Home Blog Page 211

పవన్ కళ్యాణ్ ఫారెస్ట్రీ మినిస్ట్రీ తీసుకుంది ఇందుకే.. ఎన్ని జంతువులు బతికి బట్టకట్టాయో తెలుసా..

Pawan Kalyan forestry ministry
Pawan Kalyan forestry ministry

Pawan Kalyan forestry ministry: ఎవరికైనా మంత్రి పదవి పొందే అవకాశం ఉంటే రెండవ మాటకు తావు లేకుండా రెవెన్యూ వైపు చూస్తారు. అవకాశం ఉంటే ఫైనాన్స్ లేదా ఎనర్జీ.. వంటి శాఖలను తీసుకుంటారు. ఎందుకంటే వాటిలో ఉండే సౌలభ్యం వేరు.. సంపాదించుకునే మార్గం వేరు.. కానీ ఏపీలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత.. ఆయన ఏరి కోరి పర్యావరణ శాఖను తీసుకున్నారు. తీసుకోవడం మాత్రమే కాదు తాను ఆ శాఖను తీసుకోవడం వల్ల ఏం చేస్తానో కూడా చేసి చూపిస్తున్నారు.

మరికొద్ది రోజుల్లో గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కార్యాచరణ మొదలుపెట్టాయి. ఏపీ రాష్ట్రంలో గోదావరి విస్తారంగా ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఈ నది చుట్టుపక్కల కాలుష్యకారక పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. ఆ పరిశ్రమలు పెద్ద వ్యక్తుల చేతిలో ఉన్నాయి. వాటి గురించి ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. తొలిసారిగా పవన్ కళ్యాణ్ ఆ విషయం మీద దృష్టి సారించారు. అదే కాదు తన పార్టీకి చెందిన మంత్రి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలుష్యకారక పరిశ్రమలు ఈ స్థాయిలో ఉంటే మీరు ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు.. ఈ పరిశ్రమలు త్వరలో మూతపడే అవకాశం ఉంది. గోదావరి ఊపిరి పీల్చుకునే సుముహూర్తం దగ్గర్లోనే ఉంది. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ చూపించిన తెగువ వల్ల సాధ్యమైంది.

పవన్ కళ్యాణ్ ఆ మధ్య ఉమ్మడి చిత్తూరులో పర్యటించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ మీద ఉక్కు పాదం మోపాలంటే ఏం చేయాలో క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత అటవీశాఖ సిబ్బందికి ఆయుధాలు.. ఇతర సామాగ్రి అందించేందుకు ప్రభుత్వాన్ని ఒప్పించారు. మరికొద్ది రోజుల్లో అటవీశాఖ సిబ్బందికి అత్యంత ఆధునికమైన ఆయుధ సామాగ్రి చేతికి వస్తుంది. దీనివల్ల ఆపత్కాలంలో వారికి ఆ ఆయుధాలు రక్షణగా ఉపయోగపడతాయి . అంతేకాదు స్మగ్లర్ల ఆగడాలకు చెక్ పడుతుంది.

వీటితోనే పవన్ కళ్యాణ్ ఆగిపోలేదు.. ఏపీలో విస్తారంగా ఉన్న అడవుల్లో జంతువుల వేట ఇష్టానుసారంగా సాగుతూ ఉంటుంది. వేటగాళ్లు అడవులలో ఉచ్చులు బిగిస్తుంటారు. ట్రాప్లు ఏర్పాటు చేస్తుంటారు. అందులో చిక్కుకున్న జింకలు.. కుందేళ్లు.. దుప్పులు.. వంటి జంతువులను వధించి.. వాటి మాంసాన్ని విక్రయిస్తుంటారు.. ఈ జంతువులను విక్రయించడం వల్ల అడవుల్లో జీవ వైవిధ్యం పూర్తిగా దెబ్బతింటున్నది. అందువల్ల పులులు.. ఇతర క్రూర మృగాలు ఆహారం లభించగా జనావాసాల్లోకి వస్తున్నాయి.

ఆ మధ్య రాజమండ్రిలోకి ఒక పులి వచ్చింది. చాలా రోజులపాటు ఆ ప్రాంతం లోనే అది తిరిగింది. చివరికి అటవీశాఖ అధికారులు పట్టుకోవడంతో రాజమండ్రి వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే.. అయితే ఈ అడవి జంతువులను వేటాడే వేటగాళ్ల కు చెక్ పెట్టేందుకు పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా సూచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి.. అడవుల్లో ఉన్న ఉచ్చులు.. ఫుల్ ట్రాప్లు.. కరెంటు తీగలను తొలగించారు.

హనుమాన్ ఫౌండేషన్ అటవీశాఖ అధికారులకు సహకరించింది. రంపచోడవరం అటవీ ప్రాంతంలో దుండగులు భారీ ఎత్తున ఉచ్చులు ఏర్పాటు చేశారు. రాహుల్ కూడా ఏర్పాటు చేశారు. దాదాపు క్షేత్రస్థాయిలో అటవీశాఖ అధికారులు మూడు రోజుల పాటు శ్రమించారు. అత్యంత కఠినమైన పరిస్థితుల మధ్య శ్రమించి 242 ఉచ్చులను, 10 ఫుల్ ట్రాప్ లను, 10 కిలోమీటర్ల పొడవు ఉన్న విద్యుత్ తీగలను తొలగించారు..

వీటిని తొలగించడం వల్ల ఎన్నో అటవీ జంతువులు బతికి బట్టకట్టాయి.. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే.. ఇలాంటి ఎన్నో పనులు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఎందుకంటే పచ్చని అడవి బాగుంటేనే మనిషి బతుకు బాగుంటుంది. అడవి ఎండిపోయిననాడు మనిషి బతుకు ఎడారి అవుతుంది.

ఇప్పటికైనా రేవంత్ మేల్కొన్నాడు. అసలు లోపాన్ని గుర్తించాడు.. సంతోషం

Revanth Reddy Political Journey
Revanth Reddy Political Journey

Revanth Reddy latest news: తెలంగాణ రాష్ట్ర కలను కాంగ్రెస్ పార్టీ సాకారం చేసింది.. కానీ, కెసిఆర్ వ్యూహ చతురతను అమలు చేసి.. ఆ క్రెడిట్ మొత్తం తను కొట్టేశాడు. స్వయం ప్రకటిత తెలంగాణ బాపుగా ప్రకటించుకున్నాడు. కెసిఆర్ అసలు లక్ష్యాన్ని కాంగ్రెస్ అంచనా వేయలేకపోయింది. ఆ తర్వాత జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరం కావలసి వచ్చింది. తెలంగాణ ప్రజలు బాధ్యతాయుతమైన ప్రతిపక్ష స్థానాన్ని అప్పగించినప్పటికీ.. కెసిఆర్ రాజకీయ పునరేకికరణ వల్ల కాంగ్రెస్ పార్టీ కోలుకోకుండా అయిపోయింది.

కెసిఆర్ ఏకపక్షంగా పాలిస్తూ ఉండడం.. కొన్ని ప్రజావ్యతిరేక విధానాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారిపోయాయి. వీటికి తగ్గట్టుగానే సోషల్ మీడియాలో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండేది. సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికలలో తెలంగాణ పగ్గాలు అందుకోగలిగింది. ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాను ఏ స్థాయిలో అయితే ఉపయోగించుకుందో.. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను దూరం పెట్టింది.

సోషల్ మీడియాను దూరం పెట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీకి గడిచిన రెండున్నర సంవత్సరాలుగా నష్టం జరుగుతూనే ఉంది. ఉప ఎన్నికలు.. స్థానిక సంస్థల ఎన్నికలు.. అంతకు ముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికలు.. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఇబ్బంది కలిగించలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి.. గులాబీ పార్టీ మీద ప్రజలు తీవ్రమైన కోపంతో ఉన్నారు కాబట్టి ఆ స్థాయిలో ఫలితాలు వచ్చాయి. అయితే ఎల్లకాలం అవే ఫలితాలు సాధ్యం కాదు. ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని తగ్గించుకోవడానికి భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియాను విపరీతంగా ఉపయోగించుకుంటున్నది.

కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను సోషల్ మీడియా ద్వారా బలంగా చాటిచెప్పుతున్నది. ఏ మాటకు ఆ మాట కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కంటే గులాబీ పార్టీ సోషల్ మీడియా కొన్ని లక్షల రెట్లు బలంగా ఉంది. మాధ్యమాలు ఏవైనా కావచ్చు.. గులాబీ పార్టీ బలమైన నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంది. చివరికి ప్రభుత్వం తాను చేసిన మంచి పని కూడా చెప్పుకునే స్థితిలో లేకుండా పోయింది. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ.. రైతుల ఖాతాలలో బోనస్ డబ్బులు జమ చేసినప్పటికీ.. మహిళలకు రకరకాల పథకాలు అమలు చేస్తున్నప్పటికీ.. ఇవేవీ కూడా చెప్పుకునే స్థాయిలో ప్రభుత్వం లేదు. ఒకవేళ ఇవే పథకాలను గులాబీ పార్టీ గనుక అమలు చేసి ఉంటే.. ప్రచారం ఒక స్థాయిలో ఉండేది.

