Rupee fall against Dollar: వందకోట్లకు మించిన జనాభా.. సుస్థిరమైన ప్రభుత్వం.. విలువైన మానవ వనరులు..అంతకుమించి పని చేసే సత్తా ఉన్న వ్యక్తులు.. ఇన్ని అనుకూలతలున్నప్పటికీ భారత్ ఇబ్బందిపడుతోంది. ఎదిగే క్రమంలో బొక్కాబోర్లాపడుతోంది. మన కరెన్సీ రూపాయి విలువ దారుణంగా పడిపోతోంది. ఇది సరిపోదన్నట్టు ఇప్పుడు స్టాక్ మార్కెట్ వ్యాల్యూ కూడా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
యుద్దం, డాలర్ విలువ పెరిగిపోవడం, ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, కొనుగోళ్లలో ఆటుపోట్లు ఇవన్నీఅంతర్జాతీయంగా రూపాయి విలువను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. రూపాయి విలువ కొంత కాలంగా దారుణంగా పడిపోతోంది. అంతేకాదు, జీవితకాల కనిష్టాన్ని చేరుకుని, పాలకులకు కన్నీరు మిగుల్చుతోంది. కరెన్సీ విలువ తగ్గిపోతున్న నేపథ్యంలో ఫారెక్స్ నిల్వల మీద విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది.
రూపాయి విలువ ఈస్థాయిలో పతనమవుతుంటే.. స్టాక్ మార్కెట్ కూడా నేల చూపులు చూస్తోంది. ఇటీవల తైవాన్ స్టాక్ మార్కెట్ భారతదేశాన్ని వెనక్కి నెట్టింది. ఐదో స్థానానికి చేరుకుంది. తాజాగా ఆరోస్థానాన్ని దక్షిణ కొరియా సొంతం చేసుకుంది. ఏఐ జమానాలో సెమీ కండక్టర్లు, మెమొరీ పరికరాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. దీనికి తోడు సామ్ సంగ్, ఎస్ కే హైనిక్స్ కంపెనీల షేర్లు ర్యాలీ కొనసాగించాయి.
సౌత్ కొరియా ప్రమాణిక ఈక్విటీ సూచి కోస్పీలో సామ్ సంగ్ అత్యధిక వెయిటేజీ సాధించాయి. సామ్ సంగ్, ఎస్ కే హైనిక్స్ మోస్ట్ వ్యాల్యూడ్ కంపెనీలుగా నిలిచాయి. ఇవన్నీ కూడా లక్ష కోట్ల డాలర్ల జాబితాలో చేరాయి. సౌత్ కొరియా కంపెనీలు సెమీ కండక్టర్ల తయారీలో దూసుకుపోతున్నాయి. విపరీతమైన లాభాలను నమోదు చేస్తున్నాయి. అందువల్లే సౌత్ కొరియా కెనడా, జర్మనీ, యూకే, ఫ్రాన్స్ స్టాక్ మార్కెట్లను సైతం దాటేసింది.
మనదేశంలో చిప్ ల తయారీ అంతగా ఊపందుకోలేదు. సెమీకండక్టర్లకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. ఏఐ యుగంలో వీటికి విపరీతమైన డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు పండగ చేసుకుంటున్నాయి. అందువల్లే వీటి విలువ చూస్తుండగానే లక్షలకోట్లను దాటేస్తోంది. ఇది మార్కెట్ నిపుణులను ఆశ్యర్యానికి గురి చేస్తోంది.
















అటు పవన్ కు.. ఇటు కాంగ్రెస్కు.. ఇచ్చిపడేసిన కేటీఆర్..
KTR sensational comments: తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 30 నెలలు అయింది. హస్తం పార్టీపై రాష్ట్రంలో అసంతృప్తి పెరుగుతోంది. ముఖ్యంగా రైతు భరోసా విషయంలో రైతులు అసంతృప్తిగా ఉన్నారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం కూడా అన్నదాత ఆగ్రహానికి కారణమవుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) కాంగ్రెస్ 30 నెలల పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అభివృద్ధి గురించి ప్రశ్నించినప్పుడు ‘‘ఎంత కండలు తిరిగిన పెహల్వాన్ అయినా 3 నెలల్లో పిల్లలు పుట్టించలేడు’’ అని వ్యాఖ్యానించారు. దీనికి తీవ్ర స్పందన ఇచ్చిన కేటీఆర్ ‘‘సరే మరి 30 నెలలైనా పిల్లలు పుట్టకపోతే ఏమనాలి? మిమ్మల్ని ఏమని పిలవాలి? నపుంసకులు అనాలా?’’ అని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం రెండున్నరేళ్లలో కనీస ఫలితాలు కూడా ఇవ్వలేకపోవడాన్ని ఎండగట్టారు.
బంగారు తెలంగాణ సర్వనాశనం..
తెలంగాణను బంగారు పల్లెంలో పెట్టి ఇస్తే సర్వనాశనం చేశారని కేటీఆర్ మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిదని, కాంగ్రెస్ అధికారం చేపట్టాక ఆ పురోగతి నిలిచిపోయిందని ఆరోపించారు. 30 నెలలుగా ఒక్కటి కూడా గుర్తింపు తెచ్చే పని చేయలేదని విమర్శించారు. ఎన్నికల హామీలు నెరవేర్చడంలో విఫలమైందని తెలిపారు.
పవన్ కళ్యాణ్పై ఫైర్…
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ నిర్వహించాలనుకున్న సభ వివాదాస్పదమైంది. ఈ సంఘటనపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ విభజన సమయంలో పవన్ చూపిన వైఖరి ఇప్పుడు హైదరాబాద్లో సభ పెట్టడానికి సరిపోదన్నారు. గతంలో తెలంగాణ విభజనపై పవన్ తీసుకున్న ధోరణి, ప్రస్తుతం ఆవిర్భావ దినోత్సవం రోజున సభ పెట్టడంపై మండిపడ్డారు. తెలంగాణ 4 కోట్ల భూమిపుత్రుల జాగీర్ అన్నారు. ఉద్యమం ద్వారా సాధించిన విజయాన్ని ఎవరూ తమ రాజకీయ లాభం కోసం ఉపయోగించుకోకూడదని స్పష్టం చేశారు. కేటీఆర్ ఈ వివాదం ద్వారా తెలంగాణ గర్వాన్ని మళ్లీ రేకెత్తించి, తమ పార్టీని రీబ్రాండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఈ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభించిందనడంలో సందేహం లేదు. ఇది కేవలం వ్యక్తిగత విమర్శలకు మాత్రమే పరిమితం కాకుండా, తెలంగాణ గతం, వర్తమానం మరియు భవిష్యత్ మధ్య జరుగుతున్న సంభాషణగా మారింది. రాబోయే రోజుల్లో ఈ అంశం ఎలా మార్పులు తీసుకురాబోతోందనేది ఆసక్తికరంగా ఉంటుంది.
తాజా విమర్శల ద్వారా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిఫెన్స్లోకి నెట్టారు. తెలంగాణకు తామే బ్రాండ్ అంబాసిడర్లమని చెప్పకనే చెప్పారు. దీంతో ప్రభుత్వం తన 30 నెలల ప్రగతిని స్పష్టమైన గణాంకాలు, ఫలితాలతో నిరూపించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ వివాదం తెలంగాణ రాజకీయాల్లో మరింత ఉద్రిక్తతను సృష్టించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ తనను తాను ‘‘తెలంగాణ అభివృద్ధి రక్షకుడు’’గా ప్రదర్శించుకోవడానికి ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని చూస్తోంది.