America Iran War Analysis: రక్తపుటేరులు పారుతుంటే.. మాంసం వ్యాపారులకు గిరాకీ ఉంటుంది. ఆ ఏరులు అలాగే పారాలి అని వ్యాపారులు అనుకుంటారు. ఇది ఒక ఆఫ్రికన్ సామెత.. ఇప్పటి నవీన కాలానికి ఇది నూటికి నూరు శాతం సరిపోతుంది. దీనిని అలా చేసింది అమెరికా.. అగ్రరాజ్యంగా ప్రపంచం మీద పెత్తనం సాగిస్తున్న అమెరికా.. ప్రతిసారి ఏదో ఒక పెంట చేయడం.. దానిని ప్రపంచం మీద రుద్దడం అలవాటుగా మారిపోయింది. దీనివల్ల మిగతా దేశాలు నరకం చూస్తున్నాయి. ధరలు పెరగడం.. ఆర్థిక స్థిరత్వాన్ని కోల్పోవడం.. ఇంకా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఇంత జరిగినప్పటికీ అమెరికాకు బుద్ధి రావడం లేదు. బుద్ధి తెచ్చుకోవడం లేదు.
అధ్యక్షులు మాత్రమే మారుతున్నారు
అమెరికా తీరు ఎలా ఉందంటే.. ప్రతిసారి అధ్యక్షుడు మారినప్పుడు.. అమెరికా చేస్తున్న యుద్ధ తీవ్రత మారుతుంది. బిల్ క్లింటన్, బుష్, ఒబామా, ట్రంప్, బైడన్, ట్రంప్.. ఇలా ప్రతి సందర్భంలో అమెరికా ఇతర దేశాల మీద యుద్ధాలు చేయడం.. యుద్దాల పేరుతో ఆయుధాల వ్యాపారాలు చేయడం అలవాటుగా మార్చుకుంది. ఒక అవసరాన్ని సృష్టించడం.. దానికోసం ఒత్తిడి తీసుకురావడం.. అవసరం తీరే విధంగా తానే ఏర్పాట్లు చేయడం.. ఇలా త్రిపద సిద్ధాంతాన్ని అమెరికా అమలు చేస్తోంది. దండిగా సంపాదించుకుంటున్నది.
తాజా ఇరాన్ యుద్ధంలో అమెరికాకు సంబంధం లేదు. అసలు అమెరికా వేలు పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. కేవలం న్యూక్లియర్ వెపన్స్ పేరుతో అమెరికా ఇందులోకి ప్రవేశించింది. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ చేస్తుంది అనే అంశం మీద ఇప్పటికీ అమెరికాకు ఒక క్లారిటీ లేదు. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తోంది అనే విషయాన్ని కూడా ఇంతవరకు బయట పెట్టలేకపోయింది. శుద్ధి చేసిన యురేనియం ఇరాన్ వద్ద ఉందని అమెరికా అనేక సందర్భాల్లో ఆరోపించినప్పటికీ.. అది ఆరోపణగానే మిగిలిపోయింది. నిజానికి చైనా.. ఉత్తరకొరియా.. పాకిస్తాన్.. వంటి దేశాల మధ్య న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. వాటి జోలికి అమెరికా వెళ్లదు. పైగా ఇటీవల ట్రంప్ చైనా వెళ్ళినప్పుడు.. దారుణమైన అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరికి చైనా ఇచ్చిన బహుమతులను కూడా అనుమానంతో బయట పడేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇజ్రాయిల్ ఒత్తిడి వల్ల ఇరాన్ మీద అమెరికా యుద్ధం చేసింది. అయితే ఆ తర్వాత ఇజ్రాయిల్ తెలివిగా పక్కకు తప్పుకుంది. దీంతో అమెరికా యుద్ధం చేయాల్సి వచ్చింది. భారీగా నష్టపోవాల్సి వచ్చింది.. అంతేకాదు ఇప్పుడు ఇరాన్ పెట్టిన ప్రతి కండిషన్ కు అమెరికా ఒప్పుకోవాల్సి వచ్చింది.. వాస్తవానికి ఇరాన్ దేశానికి ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదని అమెరికా చెప్పినప్పటికీ.. 14 షరతుల జాబితాలో 300 బిలియన్ డాలర్లు ఇరాన్ దేశానికి అమెరికా ఇవ్వాల్సి ఉంటుందని వార్తలు వస్తున్నాయి.. మరోవైపు హార్మోజ్ సంధిని 60 రోజులపాటు తెరిచి ఉంచుతామని ఇరాన్ చెబుతోంది.