సోషల్ మీడియా బలహీనంగా మారడాన్ని ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గుర్తించినట్టు కనిపిస్తోంది. పీఏసీ సమావేశంలో ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు రేవంత్ రెడ్డి. సోషల్ మీడియా వారియర్స్ సేవలను ఉపయోగించుకోలేకపోవడం.. బలమైన సోషల్ మీడియా విభాగాలను నిర్మించుకోలేకపోవడం.. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసుకోకుండా.. సొంత డబ్బా కు మాత్రమే ఎమ్మెల్యేలు పరిమితం కావడం పట్ల రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉండదని హెచ్చరించారు. సోషల్ మీడియాను ప్రాపర్ గా వాడుకోవాలని.. ప్రభుత్వ పథకాలను.. కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లినప్పుడే విజయం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారు సరైన గుర్తింపు లేక బయటికి వెళ్లిపోయిన విషయాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అధికారంలో ఉన్న పార్టీలో నుంచి సోషల్ మీడియా వారియర్స్ బయటకు వెళ్లిపోతే అంతకుమించిన దారుణం మరొకటి ఉండదని.. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలని సీఎం హెచ్చరించారు. అయితే సీఎం మాటలు హెచ్చరికల వరకే ఉంటాయా.. క్షేత్రస్థాయిలో ఏమైనా మార్పులు ఉంటాయా.. ఒకవేళ సీఎం మాటలు హెచ్చరికల వరకే ఆగిపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీని ఎవడూ బాగు చేయలేడు.

Whatsapp కాల్ లోనూ రికార్డింగ్.. ఎలా చేయాలో తెలుసుకోండి..

WhatsApp call recording
WhatsApp call recording

WhatsApp call recording: ప్రస్తుతం కమ్యూనికేషన్‌లో Whatsapp కీలక పాత్ర పోషిస్తోంది. వ్యక్తిగత సంభాషణలతో పాటు ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం కూడా లక్షలాది మంది వాట్సాప్ వాయిస్ కాల్స్‌ను ఉపయోగిస్తున్నారు. కొన్నిసార్లు ముఖ్యమైన సమాచారాన్ని భద్రపరచుకోవడం కోసం లేదా భవిష్యత్ అవసరాల కోసం కాల్ రికార్డ్ చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. అయితే వినియోగదారుల గోప్యతను కాపాడేందుకు మెటా సంస్థ వాట్సాప్‌లో అధికారిక కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను అందించలేదు. కానీ కొన్ని ఆప్షన్ల ద్వారా వాట్సాప్ కాల్ కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు.

చాలా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో బిల్ట్-ఇన్ స్క్రీన్ రికార్డర్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. వాట్సాప్ కాల్ ప్రారంభించే ముందు నోటిఫికేషన్ ప్యానెల్‌లో ఉన్న Screen Recorder ఆప్షన్‌ను ఆన్ చేయాలి. రికార్డింగ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘Record Audio’ ఎంపికను Mic లేదా System Sound‌గా సెట్ చేయాలి. అనంతరం వాట్సాప్ కాల్ మాట్లాడితే, కాల్‌తో పాటు ఆడియో కూడా రికార్డ్ అవుతుంది. కాల్ ముగిసిన తర్వాత రికార్డింగ్‌ను ఆపేస్తే ఆ వీడియో ఫైల్ గ్యాలరీలో సేవ్ అవుతుంది.

భద్రతా పరిమితుల కారణంగా కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లు అంతర్గత ఆడియో రికార్డింగ్‌ను అనుమతించవు. అలాంటి సందర్భాల్లో స్క్రీన్ రికార్డర్ వీడియోను మాత్రమే రికార్డ్ చేస్తుంది. దీంతో కాల్‌లోని అవతలి వ్యక్తి వాయిస్ రికార్డ్ కాకపోవచ్చు. ఇది ప్రధానంగా ఫోన్ తయారీదారులు అమలు చేసే ప్రైవసీ నిబంధనల వల్ల జరుగుతుంది. ఇంటర్నల్ ఆడియో రికార్డ్ కాకపోతే, వాట్సాప్ కాల్‌ను స్పీకర్ మోడ్‌లో ఉంచి స్క్రీన్ రికార్డింగ్ ప్రారంభించవచ్చు. ఈ విధానంలో ఫోన్ మైక్రోఫోన్ ద్వారా మీ వాయిస్‌తో పాటు అవతలి వ్యక్తి వాయిస్ కూడా రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే చుట్టుపక్కల ఉన్న శబ్దాలు కూడా రికార్డింగ్‌లో చేరే అవకాశం ఉన్నందున నిశ్శబ్ద వాతావరణంలో ఈ పద్ధతిని ఉపయోగించడం మంచిది.

యాపిల్ సంస్థ వినియోగదారుల గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. అందుకే ఐఓఎస్‌లో సాధారణ స్క్రీన్ రికార్డర్ ద్వారా లేదా థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా వాట్సాప్ కాల్స్‌ను నేరుగా రికార్డ్ చేయడానికి అనుమతి ఉండదు. ఐఫోన్‌లో కాల్ రికార్డింగ్ విషయంలో కఠినమైన భద్రతా నియమాలు అమల్లో ఉంటాయి.ఐఫోన్ వినియోగదారులు వాట్సాప్ కాల్‌ను స్పీకర్ మోడ్‌లో పెట్టి, మరో మొబైల్ ఫోన్ లేదా ప్రత్యేక ఆడియో రికార్డర్ సహాయంతో సంభాషణను రికార్డ్ చేయవచ్చు. ఇది అత్యంత సులభమైన మార్గంగా భావించబడుతోంది. అయితే రికార్డింగ్ నాణ్యత పరిసర పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

ఐఫోన్‌ను మాక్ కంప్యూటర్‌కు కనెక్ట్ చేసి, QuickTime Player వంటి టూల్స్ ఉపయోగించడం ద్వారా ఆడియోను రికార్డ్ చేసే పద్ధతులు కొన్ని సందర్భాల్లో ఉపయోగపడవచ్చు. అయితే ఇవి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారికి మాత్రమే సులభంగా అనుసరించగల మార్గాలు. అదనపు సెట్టింగ్స్ అవసరం కావచ్చు. ఏ కాల్‌నైనా రికార్డ్ చేసే ముందు స్థానిక చట్టాలు, గోప్యతా నిబంధనలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో కాల్‌లో పాల్గొనే వ్యక్తుల అనుమతి లేకుండా రికార్డ్ చేయడం చట్టవిరుద్ధం కావచ్చు. అందువల్ల రికార్డింగ్‌ను బాధ్యతాయుతంగా, అవసరమైన సందర్భాల్లో మాత్రమే ఉపయోగించడం మంచిది.

వాట్సాప్‌లో అధికారిక కాల్ రికార్డింగ్ ఫీచర్ లేకపోయినా, ఆండ్రాయిడ్‌లో స్క్రీన్ రికార్డర్, స్పీకర్ మోడ్ వంటి మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్‌లో మాత్రం భద్రతా పరిమితుల కారణంగా ప్రత్యక్ష రికార్డింగ్ సాధ్యం కాదు. అయినప్పటికీ ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా అవసరమైనప్పుడు సంభాషణలను భద్రపరచుకునే అవకాశం వినియోగదారులకు ఉంది.

జీతం రూ.90వేలు.. ఖర్చు రూ.25 వేల లోపే.. ఈమె బడ్జెట్ ప్లాన్ కు నెటిజన్ల ఫిదా..: వీడియో వైరల్

Woman budget planning viral video
Woman budget planning viral video

Woman budget planning viral video: ప్రస్తుతం పెరుగుతున్న జీవన వ్యయాల మధ్య పెద్ద నగరాల్లో ఉద్యోగం చేస్తూ డబ్బు ఆదా చేయడం చాలామందికి సవాల్‌గా మారింది. ముఖ్యంగా దిల్లీ వంటి మెట్రో నగరాల్లో అద్దె, ఆహారం, ప్రయాణం వంటి ఖర్చులు భారీగా ఉంటాయి. అందులోనూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడిన తరణంలో పెట్రోల్ తో పాట కొన్ని ఖర్చులు తగ్గించుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ సూచనలను కొందరు పట్టించుకోవడం లేదు. కానీ ఓ గవర్నమెంట్ ఆఫీసర్ మాత్రం తన బడ్జెట్ ప్లాన్ తో ఖర్చులు బాగా తగ్గించుకొని భారీగా డబ్బును సేవ్ చేస్తోంది. ఈ సమాచారాన్ని ఆమె తన ఇన్ స్ట్రాగ్రామ్ వీడియో ద్వారా తెలిపింది. ఆ వివరాలు మీకోసం..

కేంద్ర సచివాలయంలో అసిస్టెంట్ కృతిక అనే అమ్మాయి సెక్షన్ ఆఫీసర్ (ASO)గా పనిచేస్తున్నారు. SSC CGLపరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఈమె ప్రస్తుతం ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే కృతిక తన ఆర్థిక నిర్వహణతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. నెలకు ఆమెకు రూ.90,000 ఇన్ హ్యాండ్ శాలరీ వస్తుంది. ఆమె ఇందులో కేవలం రూ.25,000 లోపే ఖర్చులను చేస్తూ మిగతా సొమ్మును ఆదా చేస్తున్నారు.

