‌ రిపోర్టు ఇవ్వని పార్టీలు..
దేశంలో 67 ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ, కేవలం 36 మాత్రమే ఆడిట్‌ రిపోర్టులు సమర్పించాయి. మిగిలిన 31 పార్టీలు ఇంకా నివేదికలు అందించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రాజకీయ పార్టీలు ప్రజా సంస్థలు కాబట్టి, వాటి ఆర్థిక వ్యవహారాలు పూర్తి పారదర్శకంగా ఉండాలి. కానీ వాస్తవం దానికి విరుద్ధంగా ఉంది. ఎన్నికల బాండ్లు రద్దు అయిన తర్వాత కూడా రాజకీయ నిధుల మూలాలు పూర్తిగా స్పష్టంగా లేవు. ఎవరు ఎంత ఇచ్చారు, ఆ డబ్బు ఎలా ఖర్చు అవుతోంది ప్రజలకు తెలియాలి. లేకపోతే, రాజకీయాలు కొన్ని కార్పొరేట్‌ సమూహాల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.

బలం మంచిదే, కానీ బాధ్యత కూడా టీడీపీ రికార్డు సాధించడం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో సానుకూల అభివృద్ధిగా చూడవచ్చు. అయితే, ఇది రాజకీయ పార్టీలు ఆర్థికంగా ఎంత బలంగా ఉండాలో మాత్రమే కాకుండా, ఆ బలాన్ని ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఎలా ఉపయోగించాలో కూడా గుర్తు చేస్తుంది ఏడీఆర్‌.నివేదికలు ప్రజాస్వామ్యానికి అద్దంగా ఉంటాయి. కానీ ఆ నివేదికలు పూర్తిగా రావాలంటే అన్ని పార్టీలు బాధ్యతగా వ్యవహరించాలి. రాజకీయ ఆర్థిక వ్యవహారాల్లో కఠినమైన చట్టాలు, స్వతంత్ర ఆడిట్, పూర్తి పారదర్శకత అమలు చేయాల్సిన అవసరం ఈ గణాంకాలు మరోసారి ఉద్ఘాటిస్తున్నాయి.

రెండుసార్లు అలానే.. సాయి సుదర్శన్ చేతులు అంత వీకా..

Sai Sudharsan Hit Wicket
Sai Sudharsan Hit Wicket

Sai Sudharsan Hit Wicket: ఒకసారి జరిగితే దురదృష్టం అనుకుంటాం. మళ్లీ అదే జరిగితే దరిద్రం అనుకుంటాం. గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి సుదర్శన్ విషయంలో ఇదే జరుగుతోంది. అతడి నిర్లక్ష్యం కొంపముంచుతోంది. ఇటీవల క్వాలిఫైయర్ -1 మ్యాచ్లో బెంగళూరు చేతిలో హిట్ వికెట్ గా సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు.

14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద డఫీ బౌలింగ్లో.. అతడు హిట్ వికెట్ గా వెను తిరిగాడు. దీంతో గుజరాత్ జట్టు తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయింది. చివరికి బెంగళూరు జట్టు ముందు తలవంచింది.. సాయి సుదర్శన్ అలా అవుట్ కావడం పట్ల గుజరాత్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు.. ఇలా జరిగింది ఏంటని బాధ పడ్డారు.

రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ చేశాడు.. ఏకంగా 58 పరుగులు చేసి జోరు మీద కనిపించాడు. తొలి వికెట్ కు గిల్ తో కలిసి 167 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సెంచరీ చేస్తాడు అనుకుంటున్న క్రమంలో.. బ్రిజేష్ శర్మ బౌలింగ్ లో హిట్ వికెట్ గా అవుట్ అయ్యాడు. దీంతో మైదానంలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంది.

బెంగళూరు చేతిలో.. రాజస్థాన్ చేతిలో వరుసగా రెండుసార్లు హిట్ వికెట్ గా ఔట్ కావడంతో సాయి సుదర్శన్ తీవ్రమైన నిరాశలో కూరుకుపోయాడు. బంతిని గట్టిగా కొట్టే క్రమంలో రెండుసార్లు కూడా అతడి చేతిలో నుంచి బ్యాట్ జారిపోయింది. అంతేకాదు వికెట్ల మీద పడిపోయింది. ఫలితంగా అతడు నిరాశతో వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.

