Bihar Teacher
Bihar Teacher: సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి, లైకులు, షేర్ల కోసం సోషల్ మీడియా ఖాతాదారుల చేస్తున్న పనులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. తాజాగా ఓ ఉపాధ్యాయురాలు పరీక్ష పేపర్లు దిద్దుతూ కూడా ఓ రీల్ చేసింది. దీనిని ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బిహార్ పాటలీపుత్ర యూనివర్సిటీలో..
విద్యా శాఖకు సంబంధించి ఏది జరిగినా అది బిహార్లోనే జరుగుతుంది. అప్పట్లో చిన్న చిన్న పదాలకు స్పెల్లింగ్ తెలియని విద్యార్థులు టెన్త్ ఫలితాల్లో స్టేట్ టాపర్లుగా నిలిచారు. ఇక ఉపాధ్యాయులు కొట్టుకునే ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా బిహార్లోని పాటలీపుత్ర యూనివర్సిటీకి చెందిన ఓ ఉపాధ్యాయురాలు పరీక్ష పేపర్లు కరెక్షన్ చేస్తూ రీల్ చేసింది. దీనిని ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది.
స్పందిస్తున్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. హే మేడమ్, కొత్తగా పెళ్లైన పెళ్లికూతురుగా కనిపిస్తోందని కొందరు అంటే, దీనినే పిచ్చి అంటారండి అని మరికొందరు, స్టూడెంట్స్ లైఫ్తో గేమ్స్ వద్దు అని ఇంకొందరు కామెంట్లు పెట్టారు. ఒక టీచర్గా మీరు చేయాల్సి పని ఇదేనా అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్లుసిగ్గుతో చచ్చిపోవాలి.. గతంలో కూడా ఇలాంటి ఘటనలు నమోదయ్యాయి అని మరికొందరు కామెంట్ పెట్టారు.
టీచర్పై ఎఫ్ఐఆర్..
ఇక సోషల్మీడియాలో వైరల్ అయిన అధ్యాపకురాలి రీల్.. ఇప్పుడు ఉన్నతాధికారులకు చేరింది. దీంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిసింది. మరి ఆ టీచర్ ఇప్పటికైనా రీల్స్ చేయడం మానేస్తుందో లేదో మరి.
पीपीयू एग्जाम का कॉपी जांचने का रील्स इंस्टाग्राम पर वायरल, मैडम पर FIR दर्ज। pic.twitter.com/GlnZhH4Yuk
— छपरा जिला (@ChapraZila) May 26, 2024