దిల్లీలో ఒంటరిగా ఒక ఫ్లాట్ తీసుకుంటే నెలకు భారీగా అద్దె చెల్లించాల్సి వస్తుందని కృతిక ముందుగానే అంచనా వేశారు. దీంతో ఆమె ఒక ఫ్లాట్‌మేట్‌తో కలిసి రెండు బెడ్‌రూమ్‌ల అపార్ట్‌మెంట్‌ను షేర్ చేసుకోవాలని నిర్ణయించారు. దీంతో మొత్తం అద్దెను ఇద్దరూ పంచుకోవడం వల్ల ఆమె వాటా కింద కేవలం రూ.11,500 మాత్రమే ఖర్చవుతోంది. మెట్రో నగరాల్లో నివాస ఖర్చులను తగ్గించుకోవడానికి ఇది ఉత్తమ మార్గమని ఆమె చెబుతున్నారు.

చాలామంది ఉద్యోగులు సమయం లేక బయట ఆహారంపైనే ఆధారపడుతుంటారు. కానీ కృతిక మాత్రం ఆరోగ్యాన్ని, డబ్బును రెండింటినీ దృష్టిలో పెట్టుకుని ఇంటి వంటకే ప్రాధాన్యం ఇచ్చారు. ఇందుకోసం నెలకు రూ.5,000 జీతంతో ఒక వంటమనిషిని నియమించుకున్నారు. ఆ ఖర్చును కూడా ఫ్లాట్‌మేట్‌తో పంచుకోవడం వల్ల ఆమెపై పడే భారం కేవలం రూ.2,500 మాత్రమే. దీంతో ప్రతిరోజూ రుచికరమైన ఇంటి భోజనం తక్కువ ఖర్చుతో అందుతోంది.

నేటి యువతలో జోమాటో, స్విగ్గీ వంటి యాప్స్ ద్వారా తరచూ ఆహారం ఆర్డర్ చేసే అలవాటు ఎక్కువగా కనిపిస్తోంది. కానీ కృతిక ఆ ఖర్చులను కట్టడి చేయడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇంటి భోజనం అందుబాటులో ఉండటంతో బయట ఆహారం అవసరం చాలా తక్కువగా వస్తుంది. ఫలితంగా ఆమె నెలవారీ ఫుడ్ డెలివరీ ఖర్చులు రూ.2,000 లోపే ఉంటున్నాయి.

కృతిక జీవనశైలిలో మరో ముఖ్యమైన అంశం అవసరం లేని ఖర్చులను పూర్తిగా నివారించడం. ఖరీదైన బ్రాండ్లు, తరచూ షాపింగ్, విలాసవంతమైన వినోదాల కోసం డబ్బు ఖర్చు చేయకుండా, అవసరమైన వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చవుతోందో లెక్కపెట్టే అలవాటు ఆమెకు ఉంది.

నెలకు రూ.90,000 జీతం వస్తుండగా, ఖర్చులు రూ.25,000 లోపే ఉండటంతో మిగిలిన మొత్తాన్ని కృతిక పొదుపులు, పెట్టుబడుల కోసం వినియోగిస్తున్నారు. అత్యవసర నిధి, మ్యూచువల్ ఫండ్లు, భవిష్యత్ లక్ష్యాల కోసం ప్రత్యేకంగా డబ్బును కేటాయిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమశిక్షణే ఆమె ఆర్థిక భద్రతకు బలమైన పునాదిగా మారింది.

ఎక్కువ సంపాదించడం మాత్రమే కాకుండా, సంపాదించిన డబ్బును ఎలా నిర్వహించుకోవాలో కృతిక కథ స్పష్టంగా చూపిస్తోంది. సరైన ప్రణాళిక, అవసరాలకు మాత్రమే ఖర్చు చేయడం, పొదుపులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మెట్రో నగరంలోనూ ఆర్థికంగా బలంగా నిలవవచ్చని ఆమె నిరూపించారు. యువ ఉద్యోగులకు ఆమె బడ్జెట్ ప్లానింగ్ ఒక మంచి మార్గదర్శకంగా చెప్పుకోవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Kritika (@tweetikaa)

ఈసారి పోటీపై కొడాలి నాని సంచలన నిర్ణయం!

Kodali Nani latest decision
Kodali Nani latest decision

Kodali Nani latest decision: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రి కొడాలి నాని యాక్టివయ్యారు. తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రెండు రోజుల కిందట తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ ను సైతం వదల్లేదు. అయితే విజయవాడ అయితే వస్తున్న కొడాలి నాని గుడివాడ వైపు మాత్రం చూడడం లేదు. గుడివాడ విషయంలో ఆయన ఆలోచన మారినట్లు తెలుస్తోంది. గుడివాడకు దూరం కావడమే ఉత్తమం అన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. 2004 నుంచి 2019 వరకు ఆయన 4 ఎన్నికల్లో గెలిచారు. ఐదోసారి పోటీ చేసి ఓడిపోయారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన తర్వాత కూడా తనను ప్రజలు ఓడించారన్న ఆవేదన కొడాలి నాని లో ఉన్నట్లు తెలుస్తోంది.

టిడిపి ద్వారా ఎంట్రీ..
2004లో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గుడివాడ నుంచి పోటీ చేశారు కొడాలి నాని. ఆ ఎన్నికల్లో గెలిచారు కానీ టిడిపి అధికారంలోకి రాలేదు. 2009లో రెండోసారి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పుడు కూడా టిడిపి అధికారంలోకి రాలేదు. అప్పుడే నాయకత్వంతో విభేదించి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ వైసీపీ మాత్రం గెలవలేదు. 2019లో కొడాలి నాని గెలవడంతో పాటు వైసిపి అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో రెండున్నర సంవత్సరాల పాటు మంత్రిగా కూడా కొనసాగారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ ఇంత చేసిన తనను నియోజకవర్గ ప్రజలు ఓడించడంతో తీవ్ర ఆవేదనతో ఉన్నారు. అందుకే గుడివాడకు దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

పోటీ చేయకూడదని..
అయితే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని కొడాలి నాని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీకి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచార బాధ్యతలను కొడాలి నాని తీసుకుంటారన్న ప్రచారం సాగుతోంది. అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లో తప్పుకుంటానని నాని ముందుగానే ప్రకటన చేశారు. తన అన్న కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటించారు. తన దూకుడు రాజకీయాలతో లేనిపోని వివాదాలను తెచ్చుకున్నారు నాని. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేసి.. వివాద రాజకీయాలకు దూరంగా ఉండాలని చూస్తున్నారట కొడాలి నాని. అందులో ఎంత నిజం ఉందో చూడాలి.

'అమరావతి' వైపు చూడని టాలీవుడ్!

Tollywood silence on Amaravati
Tollywood silence on Amaravati

Tollywood silence on Amaravati: అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. మొన్నటి వరకు ఏపీ రాజధాని ఏది అంటే చెప్పుకునే పరిస్థితిలో ప్రజలు ఉండేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం సగర్వంగా చెప్పుకుంటున్నారు అమరావతి అని. అందుకు తగ్గట్టుగానే అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే అమరావతిలో 70 ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మితం అవుతున్నాయి. అందులో బ్యాంకులు సైతం ఉన్నాయి. మరో నాలుగు వరకు ప్రైవేటు యూనివర్సిటీలు, ఆస్పత్రుల నిర్మాణం జరుగుతోంది. అయితే అమరావతి ఔన్నత్యాన్ని గుర్తించిన బాలీవుడ్ సంస్థలు అమరావతిలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాల్లో అమరావతి అద్భుత నగరంగా మారుతుందని అంచనా వేస్తున్నారు బాలీవుడ్ ప్రముఖులు. అందుకే సంజయ్ దత్ లాంటివారు అమరావతికి వచ్చి.. ప్రభుత్వంతో చర్చలు జరిపి తన ఆసక్తిని బయటపెట్టారు. దీనిపై చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ సైతం సానుకూలత చూపారు. అయితే ఆయన ఒక్కరే కాదు బాలీవుడ్ ప్రముఖ సంస్థలు అమరావతిలో తమకు భూములు కేటాయించాలని కోరుతూ దరఖాస్తులు చేసుకుంటున్నాయి. అయితే వాటికి భూముల కేటాయింపుకు సంబంధించి సానుకూల నిర్ణయాలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

మర్యాదపూర్వకంగా కలవలే..
అమరావతి ఔన్నత్యాన్ని బాలీవుడ్ గుర్తించింది కానీ.. టాలీవుడ్ మాత్రం గుర్తించడం లేదు. అసలు ఏపీనే టాలీవుడ్ లెక్కచేయడం లేదు. ఏపీ పాలకుల విషయంలో కూడా అలానే ఉంది చిత్ర పరిశ్రమ పరిస్థితి. ఏపీ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలుమార్లు సూచించారు. కానీ ఇంతవరకు తెలుగు చిత్ర ప్రముఖులు వచ్చి సీఎం చంద్రబాబును కలిసిన పరిస్థితి లేదు. కనీసం అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకు రావడం లేదు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు.