సాయి సుదర్శన్ అలా అవుట్ కావడంతో గుజరాత్ కెప్టెన్ గిల్ తీవ్ర ఆగ్రహం చేశాడు.. అలా ఎందుకు చేస్తున్నావ్ అంటూ మండిపడ్డాడు. చేతుల్లో బలం లేదా.. పటుత్వం తగ్గిపోయిందా.. అంటూ కామెంట్లు చేశాడు. అంతేకాదు మ్యాచ్ ముగిసిన తర్వాత సాయి సుదర్శన్ వ్యవహారంపై వ్యాఖ్యాత ప్రశ్నించగా.. దానికి గిల్ తనదైన శైలిలో స్పందించాడు.

సాయి సుదర్శన్ చేతికి ఇకపై ప్లాస్టర్లు వేస్తామని.. అప్పుడైనా కనీసం బ్యాట్ సమర్థవంతంగా పట్టుకుంటాడని వ్యాఖ్యానించాడు. దీంతో మైదానంలో నవ్వులు వెల్లి విరిశాయి.. ఐపీఎల్ లో బ్యాటర్లు అందరూ బౌలర్ల చేతుల్లో అవుట్ అయితే.. సాయి సుదర్శన్ మాత్రం తన వికెట్ తను తీసుకోవడం.. అది కూడా రెండుసార్లు అలానే జరగడం నిజంగా ఆశ్చర్యకరం.

టచ్లోకి కాంగ్రెస్ అగ్ర నేతలు.. జగన్ ఆలోచన అదే!

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ వైఖరిని మార్చుకున్నట్టు కనిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని విభేదించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని ఒక బద్ధ శత్రువుగా చూడడంతో జగన్ విషయంలో బిజెపి కూడా సానుకూల వైఖరితోనే ఉండేది. ఒక ప్రాంతీయ పార్టీగా దానిని చూసుకుంటూ వచ్చింది. స్నేహితుడిగా చంద్రబాబు ఉన్నా.. ఆయన ప్రత్యర్థి అయిన జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం కొంత సాఫ్ట్ కార్నర్ గానే ఉండేది. ఏపీ రాజకీయ పరిణామాలు దృష్ట్యా బిజెపి సైతం చూసి చూడనట్టుగా ఉంటూ వచ్చింది. అటు తన ప్రత్యర్థి భాగస్వామ్య పార్టీ అయిన బిజెపి విషయంలో సైతం జగన్మోహన్ రెడ్డి సానుకూలంగానే వెళ్లేవారు. ఇలా పరస్పరం సానుకూలత నడుమ బిజెపి, వైసిపి ఇన్నేళ్లపాటు కొనసాగుతూ వచ్చాయి. కానీ ఈసారి మాత్రం అలా కాదు. వైసిపి విషయంలో సాఫ్ట్ కార్నర్ తో చూస్తాం అంటే బిజెపికి కుదిరే పని కాదు. బిజెపి ద్వారా కొన్ని రకాల రాజకీయ ప్రయోజనాలు పొందుతామంటే వైసీపీకి కుదరదు.

* బిజెపి మనసు మారుతోంది..
కాంగ్రెస్ పార్టీకి బద్ధ శత్రువు కాబట్టి జగన్ మోహన్ రెడ్డి విషయంలో బిజెపి అలా సానుకూలంగా ఉండేది. కానీ ఇప్పుడు టిడిపి కీలక భాగస్వామి. ఆ పార్టీ అవసరం బిజెపికి ఉంది. అందుకే టిడిపికి ఎనలేని ప్రాధాన్యమిస్తోంది బిజెపి. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి పట్ల సానుకూలత తగ్గించింది. దీంతో జగన్మోహన్ రెడ్డి సైతం పునరాలోచనలో పడ్డారు. బిజెపితో ఇక లాభం లేదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల పెట్రోల్ డీజిల్ ధరలపై నిరసన తెలిపారు. తాజాగా ప్రత్యేక ఓటరు సవరణ జాబితాను కూడా వ్యతిరేకిస్తున్నారు. తద్వారా భారతీయ జనతా పార్టీకి దూరం కావాలన్న నిర్ణయానికి వచ్చారు.

