Home Blog Page 141

'సింగీతం' మూవీ ట్విట్టర్ టాక్ ఇదే.. ఇలాంటి రివ్యూస్ వస్తాయని కలలో కూడా ఊహించలేదు..

Sing Geetham Movie Collections
Sing Geetham Movie Collections

Singeetham Movie Twitter Talk: టాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి , ఆరోజుల్లో తిరుగులేని స్టార్ డైరెక్టర్ పేరు తెచ్చుకున్న సింగీతం శ్రీనివాసరావు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒకే మూసలో వెళ్తున్న కమర్షియల్ సినిమా ఫార్మటు ని మార్చే ప్రయత్నం చేసిన లెజెండ్స్ లో ఆయన కూడా ఒకరు. ఆరోజుల్లో ఆయన తీసిన ‘ఆదిత్య 369’ గురించి ఇప్పటికీ మనం ఎంతో గొప్పగా మాట్లాడుకుంటున్నాం అంటే , ఆయన విజన్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆయనకు 94 ఏళ్ళు. ఈ వయస్సులో ఇంట్లో కదల్లేని పరిస్థితిలో కూర్చొని , కృష్ణా రామా అని అనుకుంటూ ఉంటారు. కానీ సింగీతం శ్రీనివాస రావు ఈ వయస్సులో కూడా నేటి తరం డైరెక్టర్స్ తో పోటీ పడి సినిమా తీయగలను అని నిరూపించాడు. ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ చిత్రం ‘సింగ్ గీతం’ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాకు ట్విట్టర్ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఈ విశ్లేషణలో చూద్దాం.

‘సింగ్ గీతం’ ఒక విభిన్నమైన సినిమా అని , స్క్రీన్ ప్లే లో అక్కడక్కడా స్లో గానే ఉంటుంది కానీ , కచ్చితంగా ఒకసారి థియేటర్ లో చూడదగ్గ సినిమా అని అంటున్నారు ట్విట్టర్ ఆడియన్స్. ఈ సినిమాని సింగీతం మ్యూజిక్ తోనే నడిపించడం ఒక సరికొత్త ప్రయోగమని , కానీ మధ్యలో కాస్త బోరింగ్ ఫీల్ ఇస్తుందని అంటున్నారు. ఇక కామెడీ కూడా అనేక సన్నివేశాల్లో పండింది అని, కానీ సినిమా కోర్ లైన్ సెకండ్ హాఫ్ లోనే ఉంటుందని. ఫ్లాష్ బ్యాక్ నుండి క్లైమాక్స్ వరకు ఎమోషనల్ సన్నివేశాలు అద్భుతంగా పండాయని అంటున్నారు. ఇక ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం వెన్నుముక లాంటిదని, ఈమధ్య కాలం లో ఆయన నుండి వచ్చిన బెస్ట్ వర్క్ ఇదేనని అంటున్నారు. ఇలాంటి కాన్సెప్ట్ ని నేటి తరం ఆడియన్స్ కి అందించాలనే ప్రయత్నం చేసినందుకు సింగీతం శ్రీనివాస రావు , వైజయంతి మూవీ మేకర్స్ కి సెల్యూట్ అని అంటున్నారు నెటిజెన్స్.

ఈ చిత్రం ప్రతీ ఒక్కరికి నచ్చే జానర్ అయ్యి ఉండకపోవచ్చు, కానీ ఈ సినిమా ఎమోషనల్ జర్నీ కచ్చితంగా థియేటర్స్ లో చూస్తూనే అద్భుతమైన అనుభూతి పొందగలం అంటూ చెప్పుకొచ్చారు ట్విట్టర్ ఆడియన్స్. ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే VFX షాట్స్ కాస్త బెటర్ గా ఉండుంటే బాగుండేది అనిపించింది అట. అంతే కాకుండా పాటల ఫార్మటు లో సినిమాని చెప్పించడం అందరి ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వకపోవచ్చు అని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ కూడా కాస్త స్లో గా అనిపించిందని , కొన్ని కామెడీ సన్నివేశాలు బలహీనంగా అనిపించాయని అంటున్నారు.

బంగ్లాదేశ్‌ సరిహద్దులో ఉద్రిక్తతలు.. చొరబాటుదారులను తరిమేస్తున్న ఈశాన్య రాష్ట్రాలు!

Bangladesh Border Tensions
Bangladesh Border Tensions

Bangladesh Border Tensions: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా వ్యవస్థ మరింత బలపడింది. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) సిబ్బంది చొరబాటుదారులను అడ్డుకోవడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా రావడానికి ప్రయత్నించేవారికి ఇబ్బందులు పెరిగాయి. సరిహద్దు వద్ద ఘర్షణలు, తరలింపు ప్రయత్నాలు, కంచె నిర్మాణం వంటి పరిణామాలు వేగంగా జరుగుతున్నాయి.

సరిహద్దు ఘర్షణలు..
బెంగాల్‌ ప్రభుత్వం అక్రమంగా ఉంటున్న వారిని బంగ్లాదేశ్‌కు పంపించే పనిని వేగంగా చేస్తోంది. అయితే బంగ్లాదేశ్‌ ప్రభుత్వం వారిని స్వీకరించడం లేదు. దీంతో సరిహద్దు వద్ద బీఎస్‌ఎఫ్‌తో ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు 20కి పైగా ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మరోవైపు కొత్తగా వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. కొందరు సరిహద్దు వద్ద కొన్ని రోజులు ఉండి, రాత్రిపూట రహస్యంగా బంగ్లాదేశ్‌ వైపు వెళ్తున్నారు.

4 వేల కిలోమీటర్ల సరిహద్దు..
భారత్‌–బంగ్లాదేశ్‌ మధ్య 4 వేల కిలోమీటర్లకుపైగా సరిహద్దు ఉంది. పశ్చిమ బెంగాల్‌తోపాటు మేఘాలయ, అస్సాం, మణిపూర్, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయి. వేలాది మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది ఈ సరిహద్దును కాపాడుతున్నారు. సిక్కిం, అస్సాం, మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. మేఘాలయలో నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ అధికారంలో ఉంది. మిజోరాం ప్రభుత్వం కూడా చొరబాట్లను వ్యతిరేకిస్తోంది. ఈ వాతావరణం చొరబాటుదారులకు ప్రతికూలంగా మారింది.

కంచె నిర్మాణంతో ఇబ్బందులు
భారత్‌ 569 కిలోమీటర్ల మేర సరిహద్దులో కంచె నిర్మించాలని అడుగులు వేస్తోంది. జీరో లైన్‌ వద్ద ఉన్న గ్రామాల్లో ఇళ్లు భారత్‌లో, పొలాలు బంగ్లాదేశ్‌లో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు కంచెను జీరో లైన్‌ వద్దే నిర్మించాలని కోరుతున్నారు. అయితే బంగ్లాదేశ్‌ దీనికి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో నిర్మాణానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ నెమ్మదిగా కంచె పనులు ముందుకు సాగుతున్నాయి.

బంగ్లాదేశ్‌ నేతల ఆవేశం..
బంగ్లాదేశ్‌లోని కొందరు రాజకీయ నాయకులు భారత్‌తో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని, ఐఎస్‌ఐతో చేతులు కలిపామని, సిలిగుడి కారిడార్‌ను ఆక్రమిస్తామని ఆవేశపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి ప్రకటనలు ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.భారత వ్యతిరేక ఉన్మాదులను నియంత్రించడం బంగ్లాదేశ్‌ ప్రభుత్వానికి కష్టంగా మారుతోంది. రాత్రిపూట సరిహద్దు వైపు రావడాన్ని బంగ్లాదేశీయులు కూడా వ్యతిరేకిస్తున్నారు.

ఈ మొత్తం పరిణామాల వల్ల చొరబాటుదారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. భారత్‌లోకి వచ్చినట్లయితే ఎదురయ్యే పరిస్థితుల గురించి వారిలో భయం నెలకొంది. బెంగాల్‌తో పాటు ఇతర సరిహద్దు రాష్ట్రాల్లోని ప్రభుత్వాల సహకారం ఈ తగ్గుదలకు కారణమవుతోంది. మొత్తంమీద సరిహద్దు భద్రతను మరింత బలోపేతం చేయడానికి భారత్‌ వేగంగా చర్యలు తీసుకుంటోంది. అయితే బంగ్లాదేశ్‌ వైపు నుంచి వచ్చే రాజకీయ, భద్రతా సవాళ్లను ఎదుర్కోవడం కొనసాగుతోంది.