పెట్టుబడులు పెడితే మంచిది..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మావిగన్ అంటూ పిచ్చి ప్రతిపాదన చేస్తోంది. దానిని పట్టించుకునే పరిస్థితి ఎవరికీ లేదు. పైగా ప్రజలు కూడా పెద్దగా ఆహ్వానించడం లేదు. అమరావతికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కూడా కల్పించింది. దీనిని గుర్తించిన ఎక్కడో ఉన్న బాలీవుడ్ పరిశ్రమ అమరావతికి వచ్చేందుకు సిద్ధపడింది. కానీ ఇక్కడ వ్యాపారం చేసుకుని లాభాలు ఆర్టిస్తున్న టాలీవుడ్ మాత్రం అమరావతి ముఖం చూడడం లేదు. ఇది ఎంత మాత్రం సహేతుకం కాదు. అమరావతి విషయంలో ఇప్పటికైనా తెలుగు చిత్ర పరిశ్రమ ఒక నిర్ణయానికి రావాలి. తెలుగు చిత్ర పరిశ్రమ అంటే హైదరాబాద్ అనే మాట దాటి ఏపీ వైపు విస్తరించాల్సిన అవసరం మాత్రం ఉంది.

బీజేపీ సైలెంట్‌ స్ట్రాటజీ.. నితిన్‌ మార్క్‌ నియామకాలు!

BJP silent strategy
BJP silent strategy

BJP silent strategy: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) హడావుడి లేకుండా, ప్రకటనలు లేకుండా కీలక సంస్థాగత మార్పులు చేపట్టింది. నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల నియామకం ద్వారా పార్టీ భవిష్యత్‌ ఎన్నికలు, స్థానిక సవాళ్లను ఎదుర్కోవడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది నితిన్‌ నబీన్‌ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి ప్రధాన సంస్థాగత చర్యగా గుర్తింపు పొందుతోంది.

అనుభవజ్ఞులకు పెద్దపీట..
బీజేపీ ఈ నియామకాల్లో పార్టీలో దీర్ఘకాలం పనిచేసిన, సైద్ధాంతికంగా బలమైన అనుభవం ఉన్న నాయకులను ఎంపిక చేసింది. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగిన నాయకత్వానికి అవకాశాలు ఇవ్వడం ద్వారా పార్టీ లోపలి బలాన్ని మరింత పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్పులు కేవలం రూటీన్‌ నియామకాలు కాకుండా, రాష్ట్ర–నిర్దిష్ట సవాళ్లు, అవకాశాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు.

హర్యాణా పగ్గాలు మహిళకు..
వరుసగా మూడోసారి అధికారం సాధించిన నేపథ్యంలో అర్చనా గుప్తాను రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించడం గమనార్హం. అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన సమర్థవంతమైన నాయకురాలు అర్చనా గుప్తా సారథ్యంలో పార్టీ మరింత బలపడుతుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇది బీజేపీ చరిత్రలో మహిళా రాష్ట్ర అధ్యక్షురాలి నియామకం మొదటిసారి కావడం విశేషం. ఇది మహిళా ఓటర్లను ఆకర్షించడం, పార్టీ లోపలి సమానత్వ సందేశాన్ని బలపరుస్తుంది. 2029 ఎన్నికలకు సన్నాహాల్లో భాగంగా ఈ నియామకం హర్యాణాలో బీజేపీ ఆధిపత్యాన్ని మరింత స్థిరపరచడానికి ఉపయోగపడుతుంది.

కేంద్ర మంత్రికి ఢిల్లీ పగ్గాలు..
రాజధాని ఢిల్లీకి హర్‌‡్ష మల్హోత్రాను అధ్యక్షుడిగా నియమించడం బీజేపీ వ్యూహంలో మరో కీలక అంశం. కింది స్థాయి నుంచి ఎదిగి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న హర్‌‡్ష మల్హోత్రా అనుభవం ఢిల్లీలో పార్టీని పునరుద్ధరించడంలో సహాయకరంగా ఉంటుంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఆధిపత్యం ఉన్న ఢిల్లీలో బీజేపీ బలం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నియామకం ఆ దిశగా తీసుకున్న ముఖ్యమైన అడుగు.

సిక్కు నేతకు పంజాబ్‌ పగ్గాలు..
పంజాబ్‌లో త్వరలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో గువల్‌ సింగ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం రాజకీయంగా ముఖ్యమైన సంకేతం. సిక్ఖు సమాజానికి చెందిన నాయకుడిని ఎంపిక చేయడం ద్వారా బీజేపీ ఓటర్లకు స్పష్టమైన సందేశం పంపింది. ఆప్‌పై వ్యతిరేకత, కాంగ్రెస్‌పై నమ్మకం తగ్గిన నేపథ్యంలో బీజేపీ సొంత బలం పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ నియామకం పంజాబ్‌లో పార్టీ విస్తరణకు కొత్త ఊపు ఇవ్వవచ్చు.

త్రిపురకు యువ నేత..
బంగ్లాదేశ్‌ సరిహద్దుతో ఉన్న త్రిపురలో అభిషేక్‌ దేవ్‌ రాయ్‌ను అధ్యక్షుడిగా నియమించడం ఈశాన్య భారతదేశంలో బీజేపీ వ్యూహానికి అనుగుణంగా ఉంది. వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీ వచ్చే ఎన్నికల నాటికి మరింత బలోపేతం కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. సరిహద్దు రాష్ట్రంగా త్రిపుర యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ నియామకం జరిగింది.

ఈ నాలుగు నియామకాలు బీజేపీ దీర్ఘకాలిక వ్యూహాన్ని ప్రతిబింబిస్తాయి – హడావుడి లేకుండా, సైలెంట్‌గా సంస్థాగత బలాన్ని పెంచుకోవడం. అట్టడుగు నాయకులను ప్రోత్సహించడం, మహిళా నాయకత్వానికి అవకాశం ఇవ్వడం, సామాజిక సమీకరణాలు సర్దుబాటు చేసుకోవడం ఇవన్నీ రాబోయే ఎన్నికల్లో పార్టీకి ప్రయోజనం చేకూర్చవచ్చు. ఈ మార్పులు బీజేపీని కేవలం ఎన్నికల పార్టీగా కాకుండా, దీర్ఘకాలిక సంస్థాగత బలం కలిగిన రాజకీయ శక్తిగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నందమూరి తారక రామారావు.. ఆయన ఫుడ్‌ మెనూ డిఫరెంట్‌!

NTR personal lifestyle details
NTR personal lifestyle details

NTR personal lifestyle details: నవరస నటసార్వభౌముడు, తెలుగు సినిమా ప్రపంచానికి మహానాయకుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్‌) పుట్టినరోజు సందర్భంగా ఆయన వ్యక్తిత్వం వివిధ కోణాల్లో చర్చనీయాంశమవుతోంది. ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఒక వీడియోలో ఆయన భోజన అలవాట్లు, ఆకలి, అభిరుచి సంబంధిత అనుభవాలు వెలుగులోకి వచ్చాయి.

అన్‌సీజన్‌లో కూడా అభిరుచి తీర్చే ఆహారం..
ఎన్టీఆర్‌ తనకు నచ్చిన వంటలు ఎప్పుడైనా, ఎలాగైనా తయారు చేయించుకునేవారు. ఒకసారి చింతచిగురు మాంసం కావాలని అన్నారు. అది అన్‌సీజన్‌ కావడంతో చింతచిగురు దొరకడం కష్టం. అయినా ఆయన కోరిక తీర్చడానికి నలుగు వాహనాలు పంపి, చుట్టుపక్కల నుంచి చింతచిగురు సేకరించి వంట చేశారు. ఇది సాధారణ ఆకలి కాదు. తన అభిరుచిని ఎంతో సీరియస్‌గా తీసుకునే వ్యక్తి ఎన్టీఆర్‌. ఆయన చెప్పిన మాట అంటే ఎవరైనా ఎలాగైనా నెరవేర్చేవారు. ఇది ఆయన చుట్టూ ఉన్నవారిలో ఆయన పట్ల ఉన్న గౌరవానికి, అధికార బాహ్యాకర్షణకు నిదర్శనం.

నాయకుడు ముందు, ఇతరులు తర్వాత..
ఎన్టీఆర్‌ రోజూ ఉదయం 11 గంటలకు ఇచ్చేవారు. వంటలు సిద్ధం చేసి హాట్‌ బాక్స్‌లో పెట్టి ఆయనకు అందించేవారు. ఆయన తిని మిగిలినవి మాత్రమే ఇతరులు తినేవారు. ఇది ఒక నాయకుడి, స్టార్‌ హీరో యొక్క స్థానాన్ని స్పష్టం చేసే విషయం. అయినా ఆయన తినేటప్పుడు చుట్టూ ఉన్నవారిని కూడా ఆహ్వానించేవారు. ఈ సంఘీభావం ఎన్టీఆర్‌ వ్యక్తిత్వంలోని మరో కోణం..

