ఎద అందాలతో చంపేస్తోన్న ‘దేవయానీ’
కాంగ్రెస్ గవర్నమెంట్ కు సెల్యూట్.. ఇలాంటి నిర్ణయాలే జనాల్లో నిలబెడతాయి
Kerala Menstrual Leave Policy: ఎంతసేపటికి పదవుల కోసం.. కాంట్రాక్టుల కోసం.. కమిషన్ల కోసమే పాకులాడుతుంటారు. నిత్యం పంచాయతీలు పెట్టుకుంటారు. ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకుంటారు. దుమ్మెత్తి పోసుకుంటారు. పదవుల విషయంలో రాజకీయాలు చేస్తుంటారు. పైరవీలు కొనసాగిస్తుంటారు.. ఇదిగో ఇలాంటి ప్రచారమే కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మీడియాలో.. సోషల్ మీడియాలో సాగుతూ ఉంటుంది.
అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా జనం కోణంలో ఆలోచిస్తుంటారు. తమకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటారు. అటువంటి నిర్ణయం ఇది. ఇటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు కచ్చితంగా అభినందించాలి.. భుజం తట్టి శభాష్ అని పొగడాలి.. ఇంతకీ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి.. ప్రజల జీవితాల్లో ఎలా మార్పు తీసుకొస్తుంది.. ఇంతకీ ఆ నిర్ణయం తీసుకోడానికి కారణం ఏంటి..
కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సతీషన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. వాస్తవానికి వేణుగోపాల్ కు ఆ పదవి రావాలి. కాకపోతే అనేక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు ఆ పదవి ఇచ్చారు. సతీషన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేరళ రాష్ట్రంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్కడ కౌమార అమ్మాయిలకు ప్రతినెలా మూడు రోజులపాటు రుతుక్రమ సెలవులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. 50 మందికి పైగా ఉద్యోగులు ఉన్న కార్యాలయాలలో క్వాలిటీ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నారు. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ఆరు నెలల పాటు ప్రసూతి సెలవులు అమలు చేయబోతున్నారు. అంతేకాదు పేదరికం తొలగించేందుకు.. అనాధలు లేని రాష్ట్రంగా మార్చేందుకు దత్తతలను ప్రోత్సహించబోతున్నారు. వాస్తవానికి ఇటువంటి నిర్ణయాలు గొప్పగా ఉండకపోవచ్చు. కానీ చాలామందిని ప్రభావితం చేస్తాయి.
ఆడవాళ్లకు ఆ మూడు రోజులు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో వారిలో రకరకాల సమస్యలు ఉంటాయి. అవి బయటకు చెప్పుకోలేరు. కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు మహిళా ఉద్యోగులు నరకం చూస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితిని గమనించి సెలవులు ప్రకటించడం
.. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని చెప్పడం నిజంగా గొప్ప విషయం. ఇది త్వరగా అమలులోకి వచ్చి.. కేరళ అమ్మాయిలకు, మహిళలకు రిలీఫ్ కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
ఆ ఒక్క సమస్య ను పరిష్కరించడంతో ఇండస్ట్రీ పెద్ద ఎవరో తెలిసిపోయింది...
Telugu Film Industry Issues: సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్కడికి వెళ్లి సాల్వ్ చేసుకోవాలనే విషయంలో ఇప్పటివరకు సరైన క్లారిటి రావడం లేదు. ప్రతి ఒక్కరు ఎవరి ప్రాబ్లం ని వాళ్ళు ఏదో రకంగా సొల్యూషన్ వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పర్ఫెక్ట్ సొల్యూషన్ ఏంటి అనే విషయంలో మాత్రం ఎవ్వరు సమాధానం చెప్పడం లేదు. ఇలాంటి క్రమంలోనే సింగిల్ స్క్రీన్స్ విషయంలో గత కొన్ని రోజులుగా వివాదాలు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే…నిజానికి పర్సంటేజ్ రూపం లో డబ్బులు చెల్లించకపోతే థియేటర్లు మూసేస్తాం అని ఎగ్జిబ్యూటర్లు వల్ల వాదనను వినిపించారు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ని చూపించాడు. మొత్తం తనే చూసుకుంటానని ఎవరు ఎలాంటి ఇబ్బందులను పడుతున్నారని దాని మీద ఒక సర్వేను నిర్వహించి ఎవరికి అన్యాయం జరగకుండా అందరికి న్యాయం జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోబోతున్నాం అంటూ చిరంజీవి స్వయంగా వాళ్ళందరికి చెప్పడంతో అందరూ సంతృప్తి చెందారు.
