Bodie Ghost Town: బాడీ ఘోస్ట్‌ టౌన్‌.. అక్కడి వస్తువులు ముట్టుకుంటే అంతే!

1882లో బతుకుదెరువు కోసం ఓ కుటుంబం బాడీకి వెళ్లింది. ఆ ఇంటి చిన్నారి వీడ్కోలు దేవీ .. మేము బాడీకి వెళ్తున్నాం. అని ఏడుస్తూ గట్టిగా ప్రార్థించిందట.

Written By: Raj Shekar, Updated On : May 28, 2024 6:36 pm

Bodie Ghost Town

Follow us on

Bodie Ghost Town: తూర్పు సీయారా నెవడా, కాలిఫోర్నియాలో బాడీ అనే ఘోస్ట్‌ టౌన్‌ను ఏటా లక్షల మంది సందర్శిస్తుంటారు. 7,395 అడుగుల(2,254 మీటర్ల) ఎత్తయిన కొండపై ఈ చారిత్రక నగరం ఉంది. ఎన్నో మిస్టీరియస్‌ కథనాలతో నేటికీ ప్రపంచాన్ని వణికిస్తోంది. అక్కడి అందాలను కళ్లతో ఆస్వాదించాలే తప్ప కంటికి ఇంపైన వస్తువులను తీసుకుని బ్యాగులో వేసుకుంటే ఇక అంతే.. అక్కడున్న అతీంద్రియ శక్తులే వేట మొదలవుతుంది. బొందిలో ప్రాణముండగానే కైలాసాం ఖాయం.

1859లో గుర్తింపు..
గి బోడే అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి 1859లో సియరా పర్వతాలకు తూర్పు వైపు వెళ్లాడు. మొదటిసారి ఈ ప్రాంతాన్ని కొనుగొన్నాడు. అక్కడ బంగారు గని ఉందని గుర్తించిన ఆ స్నేహితులు వారికి తెలియకుండానే ఆ స్థలాన్ని కొంతకాలం రహస్యంగా ఉంచారు. అయితే బోడే తన స్వస్థలం మోనోవిల్‌కు వెళ్తుంటే దారిలో మంచు తుఫానులో చిక్కి మరణించాడు. దీంతో అతని స్నేహితులంతా ఆ బంగారు గనులున్న ప్రాంతానికి బోడే అని పేరు పెట్టారు. అయితే బోర్డ్‌ మీద పేరు రాసే వ్యక్తి బోడేకి బదులుగా బాడీ అని రాయడంతో అదే పేరు స్థిరపడింది. కాలక్రమేణా ఆ గని గురించి తెలుసుకున్నవారి సంఖ్య పెరగడంతో 1876 నాటికి అక్కడ భారీస్థాయిలో బంగారం తవ్వకాలు మొదలయ్యాయి. మైనింగ్‌ కంపెనీలు, హైడ్రో–ఎలక్ట్రికల్‌ కేంద్రాలతో ఆ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందింది.

పెరిగిన నివాసాలు..
ఈ క్రమంలో అక్కడ స్థిరపడేవారి సంఖ్య పెరిగింది. సుమారు 10 వేల మంది నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు పెరగడంతో రైల్వే మార్గం కూడా ఏర్పడింది. 1880 నాటికి, బాడీలో ఎన్నో వ్యాపారాలు వెలిశాయి. అక్కడ చైనా టౌన్‌ అనే ఓ పెద్ద భవనంలో మొత్తం చైనీయులే ఉండేవారట. తమ దేశానికి చెందిన వస్తువులను అక్కడ అమ్మేవారట. అయితే బాడీ టౌన్‌ మొత్తంలో క్రైమ్‌రేట్‌ విపరీతంగా ఉండేదట. హత్యలు, జూదం, వ్యభిచారం, దోపిడీలు, తుపాకీ కాల్పులు, వీధికో అఘాయిత్యం నమోదయ్యేదట.