* విరుద్ధ భావజాలం..
బిజెపి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలది విరుద్ధ భావజాలం. నేరుగా పొత్తు పెట్టుకునే అవకాశం లేదు ఆ రెండు పార్టీలకు. అలాగని సానుకూలతను ఎల్లకాలం కొనసాగించలేవు. రాజకీయంగా అది రెండు పార్టీలకు మైనస్ కాక తప్పదు. పైగా ఏపీలో కూటమి స్ట్రాంగ్ అవుతోంది. ఈ పరిస్థితుల్లో జాతీయస్థాయిలో మరోకూటమిగా ఉన్న కాంగ్రెస్ తో స్నేహం చేయక తప్పని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు జగన్మోహన్ రెడ్డితో టచ్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. తమిళనాడులో విజయ్ అధికారంలోకి వచ్చారు. కలిసికట్టుగా ఉంటే ఏపీపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే జగన్ మనసు మారినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

షర్మిలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం

YS Sharmila Rajya Sabha Seat
YS Sharmila Rajya Sabha Seat

YS Sharmila Rajya Sabha Seat: వైయస్ షర్మిల కు రాజ్యసభ పదవి ఖాయమని ప్రచారం ప్రారంభం అయింది. కాంగ్రెస్ హై కమాండ్ నుంచి పిలుపు రావడంతో ఆమె హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని కలిశారు. కీలక చర్చలు కూడా జరిపారు. ఒకవైపు కర్ణాటక రాజకీయంతో కాంగ్రెస్ పెద్దలు బిజీగా ఉన్న తరుణంలో షర్మిలను పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరో రాష్ట్రంలో ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో షర్మిలను పిలిచిన రాహుల్ గాంధీ ఏపీ విషయంలో కీలక ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. ముందుగా షర్మిల కు ప్రమోషన్ కల్పించి.. ఆమె ద్వారా ఏపీ రాజకీయాలను మార్చాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది.

* అప్పట్లోనే హామీ..
షర్మిలకు రాజ్యసభ పదవి హామీ ఇప్పటిది కాదు. తెలంగాణలో పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు షర్మిల. ఆ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి షర్మిల పోటీ చేస్తారని అప్పట్లో ప్రచారం నడిచింది. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతల అభ్యంతరాలకు ఆమెకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు హై కమాండ్. ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు తీసుకుంటే కచ్చితంగా రాజ్యసభ పదవి ఇస్తామని అప్పట్లోనే హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు కర్ణాటక నుంచి రాజ్యసభకు షర్మిలను ఎంపిక చేస్తారన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో నడుస్తోంది. అక్కడ మూడు రాజ్యసభ పదవులు ఖాళీ అయ్యాయి. జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సిద్ధరామయ్యకు రాజ్యసభ పదవులు ఇచ్చేందుకు కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయించింది. ఎందుకంటే సీఎం గా ఉన్న సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. చివరిగా మిగిలిన పదవి షర్మిలకు ఇస్తారని తెలుస్తోంది.

* వైయస్ అభిమానుల్లో సంతృప్తి..
షర్మిలకు రాజ్యసభ పదవి ఇవ్వడం ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైయస్ అభిమానులను సంతృప్తి పరచాలన్నది కాంగ్రెస్ ప్రణాళిక. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఏపీలో పూర్వ కాంగ్రెస్ నాయకులంతా హస్తం పార్టీ వైపు చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో షర్మిలకు రాజ్యసభ పదవి ఇచ్చి.. ఆమెను ప్రోత్సహించి పార్టీని అభివృద్ధి చేయాలని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్ అగ్రనేతల పిలుపుతో షర్మిల ఢిల్లీ వెళ్లారు. ఒకటి రెండు రోజుల్లో రాజ్యసభ పదవి ఎంపికపై ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

పట్టాలపై ఆడ దెయ్యం.. ఇండియన్ రైల్వే శాఖకు చుక్కలు చూపించింది.. ఇంతకీ ఏం జరిగింది..

Begunkodor Railway Station Ghost Story
Begunkodor Railway Station Ghost Story

Begunkodor Railway Station Ghost Story: ఇప్పుడు అంటే మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీ యుగంలో ఉన్నాం. రేపు ఏం జరగబోతుందో ఇప్పుడే తెలుసుకోబోతున్నాం. వచ్చే పది సంవత్సరాల కాలంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడే అంచనా వేయగలుగుతున్నాం. ఒకరకంగా మన జీవితాన్ని అత్యంత ఆధునిక శైలిలో నిర్మించుకుంటున్నాం. ప్రతి విషయంలో కూడా అత్యంత ఖచ్చితత్వాన్ని కోరుకుంటున్నాం.