ప్రస్తుతానికైతే ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ ని మూసివేయడం లేదు. కాబట్టి రాబోయే సినిమాలకు చాలావరకు మంచి జరిగే అవకాశం ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకోవడం కాదు. ఇండస్ట్రీకి వచ్చిన సమస్యలను పరిష్కరించినప్పుడు మాత్రమే వాళ్ళ పెద్దరికం అనేది బయటపడుతుంది అంటూ మరి కొంతమంది ఇంకొంత మంది హీరోలను ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నారు.
మొత్తానికైతే చిరంజీవి ఇప్పటికి స్టార్ హీరో గానే కొనసాగుతున్నాడు. అయినప్పటికి ఆయన ఇండస్ట్రీలో ఉన్న కొన్ని సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుండటంతో ప్రతి ఒక్కరు చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా ఉంటే మరింత మందికి న్యాయం జరిగే అవకాశం ఉంటుందని వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…
ఇక ఏది ఏమైనా కూడా ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు తమ ప్రాబ్లంకి సొల్యూషన్స్ చూపించేవారు లేక చాలావరకు సఫర్ అవుతున్నారు. కానీ చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు అడుగు వేయడం వల్ల మరికొన్ని సమస్యలు కూడా అతని వద్దకు వచ్చే అవకాశం ఉంది. మరి వాటన్నింటిని పరిష్కరిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
ఐటీ జాబ్ మానేసి ఆటో నడుపుతోంది.. ప్రశాంతంగా బతుకుతోంది..
IT Employee Quits Job: ఉంటుందో లేదో తెలియదు. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఐదు అంకెల జీతం అన్న మాటే గాని.. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లాలి. రాత్రికి పగలుకు తేడా లేకుండా పనిచేయాలి. ఆరోగ్యం పాడైతే అంతే సంగతులు. పింకు స్లిప్ చేతిలో పెట్టి వెళ్లిపో అంటూ ఎగ్జిట్ చూపిస్తుంటారు. ఇది కొత్తకాలంగా ఐటీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న పరిస్థితి.
ఐటీ లో ఉన్న దారుణమైన పరిస్థితుల వల్ల చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇంకా కోల్పోతూనే ఉన్నారు. ఇంకా కొంతమంది అందులోనే పనిచేస్తూ ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు. నిరంతరంగా ఉండే పని ఒత్తిడి.. తలనొప్పి.. కార్పొరేట్ వ్యవహారాలు ఐటి ఉద్యోగులకు కుటుంబ సంబంధాలను దూరం చేస్తున్నాయి.. దీంతో వారు మర మనుషులుగా మారిపోతున్నారు. సంపాదన సంగతి దేవుడెరుగు. కుటుంబ బంధాలకు.. ఇతర వ్యవహారాలకు దూరమవుతున్నారు. దీనివల్ల వారి మీద ఒత్తిడి పెరిగిపోయి రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి.
ఇటువంటి పరిస్థితులు కొనసాగుతున్న ఐటీ కి ఇండస్ట్రీలో ఉప మహిళ తీసుకున్న డేరింగ్ స్టెప్ ఇప్పుడు అందరిని ఆలోచింపజేస్తుంది.. అంతేకాదు ఆమె తీసుకున్న నిర్ణయం చాలా గొప్పగా అనిపిస్తుంది. ఐటీ విభాగంలో పనిచేసిన ఆ మహిళ స్టోరీని ఓ మహిళా వ్యాపారవేత్త సామాజిక మాధ్యమాల వేదికగా వెలుగులోకి తీసుకొచ్చారు.
ఆ మహిళ దాదాపు 9 సంవత్సరాలు పాటు ఐతే ఇండస్ట్రీలో మేనేజర్ గా పని చేసింది. కార్పొరేట్ ప్రపంచంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. దానిని ఆమె అనుభవించింది. ఎంత పని చేసినా సరే ఇంకా ఒత్తిడి ఉంటున్న నేపథ్యంలో తట్టుకోలేక ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆ తర్వాత తను సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేసుకుంది.. ఒక ఆటోను పర్చేజ్ చేసింది. పురుషులతో పాటుగా తాను కూడా ఆటోను నడుపుతోంది. బిందాస్ గా నెలకు 60 వేలు వెనకేస్తోంది. గత ఉద్యోగంలో జీతం ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఇందులో ఒత్తిడి లేకుండా… సాఫీగా జీవితం సాగిపోతుందని… ఫ్యామిలీకి ఎక్కువగా సమయం కేటాయిస్తున్నట్టు ఆమె ప్రకటించింది. ఈమె చెప్పిన మాటలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి. ఐటీ ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చిన వారికి బయట చాలా అవకాశాలు ఉన్నాయని ఈమె చెప్పిన మాటల ద్వారా తెలుస్తోంది.