రెండేళ్ల కూటమి పాలన.. పురోగమనంలో ఏపీ!

AP Coalition Government Achievements (1)
AP Coalition Government Achievements

AP Coalition Government Achievements: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఈరోజు రెండేళ్లు అవుతుంది. 2024 జూన్ 4న ఫలితాలు వచ్చాయి. 12న ప్రభుత్వం కొలువుదీరింది. ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంకుశ భయాందోళనలు, రాజ్యాంగ వ్యవస్థల నిర్వీర్యం, వ్యవస్థాగత ఆర్థిక అరాచకాల చీకటి నీడల నుంచి నవ్యాంధ్ర సమాజం పూర్తి ఊపిరి పీల్చుకుంది. గత రెండేళ్ల కాలంలో సుపరిపాలనతో పాటు సంక్షేమ పథకాలకు ప్రాధాన్యమిస్తూ పాలన సాగింది. గాడిన తప్పిన పాలనా వ్యవస్థను మెరుగుపరుచుతూనే పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా.. అభివృద్ధి పనులు చేయడం ద్వారా.. ఏపీ కొంతవరకు పట్టాలు ఎక్కింది. ఈ రెండేళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన అతి పెద్ద విజయం సామాన్యుడిని పాలకుల నిఘా నీడల నుంచి విముక్తి చేయడం. గతంలో ప్రతి పౌరుడి వ్యక్తిగత జీవితానికి భంగం వాటిల్లేది. వాలంటీర్ల వ్యవస్థతో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయి.

* పెద్ద ఎత్తున పెట్టుబడులు..
రెండేళ్ల కూటమిపాలనలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం అనేది ప్లస్ పాయింట్. సీఎం చంద్రబాబు తన గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ తో ఏపీని మళ్లీ అంతర్జాతీయ ఇన్వెస్టర్ల స్వర్గధామంగా మార్చారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, సీఎంఐఈ తాజా ఆర్థిక నివేదికల ప్రకారం.. దేశవ్యాప్తంగా వచ్చిన మొత్తం పెట్టుబడుల ప్రతిపాదనలో ఏకంగా 25 శాతం సింహభాగం ఏపీ దక్కించుకుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సరికొత్త పారిశ్రామిక విధానాలు, ఎకానమిక్ కారిడార్ల ఏర్పాటుతో గడిచిన రెండేళ్ల కాలంలో ఏపీకి ఏకంగా 23 లక్షల కోట్ల మేర భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం కలిగింది.
* విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అనేది గేమ్ చేంజర్ గా నిలిచింది. ఏకంగా 1.3 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. మరోవైపు రిలయన్స్ జాయింట్ వెంచర్ ఆధ్వర్యంలో 98 వేల కోట్లతో మరో భారీ డేటా సెంటర్ రాబోతోంది.
* రాయలసీమలో తయారీ రంగ పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటు అవుతున్నాయి. ప్రముఖ ఇంధన సంస్థ ఏబీసీ క్లీన్ టెక్ సుమారు లక్ష కోట్ల పెట్టుబడులతో ప్రతిష్టాత్మక గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్టులను గ్రౌండింగ్ చేసింది. క్లీన్ ఎనర్జీ, హైటెక్నాలజీ మౌలిక వస్తువుల కలయికతో లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పిస్తూ.. 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి ప్రతిపాదితంగా రాడం అనేది గొప్ప విషయం.
* పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఓటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. రాష్ట్ర వ్యవసాయ రంగానికి వెన్నెముకగా ఉన్న ఈ ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పేరుతో వైసిపి హయాంలో ఇబ్బంది పడింది. నాటి అనాలోచిత నిర్ణయాల వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం, గైడ్ బండ్ కుంగిపోవడం ప్రాజెక్టు భవిష్యత్తుకు ప్రశ్నార్థకంగా మార్చింది. కూటమి అధికారంలో రాగానే దిద్దుబాటు చర్యలు ప్రారంభం అయ్యాయి. సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో నిధులకు సంబంధించిన ఇబ్బందులు తీరాయి. జియో టెక్నికల్ పనులు వేగంగా పూర్తయ్యాయి.
* పోలవరం ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి కూటమి ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది. విశాఖ మెట్రోపాలిటన్ ప్రాంతం తో పాటు ఉమ్మడి గోదావరి, విశాఖ జిల్లాల తాగునీటి అవసరాలను తీర్చ నుంది ఈ ప్రాజెక్టు.
* అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వైసీపీ హయాంలో మూడు రాజధానులతో అమరావతి నిర్వీర్యం అయింది. కూటమి వచ్చిన తర్వాత వేలకోట్ల రూపాయల అంతర్జాతీయ పెట్టుబడులతో మళ్ళీ జీవం పోసుకుంది. కేంద్ర ప్రభుత్వం సైతం 15 వేల కోట్ల రూపాయల సాయాన్ని సర్దుబాటు చేసింది. ప్రపంచ బ్యాంకు తోపాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా నిధులను సర్దుబాటు చేసింది. మెగా కన్వెన్షన్ సెంటర్లు, ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణాన్ని కూడా అనుమతులు మంజూరయ్యాయి.
* వైసిపి హయాంలో రహదారులు దారుణంగా ఉండేవి. నరకాన్ని తలపించేవి. ఆంధ్రప్రదేశ్ రహదారుల రూపురేఖలు మార్చేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. కేవలం ప్రాథమిక దశలోనే రోడ్లు భవనాల శాఖ పరిధిలోని రహదారుల మరమ్మత్తులకు ఏకంగా 1000 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. రికార్డ్ స్థాయిలో పనులు పూర్తి చేసింది. అద్వానపు రోడ్ల నుంచి ప్రజలకు విముక్తి కల్పించింది.
* నిజమైన సంక్షేమం అంటే కేవలం అప్పులు తెచ్చి బట్టలు నొక్కడం కాదు అని నిరూపించారు సీఎం చంద్రబాబు. ప్రాధాన్యత క్రమంలో సంక్షేమ పథకాలను అమలు చేసి చూపించింది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా దాదాపు అన్నింటిని అమలు చేసి తన చిత్తశుద్ధిని చాటుకుంది.
* తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆటో డ్రైవర్ల సేవలో, మత్స్యకార భరోసా.. ఇలా దాదాపు అన్ని పథకాలను పూర్తి చేసి సంక్షేమ రాజ్యాన్ని తలపించింది ఏపీలో కూటమి ప్రభుత్వం.

కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఇవే.. దిద్దుకోకపోతే తప్పదు మూల్యం

AP Coalition Government Mistakes
AP Coalition Government Mistakes

AP Coalition Government Mistakes: అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైసీపీలో విపరీతమైన నిరాశ కనిపిస్తోంది. అందువల్లే ఏ మాత్రం అవకాశం దొరికినా సరే వదిలిపెట్టకుండా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. జరిగింది ఇసుకంత అయితే.. దానిని పెద్ద బండరాయి లాగా చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇది కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. అయితే ఇటువంటి లోపాల మీద కూటమి ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకోకపోతే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