తిరిగి వస్తామనే నమ్మకం లేదు..
ఇక 1882లో బతుకుదెరువు కోసం ఓ కుటుంబం బాడీకి వెళ్లింది. ఆ ఇంటి చిన్నారి వీడ్కోలు దేవీ .. మేము బాడీకి వెళ్తున్నాం. అని ఏడుస్తూ గట్టిగా ప్రార్థించిందట. దానిని బట్టి అక్కడ ఎలాంటి భయానక వాతావరణం ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అక్కడికి వెళ్తే తిరిగి ప్రాణాలతో వస్తామన్న నమ్మకం ఉండేది కాదట. అన్యాయాలు, హింసలతో కొందరు చనిపోతే.. తీవ్రమైన మంచు కారణంగా మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇంకొందరేమో మైనింగ్‌ ప్రమాదాల్లో మృతిచెందారు.

1892లో అగ్ని ప్రమాదం..
ఇక 1892లో బాడీలో పెద్ద అగ్నిప్రమాదం జరిగింది. భారీగా ఆస్తినష్టం జరిగింది. గనులు ఖాళీ కావడంతో 1917 నాటికి రైల్వే మార్గాన్ని మూసివేశారు. 1932లో మరొక పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పట్టణం మొత్తం ఖాళీ అయింది. అలా ప్రకృతితో మమేకమైన బాడీ ఇప్పుడు మాత్రం ఎన్నో వ్యథలను వినిపిస్తోంది.

రెండు కళ్లూ చాలవు..
బాడీ పట్టణాన్నిచూడడానికి రెండు కళ్లు చాలవట. పర్యాటకులు కొండ కోనల్లో, విశాలమైన గడ్డి మైదానాల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న వాహనాలు, నాటి కట్టడాలు, గుర్రపు బండ్లు వంటి వన్నీ చిత్రకారడుగు గీసిన పెయింటింగ్ లా ఆకట్టుకుంటాయి. ఇక్కడ మొత్త 168 భవనాలు నేటికీ ఉన్నాయి. సమీపంలో శ్మశానవాటికలో 150 మంది ఖననాలు కనిపిస్తాయి. అయితే బాడీ టౌన్‌లో పగటిపూడ కూడా విచిత్రమైన అలికిడులు భయపెడతాయట.

అతీంద్రియ శక్తులు ఉన్నాయని..
పురాతన ఇళ్లలో నిద్ర చేయడానికి సాహసించిన ఎందరో పర్యాటకులు అక్కడి అతీంద్రియ శక్తులేవో తమకు ఊపిరి ఆడకుండా చేశాయని చెబుతారు కనిపించని రూపాలు వణికించాయని తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఒ కెయిన్‌ హౌస్‌లో ఓ చైనా మహిళ దెయ్యంగా తిరుగుతుందని స్థానికుల నమ్మకం. శ్మశానవాటికలో ఎవెలిన్‌ అనే మూడేళ్ల పాప ముసి ముసి నవ్వులు వినిపిస్తాయని చెబుతారు.

వస్తువులు తీసుకెళ్లి..
ఇక్కడకి వచ్చిన పర్యాటకులు అక్కడ దొరికిన సీసాలు, చిన్నచిన్న బొమ్మలు తమ వెంట తీసుకెళ్లి ప్రమాదాలు కొని తెచ్చుకున్నారట. తీసుకెళ్లిన ప్రతీ వస్తువు ఒక లేఖతోపాటు బాడీకి తిరిగి రావడమే ట్విస్ట్‌. ఈ వస్తువును దొంగిలించినందుకు లేదా తీసుకున్నందుకు మమ్మల్ని క్షమించండి అని రాసిన ఎన్నో అజ్ఞాత లేఖల్లో బాడీలోని వస్తువులు కనిపిస్తాయట. వస్తువులు తీసుకెళ్లినవారు కారు ప్రమాదాలు జరగడం, ఉద్యోగాలు కోల్పోవడం, తీవ్రమైన అనారోగ్యానికి గురికావడం ఇలా అనేక సమస్యలతో ఇబ్బంది పడి తిరిగి వస్తువులను బాడీకి పంపిచేశారట. అది తెలిసి వారు ఇక్కడి వస్తువులను ముట్టుకోరు.