View this post on Instagram
పాకిస్తాన్ దెబ్బకు నరేంద్ర మోడీ తోక ముడిచాడా.. మీకో దండం రా అయ్యా
Narendra Modi Pakistan Debate: కుక్కకు సింహం లాంటి ఎలివేషన్ ఇస్తే ఎలా ఉంటుంది.. బురదలో దొర్లే పందిని సింహాసనం మీద కూర్చోబెడితే ఎలా ఉంటుంది.. పాకిస్తాన్ విషయంలో ఓవర్గం మీడియా చేస్తున్న అతి కూడా ఇలానే ఉంది. అసలే ఆ దేశానికి ఆర్థిక వనరులు లేవు. ప్రజల మీద విపరీతమైన ఒత్తిడి పెంచుతున్నారు. దారుణంగా పన్నులు వేస్తున్నారు. అప్పులు తీర్చే మార్గం లేక ఉన్న ఆ కాస్త ఫారెక్స్ నిల్వల నుంచి చెల్లిస్తోంది. యూఏఈ పాకిస్తాన్ దేశస్థులను తమ దేశం నుంచి వెళ్లగొడుతోంది. ఐఎంఎఫ్ బెల్ అవుట్ ఇవ్వకుండా పాకిస్తాన్ సహనాన్ని పరీక్షిస్తోంది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ మీద బీభత్సంగా దెబ్బ కొడుతోంది. చివరికి గల్ఫ్ దేశాలు కూడా పాకిస్తాన్ దేశాన్ని నమ్మడం లేదు.
ఉగ్రవాదులు కూడా అబ్రహం అకార్డ్స్ విషయంలో పాకిస్తాన్ పాలకులను బెదిరిస్తున్నారు. తిక్క తిక్కగా ప్రవర్తిస్తే చుక్కలు చూస్తారంటూ హెచ్చరిస్తున్నారు. అమెరికాతో అంట కాగితే ఖబర్దార్ అంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న పాకిస్తాన్ ఏ విధంగా బలమైన శక్తిగా ఎదుగుతోంది.. ఏ స్థాయిలో ఆ దేశానికి అనుకూలంగా అన్ని పరిస్థితులు ఉన్నాయి.. కానీ ఇవేవీ కొన్ని మీడియా సంస్థలకు పట్టవు. వాటికి కావాల్సింది కేవలం భారత వ్యతిరేకత. అందువల్లే పాకిస్తాన్ దేశాన్ని గొప్పగా కీర్తిస్తున్నాయి.
పుల్వామా ఎటాక్.. పహల్గామ్ దాడి భద్రతాపరమైన లోపాల వల్ల జరిగాయట.. అందులో ఉగ్రవాదుల దుర్మార్గం ఏదీ లేదట. పైగా వీటికి సాక్షాలను అంతర్జాతీయ సమాజం ముందు ఉంచడంలో భారత్ విఫలమైందట. అప్పట్లో కేరళలో జరిగిన సమావేశంలో పాకిస్తాన్ దేశాన్ని ప్రపంచం నుంచి ఒంటరి చేస్తామని నరేంద్ర మోడీ చేసిన ప్రకటన మీద నిలబడలేదట. పైగా ఇప్పుడు చైనా, అమెరికా పాకిస్తాన్ దేశానికి అండగా ఉంటున్నాయట. ఈ విషయంలో నరేంద్ర మోడీ ఏమి చేయలేకపోతున్నారట.
చైనా అనేది సామ్రాజ్యవాదం దేశం. అమెరికా అనేది సైతాన్ దేశం. ఈ రెండు దేశాలకు కేవలం వనరులు.. తాము చెప్పినట్టు ఆడించే వత్తాసు పాలకులు మాత్రమే కావాలి. అందువల్లే పాకిస్తాన్ దేశంతో ఇవి స్నేహం నటిస్తున్నాయి. ఒకవేళ ఇదంతా నిజమే అనుకుంటే ట్రంప్ ఎందుకు పాకిస్తాన్ లో పర్యటించడం లేదు.. చైనా అధ్యక్షుడు ఎందుకు పాకిస్తాన్ వెళ్లడం లేదు.. స్థూలంగా పాకిస్తాన్లో ఉన్న వనరులు ఈ రెండు దేశాలకు కావాలి. పైగా భారత్ మీద పెత్తనం సాగించాలని అమెరికాకు, డ్రాగన్ దేశానికి ఒక స్థావరం కావాలి. అందువల్లే పాకిస్తాన్ దేశంతో అవి స్నేహం నటిస్తున్నాయి.