కచ్చితంగా ఇవి జరగాలి

అభివృద్ధి, సంక్షేమం అని చెబుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం కచ్చితంగా వీటి మీద దృష్టి పెట్టాలి. అన్ని రకాలుగా పింఛన్లను భారీగా పెంచామని ప్రభుత్వం చెబుతోంది. కానీ రెండు సంవత్సరాల కాలంలో ఇంతవరకు కొత్త పింఛన్లను మంజూరు చేయలేదు. కొత్తగా ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. గృహాలను కూడా నిర్మించలేదు. నాడు వైసిపి అధికారంలో ఉన్నప్పుడు అనర్హులకు పింఛన్లు ఇచ్చారు. వారిపై ఇంతవరకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. రీసర్వే సమస్యను ఇంతవరకు పరిష్కరించలేదు. క్వాంటం వ్యాలీ.. డేటా సెంటర్లు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సామాన్యులకు ఏ విధమైన ఉపయోగం లభిస్తుందో వివరించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉన్నది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగుల జీతాలు ఆలస్యం అయ్యేవి. విశ్రాంత ఉద్యోగుల పింఛన్లు కూడా సరిగా వచ్చేవి కాదు. పిఆర్సి అమల్లో జగన్ ప్రభుత్వం మొండిగా ఉండేది. చివరికి సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పిన జగన్ వెనుకడుగు వేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల విషయంలో సానుకూల ధోరణితో కనిపిస్తోంది. వేల కోట్ల బకాయిలు విడుదల చేసింది. ఉద్యోగుల సమస్యల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

అమరావతి విషయంలో

అమరావతి నిర్మాణంలో ప్రభుత్వం ఇంకా వేగం పెంచాల్సి ఉంది. కొన్ని విషయాల పట్ల పాఠాలు నేర్చుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వ భవనాలు.. సముదాయాల నిర్మాణం మీదనే ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే పబ్లిక్ యాక్టివిటీ లో వేగం పెరగాలంటే కచ్చితంగా లే అవుట్లు డెవలప్ కావాలి. అవి లేకుండా అమరావతిలో ఎవరు కూడా ఇల్లు కట్టుకునే సాహసం చేయరు. వ్యాపారాలు ప్రారంభించలేరు.

ఆర్థిక లోటు

వైసీపీ పరిపాలనలో ఏపీ రాష్ట్రంలో ఆర్థిక లోటు పెరిగిపోయింది. సంక్షేమ పథకాలకు మాత్రమే నిధుల సర్దుబాటు జరుగుతోంది. అభివృద్ధి పనుల విషయంలో కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతోంది. అప్పుల మీదనే ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అందువల్ల అప్పుల భారం పెరిగిపోతుంది. వీటివల్ల కీలకమైన పథకాల అమలు సాధ్యం కావడం లేదు. ఉదాహరణకు ఎన్టీఆర్ వైద్య సేవ బకాయిలు భారీగా పెరిగిపోయాయి. ఈ పథకానికి నిధుల సర్దుబాటు చేయడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.

పొలిటికల్ గవర్నెన్స్ బాగోలేదు

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా అధికారులు వ్యవహరించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా అలానే కొనసాగుతోంది. పొలిటికల్ గవర్నెన్స్ ను అమలు చేయాలని చంద్రబాబు చెబుతున్నప్పటికీ అధికారులు వినిపించుకోవడం లేదు. కన్సల్టెంట్లు ప్రభుత్వంలో హవా కొనసాగిస్తున్నారు. కన్సల్టెంట్లు చెప్పిన మాటనే ప్రభుత్వం పాటిస్తోంది.. కొన్ని సందర్భాలలో కన్సల్టెంట్లు చెప్పినట్టుగానే చంద్రబాబు చేయాల్సి వస్తుంది. దీనివల్ల సోషల్ మీడియాలో విష ప్రచారం జరుగుతోంది.

సూపర్ సిక్స్ లో రెండు అమలు కావడం లేదు

సూపర్ సిక్స్ పథకాలలో ఇంకా రెండు అమలు కావడం లేదు. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు.. ఇది సాధికాకపోతే నెలకు 3000 నిరుద్యోగ భృతి.. ప్రతినెల మహిళకు 1500 రూపాయల చొప్పున ఆడబిడ్డ నిధి ఇస్తామని ఇచ్చిన హామీ అమలు కావడం లేదు. ఇక మిగతా పథకాలు తల్లికి వందనం.. అన్నదాత సుఖీభవ.. దీపం 2.. స్త్రీ శక్తి పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయి.

నేతలు జాగ్రత్తగా ఉండాలి

కొంతమంది నేతలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. దారుణంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అవినీతి వ్యవహారాలకు పాల్పడుతున్నారు. పోలీస్ విధుల్లో కూడా జోక్యం చేసుకుంటున్నారు. వారి వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది.. ఎమ్మెల్యేలు వ్యవహార శైలి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగి హెచ్చరికలు జారీ చేస్తున్నారంటే.. ప్రజాప్రతినిధులు ఎలా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఇలా చేసి వైసిపి ప్రజల నుంచి ఎలాంటి ఫలితాన్ని ఎదుర్కొన్నదో అందరూ చూశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అటువంటి పరిస్థితి రాకూడదంటే నేతలు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది.

అస్సాంలో ఆక్రమణదారుల కు గట్టి షాక్.. హిమంతకు కొండంత బలం

Assam Encroachment Case
Assam Encroachment Case

Assam Encroachment Case: అస్సాంలో ప్రభుత్వ భూములు, అటవీ ప్రాంతాలు, ముఖ్యంగా పశువుల మేత కోసం రిజర్వ్‌ చేసిన ప్రొటెక్టెడ్‌ గ్రేజింగ్‌ రిజర్వులు, అలాగే ఆలయాల భూములను ఆక్రమించుకున్న వారిని తొలగించడం తప్పనిసరి అని గౌహతి హైకోర్టు స్పష్టం చేసింది. ఆక్రమణదారులు కోర్టును ఆశ్రయించినప్పటికీ, వారి వాదనలను తిరస్కరించి, ప్రభుత్వం తప్పనిసరిగా తొలగింపు చర్యలు చేపట్టాలని నిక్కచ్చిగా ఆదేశించింది. ఈ తీర్పు అస్సాంలో భూమి ఆక్రమణ సమస్యలపై కొత్త చర్చలను రేకెత్తించింది.

హైకోర్టు తీర్పు వివరాలు..
గౌహతి హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ జడ్జి దేవాశిష్‌ బోరువ ఈ తీర్పును ఇచ్చారు. ప్రభుత్వ భూములు, అటవీ భూములు, ప్రొటెక్టెడ్‌ గ్రేజింగ్‌ రిజర్వులు, ఆలయాల భూముల నుంచి ఆక్రమణదారులను తొలగించడం ప్రభుత్వ బాధ్యత అని కోర్టు పేర్కొంది. కొంత సమయం ఇవ్వవచ్చని అనుమతించినప్పటికీ, తొలగింపు ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. లుటుమా రిజర్వ్‌ ఫారెస్టు, బోర్పాని రిజర్వ్‌ ఫారెస్టు వంటి ప్రాంతాల్లో అక్రమ నివాసులు ఎక్కువగా ఉన్నారని, వారిని తొలగించడం అనివార్యమని తీర్పులో ఉంది.

ఆక్రమణదారుల వాదనలు..
ఆక్రమణదారులు తమను తొలగించడం అక్రమమని, హక్కులు హరించబడుతున్నాయని వాదించారు. కొందరు బంగ్లాదేశ్‌ చొరబాటుదారులు ఆందోళనలు చేసి, తమ మనుగడకు ఇది ముప్పని పేర్కొన్నారు. వారు హైకోర్టును ఆశ్రయించి, తొలగింపు చర్యలను నిలిపివేయాలని కోరారు. అయితే ఈ వాదనలు కోర్టు ముందు నిలబడలేదు. కోర్టు వారి పిటిషన్లను తిరస్కరించి, ఆక్రమణలను తొలగించడం చట్టబద్ధమని తేల్చింది.

కోర్టు నిర్ణయం కీలకం..
ఈ తీర్పు అస్సాంలో భూమి సంబంధిత వివాదాలకు కొత్త దిశను ఇస్తుంది. పబ్లిక్‌ రిసోర్సెస్‌ను రక్షించడం, అటవీ ప్రాంతాలను సంరక్షించడం, పశువుల మేతకు రిజర్వ్‌ చేసిన భూములను సరైన వినియోగం కోసం ఉంచడం వంటి అంశాలను హైకోర్టు ప్రాధాన్యతగా చూసింది. ప్రభుత్వం తన బాధ్యతను నెరవేర్చాలని ఆదేశించడం ద్వారా, చట్టం ముందు అందరూ సమానులనే సూత్రాన్ని బలపరిచింది. ఆక్రమణలు ఎంతకాలం కొనసాగినా, అవి చట్టవిరుద్ధమని తేల్చడం ఈ తీర్పు యొక్క ప్రధాన లక్ష్యం.