జీడిపప్పు భోజనం..
షూటింగ్‌ సమయంలో ఒకసారి ఎదుట కేజీ జీడిపప్పు పెట్టగా, గుప్పెడు గుప్పెడుగా నోట్లో వేసుకుని 15 నిమిషాల్లో మొత్తం తీర్చేశారు. చుట్టూ ఉన్నవారిని కూడా తీసుకోమన్నారు కానీ ఆయన తినేవరకు ఎవరూ ముట్టుకోలేదు. ఇది ఆయన ఆకలి ఎంత భారీగా ఉండేదో చూపిస్తుంది. మరోసారి ఫైట్‌ సీన్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా ఉదయం టిఫిన్‌ చాలడం లేదని నిర్మాత నాగిరెడ్డి వద్దకు వెళ్లి మరో టిఫిన్‌ అడిగారు. ‘‘నాకు ఆకలి ఎక్కువ’’ అని స్పష్టంగా చెప్పారు. ఇది ఎన్టీఆర్‌ శారీరక శక్తి, ఎనర్జీ లెవెల్స్‌ ఎంత ఎక్కువగా ఉండేవో తెలియజేస్తుంది.

పాత్రలో పూర్తి నిమగ్నం..
ఎన్టీఆర్‌ రాముడు లేదా కృష్ణుడు వేషంలో ఉన్నప్పుడు కేవలం నిమ్మకాయ నీళ్లు మాత్రమే తాగేవారు. ఇది ఆయన నటనా ప్రతిభకు మరో నిదర్శనం. పాత్రలో పూర్తిగా లీనం అయ్యే ఆయన సంయమనం, డిసిప్లిన్‌ అప్పటి సినిమా పరిశ్రమలో అరుదైనది.

ఎన్టీఆర్‌ భోజన అలవాట్లు ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. ఆయనలో ఉన్న ఆకలి కేవలం శారీరకం కాదు.. అధికారం, ప్రజా సేవ, సినిమా పట్ల మక్కువ అన్నీ ఒక భారీ ఆకలి రూపాలే. అన్‌సీజన్‌లో కూడా కోరినది తెచ్చి పెట్టించుకోవడం ఆయన నిర్ణయాత్మకతను చూపిస్తుంది. ఇతరులు తినే ముందు తాను తినడం నాయకత్వ స్వభావాన్ని, మరోవైపు సహచరులను ఆహ్వానించడం సరళత్వాన్ని తెలియజేస్తాయి.

గ్రామ సింహాలకు చుక్కలు చూపించాడు...కుక్కల ప్రేమికులారా.. దయచేసి ఈ వీడియో చూడకండి..

Village Dogs Viral Video
Village Dogs Viral Video

Village Dogs Viral Video: మన దేశంలో వీధి కుక్కలు కరచి ప్రతి సంవత్సరం చాలామంది గాయపడుతుంటారు. ఇటీవల కాలంలో రేబిస్ వంటి వ్యాధికి చాలామంది చనిపోతున్నారు. కుక్కల వల్ల చోటుచేసుకుంటున్న మరణాలకు సంబంధించిన కేసులు ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా ఈ అంశంపై అనేకసార్లు స్పందించింది. వీధి కుక్కలను దూరంగా ఉంచాల్సిందేనని.. అవసరమైతే సంహరించాల్సిందేనని అనేక సందర్భాల్లో తీర్పులను వెల్లడించింది.

మనదేశంలో కుక్కల ప్రేమికులకు సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో వెల్లడించిన తీర్పులు రుచించలేదు. అందువల్లే అనేక సందర్భాలలో సుప్రీంకోర్టు మెట్లను.. ఇంకా రకరకాల మార్గాలను అన్వేషించారు. ఆయనప్పటికీ కుక్కల ప్రేమికులకు అనుకూలమైన తీర్పురాలేదు. సానుకూలమైన నిర్ణయం రాలేదు. అయినప్పటికీ వారు వెనుకడుగు వేయడం లేదు. సోషల్ మీడియాలో ఉద్యమాలు.. ఆన్లైన్ వేదికలలో రకరకాల వ్యవహారాలు సాగిస్తున్నారు.

కుక్కల ప్రేమికులకు తెలియని అసలు విషయం ఏంటంటే.. వీధి కుక్కల వల్ల ప్రతి ఏడాది వేలాదిమంది గాయపడుతున్నారు. చాలామంది చనిపోతున్నారు. రేబిస్ సోకినప్పుడు మనిషిలో కనిపించే లక్షణాలు అత్యంత దారుణంగా ఉంటాయి. మనిషిలాగ ఉండేప్పటికీ జంతువు లాగా అతని ప్రవర్తించే తీరు భయంకరంగా ఉంటుంది. అటువంటి వ్యాధి కుక్కల ప్రేమికుల కుటుంబ సభ్యులకు వస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అందువల్లే ఇటీవల కాలంలో కుక్కల ప్రేమికుల మీద సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

సోషల్ మీడియాలో కుక్కల ప్రేమికులకు కనువిప్పు కలిగించే ఒక వీడియో ఒకటి విపరీతంగా సర్కులేట్ అవుతోంది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. ఎప్పుడు జరిగిందో తెలియదు. కానీ ఒక వ్యక్తి అర్థరాత్రి పూట నడుచుకుంటూ ఇంటికి వస్తున్నాడు.. అతడిని కొన్ని వీధి కుక్కలు వెంబడించాయి. కరిచేందుకు ప్రయత్నించాయి. అయితే అతడు ఏమాత్రం భయపడకుండా ఆ కుక్కల మీద దాడి చేయడం మొదలుపెట్టాడు. కుక్కలను ముందుగా బెదిరించాడు. అవి మాట వినకపోవడంతో.. తట్టుకోలేక తన వైల్డ్ ఫైర్ అవతారాన్ని చూపించాడు. వెంటనే తన చేతుల్లోకి ఒక కుక్కను తీసుకొని అటు ఇటు తిప్పాడు. దీంతో మిగతా కుక్కలు భయపడిపోయాయి. అతడిని చూసి పారిపోయాయి.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. కుక్కల ప్రేమికులు ఇప్పుడు మాట్లాడతారా.. ఈ వీడియో చూసిన తర్వాత నిశ్శబ్దంగా ఉండిపోతారా.. లేక సుప్రీంకోర్టులో కేసులు వేస్తారా.. తెలుసుకోండి అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. అదే కాదు ఆ వ్యక్తి కుక్కలను ఆ విధంగా తరిమి కొట్టడంతో అతని మీద ప్రశంసలు జల్లు కురుస్తోంది. గొప్ప పని చేశావు అంటూ అందరూ అతడిని సోషల్ మీడియా వేదికగా అభినందిస్తున్నారు.

 

 

iPhone కొనేవారికి గుడ్ న్యూస్.. 18 సిరీస్ స్పెషిఫికేషన్ లీక్..

iPhone 18 series specifications leak
iPhone 18 series specifications leak

iPhone 18 series specifications leak: Apple కంపెనీకి చెందిన ఐ ఫోన్ భారత మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడు పోతుంటాయి. అయితే ఈ కంపెనీకి చెందిన iPhone 18 సిరీస్ మార్కెట్లోకి రాబోతుంది. ఇప్పటికే ఐ ఫోన్ కొనాలని అనుకునేవారు కొత్త సిరీస్ కోసం ఎదురుచూస్తన్నారు. ఇలాంటి వారికి ఈ కొత్త ఫోన్ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. అయితే ఈ 18 సిరీస్ ఎలా ఉంటుందో చూద్దాం..

యాపిల్ కంపెనీ నంచి ప్రతీ ఏడాది కొత్త మొబైల్ ను సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తుంది. అలాగే ఏడాది కూడా iPhone 18 Pro, iPhone 18 Pro Max మోడళ్లను 2026 సెప్టెంబర్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఈసారి యాపిల్ ఒక కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రీమియం మోడల్స్‌ను సెప్టెంబర్‌లో విడుదల చేస్తూనే, సాధారణ iPhone 18, బడ్జెట్ ఫ్రెండ్లీ iPhone 18e మోడళ్లను వచ్చే ఏడాది వరకు వాయిదా వేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కాబట్టి, సాధారణ వినియోగదారులకు కొత్త ఐఫోన్ అందుబాటులోకి రావడానికి కొంత సమయం పట్టవచ్చు.

భారత మార్కెట్‌లో ఐఫోన్ 18 ధరలు ప్రీమియం శ్రేణిలోనే ఉండనున్నాయి. అంచనాల ప్రకారం iPhone 18 Pro బేస్ వేరియంట్ ధర సుమారు రూ.1,34,900 నుంచి రూ. 1,39,900 మధ్య ఉండవచ్చు. అలాగే, iPhone 18 Pro Max మోడల్ ధర సుమారు రూ.1,49,900 నుంచి రూ.1,59,900 వరకు ఉండవచ్చని అంచనా. సాధారణ iPhone 18 ధర 2027లో విడుదలయితే సుమారు రూ. 89,999 నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

కెమెరా విభాగంలో ఈసారి పెద్ద మార్పులు ఉండనున్నాయి. ముఖ్యంగా, iPhone 18 Pro మోడళ్లలో ‘వేరియబుల్ అపెర్చర్’ లెన్స్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనివల్ల వినియోగదారులు DSLR కెమెరాల మాదిరిగా డెప్త్ ఆఫ్ ఫీల్డ్ , లైటింగ్ పై పూర్తి నియంత్రణను కలిగి ఉంటారు. అంతేకాకుండా ముందు వైపు ఉన్న ‘డైనమిక్ ఐలాండ్’ పరిమాణం సుమారు 35% తగ్గి ఎక్కువ స్క్రీన్ స్పేస్‌ను అందిస్తుందని భావిస్తున్నారు. ఫోన్ వెనుక భాగంలో కొత్త రంగులు మరియు మెరుగైన ఫినిషింగ్‌తో వచ్చే అవకాశం ఉంది.