ఇటువంటి కాలంలో మూఢనమ్మకాలకు అవకాశం లేదు. దయ్యాలు, మంత్రాలు, తంత్రాలు వంటి వాటికి ఆస్కారం లేదు. కానీ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఒక ఆడ దయ్యం చుక్కలు చూపించింది. ఏకంగా ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ కు వెన్నులో వణుకు పుట్టించింది. ఒకటి కాదు, చాలా కాలం వరకు ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ ఆ ప్రస్తావన వస్తేనే గజగజా వణికి పోయేది.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బెగున్ కోదర్ అనే రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ 1967 లో రైల్వే పట్టాల మీద ఆడ దయ్యం తిరుగుతుందని ప్రచారం జరిగింది. అసలు ఆ పుకారు ఎవరు సృష్టించారు కూడా తెలియదు. అయితే ఆ స్టేషన్ మాస్టర్ కుటుంబం ఉన్నట్టుండి చనిపోయింది.. ఆ తర్వాత అటు చుట్టుపక్కల వారు ఆ రైల్వే స్టేషన్ వెళ్లడానికి కూడా ధైర్యం చేయలేకపోయారు. ఆడ దయ్యం తిరుగుతుందని.. స్టేషన్ మాస్టర్ కుటుంబాన్ని చంపేసిందని చుట్టుపక్కల వారు చర్చించుకోవడం మొదలుపెట్టారు. స్టేషన్లోకి ఎవరు రాకపోవడం.. అక్కడ పనిచేయడానికి మిగతావారు ముందుకు రాకపోవడంతో రైల్వే శాఖ తట్టుకోలేక ఆ స్టేషన్ మొత్తాన్ని మూసేసింది. దాదాపు 42 సంవత్సరాల పాటు ఆ స్టేషన్లో రైళ్లు ఆగలేదు. రైల్వే స్టేషన్ తెరుచుకోలేదు. చివరికి 2009లో మళ్లీ స్టేషన్ ను ప్రారంభించారు. ఆ స్టేషన్లో రైళ్లు ఆగడం మొదలైంది. అంతేకాదు ప్రయాణికులు కూడా రావడంతో స్టేషన్ పరిసరాలు సందడిగా మారిపోయాయి.

ఈ ఘటన జరిగి సంవత్సరాలు పూర్తి కావడంతో రైల్వే స్టేషన్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆ విషయం గురించి మర్చిపోయారు. నాటి కాలం వారు ఇప్పుడు అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం లేదు. పైగా కాలం కూడా మారిపోవడంతో మూఢనమ్మకాలను ఎవరూ పెద్దగా నమ్మడం లేదు. స్టేషన్ పరిసరాలను మొత్తం అభివృద్ధి చేయడంతో దయ్యంలాంటి ఆనవాళ్లు కనిపించడం లేదు.. ఏది ఏమైనప్పటికీ ఇండియన్ రైల్వే చరిత్రలో ఈ దయ్యం ఎపిసోడ్ హర్రర్ సినిమాను చూపించింది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఇండియన్ రైల్వే శాఖలో అధికారులు ఈ స్టేషన్ గురించి మాట్లాడినప్పుడు గతం తాలూకు ఉదంతాలను గుర్తు చేసుకుంటారు.

వైభవ్ సూర్య వంశీని వెంటాడుతున్న దురదృష్టం.. పాపం బుడ్డోడికి ఎందుకీ కష్టాలు

Vaibhav Suryavanshi Unlucky Dismissals
Vaibhav Suryavanshi Unlucky Dismissals

Vaibhav Suryavanshi Unlucky Dismissals: వైభవ్ సూర్య వంశీ వయసు 15 సంవత్సరాలు మాత్రమే. కానీ అతడు ఆడుతున్న తీరు చూస్తుంటే మాత్రం సంవత్సరాల అనుభవం ఉన్న ఆటగాడి కంటే ఎక్కువ కనిపిస్తోంది. బంతిని కొట్టే విధానంలో.. వికెట్ కాపాడుకునే విధానంలో అతను చూపిస్తున్న మెచ్యూరిటీ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా జట్టులో పెద్దపెద్ద ప్లేయర్లు సైతం చేతులెత్తేస్తున్న వేళ.. అతడు ఆడుతున్న తీరు అత్యంత గొప్పగా ఉంది.

అతడి ఆట తీరు అంత అద్భుతంగా ఉంది కాబట్టి గొప్ప గొప్ప ప్లేయర్లు అతడిని కొనియాడుతున్నారు. సూపర్ బ్యాటింగ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇతడి చేతిలో భారత జట్టు అత్యంత భద్రంగా ఉంటుందని.. టీమిండియా కు భవిష్యత్తు ఇతడేనని వ్యాఖ్యానిస్తున్నారు. ఐపీఎల్ లో ఈ సీజన్లో ఇప్పటివరకు పరుగుల వరద పారిస్తూ.. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు సూర్య వంశీ. రాజస్థాన్ జట్టుకు బ్యాటింగ్ విభాగంలో వెన్నెముక మాదిరిగా నిలుస్తున్నాడు. జట్టుకు అవసరమైన ప్రతి సందర్భంలో ఆపద్బాంధవుడి పాత్ర పోషిస్తూ సత్తా చూపిస్తున్నాడు.