వనరులకు రక్షణ..
ఈ తీర్పు అస్సాంలో రూల్‌ ఆఫ్‌ లా (చట్ట పాలన)ను బలపరుస్తుంది. అటవీ భూములు, గ్రేజింగ్‌ రిజర్వులు వంటి ప్రభుత్వ ఆస్తులు కొందరి ఆక్రమణల వల్ల నష్టపోకుండా ఉండాలని కోర్టు నొక్కి చెప్పింది. ఇది పర్యావరణ పరిరక్షణకు, స్థానిక సమాజాల జీవనోపాధికి (ముఖ్యంగా పశువుల పెంపకం) సహాయపడుతుంది. అస్సాంలో భూమి ఆక్రమణ సమస్య చాలా కాలంగా సున్నితంగా ఉంది. ఇలాంటి తీర్పులు ప్రభుత్వ చర్యలకు చట్టబద్ధమైన మద్దతు ఇస్తాయి. అయితే, తొలగింపు సమయంలో మానవత్వం, పునరావాస వ్యవస్థలను కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి.

బంగ్లాదేశ్‌ చొరబాటుదారుల వాదనలను కోర్టు తిరస్కరించడం, చట్టం ముందు జాతీయత లేదా ఆక్రమణ స్థాయి ఎంత ఉన్నా, చట్టవిరుద్ధమైన ఆక్రమణలు ఆమోదించబడవని సంకేతం ఇస్తుంది. దీర్ఘకాలంలో ఇది అక్రమ నివాసాలను నిరోధించి, రాష్ట్ర వనరులను సరైన విధంగా ఉపయోగించడానికి దోహదపడుతుంది. మొత్తంమీద ఈ తీర్పు అస్సాంలో భూమి సంబంధిత వివాదాలను పరిష్కరించడంలో న్యాయవ్యవస్థ పాత్రను బలపరుస్తుంది. హిమంత ప్రభుత్వం ఇప్పుడు ఈ ఆదేశాలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.

పారిశ్రామిక ఆంధ్ర ప్రదేశ్.. రెండేళ్ల కూటమి పాలనలో ఎంత మారిపోయిందంటే..

Andhra Pradesh Industrial Development
Andhra Pradesh Industrial Development

Andhra Pradesh Industrial Development: ఆంధ్రప్రదేశ్లో ఎన్నో వనరులు ఉన్నాయి. మానవ వనరులు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటిచోట పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టాలి. పెద్ద పెద్ద కంపెనీలు ఏపీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి. వేల సంఖ్యలో ఉద్యోగాలు రావాలి. ప్రభుత్వానికి కోట్లల్లో ఆదాయం సమకూరాలి. కానీ వైసిపి ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో దీనికి విరుద్ధంగా జరిగింది. అందువల్లే ఏపీలో పారిశ్రామిక ప్రగతి పడక వేసింది. పైగా ఉన్న కంపెనీలు వేరే ప్రాంతాలకు వెళ్లిపోయాయి.

కూటమి ప్రభుత్వ హయాంలో

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోంది. కేవలం రెండు సంవత్సరాల కాలంలో ఏపీ రాష్ట్రంలో 800 కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. కొన్ని కంపెనీలు పెట్టుబడులు మొదలుపెట్టాయి. వీటి ద్వారా ఏకంగా 23 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మన దేశానికి ఏడాది కాలంలో వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో 25.3% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం విశేషం.

లక్షలకోట్ల పెట్టుబడులు

అనకాపల్లి ప్రాంతంలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన జరిగింది. దీనిని 1.35 లక్షల కోట్లతో నిర్మిస్తున్నారు.. రామాయపట్నంలో 96, 862 కోట్లతో బీసీపీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేస్తున్నారు. పారిశ్రామికంగా పేరుపొందిన కాకినాడలో ఏఎం గ్రీన్ అనే సంస్థ సుమారు రెండు గిగా వాట్ సామర్ధ్యంతో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. ఇది పూర్తయితే దేశంలోనే అతిపెద్దది.. ప్రపంచంలోనే రెండవ అతిపెద్దదిగా నిలుస్తుంది. అమరావతి రాజధాని పనులు వేగంగా జరుగుతున్నాయి. పోలవరం కూడా పూర్తికావస్తోంది.. విశాఖలో గూగుల్.. రిలయన్స్ డేటా సెంటర్ల నిర్మాణం వేగంగా సాగిపోతూ ఉంది.

కీలక ఆదేశాలు

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతుల గుండెల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇబ్బంది పెట్టేది. దీనిని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఇసుక విధానంలో సరికొత్త మార్పులు తీసుకొచ్చింది. ఉచితంగా ఇసుక విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. చెత్త పన్ను మొత్తం రద్దు చేసింది. అంతేకాదు, 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను కూటమి ప్రభుత్వం తొలగించింది. వాలంటీర్ల వ్యవస్థను పూర్తిగా తగ్గించేసింది. తద్వారా వికాసం వైపు ఏపీ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తోంది. రెండు సంవత్సరాల పరిపాలన కాలంలో ఏపీ రాష్ట్రంలో గణనీయమైన మార్పును కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది.

విస్తరించిన రుతుపవనాలు.. ఇక వానలే!

Heavy Rainfall In Telugu States
Heavy Rainfall In Telugu States

Monsoon Rains Andhra Pradesh: రాష్ట్రంలో వాతావరణం లో మార్పులు సంభవించాయి. ఇప్పటివరకు వేడి వాతావరణం కొనసాగుతుండగా.. అకస్మాత్తుగా మేఘావృతం అవుతుంది. వర్షానికి తగ్గట్టు వాతావరణం మారుతోంది. ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, ద్రోణీ కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే భీకర గాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. పలు జిల్లాలను అప్రమత్తం చేసింది. చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తాజా బులిటెన్ లో వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ ఈదురు గాలులు కూడా వీచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది విపత్తుల నిర్వహణ సంస్థ.

* చురుగ్గా కదులుతున్న వైనం..
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. అయితే రుతుపవనాలు చురుగ్గా ఉన్న క్రమంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, ద్రోణి కారణంగా ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. ఈదురు గాలుల తీవ్రత కూడా అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, కడప, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. గాలుల తీవ్రత కూడా అధికంగా ఉండనుంది. పోలవరం,అనకాపల్లి, కాకినాడ,పల్నాడు, మార్కాపురం,ప్రకాశం, నెల్లూరు జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి.

* భారీ వర్షం నమోదు..
ఏపీ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో గురువారం భారీ వర్షాలు నమోదయ్యాయి. విజయవాడ నగరంలో గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. గాలివాన బీభత్సం సృష్టించింది. విద్యుత్ సరఫరా లో కూడా అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది. మరోవైపు నైరుతి రుతుపవనాల చురుగ్గా కదులుతుండడంతో.. వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వర్షాలు నమోదు కాలేదు ఏపీలో. దీంతో ఖరీఫ్ ఫై ఆందోళన కనిపిస్తోంది రైతుల్లో.

విధ్వంసం నుంచి వికాసం వైపు.. రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ఏపీలో ఏం చేసిందంటే..

AP Coalition Government Achievements
AP Coalition Government Achievements

AP Coalition Government: విధ్వంసం నుంచి వికాసం వైపు.. ఇటీవల కాలంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే ఇదే మాట మాట్లాడుతున్నారు. నిజంగా రెండు సంవత్సరాల పరిపాలన కాలంలో ఏపీ రాష్ట్రం అంతగా అభివృద్ధి చెందిందా.. సంక్షేమ పథకాల అమలులో సరికొత్త ఒరవడి సృష్టిస్తుందా.. దీనికి క్షేత్రస్థాయిలో గణాంకాలు సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

లక్ష కోట్ల వరకు ఖర్చు

ఉదాహరణకు రెండు సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం ఏపీలో సంక్షేమ పథకాల కోసం లక్ష కోట్ల వరకు ఖర్చు చేసింది. కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రమే కాకుండా.. అందరికీ ఈ పథకాలు అమలవుతున్నాయి.. ఉదాహరణకు అన్న క్యాంటీన్ల ను తీసుకుంటే.. ఇవి నూటికి నూరు శాతం విజయవంతమయ్యాయి. ఇప్పటివరకు 230 కోట్లను ప్రభుత్వం వీటి మీద ఖర్చుపెట్టింది. స్త్రీ శక్తి పథకం ద్వారా 71 కోట్ల మంది మహిళలు ప్రయాణాలు సాగించారు. 2565 కోట్ల మేర లబ్ధి పొందారు.