ఈ కొత్త ఐఫోన్లలో అత్యంత శక్తివంతమైన A20 Pro చిప్‌సెట్ ఉండనుంది. ఇది 2nm ప్రాసెస్ ఆధారంగా తయారవుతుంది, దీనివల్ల ఫోన్ పనితీరు 15 శాతం వేగంగా పనిచేస్తుంది. పవర్ ఎఫీషియెన్సీ 30 శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే మల్టీ టాస్కింగ్, గేమింగ్ కోసం ఇందులో 12GB RAM అందించే అవకాశం ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే.. Pro Max మోడల్‌లో 5,100mAh నుంచి 5,200mAh సామర్థ్యం గల బ్యాటరీ ఉండవచ్చని, ఇది మునుపటి కంటే మెరుగైన బ్యాటరీ లైఫ్ అందిస్తుందని నివేదికలు చెబుతున్నాయి.

చాటుసుఖాలకు అలవాటు పడితే.. ప్రాణాలు ఇలా గాలిలో కలిసిపోతాయి.. వైరల్ వీడియో

Fitness Trainer Huan Mao
Fitness Trainer Huan Mao

Fitness Trainer Huan Mao: విచక్షణ అనేది లేదు. మనుషులమనే కనీస స్పృహ లేదు. ఐదు నిమిషాల సుఖం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఎంతటి దారుణానికైనా పాల్పడుతున్నారు. చాటు సుఖాలకు అలవాటు పడి చివరికి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అటువంటిదే ఈ ఘటన కూడా.. ఇది యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది..

అతడి పేరు ఏంటో తెలియదు. ఉండేది మాత్రం సింగపూర్లో. చేసేది ఫిట్నెస్ ట్రైనర్ గా.. ఇతడి వద్దకు అన్ని వర్గాల ప్రజలు వస్తుంటారు. అలాగే ఆ మహిళ కూడా రావడం మొదలైంది. మొదట్లో ఆమెకు అతడు అనేక రకాల కసరత్తులు నేర్పించేవాడు. లావుగా ఉన్న ఆమెను సన్నగా మార్చేశాడు. ఒకరకంగా చెప్పాలంటే కల్పనా రాయ్ ఇలాంటి ఆకారాన్ని ఐశ్వర్యరాయ్ లాగా మార్చేశాడు. దీంతో ఆమెకు మనోడు అంటే మోజు పుట్టింది. అతనితో పొందు కోరుకుంది. ఇంకేముంది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదట్లో అతడు ఆమె ఆఫర్ కు ఒప్పుకోలేదు. ఆమె అతడు ముందు వలువలు మొత్తం వదిలేయడంతో మనోడిలో ఉన్న మగాడు మేల్కొన్నాడు. మగతనాన్ని తట్టుకోలేక ఆమె మీద రెచ్చిపోవడం మొదలు పెట్టాడు.

ఇక అప్పుడు మొదలు.. వారి దండయాత్ర కొనసాగుతూనే ఉంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా అదే పని. ఈ విషయం ఆమె భర్తకు తెలియదు.. ఇక ఇటీవల ఆమెకు ఇంట్లో పని ఉండడం వల్ల ఫిట్నెస్ సెంటర్ కు వెళ్ళడం సాధ్యం కాలేదు. దీంతో ఆమె అతడితో సాంగత్యం కోరుకుంది. ఈ నేపథ్యంలో భర్త బయటకి వెళ్లిపోవడంతో ప్రియుడికి సమాచారం అందించింది. అతడు వెంటనే అక్కడికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి స్వర్గ సుఖాలలో మునిగి తేలడం మొదలుపెట్టారు. క్లైమాక్స్లో భర్త ఎంట్రీ ఇవ్వడంతో.. ఫిట్నెస్ ట్రైనర్ పరిస్థితి కుడిదిలో పడ్డ ఎలుకలాగా మారిపోయింది. అక్కడ నుంచి బయటపడేందుకు అతడు.. మరో మాటకు తావు లేకుండా వారు ఉంటున్న ఇంటి కిటికీ నుంచి బయటికి వచ్చాడు. అమాంతం దూకేశాడు. కిందపడి కన్నుమూశాడు. ఈ సంఘటన సింగపూర్ దేశంలో చోటుచేసుకుంది. వ్యాయామ నిపుణుడు అంత పెద్ద భవనం నుంచి కింద పడడంతో తల పగిలి చనిపోయాడు.

ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. సిసి ఫుటేజ్.. ఫోన్ కాల్స్.. ఇతర వివరాలను సేకరించారు. ఆ వివాహిత మీద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. చాటుమాటు సంబంధాలు ఎంతటి ఘోరాలకు కారణమవుతాయో ఈ సంఘటన నిరూపిస్తోంది.

తిట్టిన మెగా ఫ్యామిలీనే నమ్ముకున్న రోజా!

RK Roja
RK Roja

Roja: రాజకీయంగా మాజీమంత్రి రోజా దూకుడు స్వభావంతో ఉంటారు. రాజకీయ ప్రత్యర్థులను విపరీతంగా ద్వేషిస్తుంటారు. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఆమె వాడే భాష, పదప్రయోగం తీవ్రంగా ఉంటుంది. ఇటీవల మెగా ఫ్యామిలీ పై కూడా ఆమె తరచూ వ్యాఖ్యానాలు చేస్తుంటారు. వారికి మద్దతుగా నిలిచే బుల్లితెర నటులపై కూడా నోరు పారేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే రాజకీయంగా విభేదించే రోజా సినిమాల పరంగా మాత్రం మెగా ఫ్యామిలీ వైపు మొగ్గు చూపుతుండడం విశేషం. మెగా ఫ్యామిలీతోనే తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఆమె నోటి నుంచి వస్తోంది. చిరంజీవి అవకాశం ఇస్తే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని ఆమె చెప్పుకు రావడం విశేషం.

* చిరంజీవి వైపే మొగ్గు..
ప్రముఖ జర్నలిస్టు జాఫర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బుల్లితెర కార్యక్రమానికి వచ్చారు మాజీ మంత్రి రోజా. ఆయన పలు ప్రశ్నలు వేశారు. సినిమా రంగంలో ఉన్న ఆ నలుగురు అగ్ర కథానాయకులు ఎవరితో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారని ప్రశ్నించారు. మారు మాట చెప్పకుండా మెగాస్టార్ చిరంజీవి అంటూ తేల్చి చెప్పారు రోజా. ఆయనతో అయితే డాన్స్ పోటీపడి చేయవచ్చని చెప్పుకొచ్చారు. బాలకృష్ణ అంటే వ్యక్తిగతంగా ఇష్టం కానీ.. చిరంజీవితో నటించడం అంటేనే తనకు ఆసక్తి అని నిర్మొహమాటంగా చెప్పేశారు. నాగార్జునకు తాను అభిమానిని.. ఆయనతో నటించిన అని చెప్పారు. వెంకటేష్ తో ఒకే ఒక్క సినిమా మాత్రమే చేశానని.. ఆయన విషయంలో సైతం ఆప్షన్ లేదని తేల్చి చెప్పారు రోజా.

* అప్పట్లో ఆశీర్వాదం కోసం..
వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవితో రోజాకు మంచి అనుబంధమే ఉండేది. ఆయనతో కలిసి పలు హిట్ చిత్రాల్లో నటించారు. మంత్రిగా ఎంపికైన తర్వాత చిరంజీవి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.. మరో మెగా బ్రదర్ నాగబాబుతో సుదీర్ఘకాలం ఈటీవీ జబర్దస్త్ కార్యక్రమంలో జడ్జిగా కొనసాగారు. అయితే పవన్ కళ్యాణ్ పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ పెట్టుకుంటూ వస్తున్నారు. మధ్య మధ్యలో మెగా ఫ్యామిలీ పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ సినిమాల పరంగా చిరంజీవి ద్వారా రీఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచనతో రోజా ఉన్నారు. మరి అందుకు చిరంజీవి అవకాశం ఇస్తారో లేదో చూడాలి.

గొయెంకా ఉన్నన్ని రోజులు లక్నో బాగుపడదా.. ఆ టీంకు ఎవరూ ఆడరా..

Sanjiv Goenka
Sanjiv Goenka

Sanjiv Goenka: అది 2024.. ఐపీఎల్ సీజన్.. హైదరాబాద్, లక్నో జట్లు పోటీ పడుతున్నాయి. లక్నో విధించిన లక్ష్యాన్ని హైదరాబాద్ ప్లేయర్లు అత్యంత సునాయాసంగా చేదించారు.. లక్నో బౌలర్ల బౌలింగ్ మొత్తాన్ని తీసి అవతలపడేశారు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత దారుణమైన ఓటమిది.