ఒకసారి తేడా కొడితే పాకిస్తాన్ దేశాన్ని అవి ఏం చేయాలో అదే చేస్తాయి. చైనా అవసరం లేకుండా.. అమెరికాతో సంబంధం లేకుండా భారత్ ఏమైనా చేయగలుగుతుంది.. అది పాకిస్తాన్ వల్ల అవుతుందా.. అమెరికా దయ లేకపోతే.. చైనా బిచ్చం వెయ్యకపోతే పాకిస్తాన్ బతికే పరిస్థితి లేదు.. చివరికి చీనాబ్ నది నుంచి నీళ్లు వదలకపోతే పాకిస్తాన్ ఎడారి అవుతుంది.. ఇన్ని తెలిసిన కూడా మీడియా సంస్థలు పాకిస్తాన్ దేశానికి అనుకూలంగా రాస్తున్నాయి అంటే ఇది మామూలు పైత్యం కాదు. ఎన్ని రకాల మందులు వాడినా ఇది తగ్గదు.
క్లెయిమ్ కాని ఆస్తులు పొందాలని అనుకునే వారికి గుడ్ న్యూస్..
Unclaimed assets claim process: బ్యాంకుల్లోని సేవింగ్స్ ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇన్సూరెన్స్ పాలసీలు, మ్యూచువల్ ఫండ్స్ , కంపెనీల షేర్ల రూపంలో వేల కోట్ల రూపాయలు ఎవరూ క్లెయిమ్ చేయకుండా నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా ఇలా క్లెయిమ్ చేయని ఆస్తుల విలువ దాదాపు లక్ష కోట్ల రూపాయలకు పైమాటేనని అంచనా. యజమానులు మరణించడం, మర్చిపోవడం లేదా నామినీ వివరాలు సరిగ్గా లేకపోవడం వంటి కారణాల వల్ల ఈ డబ్బు అనాథగా మారిపోయింది. ఇలాంటి నిధులు అక్రమాలకు తావులేకుండా, సంబంధిత వారసులకు లేదా కుటుంబీకులకు అందజేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ చర్యల ద్వారా వారసులు తమ పూర్వీకుల ఆస్తులను ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు. అదెలాగంటే?
సామాన్యుల సొమ్మును వారికి చేరవేసే ప్రక్రియను సులభతరం చేయడానికి, కేంద్ర ప్రభుత్వం ‘మీ డబ్బు, మీ హక్కు’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా https://www.unclaimedassetsportal.in/ అనే అధీకృత పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. దేశంలోని వివిధ ఆర్థిక సంస్థల వద్ద పేరుకుపోయిన క్లెయిమ్ చేయని ఆస్తులను ఒకే చోట వెతికేందుకు, వాటిపై హక్కును క్లెయిమ్ చేసేందుకు ఈ వెబ్సైట్ ఒక వేదికగా పనిచేస్తుంది. ఇది డిజిటల్ ఇండియాలో భాగంగా ఆర్థిక పారదర్శకతను పెంచేందుకు తీసుకున్న అత్యంత కీలకమైన అడుగు.
ఈ పోర్టల్ ద్వారా నిధుల వివరాలను తెలుసుకోవడం చాలా సులభం. వినియోగదారులు లేదా వారసులు తమ వ్యక్తిగత వివరాలు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వంటి పత్రాలతో పోర్టల్లో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత, వివిధ సంస్థల డేటాబేస్ల ద్వారా సదరు ఆస్తులు ఎక్కడ ఉన్నాయో వెతికే సదుపాయం ఉంటుంది. ఒకవేళ మీ కుటుంబ సభ్యులకు చెందిన డబ్బు లేదా ఆస్తులు క్లెయిమ్ చేయబడకుండా ఉంటే, మీరు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించి, వాటిని వెనక్కి పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
క్లెయిమ్ చేయని ఆస్తుల గుర్తింపు మరియు బదిలీ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా, లక్షలాది కుటుంబాలకు ఆర్థిక ఊరట లభించనుంది. ముఖ్యంగా మధ్యతరగతి మరియు దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఎంతో ప్రయోజనకరం. ఈ పోర్టల్ ప్రారంభం కావడం వల్ల, ఏళ్లుగా మూలపడి ఉన్న డబ్బు తిరిగి ఆర్థిక వ్యవస్థలోకి రావడంతో పాటు, వారసులకు వారి హక్కులు లభిస్తాయి. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తమ కుటుంబ ఆస్తుల వివరాలను ఒకసారి సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
వైభవ్ సూర్యవంశీ.. ఎవరెస్టంత ఎత్తుకు ఎదిగిపోయాడు
Vaibhav Suryavanshi success story: ఆ మధ్య ఐపీఎల్ లీగ్ మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ వీరవిహారం చేశాడు. సూపర్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం మైదానంలోకి లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ వచ్చారు. ఆయనను చూడగానే వైభవ్ సూర్యవంశీ మరోమాటకు తావు లేకుండా పాదాలకు నమస్కరించారు. ముగ్ధుడైపోయిన సునీల్ గవాస్కర్ అతడిని తన చేతులతో పైకి లేపి లగేరహో భేటా అంటూ ఆశీర్వదించారు.