సామాజిక పింఛన్లు

గడిచిన రెండు సంవత్సరాల కాలంలో ఎన్టీఆర్ భరోసా పేరు మీద ప్రభుత్వం సామాజిక పింఛన్లు ఇచ్చింది. 65,887 కోట్లను పేదలకు పంచింది. ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పింఛన్లు ఇచ్చిన దాఖలాలు లేవని ఏపీ ప్రభుత్వ పేదలు చెబుతున్నారు. దీపం పథకంలో భాగంగా 4.26 కోట్ల సిలిండర్లను పేదలకు అందించారు. దీనికోసం 3100 కోట్లను ఖర్చుపెట్టారు. అన్నదాత సుఖీభవ పథకానికి దాదాపు 8 వేల 985 కోట్లు ఖర్చు చేశారు. 46 లక్షల మంది రైతులకు భరోసా కల్పించారు. ఒక్కో రైతు ఖాతాలో 20వేల చొప్పున జమ చేశారు. ఆటో డ్రైవర్లకు 15000 చొప్పున ఇప్పటివరకు 435 కోట్లను జమ చేశారు. మత్స్యకార సేవలో భాగంగా మత్స్యకారులకు ఏడాదికి 20వేల చొప్పున కూటమి ప్రభుత్వం ఇస్తోంది. దీనికోసం 250 కోట్లు ఖర్చుపెట్టింది. తల్లికి వందనం పథకం ద్వారా 65.27 లక్షల మంది పిల్లలకు ఈ పథకాన్ని అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తంగా 4-5 లక్షల మంది తల్లుల ఖాతాలో ఇప్పటివరకు పదివేల కోట్లను జమ చేసింది..

రోడ్లు వేసింది.. ఉద్యోగాలు భర్తీ చేసింది..

గ్రామీణ ప్రాంతాల్లో 2000 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లను వేసింది కూటం ప్రభుత్వం. పదివేల కిలోమీటర్ల పరిధిలో తారు రోడ్లలో నిర్మించింది. ఏజెన్సీ ప్రాంతంలో వెయ్యికోట్లతో రోడ్లు నిర్మించింది. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది ప్రభుత్వం. అంతేకాదు పోలీస్ శాఖలో 6100 మంది ఉద్యోగులను నియమించింది. అంతేకాదు విద్యుత్ చార్జీలను ఈ రెండు సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా పెంచలేదు. దీనికి తోడు ట్రూ డౌన్ ద్వారా తగ్గించడం ప్రజలకు ఊరట కల్పించింది. డీఎస్సీ ద్వారా దాదాపు 16 వేలకు పైగా టీచర్ పోస్టులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. నాసిరకమైన మద్యానికి చరమగీతం పాడింది. అస్తవ్యస్తమైన మద్యం విధానాన్ని చెత్తబుట్టలో పడేసింది. పారదర్శకతకు పెద్దపీట వేసింది. నూతన ఎక్సైజ్ విధానానికి అమల్లోకి తెచ్చింది.

14 గంటల్లో 52 లక్షల వ్యూస్.. 'వారణాసి' రికార్డు ని బద్దలు కొట్టిన 'ఓజీ 2'..ఇదేమి మాస్ సామీ..

Pawan Kalyan OG 2
Pawan Kalyan OG 2

Pawan Kalyan OG 2: పవన్ కళ్యాణ్ అభిమానులకు ‘ఓజీ’ అనే పేరు తీస్తే చాలు, వాళ్ళ శరీరాల్లో వెయ్యి వోల్ట్స్ ఎనర్జీ పాస్ అవుతుంది. గతం లో ‘గబ్బర్ సింగ్’ చిత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక గొప్ప ఎమోషన్. కానీ ‘ఓజీ’ చిత్రం అంతకు మించిన ఎమోషన్ గా వాళ్లకు మారిపోయింది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. వాస్తవానికి ‘ఓజీ’ గొప్ప చిత్రమేమి కాదు, కేవలం రెండు మూడు సన్నివేశాలు మాత్రమే ఆ చిత్రం లో బాగుంటాయి, వాటికే అభిమానులు పిచోళ్లు అయిపోయారు, డివైడ్ టాక్ వచ్చినప్పటికీ 321 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టారు. కానీ ఓటీటీ లోకి వచ్చిన తర్వాత ‘ఓజీ’ క్రేజ్ ఇంకా తారా స్థాయికి చేరింది. ముఖ్యంగా జెన్ జీ ఆడియన్స్ ‘ఓజీ’ సినిమాల్లోని సన్నివేశాలకు సంబంధించిన షాట్స్ ని అప్లోడ్ చేయకుండా ట్వీట్లు , పోస్టులు వేయలేకపోతున్నారు. ఆ రేంజ్ లో వాళ్లకు ఎక్కేసింది.

‘ఓజీ 2’ వస్తే బాగుంటుంది అని అభిమానులతో పాటు, జెన్ జీ మామూలు ఆడియన్స్ కూడా చాలా బలంగా కోరుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు, చాలా బిజీ గా గడుపుతున్నాడు , ఇలాంటి సమయం లో ఆయన నుండి సినిమాలు ఊహించడం కష్టం , ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రమే ఆయన చివరి చిత్రం గా నిలుస్తుందేమో అని అంతా అనుకున్నారు. అభిమానులు రెండు మూడు రోజుల క్రితం , పవన్ కళ్యాణ్ రిటైర్మెంట్ ఇవ్వబోతున్నాడు అంటూ చాలా బాధ పడ్డారు కూడా. సరిగ్గా అలాంటి సమయం లోనే ఆయన నుండి ‘ఓజీ 2’ చిత్రం రాబోతుందని నిన్న ట్విట్టర్ లో ఒక అధికారిక ప్రకటన వచ్చింది. ఈ చిన్న ట్వీట్ సృష్టించిన ప్రకంపనలు సాధారణమైనవి కాదు.

కేవలం 14 గంటల్లోనే ఈ ట్వీట్ కి 52 లక్షల వ్యూస్ , 14 వేల రీట్వీట్స్, 35 వేల లైక్స్ వచ్చాయి. ఎన్టీఆర్ ‘డ్రాగన్’ చిత్రం ప్రకటనకు , మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ ప్రకటన కు కూడా ఈ రేంజ్ వ్యూస్ రాలేదు. ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రం లైఫ్ టైం వ్యూస్ కూడా ఈ రేంజ్ లో లేవు. అలాంటిది కేవలం ఒక్క చిన్న ట్వీట్ తో ఈ రేంజ్ రీచ్ వచ్చిందంటే, ఇక రాబోయే రోజుల్లో ‘ఓజీ 2’ కి సంబంధించిన అప్డేట్స్ వచ్చినప్పుడు రీచ్ ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోండి అంటూ పవన్ ఫ్యాన్స్ ట్వీట్స్ వేస్తున్నారు .ఇక 24 గంటలు గడిచిన తర్వాత ఈ ట్వీట్ కి ఇంకా ఎంత రీచ్ , వ్యూస్ వస్తాయో చూడాలి.

'ట్రాన్స్ జెండర్' గా కనిపించబోతున్న రవితేజ..కెరీర్ లోనే సరికొత్త ప్రయోగం..ఆడియన్స్ ఎలా తీసుకుంటారో..