నాటి మ్యాచ్ ను లక్నో జట్టు ఓనర్ సంజీవ్ గో ఇంకా వీక్షించాడు. తమ జట్టు ప్లేయర్లు అలా ఆడుతున్న విధానాన్ని చూసి బాధపడ్డాడు. కాకపోతే ఆ బాధను అతడు మనసులో దాచుకోలేకపోయాడు. తన పక్కనే ఉన్న కెప్టెన్ కే ఎల్ రాహుల్ మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలా ఆడితే ఎలా అంటూ మండిపడ్డాడు. అసలే సున్నిత మనస్కుడైన కేఎల్ రాహుల్ తదుపరి మ్యాచ్ దూరమయ్యాడు. అంతేకాదు, ఆ సీజన్ నుంచి లక్నో జట్టు నుంచి తప్పుకున్నాడు. ఆ తదుపరి సీజన్లో అతడు ఢిల్లీ జట్టుకు మారిపోయాడు. ఢిల్లీ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. గోయంక తీరు వల్ల అతడు తట్టుకోలేక బయటకు వెళ్లిపోయినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనిపై రాహుల్ ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

రాహుల్ ఢిల్లీకి వెళ్లిపోయిన తర్వాత రిషబ్ పంత్ ను గోయంక ఢిల్లీ జట్టు నుంచి తీసుకున్నాడు. అతడికి సారధిగా బాధ్యతలు అప్పగించాడు. అతడికి ఏకంగా 27 కోట్లు చెల్లించాడు.. అంతేకాదు వచ్చే పదిహేను సంవత్సరాల లో రిషబ్ పంత్ 5 ట్రోఫీలు గెలిచి.. ధోని, రోహిత్ పక్కన నిలుస్తాడని గోయంక వ్యాఖ్యానించాడు. కానీ రెండు సీజన్లు కూడా పంత్ నాయకుడిగా ఉండలేకపోయాడు. ఈ సీజన్లో దారుణంగా ఆట తీరు ప్రదర్శించిన నేపథ్యంలో పంత్ జట్టు సారధిగా తప్పుకున్నాడు.

సంజీవ్ తీసుకొచ్చిన ఒత్తిడి వల్లే అతడు సారధిగా తప్పుకున్నాడని వార్తలు వస్తున్నాయి. విపరీతమైన ఒత్తిడి పెంచడం.. ప్రతి మ్యాచ్లో గెలవాలి అని కోరుకోవడం.. ఐపీఎల్ ట్రోఫీ సాధించాలని పదేపదే నిర్దేశించడంతో పంత్ ఇబ్బందిపడ్డాడని.. అందువల్లే జట్టు సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడని స్పోర్ట్స్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గోయంక లక్నో జట్టు యజమానిగా ఉన్నంతవరకు ఆ జట్టులో ఎవరూ ఆడేందుకు ముందుకు రారని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు..

పెద్ది రిజల్ట్ తేడా కొడితే ఈ ఇద్దరు కోలుకోవడం కష్టమేనా..?

Ram Charan Peddi
Ram Charan Peddi

Ram Charan Peddi: రామ్ చరణ్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంతకుముందు చేసిన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. గత సంవత్సరం చేసిన ‘గేమ్ చేంజర్’ మూవీ ఆశించిన మేరకు సక్సెస్ ని సాధించపోవడంతో ఆయన మార్కెట్ కొంత వరకు తగ్గింది. ఇక ఎలాగైనా సరే పెద్ది సినిమాతో తను భారీ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే ఈ సినిమా అద్భుతంగా వచ్చినప్పటికి ఇందులో కొన్ని ఎమోషన్స్ మిస్ అవుతున్నాయి అంటూ ఫిలిం నగర్ సర్కిల్ నుంచి కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి…నిజానికి సినిమా సక్సెస్ అయితే పర్లేదు కానీ ఒకవేళ సినిమా తేడా కొడితే మాత్రం ఇద్దరి కెరియర్లు రిస్కు లో పడే ప్రమాదం ఉంది. వాళ్లెవరూ అంటే ఒకరు రామ్ చరణ్ కాగా, మరొకరు బుచ్చిబాబు…ఎందుకంటే రామ్ చరణ్ తో పాటు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీర్లందరు భారీ విజయాలను సాధిస్తున్న క్రమంలో రామ్ చరణ్ మాత్రం పాన్ ఇండియాలో సోలో హీరోగా 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా ఒక్కటి కూడా చేయలేదు…

అందువల్లే ఆయన చాలావరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక బుచ్చిబాబు ‘ఉప్పెన’ సినిమా తర్వాత డైరెక్ట్ గా రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఆయనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడా? లేదా అనే ధోరణిలో కూడా ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు.

ఒకవేళ బుచ్చిబాబు సక్సెస్ ని సాధించకపోతే మాత్రం ఆయన కెరీర్ డీలా పడిపోయే అవకాశమైతే ఉంది. ఆయన వెనకాల సుకుమార్ ఉన్నాడనే కాన్ఫిడెంట్ తో రామ్ చరణ్ అతనికి సినిమా ఇచ్చాడు కానీ లేకపోతే మాత్రం రామ్ చరణ్ తనకి సినిమా ఇచ్చేవాడు కాదు.

ఇక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టాప్ డైరెక్టర్ గా మారుతాడా? లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. అయితే పెద్ది సినిమా రిజల్ట్ తేడా కొడితే మాత్రం బుచ్చిబాబు, రామ్ చరణ్ కెరియర్ల మీద భారీ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటూ సినిమా మేధావులు కామెంట్స్ చేస్తున్నారు…

కేఎన్ఆర్ జగన్ పిఏ కాదా? పొలిటికల్ అసిస్టెంటా?

Jagan PA Controversy
Jagan PA Controversy

Jagan PA Controversy: ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు కె. నాగేశ్వర్ రెడ్డి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రైవేట్ పిఎగా ఆయన ఉండేవారు. ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు తెలుసు. ఐదేళ్ల వైసిపి పాలనలో జగన్ వెంట నిత్యం కనిపించే వారు కూడా. అయితే ఇప్పుడు ఆయన మద్యం కుంభకోణం కేసులో నిందితుడు. తనిఖీల్లో ఆయనకు సంబంధించి వందల కోట్ల అక్రమాస్తులు బయటపడ్డాయి. ఆయన చూస్తే ఓ సాధారణ ఉద్యోగి. కానీ సంపాదన చూస్తే వందల కోట్లలో కనిపించింది. దీంతో ఆయన చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. అయితే ఇప్పుడు ఆయన జగన్ పిఏ కాదు అని సాక్షి మీడియాలో ఒక కథనం వచ్చింది. ఒక పొలిటికల్ అసిస్టెంట్ గా అందులో పేర్కొన్నారు. అయితే ఆయన పిఏ అని అందరికీ తెలుసు. ఆ మాట చెప్పేందుకు ఇప్పుడు ఆ సెక్షన్ మీడియా ముందుకు రావడం లేదు.

* సూరీడును కాదనుకొని..
నాగేశ్వర్ రెడ్డి వ్యక్తిగత పీఏగా జగన్మోహన్ రెడ్డికి సేవలు అందించారు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి కి సూరీడు మాదిరిగా అన్నమాట. దాదాపు ఆరు సంవత్సరాల పాటు సీఎం వద్ద వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న సూరీడు బాగానే వెనుకేసుకున్నారు. భారీ స్థాయిలో సంపాదించుకున్నారు. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్లను సైతం శాసించారని అప్పట్లో ఒక ప్రచారం ఉండేది. అక్రమంగా భారీగా సంపాదించారని కూడా ఆరోపణలు ఉన్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి సూరీడును దూరం పెట్టారు. నాగేశ్వర్ రెడ్డిని దగ్గరకు చేర్చుకున్నారు. వాస్తవానికి నాగేశ్వర్ రెడ్డి సాక్షిలో ఒక చిరుద్యోగి ఆట. ఆయన కుటుంబం ఒక టిఫిన్ దుకాణం నడుపుకునేదట. అటువంటి నాగేశ్వర్ రెడ్డి గత ఐదేళ్లలో వందల కోట్ల ఆస్తులకు పడగలెత్తడం ఏమిటనేది ఇప్పుడు ప్రశ్న.

* తీవ్ర మనస్థాపం..
అయితే ఇన్నాళ్లు జగన్మోహన్ రెడ్డికి సేవలు అందించారు. చాలా నమ్మకస్తుడిగా ఉండేవారు. ఇప్పుడు ఉన్నట్టుండి నాగేశ్వర్ రెడ్డి అంటే ఎవరు అన్నట్టుగా వ్యవహరిస్తుండడంతో ఆయన బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వందల కోట్ల బినామీ ఆస్తులతో అడ్డంగా బుక్కైన ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్నారని బయట ప్రచారం నడుస్తోంది. ఆయన అప్రూవర్ గా మారే అవకాశం ఉన్నట్లు కూడా ఒక టాక్ అయితే మాత్రం బయటకు వచ్చింది. అందుకే జగన్మోహన్ రెడ్డి తో పాటు అనుకూల మీడియా స్వరం పూర్తిగా మారిపోయింది. సాక్షిలో ఏకంగా కేఎన్ఆర్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి పీఏ కాదని.. పొలిటికల్ అసిస్టెంట్ మాత్రమేనని చెప్పడం చూస్తుంటే మాత్రం దీని వెనుక ఉన్న అసలు నిజం బయటకు తెలిసిపోతోంది.