వైభవ్ సూర్యవంశీలో ఈ గుణమే ఇప్పుడు అందరికీ నచ్చుతోంది. ధోని నుంచి విరాట్ వరకు అందరూ అతడిని మెచ్చుకుంటున్నారు. సెహ్వాగ్ అయితే ఏకంగా తాను ఒక ఫ్రాంఛైజీ కి ఓనర్ అయితే అతడికి ఏకంగా 30 కోట్లు ఇస్తానని ప్రకటించాడు. ఇంత వరకు ప్రపంచ లీగ్ చరిత్రలో ఏ ఆటగాడికి కూడా ఆ స్థాయిలో ధర లభించలేదు. సెహ్వాగ్ మాటలను బట్టి సూర్యవంశీ ఆట తీరు. అతడి కి పెరిగిన మార్కెట్, అతడి వ్యాల్యూ అర్థం చేసుకోవచ్చు.
మైదానం ప్రత్యర్థి బౌలర్ల మీద సూర్యవంశీ విరుచుకుపడతాడు. దయాదాక్షిణ్యం లేకుండా కొట్టేస్తుంటాడు. అతడి ఆటతీరు చూస్తుంటే తోపు బౌలర్లకు సైతం చెమటలు పడుతుంటాయి. గుజరాత్ జట్టుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో సూర్యవంశీ ఒక్కడే జట్టు భారాన్ని మోసిన తీరు..అతడు ఒక్కడే అన్ని పరుగులు చేసిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే.
మైదానంలో వీరవిహారంచేసే వైభవ్ సూర్యవంశీ..పెద్దలతో మాత్రం గొప్పగా నడుచుకుంటాడు. గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీతో ఫొటోలు దిగేందుకు చాలామంది పోటీపడ్డారు. ఇందులో ప్రముఖులు కూడా ఉన్నారు. వారందరి దగ్గరనుంచి సూర్యవంశీ ఆశీర్వాదం తీసుకున్నాడు. అతడి ముఖంలో అసహనం కనిపించలేదు. చిరాకు కనిపించలేదు. ఎంతో ఉత్సాహంగా కనిపించాడు. ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలని సూర్యవంశీ నిరూపించాడు.
वैभव सूर्यवंशी मैच के पहले दौड़कर आए, सुनील गावस्कर और संजय बांगड़ के पैर छूकर आशीर्वाद लिया।
जतिन सप्रू का भी पैर छूने बढ़े तो जतिन तेजी से पीछे हट गए।
इतना बड़ा नाम कमाने के बाद भी घमंड ना आना ही व्यक्ति को महान बनाता है। pic.twitter.com/HogEfjhIaD
— Shubham Shukla (@Shubhamshuklamp) May 27, 2026
స్పిరిట్ లో ప్రభాస్ బ్రదర్ గా సందీప్ రెడ్డి వంగ కనిపించబోతున్నాడా.. ఇక రచ్చ రచ్చే..
Spirit movie Prabhas brother role: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ప్రభాస్ లాంటి నటుడు సైతం పెను సంచలనాలను క్రియేట్ చేసే సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే పెను సంచలనాలను క్రియేట్ చేయాలని 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, హీరో ప్రభాస్ ఇద్దరు చాలా కసిగా ఉన్నారు. అయితే ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే ఉందట. ప్రభాస్ బ్రదర్ గా నటించే ఒక పాత్రలో సందీప్ రెడ్డివంగా నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. నిజానికి సందీప్ రెడ్డివంగా ను చూడగానే ఒక రఘుడ్ లుక్ తో, బేస్ వాయిస్తూ వేసుకొని ఉంటాడు కాబట్టి ఆయన మాటలకే చాలా మంది భయ పడిపోతుంటారు.