Ravi Teja Transgender Role
Ravi Teja Transgender Role

Ravi Teja Transgender Role: మన తెలుగు హీరోలు , తమ ఇమేజ్ నుండి బయటకు వచ్చి , నేటి తరం జెన్ జీ ఆడియన్స్ ని అలరించేందుకు విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నారు. రీసెంట్ గానే మనమంతా ‘పెద్ది’ చిత్రాన్ని చూశాం. వంద మంది శత్రువులను నరికి చంపే హీరోయిజాన్ని గతం లో రామ్ చరణ్ లో మనం చూశాం , అలాంటి హీరో అవిటి వాడిగా నటిస్తే జనాలు రిసీవ్ చేసుకుంటారని మనం కలలో అయినా ఊహించుకొని ఉంటామా ?, కానీ జనాలు ఆ పాత్రని రిసీవ్ చేసుకున్నారు , వందల కోట్ల వసూళ్లను ఇస్తున్నారు. ఇప్పుడు హీరో ఇమేజ్ ని ఎవ్వరూ చూడడం లేదు , కంటెంట్ ని మాత్రమే చూస్తున్నారు , కంటెంట్ ఆడియన్స్ కి నచ్చితే స్టార్ హీరోలు ఎలాంటి పాత్రలు చేసినా ఆదరిస్తారు అనేది రీసెంట్ గా విడుదలైన ‘పెద్ది’ మరోసారి నిరూపించి చూపించింది. ఈ సినిమా ఇచ్చిన ధైర్యమో ఏమో తెలియదు కానీ , మాస్ మహారాజ రవితేజ కూడా ఇలాంటి ప్రయోగమే ఒకటి చేయబోతున్నాడు.

రీసెంట్ గానే ఆయన దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘స్వాగ్’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన హషిత్ గోలి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ చిత్రం లో రవితేజ ట్రాన్స్ జెండర్ గా కనిపించబోతున్నాడు అట. ఆరంభం నుండి ఎండింగ్ వరకు ఆయన ఆ పాత్రలోనే కనిపిస్తాడట. ఇది విన్న అభిమానులు, రవితేజ లాంటి మాస్ హీరో, ఇలాంటి పాత్ర ని చేయడానికి ఒప్పుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది, నిజంగా ఆయనలో చాలా మార్పు వచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కథ ఏంటి అనేది ఇంకా పూర్తి వివరాలు బయటకు రాలేదు కానీ , ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎవ్వరూ చూడని అద్భుతమైన , విభిన్నమైన స్టోరీ లైన్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది అట.

ప్రస్తుతానికి రవితేజ ‘ఇరుముడి’ అనే చిత్రం లో నటిస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తి అవ్వగానే , రవితేజ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అవ్వబోతున్నట్టు సమాచారం. రవితేజ కి ఇలాంటి ప్రయోగాలు చేయడం కొత్తేమి కాదు. గతం లో ఆయన ‘రాజా ది గ్రేట్’ చిత్రం గుడ్డివాడిగా నటించి భారీ హిట్ ని అందుకున్నాడు. అయితే అందులో గుడ్డివాడు అయినప్పటికీ కూడా తన మార్క్ మాస్ హీరోయిజాన్ని చూపించడం లో రవితేజ ఎక్కడా తగ్గలేదు. మరి ఈ ట్రాన్స్ జెండర్ పాత్ర కూడా అలాగే ఉంటుందా, లేదా పూర్తి భిన్నంగా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.

వన్డే వరల్డ్ కప్ 2027: షెడ్యూల్ వచ్చేసింది.. జట్లు, మ్యాచ్ లు, వేదికలు.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం..

ODI World Cup 2027 Schedule
ODI World Cup 2027 Schedule

ODI World Cup 2027 Schedule: ఐపీఎల్ సంబరం ముగిసిపోయింది. అంతకంటే ముందు టి20 వరల్డ్ కప్ విజయవంతంగా సాగింది. ఇప్పుడు అందరి దృష్టి వన్డే ప్రపంచ కప్ 2027 గురించి. అయితే దీనికి సంబంధించి అభిమానులకు ఐసీసీ గుడ్ న్యూస్ చెప్పేసింది. ఐసీసీ 2027 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల చేసింది.. అహ్మదాబాదులో ఐసీసీ బోర్డు సమావేశంలో మ్యాచ్ నిర్వహణ తేదీలను ప్రకటించారు.

అక్టోబర్ 4 నుంచి మొదలు

వచ్చే ఏడాది అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 అంటే దాదాపు 48 రోజులపాటు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కొనసాగుతూ ఉంటుంది. చాలా వరకు మ్యాచులు దక్షిణాఫ్రికాలో జరుగుతాయి. టోర్నమెంట్లో మొత్తం 54 మ్యాచులు జరిగే అవకాశం ఉంది. ఇందులో 41 మ్యాచ్లు దక్షిణాఫ్రికాలో జరుగుతాయి. 8 స్టేడియాలలో ఈ మ్యాచ్ లు నిర్వహిస్తారు. జింబాబ్వే లో ఎనిమిది నుంచి పది మ్యాచ్లు జరుగుతాయి. మిగతా మూడు మ్యాచ్లను నమీబియాలో నిర్వహిస్తారు. జింబాబ్వేలో క్వీన్స్, హరారే స్పోర్ట్స్ క్లబ్, విక్టోరియా ఫాల్స్ మైదానాలలో మ్యాచులు నిర్వహిస్తారు.

పాత విధానంలోనే నిర్వహణ

సౌత్ ఆఫ్రికా ఇప్పటివరకు టి20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ, ఉమెన్స్ టి20 ప్రపంచ కప్ కు ఆతిధ్యం ఇచ్చింది. 2003లో సౌత్ ఆఫ్రికా మెన్స్ వరల్డ్ కప్ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చింది. నాడు కంగారు జట్టు విజేతగా నిలిచింది. ఈసారి మెన్స్ వన్డే వరల్డ్ కప్ పాత విధానంలోనే జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. దీనివల్ల మిగతా జట్లు కూడా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తాయి. అవసరమైతే సంచలన ప్రదర్శన చేస్తాయి. దీనివల్ల ట్రోఫీ మీద అంచనాలు పెరిగిపోతాయి. రేటింగ్స్ కూడా అధికంగా నమోదవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఐసిసికి దండిగా ఆదాయం వస్తూ ఉంటుంది. అందువల్లే ఐసీసీ ఈసారి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

గతంలో ఏం జరిగిందంటే..

గతంలో రెండు ఎడిషన్లలో 10 జట్లు మాత్రమే వన్డే వరల్డ్ కప్ లో పాల్గొన్నాయి. 2027లో మళ్లీ 14 జట్ల విధానాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. రెండు గ్రూపులలో 14 జట్లను విభజిస్తారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లకు సూపర్ సిక్స్ అవకాశం ఉంటుంది.. ఐసీసీ సభ్య దేశాలుగా ఉన్న దక్షిణాఫ్రికా.. జింబాబ్వే ట్రోఫీలో ఆడేందుకు నేరుగా అర్హత సాధించాయి. నమీబియా క్వాలిఫై మ్యాచ్ ఆడాలి. అందులో గెలిస్తేనే వరల్డ్ కప్ లో ఆడే అవకాశం ఉంటుంది.

బండి సంజయ్ అజ్ఞాతంలో ఉంది అందుకే.. అసలు నిజం ఇప్పుడు తెలిసింది..

Bandi Sanjay
Bandi Sanjay

Bandi Sanjay: కొడుకు మీద ఫోక్సో కేసు నమోదైన తర్వాత కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాజకీయంగా అంత యాక్టివ్ గా లేరు. పైగా ఆయన తీవ్ర నిరాశలో కనిపిస్తున్నారు. ఒకప్పటి మాదిరిగా ప్రత్యర్ధుల మీద ఆయన ఆగ్రహం గా ఉండడం లేదు. తీవ్రస్థాయిలో మాట్లాడటం లేదు. కార్యకర్తలను కలుస్తున్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. ఆ తర్వాత ఢిల్లీ లేదా హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆయన దగ్గరగా ఉంటున్నారు.

కొద్దిరోజుల క్రితం బండి సంజయ్ ఆ మాత్రం కూడా అందుబాటులో లేకుండా పోయారు. సన్నిహితులకు కూడా ఆయన సమాచారం తెలియదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కి ఏమైంది.. ఆయన ఏమైపోయారు.. ఉన్నట్టుండి అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లిపోయారు అనే చర్చ నడిచింది. ఇక నమస్తే తెలంగాణ అయితే బండి సంజయ్ మీద టన్నులకొద్దీ బురద కథనాలు రాయడం మొదలుపెట్టింది. అయితే బండి సంజయ్ ఎట్టకేలకు బయటికి వచ్చారు. తాను ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయానో వివరించారు.