ఇరాన్ పట్టుబట్టిన ప్రతి అంశానికి అమెరికా ఓకే చెప్పింది. అలాంటప్పుడు ఈ యుద్ధంలో అగ్రరాజ్యం సాధించింది ఏముందని వార్తలు వస్తున్నాయి. హర్ముజ్ జల సంధిని మూసివేయడం.. తెరిపించడం మాత్రమే ట్రంప్ సాధించిన అచీవ్మెంట్. అంతకుమించి అమెరికాకు ఒరిగింది ఏమీ లేదు.
















నా డ్యాన్స్ నాకే నచ్చలేదు అంటూ హీరోయిన్ తమన్నా షాకింగ్ కామెంట్స్..
Tamannaah Shocking Comments On Dance: మన ఇండియా డ్యాన్స్ అద్బురంగా వేసే హీరోయిన్స్ లో ఒకరు తమన్నా. ఈమెతో డ్యాన్స్ వేయాలంటే స్టార్ హీరోలు భయపడిపోతుంటారు. తోపు డ్యాన్సర్లు అనిపించుకున్న బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ని కూడా డామినేట్ చేసిన చరిత్ర తమన్నా సొంతం. ఈ స్పీడ్ గా డ్యాన్స్ వేయడమే కాదు , గ్రేస్ ఫుల్ గా కూడా డ్యాన్స్ వేయగలదు. ఇప్పటికీ కూడా ఈమె నేటి తరం లో టాప్ డ్యాన్సర్లు గా పిలవబడే సాయి పల్లవి , శ్రీలీల వంటి వారితో సమానంగా పోటీ పడి డ్యాన్స్ వేయగలదు. అలాంటి టాప్ డ్యాన్సర్ అయినటువంటి తమన్నా , రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో తన డ్యాన్స్ తనకే నచ్చలేదు వంటి కామెంట్స్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. అది కూడా ఆమె కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిల్చిన సాంగ్ గురించి ఈ విధంగా చెప్పుకొచ్చింది.
జైలర్ చిత్రం లో ‘నువ్వు కావాలయ్యా’ అనే సాంగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సాంగ్ అనుభూతి గురించి తమన్నా మాట్లాడుతూ ‘ఎందుకో ఈ పాటలో నేను వేసిన డ్యాన్స్ నాకు మనస్ఫూర్తిగా నచ్చలేదు. ఈ సాంగ్ షూట్ పూర్తి అయ్యాక, మళ్లీ ఆ మూవీ షూటింగ్ కి వెళ్తున్నప్పుడు నాకు ఎందుకో అసంతృప్తి గా అనిపించేది. ఇంకా చాలా బాగా చేసి ఉండుంటే బాగుండేది అనిపించేది. కానీ అనూహ్యంగా ఆ పాటకు ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ రావడం నాకొక థ్రిల్లింగ్ అనుభూతి’ అంటూ చెప్పుకొచ్చింది తమన్నా. ఒక్కోసారి మనం చేసిన పని మనకి సంతృప్తి ని ఇవ్వకపోవచ్చు , కానీ అవతల వాళ్లకు చాలా బాగా అనిపిస్తుంది , సరిగ్గా తమన్నా విషయం లో అదే జరిగింది.
ఈ పాటకు తమిళ వెర్షన్ లో ఏకంగా 413 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అదే విధంగా తెలుగు వెర్షన్ పాటకు 85 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ రేంజ్ సాంగ్ తమన్నా కి నచ్చకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఈ సాంగ్ అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణం తమన్నా నే , అందులో ఎలాంటి సందేహం. ఇకపోతే తమన్నా ప్రస్తుతం తమిళం లో మూడు సినిమాలు , హిందీ లో మూడు సినిమాలు చేస్తోంది. తెలుగు లో ఈమె చివరి సారిగా వెండితెర పై కనిపించిన చిత్రం ‘ఓదెల 2’. ఈ చిత్రం తర్వాత ఆమె మరో తెలుగు సినిమాకు కమిట్ అవ్వలేదు.