వైభవ్ సూర్య వంశీ ఆట తీరు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు చూపించే దూకుడుకు కొత్తగా ఉపమానాలు అల్లాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అతడు బ్యాటింగ్ చేస్తున్న తీరు అమోఘం. బంతులను కొడుతున్న తీరు అత్యద్భుతం. వీరోచితమైన బ్యాటింగ్ తో అతడు చూపిస్తున్న తెగువ అనితర సాధ్యం. ఇన్ని సానుకూలతలు ఉన్నప్పటికీ.. సూర్య వంశీ కి ఒక విషయంలో మాత్రం ప్రత్యేక ఇబ్బంది ఎదురవుతోంది. అదే సెంచరీల ముందు అతడు అవుట్ కావడం..

ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడుసార్లు సెంచరీల ముందు సూర్య వంశీ అవుట్ అయ్యాడు.. అతడు అలా అవుట్ కావడం అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తోంది. ఈ సీజన్లో ఇప్పటివరకు అతడు మూడుసార్లు సెంచరీల ముందు అవుట్ అయ్యాడు. లీగ్ దశలో 93 పరుగుల వద్ద ఒకసారి అవుట్ అయ్యాడు. ఎలిమినేటర్ మ్యాచ్లో 97 పరుగుల వద్ద మరొకసారి ఒకటి అయ్యాడు. క్వాలిఫైయర్ టు మ్యాచ్లో 96 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.

ఒకవేళ ఈ మూడు సార్లు అతడు అవ్వకుండా ఉండి ఉంటే.. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో నాలుగు సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా అతడు రికార్డు సృష్టించేవాడు. అంతే కాదు, అన్ క్యాప్డ్ ఆటగాడిగా ఈ స్థాయిలో పరుగులు సృష్టించిన ప్లేయర్ గా అతడు రికార్డు నెలకొల్పేవాడు. సూర్య వంశీ ఇలా మూడుసార్లు అవుట్ కావడం పట్ల అతడి అభిమానులు, రాజస్థాన్ యాజమాన్యం తీవ్ర నిర్వేదం వ్యక్తం చేస్తోంది.

ఈ ఐదు రాశుల వారికి ఈ రోజు అనుకోని అదృష్టం..

Today 30 May 2026 Horoscope
Today 30 May 2026 Horoscope

Today 30 May 2026 Horoscope: జ్యోతిష శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. మరికొన్ని రాశుల వారు కొత్త వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు స్నేహితులతో సరదాగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. పూర్వికులు ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారులు కొత్తగా ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం అందుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి విద్యార్థులు ఈ రోజు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి పెద్దల సలహా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. డబ్బు వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు గతంలో చేపట్టిన పనులన్నీ ఇప్పుడు పూర్తి అవుతాయి. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడును పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం గణనీయంగా పెరిగినా.. ఖర్చులు ఉంటాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడంతో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారి కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. అనుకోకుండా ఉద్యోగుల ఆదాయం పెరుగుతుంది. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు అధికంగా ఉంటాయి. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏదైనా వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకూడదు. ఉద్యోగులకు అదనపు ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఇలాంటి సమయంలో వీరికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. అనుకోకుండా ప్రయాణాలు చేస్తే వాటి వల్ల లాభాలు ఉంటాయి. వ్యాపారులకు సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఉద్యోగులు తోటి వారి సహాయంతో మిగిలిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగానికి గురవుతారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వీటిని పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దల సలహా తీసుకుంటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా గడుపుతారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు మెరుగైన లాభాలు ఉంటాయి. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆర్థికంగా శుభ ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగులకు సానుకూలమైన వాతావరణం ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఆకస్మికంగా లాభాలు ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రయాణాలు కలిసి వస్తాయి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థికపరంగా అన్ని విజయాలు సాధిస్తారు. స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణఉండడంతో ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు. పెండింగ్ పనులు అన్ని పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

అమెరికా నేలపై అన్నగారికి ఘన నివాళి.. రాలీలో వైభవంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!