బండి సంజయ్ అజ్ఞాతంలోకి వెళ్లలేదు. ఎవరికీ కనిపించకుండా పోలేదు. ఆయన అనారోగ్యానికి గురయ్యారు. కల్తీ పాలు తాగడం వల్ల ఆయన ఆరోగ్యం పాడైంది. దీంతో ఆయన చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. గర్జన 20 సంవత్సరాలుగా బండి సంజయ్ కానీ దగ్గు లేదా జ్వరంతో కూడా బాధపడలేదు. హైదరాబాద్ నగరంలో కల్తీ పాలు తాగడం వల్ల ఐదు రోజులు ఆయన మంచానికే పరిమితమయ్యారు. ఇదే విషయాన్ని ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంట లోని కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ప్రకృతి వ్యవసాయ రైతు సమ్మేళనంలో వెల్లడించారు.

రైతులు రసాయన ఎరువులకు దూరంగా ఉండాలని.. ప్రకృతి సిద్ధ మీద దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. సేంద్రీయ సాగుతో రైతుల కోటీశ్వరులు కావచ్చని సూచించారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులను ప్రకృతిసిద్ధమైన ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్ర నిర్వాహకులు 10,000 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేయడాన్ని బండి సంజయ్ అభినందించారు.

ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహార పదార్థాల వినియోగం పెరిగిపోయింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహిస్తున్న దాడులలో ఈ విషయాలు వెలుగుచూస్తున్నాయి. చివరికి కేంద్రమంత్రి కూడా కల్తీ పాల వల్ల అనారోగ్యానికి గురి కావడం ఆందోళన కలిగిస్తోంది. దీనిని బట్టి హైదరాబాదు నగరంలో ఆహార పదార్థాలు నాణ్యత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర హోం మంత్రికే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అవగతం చేసుకోవచ్చు.

కేంద్ర క్యాబినెట్ లోకి జనసేన.. ఆయనకే ఛాన్స్!

Janasena Central Cabinet
Janasena Central Cabinet

Janasena Central Cabinet: కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రాధాన్యం ఇస్తోంది రాజకీయపరంగా. ఎందుకంటే నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన బలాన్ని అందించింది ఏపీ. కూటమిపరంగా 21 పార్లమెంట్ స్థానాలు అందించింది. టిడిపి 16 ఎంపీలతో ఎన్డీఏలో రెండో స్థానంలో నిలిచింది. అందుకే ఆ పార్టీకి రెండు కేంద్ర మంత్రి పదవులు లభించాయి. అయితే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మిత్రపక్షాలకు మంత్రి పదవులు దక్కాయి. రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్న జనసేనకు మాత్రం ఒక్క పదవి లేదు కేంద్ర మంత్రివర్గంలో. అందుకే ఈసారి జనసేనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని తెలుస్తోంది. ఇటీవల ఎన్డీఏ పక్ష సమావేశానికి హాజరైన పవన్ కు కేంద్ర పెద్దలు ఈ విషయాన్ని చెప్పినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే జనసేన నుంచి ముగ్గురు ఎంపీలు ఉంటారు. ఇద్దరు లోక్సభ సభ్యులు ఉన్నారు. తాజాగా రాజ్యసభకు జనసేన తరఫున లింగమనేని రమేష్ ప్రాతినిధ్యం వహించనున్నారు.

* జనసేనకు ముగ్గురు ఎంపీలు..
ఒకవేళ జనసేనకు కేంద్ర మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తే ఎవరిని ఎంపిక చేస్తారు అనేది ప్రశ్న. అయితే ఆ పార్టీకి కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఉన్నారు. తాజాగా రాజ్యసభ సభ్యుడిగా లింగమనేని రమేష్ ఎంపికయ్యారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వల్లభనేని బాలశౌరికి పవన్ ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. ఆయన సీనియర్ నాయకుడితో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడం కలిసి వచ్చే అంశం.

* సుదీర్ఘ నేపథ్యం..
సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది వల్లభనేని బాలసౌరికి. 2004లో తెనాలి పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో తెనాలి పార్లమెంట్ స్థానం కనుమరుగయింది. దీంతో 2009 ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడంతో ఆ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మాత్రం మచిలీపట్నం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2024 ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి జనసేనలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే బాలశౌరి సీనియారిటీని పరిగణలోకి తీసుకుని ఆయనకు కేంద్రమంత్రి పదవికి పవన్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

ఆ చిన్నారిపై పెద్ద మనసు చాటుకున్న లోకేష్!

Lokesh Helping Student
Lokesh Helping Student

Lokesh Helping Student: నారా లోకేష్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. తన దృష్టికి వచ్చిన ఓ పేద విద్యార్థి సమస్యకు పరిష్కార మార్గం చూపించారు. లోకేష్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఏదైనా సమస్యపై సామాన్యులు తనకు ట్యాగ్ చేస్తే.. సమస్య తీవ్రతను బట్టి ఇట్టే స్పందిస్తారు. ముఖ్యంగా వీడియో, ఫోటో తో తమ గోడును వెల్లబోసుకుంటే.. అలాంటి పోస్టులకు వెంటనే రియాక్ట్ అవుతారు. రాజ్యాంగ ఓ చిన్నారి లోకేష్ మామ నాకు సీటు కావాలి అంటూ పెట్టిన వీడియో చూసిన మంత్రి లోకేష్ వెంటనే ఎక్స్ వేదికగా స్పందించారు. సమస్యకు పరిష్కారం చూపించి ఆకట్టుకున్నారు.

* సీటు రాకపోవడంతో..
కర్నూలు జిల్లాకు చెందిన మానస అనే చిన్నారి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం పాఠశాలలో సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆ చిన్నారికి సీటు రాలేదు. దీంతో తనకు ఎలాగైనా కేజీబీవీలు సీటు వచ్చేలా చేయాలంటూ ఆ చిన్నారి ఒక వీడియోను విడుదల చేసింది. నేరేడుప్పల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీల కుటుంబానికి చెందిన మానస ఐదో తరగతి పూర్తి చేసింది. ఆరో తరగతిలో ప్రవేశాల కోసం కేజీబీవీ పరీక్ష రాసినా అందులో సెలెక్ట్ కాలేదు. ఈ క్రమంలో పొలం పనులు చేస్తూ.. ఆ పొలంలో నుంచి తన ఆవేదనను వీడియో తీసి మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చింది. ఈ వీడియో పై స్పందించిన మంత్రి నారా లోకేష్ మానస చదువుకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

* నిరుపేద కుటుంబం
మానస తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. ఈ క్రమంలో తన చదువు మధ్యలోనే ఆగిపోతోందన్న ఆందోళన మానసలో పెరిగింది. ఈ క్రమంలోనే లోకేష్ మామ అంటూ మానస చేసిన విజ్ఞప్తి ప్రతి ఒక్కరిని కదిలించింది. దీనిపై నారా లోకేష్ స్పందించారు. సంబంధిత అధికారులను ఆదేశించారు. మానసకు హాస్టల్ సీటు ఇప్పించడమే కాకుండా.. ఆమె చదువుకు సహాయం చేస్తానని కూడా మాట ఇచ్చారు. బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి అంటూ చిన్నారి మానసకు ఆశీస్సులు అందించారు. దీనిపై మానస తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.

డీఎస్సీ పై జగన్ బురద రాజకీయం!

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: ఏదైనా ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగితే న్యాయస్థానాలకు వెళ్లి.. ఉపశమనం పొందుతుంటారు. తప్పకుండా అక్రమాలు జరిగాయని ఆధారాలు ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుంటారు. కానీ ఏపీలో డీఎస్సీ 2025 పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అదే పనిగా ఆరోపణలు చేస్తోంది. ఏవేవైతే సాక్షిలో డీఎస్సీ నియామకాలపై వచ్చిన అక్రమాల కేస్ స్టడీలపై ఎప్పటికప్పుడు విద్యాశాఖ అధికారులు సంతృప్తికరమైన వివరణ ఇచ్చారు. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెనక్కి తగ్గడం లేదు. చివరకు జగన్మోహన్ రెడ్డి సైతం ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ డీఎస్సీ 2025 పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. తలా తోకాలేని ఆరోపణలు చేస్తున్నారు.