మరి అలాంటి ఒక వ్యక్తి ఈ సినిమాలో చిన్న నెగెటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ లో నటించబోతున్నాడు అనే వార్త తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళు చేసే సినిమాల విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేయాల్సిన అవసరమైతే ఉంది.
ఇక దాంతో పాటుగా సందీప్ రెడ్డివంగా ఈ సినిమాలో నటిస్తున్నాడు అంటే ఆయన చాలా వరకు క్లారిటిని మైంటైన్ చేయాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వస్తున్న సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి…ఈ సినిమాలో సందీప్ నటిస్తే నిజంగానే అదొక వండర్ గా నిలిచిపోతుంది.
నిజానికి ఆయన చాలా మంచి నటుడని ఆయనతో వర్క్ చేసిన చాలా మంది చెబుతుంటారు. కానీ స్క్రీన్ మీద మనం ఎప్పుడు చూడలేదు. ఒకవేళ ప్రభాస్ పక్కన మనం ఆయన్ని చూసినట్లయితే ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ ఇద్దరు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
దాసరి సమాధికి ఇలాంటి దుస్థితి రావడమా..? హీరోలు దర్శకులు ఏం చేస్తున్నారు..
Dasari Narayana Rao memorial condition: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని పెంచిన వాళ్ళలో దాసరి నారాయణరావు ఒకరు… వైవిధ్యభరితమైన సినిమాలను చేస్తూ ఇప్పుడున్న చాలామంది స్టార్ హీరోలకు తన సినిమాల్లో అవకాశాలను ఇచ్చి వాళ్ళని స్టార్లుగా తీర్చిదిద్దిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం… అలాంటి దిగ్గజ దర్శకుడు 2017 మే 30వ తేదీన మరణించారు. ఇక ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి దగ్గరికి వెళ్లి నివాళులు అర్పించాలి అనుకున్న వారికి ఒక చేదు అనుభవమైతే ఎదురైంది. దాసరి నారాయణ రావు ఆయన భార్య పద్మ సమాధులను ఒకే చోట పెట్టారు. అయితే దానిని అప్పటినుంచి ఇప్పటివరకు పట్టించుకునే నాధుడు కూడా లేకపోయాడు. తన కుటుంబ సభ్యులు కూడా ఆ సమాధులను పట్టించుకోవడం లేదంటూ చాలావరకు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలను అందించి ఎంతో మంది నటులను, దర్శకులను వెలుగులోకి తీసుకొచ్చిన దాసరి నారాయణరావు సమాధిని ఎవ్వరు పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం అనే చెప్పాలి. ఆయన సమాధి చుట్టూ పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం పేరుకుపోయిన కనీసం వాటిని క్లీన్ చేసే నాధుడు కూడా లేకపోయాడు.
ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న మంచి మనోజ్ వెంటనే తనతో పాటు తన మనుషులను తీసుకొచ్చి దాని చుట్టూ క్లీన్ చేయించాడు. కొంతమంది మనుషులను పంపించి వాటిని క్లీన్ చేయాలని చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే దాసరి నారాయణరావు ఇండస్ట్రీ పెద్దగా కూడా కొన్ని సంవత్సరాల పాటు వ్యవహరించారు. ఎన్నో సినిమాలకు ఆయన మార్గదర్శి గా మారాడు.
అలాగే కొంతమంది ని ఆదుకోవడంలో కూడా ఆయన చాలావరకు హెల్ప్ చేశాడు. ఇండస్ట్రీలో ఎలాంటి సమస్య ఎవరికి ఎదురైనా కూడా దానిని పరిష్కరించడంలో ఆయన ముందు వరుసలో ఉండేవారు… అలాంటి దాసరి నారాయణరావు గారిని చనిపోయిన తర్వాత కనీసం పట్టించుకునే వారు కూడా లేరు. చాలా మంది స్టేజ్ ఎక్కి నాకు దాసరి గారు లైఫ్ ఇచ్చారు అని చెబుతుంటారు. కానీ ఆయనసమధి దగ్గరికి వచ్చి నివాళులు అర్పించే వారు మాత్రం కరువయ్యారు…
ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్తుంది…మన ముందు తరం వాళ్ళను గౌరవించుకోవడం మన బాధ్యత…ఇప్పుడు ఇండస్ట్రీ లో ఉన్న హీరోలు దర్శకులు ఒకప్పుడు దాసరి లాంటి దిగ్గజ దర్శకులు చేసిన సినిమాలను చూసే ఇండస్ట్రీ లోకి వచ్చారనే విషయాన్ని ఇప్పుడున్న గుర్తుంచుకుంటే మంచింది. లేకపోతే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు సైతం మిమ్మల్ని మర్చిపోయే అవకాశం ఉంది…
యూఎస్ యూటర్న్.. గ్రీన్ కార్డ్ ఆశావహులకు బిగ్ రిలీఫ్
US green card latest update: అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడాలనుకునే వారు అక్కడి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తారు. అయితే ట్రంప్ ప్రభుత్వం ఇటీవల గ్రీన్కార్డు జారీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆ నిర్ణయాన్ని యూఎస్ మళ్లీ వెనక్కి తీసుకుంది. దీంతో అమెరికాలో స్థాయి నివాసం (పర్మనెంట్ రెసిడెన్సీ) కోసం ఎదురుచూస్తున్న వేలాది వలసదారులు, ముఖ్యంగా భారతీయులు ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. మొదటి ప్రకటనలో గందరగోళం ఉండడంతో యూఎస్ అధికారులు స్పష్టమైన వివరణ ఇచ్చి పరిస్థితిని సాధారణపరచారు.