TANA NRI

NTR 103rd birth anniversary : తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్ర రాజధాని రాలీ (Raleigh) నగరంలో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ (NRI TDP) ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.  రాలీ నుండి ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన కాకర్ల సురేష్ గారి స్ఫూర్తితో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లుగానే, ఈ సంవత్సరం కూడా ఎన్టీఆర్ జయంతి వేడుకలను అభిమానులు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు అత్యంత ఘనంగా నిర్వహించారు.

తరలివచ్చిన ప్రవాసాంధ్రులు.. పూలమాలలతో నివాళులు

ఈ కార్యక్రమానికి అమెరికాలో స్థిరపడిన తెలుగు ప్రజలు.. టీడీపీ అభిమానులు, వివిధ సామాజిక సంస్థల ప్రతినిధులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అన్నగారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సినీరంగంలో ‘విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా’, రాజకీయాల్లో తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన యుగపురుషుడిగా ఎన్టీఆర్ చేసిన సేవలను ఈ సందర్భంగా పలువురు వక్తలు కొనియాడారు.

యుగయుగాల పాటు చిరస్థాయిగా నిలిచే పేరు ‘ఎన్టీఆర్’

ఈ వేడుకల్లో ప్రసంగించిన ప్రవాసాంధ్ర నాయకులు ఎన్టీఆర్ గొప్పతనాన్ని ఈ క్రింది విధంగా స్మరించుకున్నారు. “పదవులు శాశ్వతం కావు.. కానీ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించిన మహానుభావులు యుగయుగాల పాటు చిరస్థాయిగా నిలిచిపోతారు” అంటూ ఎన్టీఆర్ జీవితాన్ని ఉదహరించారు. ఆయన ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంక్షేమ పథకాలు, తెలుగు గర్వాన్ని నిలబెట్టిన తీరు ఇప్పటికీ కోట్లాది మందికి స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు. సుదూర తీరాల్లో, అమెరికా గడ్డపై ఉన్నప్పటికీ.. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను విస్మరించకుండా, కుటుంబ సమేతంగా అన్నగారి జయంతిని జరుపుకోవడం విశేషమని ఆనందం వ్యక్తం చేశారు.

నిర్వాహకుల కృతజ్ఞతలు.. ‘చార్మినార్’ రెస్టారెంట్‌కు అభినందనలు

కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు రాలీ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ (Raleigh NRI TDP) కార్యవర్గం హాజరైన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ముఖ్యంగా విచ్చేసిన అతిథులందరికీ రుచికరమైన విందు భోజనాన్ని వడ్డించి, కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను చేకూర్చిన ‘చార్మినార్’ రెస్టారెంట్ యాజమాన్యాన్ని నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు. “అన్నగారి ఆశయాలు, సేవా తత్వం, తెలుగు ఆత్మగౌరవం అనే సందేశం తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తూనే ఉంటుంది. ఎన్టీఆర్ చూపిన బాటలో సమాజ సేవ చేయడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి” అని నిర్వాహకులు స్పష్టం చేశారు.

అమెరికా గడ్డపై జరిగిన ఈ జయంతి వేడుకలు ప్రవాస తెలుగు ప్రజల ఐక్యతకు, అన్నగారిపై వారికి ఉన్న అపారమైన అభిమానానికి మరోసారి అద్దం పట్టాయి.

కర్ణాటక పంచాయతీ సెటిల్.. రాహుల్ గాంధీ వద్దకు కాంగ్రెస్ నేతలు.. తెలంగాణలో ఏం జరుగుతోంది..

Rahul Gandhi Telangana Leaders Meeting
Rahul Gandhi Telangana Leaders Meeting

Rahul Gandhi Telangana Leaders Meeting: కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికలలో కేవలం కేరళ రాష్ట్రంలో మాత్రమే అధికారంలోకి వచ్చింది. తమిళనాడు రాష్ట్రంలో అధికార పక్షంలో ఒక భాగమైంది. కీలకమైన పశ్చిమ బెంగాల్లో.. అస్సాంలో.. చిన్న రాష్ట్రమైన పుదుచ్చేరిలో అధికారాన్ని దక్కించుకోలేకపోయింది. కనీసం చెప్పుకునే స్థాయిలో శాసనసభ స్థానాలను దక్కించుకోలేకపోయింది.