వెంకటేష్ చేయాల్సిన ఈ మూడు సినిమాలను చిరంజీవి, బాలయ్య, నాగార్జున చేశారా..?

Venkatesh
Venkatesh

Venkatesh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇక ఇప్పటివరకు తన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలతో మరింత ముందుకు సాగాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్ కి రప్పించిన ఘనత కూడా తనకే దక్కుతుంది. సీనియర్ హీరోలందరిలో వెంకటేష్ టాప్ లెవెల్లో ముందుకు దూసుకెళ్తున్నాడు. కామెడీతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఫ్యామిలీ ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేస్తూ తను సినిమాలను చేస్తూ ఉంటాడు. అలాంటి వెంకటేష్ చేయాల్సిన ఒక మూడు సినిమాలను చిరంజీవి, బాలయ్య, నాగార్జున ముగ్గురు చేసి ప్లాప్ లను మూటగట్టుకున్నారనే విషయం మనలో చాలామందికి తెలియదు…ఇంతకీ ఆ సినిమాలు ఏంటంటే… చిరంజీవి హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో చేసిన ‘డాడీ’ సినిమా కథను మొదట వెంకటేష్ కోసం అనుకున్నారు. కానీ అది అనుకోకుండా చిరంజీవితో చేయాల్సి వచ్చింది. నిజానికి సినిమా ఓకే అనిపించినప్పటికి వెంకటేష్ తో చేసి ఉంటే సినిమా బాగా ఆడుండేదని వెంకటేష్ స్వయంగా చిరంజీవికి చెప్పారట.

ఈ విషయాన్ని చిరంజీవి ఒక ఈవెంట్లో బహిరంగంగా చెప్పడం వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కి నిదర్శనం అనే చెప్పాలి… ఇక బాలయ్య బాబు హీరోగా ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘గొప్పింటి అల్లుడు’ సినిమా మొదట వెంకటేష్ కోసం అనుకున్నారు.

కానీ వెంకటేష్ డేట్స్ లేకపోవడం వల్ల బాలయ్య బాబుతో చేయాల్సి వచ్చింది. అయితే ఆ సినిమాలో వెంకటేష్ కోసం మొదలు కామెడీ ట్రాక్ ని రాసుకున్నారు. కానీ బాలయ్య బాబు హీరో అవ్వడంతో ఆ ట్రాక్ మొత్తాన్ని చేంజ్ చేయడం వల్ల సినిమాలో సోల్ చెడిపోయి సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు…నాగార్జున హీరోగా కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘బావ నచ్చాడు’ సినిమా సైతం మొదట వెంకటేష్ తో చేయాలనుకున్నారు. కానీ ఈ మూవీ కూడా వెంకటేష్ చేయకపోవడంతో నాగార్జున దగ్గరికి వెళ్ళింది.

ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా ఎంగేజ్ చేయలేకపోయింది. మొత్తానికైతే విక్టరీ వెంకటేష్ చేయాల్సిన జానర్ లో ఈ ముగ్గురు హీరోలు సినిమాలను చేసి డిజాస్టర్ లను మూట గట్టుకున్నారు. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించాలంటే అది వెంకటేష్ వల్ల మాత్రమే అవుతుందని ఆయన ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు…

భారత్ లో ‘పాకిస్తాన్’ రివర్స్ దురంధర్ యాక్షన్.. వెలుగులోకి సంచలన నిజం

Pakistan Reverse Action
Pakistan Reverse Action

Pakistan Reverse Action: దురంధర్.. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా మన దేశంలో భారీగా వసూళ్లను సాధించింది. అంతేకాదు, మన దేశం మీద పాకిస్తాన్ సాగించిన దుర్మార్గాన్ని బయటపెట్టింది. భారతదేశానికి సంబంధించిన రా ఏజెంట్లు పాకిస్థాన్లో ఎలా ఉన్నారు.. దేశంలో అంతర్గత భద్రతను పెంపొందించడానికి వారు ఏ విధంగా కృషి చేస్తున్నారు.. ఉగ్రవాదులను వారు ఏ విధంగా అంతం చేస్తున్నారు.. అనే విషయాల మీద ఈ సినిమా రూపొందింది.

దురంధర్ సినిమాను పాకిస్తాన్ తీవ్రస్థాయిలో విమర్శించింది. కొంతమంది కూహాన లౌకికవాదులు కూడా మన దేశంలో ఉంటూ ఈ సినిమా గురించి చెత్త వాగుడు వాగారు. దురంధర్ సినిమా విడుదలైన తర్వాత పాకిస్తాన్ లో పరిస్థితులు మారిపోయాయి. బిచ్చగాళ్లను.. మతిస్థిమితం లేని వాళ్లను అక్కడి సర్కార్ అదుపులోకి తీసుకుంది. వారు ఏమైనా దురంధర్ల మాదిరిగా పనిచేస్తున్నారేమోనని అనుమానంతో ఇంటరాగేషన్ చేసింది. పాకిస్తాన్లో భారత్ తరఫున దురంధర్ల గురించి మనం సినిమాలో చూసాం. కానీ మనదేశంలో కూడా పాకిస్తాన్ రివర్స్ యాక్షన్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో మనదేశంలో జరుగుతున్న పరిణామాలు దీనికి బలం చేకూర్చుతున్నాయి.

పంజాబ్ రాష్ట్రంలో కొద్దిరోజుల క్రితం ఓ ఏఎస్ఐ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో అతడు చనిపోయాడని అందరూ అనుకున్నారు. కానీ పోలీసులు దర్యాప్తు జరిపితే అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు వ్యక్తులను ఢిల్లీలో పోలీసులు అరెస్ట్ చేస్తే దాని వెనుక ఉన్న అసలు కథ తెలిసింది. ఆ తర్వాత హర్యానాలో ఓ పోలీస్ స్టేషన్ మీద బాంబు దాడి జరిగింది. ఈ కేసును విచారించిన పోలీసులకు అసలు విషయం తెలిసింది.. ఢిల్లీలో పోలీసులు ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిని విచారిస్తే అసలు కథ తెలిసింది.. ఇక గురుదాస్ పూర్ ప్రాంతంలో ఇద్దరు పోలీసులు హత్యకు గురయ్యారు. ఈ కేసును విచారించిన పోలీసులకు అసలు కథ తెలిసింది.

మనదేశంలో జరిగిన వేరువేరు సంఘటనలలో పోలీసులు విచారణ సాగిస్తే తెలిసిన అసలు కథలలో ఉన్న సూత్రధారి పేరు షహజాద్ భట్టి. ఇతడు పాకిస్తాన్లో ఉంటాడు. మాఫియా డాన్.. మాదకద్రవ్యాలు.. అక్రమ ఆయుధాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. భారతదేశం అంటే విపరీతమైన ద్వేషాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు.

మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి.. దారుణాలు జరగడానికి సోషల్ మీడియాను.. ఆన్లైన్ వేదికలను ఉపయోగించుకుంటాడు. కొంతమంది వ్యక్తులను తనకు స్లీపర్ సెల్స్ గా మార్చుకున్నాడు. వారందరికీ కూడా టర్కీ ప్రాంతం నుంచి డబ్బులు సరఫరా చేస్తున్నాడు. ఇతడు భారతదేశంలో ఇంతవరకు అడుగుపెట్టలేదు. కానీ దురంధర్ మాదిరిగా భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి.. అసాంఘిక పనులు జరగడానికి.. ప్రజల్లో భయం దిగడానికి ఇతడు కారణమవుతున్నాడు. ఇతడు 17 దేశాల్లో తన కార్యకలాపాలు సాగిస్తున్నాడు. 300 మంది వ్యక్తులు ఇతడికి సహకారం అందిస్తున్నారు.. ఆమధ్య నేషలిస్ట్ కాంగ్రెస్ నాయకుడు బాబా సిద్ధికి హత్యకు గురయ్యాడు. ఆ కేసును పోలీసులు విచారిస్తే ఇతడి గురించి తెలిసింది..

ఇతడు కేవలం మాదకద్రవ్యాలు.. అక్రమ ఆయుధాల వ్యాపారం మాత్రమే కాదు, తెహరిక్ ఏ తాలిబన్ హిందుస్థాన్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. దీనిద్వారా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నాడు. హిజిబుల్ ముజాహిద్దీన్, లష్కరే ఏ తోయి బా వంటి సంస్థలను మించి ఉగ్రవాద కార్యకలాపాలు సాగించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది.. అయితే ఇతడిని అజ్ఞాత సాయుధ దళాలు అంతం చేసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే కొంతకాలంగా ఇతడి మీద అజ్ఞాత సాయుధ దళాలు దృష్టిపెట్టాయి. ఈ క్షణమైనా సరే ఇతడు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని జాతీయవాదులు చెబుతున్నారు.