* ప్రెస్ మీట్ లో హడావిడి
నిన్ననే వారాంతపు ప్రెస్ మీట్ తో తాడేపల్లిలో ముందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి. తన పక్కన ఒక డీఎస్సీ అభ్యర్థిని కూర్చోబెట్టారు. అతడికి గోల్డ్ మెడల్ ఉన్నా ఉద్యోగం ఇవ్వలేదు అంటూ పెద్ద హడావిడి చేశారు. అయితే ఆ అభ్యర్థి తన డీఎస్సీ ఆన్లైన్ అప్లికేషన్ లో తనకు గోల్డ్ మెడల్ ఉందనే విషయాన్ని అస్సలు పేర్కొనలేదు. దరఖాస్తు లోనే చూపించని అర్హతలను అధికారులు పరిశీలన సమయంలో ఎలా పరిగణలోకి తీసుకుంటారని కనీస స్పృహ లేకుండా జగన్ మాట్లాడుతున్నారు. ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగి టాప్ ర్యాంక్ సాధించాడు అంటూ చేసిన ఆరోపణలపై ఇదివరకే విద్యాశాఖ ఆధారాలతో సహా వివరణ ఇచ్చింది. అతడు ఎన్వోసీ తీసుకోనందునే ఉద్యోగం ఇవ్వలేదని స్పష్టం చేసింది. అయినా సరే జగన్ పదేపదే డీఎస్సీ పై విషం చిమ్ముతూనే ఉన్నారు.

* కోర్టుకు వెళ్లకుండా.
డీఎస్సీలో అక్రమాలు జరిగితే.. ఆధారాలు ఉంటే వెంటనే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయకుండా బురదజల్లేందుకు మాత్రమే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే డీఎస్సీ పూర్తి పారదర్శకంగా జరిగిందన్నది మెజారిటీ అభ్యర్థుల అభిప్రాయం. కానీ అభ్యర్థుల్లో గందరగోళం సృష్టించి రాజకీయం చేయాలన్నది జగన్ ఆలోచన. అందుకే అదే పనిగా విషం చిమ్ముతూనే ఉన్నారు. ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు తెలుసు. ఎవరెవరు అభ్యర్థులకు ఉద్యోగాలు రాలేదో వారికి తెలుసు. కానీ ఆరు లక్షల మంది డిఎస్సీ పరీక్షలు రాశారు. అందులో 16 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. మిగతా వారి కుటుంబాల ఓట్ల కోసం ఈ సరికొత్త రాజకీయ ఎత్తుగడ ఆడుతున్నారు జగన్. అయితే ఇది వర్క్ అవుట్ అవుతుందా? అంటే మాత్రం కాదు అనే సమాధానం వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

ఉత్తమ వలస వాదుల్లో మనోళ్లు.. 250 మందిలో 27 మంది ఎన్నారైలు!

Forbes 250 Immigrants List
Forbes 250 Immigrants List

Forbes 250 Immigrants List: భారత్‌ లేకుంటే అమెరికా లేదు.. ఆ దేశ మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ మూడు దశాబ్దాల క్రితం చేసిన ప్రకటన ఇది. ఇది నూటిని నూరుపాళ్లు నిజం. భారతీయులు అమెరికాకు వెళ్లి.. తక్కువ వేతనాలతో మన మేధాశక్తిని అమెరికా అభివృద్ధికి ధారపోశారు.. ఇప్పటికీ పోస్తున్నారు. అమెరికా ఎదుగుదలలో భారతీయుల పాత్రను ఎవరూ కాదనలేరు. భారత్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా వలస వచ్చి స్థిరపడిన ఎలాన్‌ మస్క్‌ వంటి వారు కూడా అగ్రరాజ్యాభివృద్ధిలో భాగస్వాములయ్యారు. అమెరికా ఏర్పడి జూలై 5 నాటికి 250 ఏళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఫోర్బ్స్‌ 250 మంది ఉత్తమ వలసదారుల జాబితాను ప్రకటించింది. ఈ లిస్ట్‌లో 27 మంది భారత సంతతి వ్యక్తులు చోటు దక్కించుకోవడం, భారతీయల ప్రపంచ స్థాయి ప్రభావాన్ని స్పష్టం చేస్తోంది. ఇందులో వ్యాపారం, సాంకేతికత, సంస్కృతి, రాజకీయాలు వంటి రంగాల్లో విశేష కృషి చేసిన వలసదారులు ఉన్నారు.

టాప్‌లో ఆస్ట్రియా నటుడు..
250 మంది ఉత్తమ వలసవాదుల జాబితాలో ఆస్ట్రియా నుంచి వచ్చిన నటుడు–రాజకీయ నాయకుడు ఆర్నాల్డ్‌ ష్వాజ్‌నెగ్గర్‌ టాప్‌ స్థానంలో ఉన్నారు. ఈ జాబితా అమెరికా అభివృద్ధిలో వలసదారుల పాత్రను హైలైట్‌ చేస్తుంది. 27 మంది భారత సంతతి వ్యక్తుల్లో గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, పెప్సికో మాజీ సీఈవో ఇంద్రా నూయి వంటి ప్రముఖులు ఉన్నారు. వీరు తమ నాయకత్వంలో ప్రపంచ స్థాయి కంపెనీలను మరింత బలోపేతం చేశారు. సాంకేతిక రంగంలో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉండటం, ఈ జాబితాలో భారత్‌ టాప్‌ స్థానాల్లో ఒకటిగా నిలవడానికి కారణమైంది.

భారతీయుల విజయానికి ప్రతీక..
భారత సంతతి వ్యక్తులు ఈ స్థాయిలో విజయం సాధించడం కేవలం యాదృచ్ఛికం కాదు. భారతదేశంలోని ఉన్నత విద్యా వ్యవస్థ, గణితం–సైన్స్‌లో బలమైన పునాది, పని కఠినత్వం వంటివి వారిని ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా చేశాయి. అమెరికా వంటి దేశంలో అవకాశాలు, ఇన్నోవేషన్‌కు అనుకూలమైన వాతావరణం ఈ ప్రతిభను మరింత ముందుకు తీసుకెళ్లాయి. వీరు కేవలం వ్యక్తిగత విజయం సాధించలేదు. గూగుల్, మైక్రోసాఫ్ట్‌ వంటి కంపెనీలను గ్లోబల్‌ లీడర్లుగా మార్చడం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారీగా సహకరించారు. ఇది ‘బ్రెయిన్‌ గెయిన్‌’ అనే భావనను బలపరుస్తుంది. అయితే, భారత్‌ నుంచి ప్రతిభావంతులు వలస వెళ్లడం వల్ల దేశంలోని నైపుణ్యాల కొరత గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి.

250 సంవత్సరాల చరిత్రలో వలసదారులు ఎప్పుడూ కీలక భూమిక పోషించారు. భారత సంతతి వ్యక్తులు టెక్, బిజినెస్‌ రంగాల్లో ఆధునిక ఇన్నోవేషన్‌లకు నాంది పలికారు. వీరి నాయకత్వం వల్ల అమెరికా ఆర్థిక వృద్ధి, ఉద్యోగ సృష్టి, సాంకేతిక పురోగతి వేగవంతమైంది. ఈ లిస్ట్‌ ద్వారా ఫోర్బ్స్‌ అమెరికా అభివృద్ధి వలసదారుల సహకారం లేకుండా సాధ్యం కాదని సూచిస్తోంది. మొత్తంమీద, ఈ ఫోర్బ్స్‌ లిస్ట్‌ భారత సంతతి వ్యక్తుల విజయ గాథను మాత్రమే కాకుండా, ప్రపంచీకరణ యుగంలో నైపుణ్యాలు, అవకాశాలు ఎలా మిళితమవుతాయో చూపిస్తోంది.