క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇప్పుడు వచ్చే వాళ్ళతో.. పోయే వాళ్లతో అత్యంత రద్దీగా ఉంది. రాహుల్ గాంధీ కూడా మల్లికార్జున కార్గే.. వేణుగోపాల్ రెడ్డి వంటి వారితో నిత్యం సమావేశాలు పెడుతున్నారు. ఏం జరిగి ఉంటుంది.. ఏం జరుగుతోంది అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నప్పుడే.. తెలంగాణ నేతలు అక్కడ కనిపిస్తున్నారు. కొద్దిరోజుల వరకు సాగిన కర్ణాటక పంచాయతీ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడంతో ముగిసింది. ఇప్పుడు మళ్లీ తెలంగాణ పంచాయతీ ప్రారంభమైంది. అలాగని తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు జరగడం లేదు. రేవంత్ రెడ్డి స్థానంలో కొత్త వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుకోవడం లేదు.

కాకపోతే కొంతమంది మంత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు.. తమ శాఖలలో పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నట్టు అధిష్టానానికి నివేదిక అందింది. ఇటీవల మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీకి ఈ విషయాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో అధిష్టానం కొన్ని శాఖలలో ప్రక్షాళన చేయాలని భావించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసిన కాంగ్రెస్ నాయకుడు వెంటనే ఢిల్లీ చేరుకున్నారు. మంత్రులుగా ప్రమోషన్ సాధించాలి అనుకునేవారు రాహుల్ గాంధీ ప్రాపకం కోసం పాకులాడుతున్నారు.

వారిలో ఇప్పటికే గడ్డం ప్రసాద్ తనకు మంత్రి పదవి కేటాయించాలని రాహుల్ గాంధీకి వినతిపత్రం అందించిన తెలుస్తోంది. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి.. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వంటి వారు తమకు మంత్రి పదవులు ఇవ్వాలని రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా తనకు మంత్రి పదవి ఇవ్వాలని రాహుల్ గాంధీని కోరినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. ముఖ్యమంత్రిపై నేరుగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా మాట్లాడుతున్నారు.

మంత్రివర్గ ప్రక్షాళన జరుగుతుందని వార్తలు వస్తున్నా నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీ నివాసంలో గాని.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాని కనిపించడం లేదు. ఇంతవరకు విజ్ఞప్తులు అందించినట్టు కూడా సమాచారం అందడం లేదు. అంటే మంత్రివర్గ విస్తరణ ఉంటుందా.. లేక మీడియాకు కాంగ్రెస్ పార్టీ లీకలు ఇస్తోందా.. అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మరింత స్పష్టత రావాలంటే మరికొంత సమయం పడుతుందని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.

మోడీ సార్.. బంగారం మీదనే కాదు.. వాటిపై కూడా సుంకాన్ని పెంచాలి.. ఎందుకంటే..

Diamond Import Duty India
Diamond Import Duty India

Diamond Import Duty India: బంగారానికి భారతీయులకు విడదీయరాని బంధం ఉంటుంది. బంగారం మన దేశ అవసరాలకు సరిపడా ఉత్పత్తి కాదు. అందువల్లే విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం కోసం ఆ స్థాయిలో మన దేశం విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చుపెట్టే స్థాయి లేకపోవడంతో.. పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది. బంగారం మీద సుంకాన్ని పెంచేసింది. దీంతో బంగారం ధరలు నేల చూపులు చూస్తున్నాయి.

బంగారం విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు డైమండ్స్ మీద తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.. ఎందుకంటే ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ డైమండ్ కన్జ్యూమర్ కంట్రీగా ఇండియా నిలిచింది. ఇప్పటివరకు చైనా, జపాన్ దేశాల తర్వాత భారత్ ఉండేది. వజ్రాల వినియోగంలో అమెరికా మొదటి స్థానంలో ఉండేది. అయితే ఇటీవల డి బీర్స్ అనే సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం భారత దేశంలో న్యాచురల్ డైమండ్ మార్కెట్ ఏకంగా 12 శాతం పెరిగిందని తెలుస్తోంది. జెన్ జడ్ యువత.. ఇండిపెండెంట్ ఉమెన్స్.. యువకులు ఎక్కువగా వజ్రాలను కొనుగోలు చేస్తున్నారు. వాటిని ధరించడాన్ని స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు. పైగా రకరకాల అయిన వజ్రాలను దిగుమతి చేసుకొని.. ఆభరణాలుగా రూపొందించుకుంటున్నారు.