ఆందోళన ఎందుకు?
గత వారం వచ్చిన కొన్ని నివేదికలు గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లి అక్కడి నుంచే ప్రక్రియ పూర్తి చేయాలని సూచించాయి. దీంతో హెచ్–1బీ వీసాలపై పని చేస్తున్న వృత్తిపరులు, వారి కుటుంబాలు తీవ్ర అనిశ్చితికి లోనయ్యారు. ఎన్నో సంవత్సరాలుగా అమెరికాలోనే ఉండి, ఉద్యోగాలు చేస్తున్న వారికి ఇది పెద్ద ఆందోళన కలిగించింది.
తాజాగా మార్పు..
హోమ్ల్యాండ్ సెక్యూరిటీ శాఖ స్పష్టం చేసినట్లు, చాలా మంది దరఖాస్తుదారులపై ఎలాంటి పెద్ద మార్పు రాదు. ప్రతీ కేసును వ్యక్తిగతంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని, అనేక మంది అమెరికాలోనే ఉండి ప్రక్రియ కొనసాగించవచ్చని తెలిపారు. ఇది కేవలం కొన్ని ప్రత్యేక సందర్భాలకు మాత్రమే వర్తింపజేయబడుతుందని అధికారులు వివరించారు.
ఎవరికి ప్రయోజనకరం?
భారతీయ సాంకేతిక నిపుణులు హెచ్–1బీ వీసా హోల్డర్లు, వారి కుటుంబాలు ప్రధాన లబ్ధిదారులు. వారి ఉద్యోగాలు, జీవనం అంతరాయం లేకుండా కొనసాగడానికి ఈ స్పష్టత సహాయపడుతుంది. టెక్ రంగం సహా వివిధ రంగాల్లోని యజమానులు నైపుణ్యం కలిగిన ఉద్యోగులను కోల్పోయే భయం నుంచి బయటపడ్డారు. దీర్ఘకాలిక అనిశ్చితి తొలగి, స్థిరత్వం వైపు అడుగులు వేయడానికి మార్గం సుగమమైంది.
వలసదారులకు ఊరట..
అమెరికా యూటర్న్ వలస విధానాల్లో ఆచరణాత్మకతను ప్రతిబింబిస్తుంది. ఒకవైపు కఠిన నిబంధనలు విధించాలనే ఉద్దేశం ఉన్నా, ఆర్థిక వ్యవస్థకు అవసరమైన నైపుణ్యం కలిగిన వలసదారులను కోల్పోవడం దేశం ఇష్టపడదు. ఫలితంగా, వ్యక్తిగత కేసుల పరిశీలనపై ఎక్కువ ఆధారపడటం ద్వారా సమతుల్య విధానాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఇది పూర్తి స్థిరత్వం కాదు. గ్రీన్ కార్డ్ వేచి ఉండే సమయం ఇంకా ఎక్కువగా ఉండటం, బ్యాక్లాగ్ సమస్యలు కొనసాగుతున్నాయి. కాబట్టి దరఖాస్తుదారులు ఎప్పటిలాగే అప్రమత్తంగా ఉండి, తాజా అప్డేట్లను గమనించాలి.
తాజా పరిణామం వలసదారుల్లో నమ్మకం కొంత మెరుగుపరిచినప్పటికీ, దీర్ఘకాలిక పరిష్కారాల కోసం అమెరికా వలస వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు అవసరమని స్పష్టం చేస్తోంది.
ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడానికి కారణం ఇదే..
Why Pumpkin is hung in front of House: భారతీయ సంస్కృతిలో ప్రతి ఆచారానికి ఒక ప్రత్యేకమైన అర్థం, అంతరార్థం ఉంటుంది. అలాంటి సంప్రదాయాల్లో ఇంటి ముంగిట గుమ్మడికాయ కట్టడం కూడా ఒకటి. కొత్త ఇల్లు నిర్మించినప్పుడు, దుకాణం లేదా వ్యాపార సంస్థ ప్రారంభించినప్పుడు, గృహప్రవేశం వంటి శుభకార్యాల సమయంలో గుమ్మడికాయను కట్టి వేలాడదీయడం దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న ఆచారం. ఇది కేవలం మూఢనమ్మకం కాదని, దాని వెనుక ఆధ్యాత్మిక విశ్వాసాలతో పాటు కొన్ని శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని పెద్దలు చెబుతుంటారు. అవేంటో చూద్దాం..
హిందూ సంప్రదాయం ప్రకారం.. కొత్తగా నిర్మించిన ఇల్లు, కొత్త వ్యాపారం లేదా శుభకార్యం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మంచి విషయాలను చూసినప్పుడు కొందరి అసూయ, ప్రతికూల ఆలోచనలు లేదా దృష్టిదోషం పడుతుందని పూర్వీకులు విశ్వసించేవారు. అందుకే ఆ ప్రతికూల శక్తులను ఇంటి లోపలికి రానీయకుండా గుమ్మడికాయను గుమ్మానికి కట్టేవారు. దీనివల్ల దృష్టి గుమ్మడికాయపై పడుతుందని, ఇల్లు లేదా వ్యాపారంపై పడే ప్రతికూల ప్రభావం తగ్గుతుందని నమ్మకం.
వాస్తు శాస్త్రంలో గుమ్మడికాయను శుభప్రదమైన వస్తువుగా భావిస్తారు. ఇది నెగెటివ్ ఎనర్జీని గ్రహించి, పరిసరాల్లో సానుకూల శక్తిని పెంచుతుందని చెబుతారు. ముఖ్యంగా తెల్ల గుమ్మడికాయ లేదా బూడిద గుమ్మడికాయను కట్టడం ద్వారా ఇంటిలో ప్రశాంతత, ఐశ్వర్యం, శ్రేయస్సు పెరుగుతాయని వాస్తు నిపుణులు పేర్కొంటారు.
పురాణాల్లో గుమ్మడికాయను పవిత్రతకు, సంపూర్ణతకు ప్రతీకగా పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో దానిని దేవతారాధనలో కూడా ఉపయోగిస్తారు. యజ్ఞాలు, హోమాలు ముగిసిన తర్వాత గుమ్మడికాయను బలి ప్రతీకగా సమర్పించే ఆచారం కూడా ఉంది. అందువల్ల గుమ్మడికాయ చెడు శక్తులను దూరం చేసే సాధనంగా భావించబడింది.
పూర్వకాలంలో నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత ఇంటి చుట్టూ ధూళి, వ్యర్థాలు ఎక్కువగా ఉండేవి. గుమ్మడికాయ త్వరగా కుళ్లే స్వభావం కలిగి ఉండటంతో దానిపై ఈగలు, పురుగులు చేరేవి. ఫలితంగా అవి ఇంటి లోపలికి కాకుండా బయటే కేంద్రీకృతమయ్యేవని కొందరు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇంటి పరిశుభ్రత కొంతవరకు కాపాడబడేదని భావిస్తారు.
గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లో నివసించే వారికి ఒక రకమైన భద్రతా భావన కలుగుతుంది. “మన ఇంటిని చెడు ప్రభావాల నుంచి రక్షించే చర్య చేశాం” అనే సానుకూల ఆలోచన మానసికంగా ధైర్యాన్ని ఇస్తుంది. ఈ విశ్వాసం కుటుంబ సభ్యుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో గుమ్మడికాయకు బదులుగా నిమ్మకాయలు, మిరపకాయలు లేదా ఇతర వస్తువులను కూడా కడతారు. అయితే వాటి ఉద్దేశం మాత్రం ఒకటే. ప్రతికూల శక్తులను దూరం చేసి, శుభఫలితాలను ఆహ్వానించడం. కొన్ని ప్రాంతాల్లో గుమ్మడికాయపై ముఖం ఆకారాన్ని గీసి వేలాడదీయడం కూడా కనిపిస్తుంది.
