వజ్రాల హారాలు.. వజ్రాలతో పొదిగిన ఉంగరాలు.. వజ్రాల తో రూపొందించిన లాకెట్లు ధరిస్తున్నారు.. వీటి కోసం భారీగానే ఖర్చు పెడుతున్నారు. అందువల్ల వజ్రాల వినియోగంలో భారత్ ఏకంగా చైనా, జపాన్ దేశాలను దాటేసింది. ఇప్పుడు నెంబర్ 2 స్థానంలోకి వచ్చేసింది. ఇదే స్థాయిలో దిగుమతులు కనుక కొనసాగితే భారత్ కచ్చితంగా అమెరికా దేశాన్ని దాటేస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పైగా మనదేశంలో వజ్రాలను సానపెట్టే ప్రక్రియ గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో ఎక్కువగా సాగుతూ ఉంటుంది. ఇక్కడ గతంలో సాన పెట్టిన వజ్రాలను ఇతర దేశాలకు విమర్శ చేసేవారు. కొంతకాలంగా మనదేశంలోనే ఎక్కువగా వినియోగం అవుతున్నాయి.

వజ్రాలను కూడా రకరకాలైన వాటిని భారతీయులు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా పింక్.. గోల్డెన్.. వైట్ డైమండ్లకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. హై ప్రొఫైల్ వ్యక్తులు ఎక్కువగా వజ్రాలను ధరిస్తున్నారు. ఇటీవల జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో.. మెట్ గాలా లో వజ్రాలతో రూపొందించిన ఆభరణాలను సెలబ్రిటీలు ధరించారు. అమెరికా సెలబ్రిటీలను మించి ఇండియన్ సెలబ్రిటీలు డైమండ్ జ్యువెలరీ ధరించారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వజ్రాల డిమాండ్ ఇలాంటి కొనసాగితే బంగారం మాదిరిగానే వాటి మీద కూడా సుంకాన్ని భారత ప్రభుత్వం విధించే అవకాశం లేకపోలేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్య వంశీ..

Vaibhav Suryavanshi IPL Record
Vaibhav Suryavanshi IPL Record

Vaibhav Suryavanshi IPL Record: 1 అనుకున్నట్టుగానే ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ మొత్తాన్ని దున్నేస్తున్నాడు. తిరుగులేని స్థాయిలో ఆడుతూ అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు ఈ సీజన్లో అతడు ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ జట్టు మీద హాఫ్ సెంచరీ చేశాడు. తద్వారా ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ సీజన్లో అన్ క్యాప్డ్ ఆటగాడిగా రంగంలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ చరిత్రను మొత్తం తిరగ రాశాడు. పవర్ ప్లే లో 500 పరుగులు చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. పొట్టి ఫార్మాట్లో గేల్.. హెడ్.. అభిషేక్ శర్మ.. వంటి మేటి ప్లేయర్లకు సాధ్యం కాని రికార్డులను అతడు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడిగా మిగిలిపోయాడు. అతడు సాధించిన రికార్డును మరే ఆటగాడు కూడా బద్దలు కొట్టే అవకాశం లేదు. 15 సంవత్సరాల వయసులోనే అతడు ఈ స్థాయిలో రికార్డులు సృష్టిస్తున్నాడు అంటే మాటలు కాదు.

ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లే లో 500 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా వైభవ్ సూర్య వంశీ రికార్డు సృష్టించాడు. 2016లో వార్నర్ 467, 2024లో హెడ్ 402, సాయి సుదర్శన్ 2025లో 402, గిల్ క్రిస్ట్ 2009లో 382, బట్లర్ 2022లో 374, కోహ్లీ 2024లో 373 పరుగులు చేశారు. వైభవ్ సూర్య వంశీ తో పోల్చి చూస్తే మిగతా ప్లేయర్లు అత్యంత అనుభవం ఉన్నవారు. ఎక్కువ వయసు ఉన్నవారు. వారిలో ఎవరు కూడా 500 పరుగుల మార్కు అందుకోలేకపోయారు. కానీ సూర్య వంశీ తనకు మాత్రమే సాధ్యమైన బ్యాటింగ్ తో ఆకట్టుకుంటున్నాడు. అంతేకాదు 500 పరుగుల మైలు రాయి అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించాడు.

ఇటీవల హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సూర్య వంశీ 97 పరుగులు చేశాడు. మూడు పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయాడు. ఒకవేళ అతడు గనక సెంచరీ చేస్తే ఐపీఎల్ చరిత్రలో రెండు సెంచరీలు చేసిన ఆన్ క్యాప్డ్ ఆటగాడిగా రికార్డు సృష్టించేవాడు.